సిద్దు సర్కారుపై ఆపరేషన్?
మంగళవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2024గత ఏడాది మే 20వ తేదీన సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. మే 20వ తేదీ సమీపిస్తోంది. అంతలోనే సిద్దరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ముసలం పుడుతుందని బీజేపీ నాయకులు జోస్యాలు చెబుతున్నారు. ఇటీవల మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే చెప్పిన మాటలనే ఆ నేతలు ప్రస్తావిస్తూ ఈ సర్కారు పతనం అవుతుందని అంటున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తరువాత ఏమైనా జరగవచ్చని బీజేపీ నేత విజయేంద్ర కొత్తగా చెప్పడంతో ఆపరేషన్ కమలకు కసరత్తు సాగుతోందని అర్థమవుతోంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తాయి. అందులో కాషాయానికి దేశంలోను, రాష్ట్రంలో గట్టి మెజారిటీ వస్తే.. హస్తం సర్కారును కదిలించే కార్యాచరణ చేస్తుందని సమాచారం. తప్పు చేయకున్నా శిక్షిస్తారా● జైల్లో రేవణ్ణ రోదన: ఎమ్మెల్యే జీటీ
శివాజీనగర: ఏ తప్పూ చేయకున్నా జైలుకు పంపారని జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్.డీ.రేవణ్ణ పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విలపించారని పార్టీ ఎమ్మెల్యే జీ.టీ.దేవేగౌడ చెప్పారు. మహిళపై వేధింపులు, కిడ్నాప్ కేసుల్లో ఆయన జైలుపాలు కావడం తెలిసిందే. జీటీ జైలులో రేవణ్ణను కలిశారు. బయటికి వచ్చి మాట్లాడుతూ ఆయన యోగక్షేమాల గురించి చర్చించాను. తప్పు చేస్తే జైల్లో పెట్టాలి, కానీ ఏ తప్పు చేయకున్నా ఇబ్బంది పెట్టారని రేవణ్ణ 10 నిమిషాలు రోదించారన్నారు. సదరు మహిళతో మాట్లాడి 6 సంవత్సరాలు అయిందని ఆయన చెప్పారన్నారు. తనయుడు, ఎంపీ ప్రజ్వల్ గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదనే తెలిపారు. కాగా, రేవణ్ణకు నగరంలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు సోమవారం బెయిలు మంజూరు చేసినట్లు తెలిసింది. ఆయనకు ఈ నెల 14 వరకు జ్యుడిషియల్ రిమాండు ఉంది. ప్రజ్వల్ నివాసానికి
ఫొరెన్సిక్ బృందం దొడ్డబళ్లాపురం: లైంగిక దాడి, లైంగిక వేధింపుల కేసుల్లో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ నివాసానికి ఫొరెన్సిక్ నిపుణుల బృందం వెళ్లి శాంపిల్స్ సేకరించడం జరిగింది. సోమవారం ఎఫ్ఎస్ఎల్ బృందం హాసన్లో ఎస్పీ కార్యాలయం పక్కన ఉన్న ప్రజ్వల్ నివాసంలో శాంపిల్స్ సేకరించారు. ఇప్పటికీ ప్రజ్వల్ విదేశాల్లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. ప్రజ్వల్ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ తండ్రి, మాజీ మంత్రి రేవణ్ణ జైలుపాలయ్యారు. ప్రజ్వల్ తమను విపరీతంగా వేధించేవాడంటూ మహిళ, ఆమె కూతురు కొత్తగా ఆరోపణలు చేశారు. ప్రజ్వల్ తల్లి భవానీకి సిట్ మళ్లీ నోటీసులు పంపింది.
పెన్డ్రైవ్ కేసులో మరో ట్విస్టు
ప్రజ్వల్ పెన్డ్రైవ్ కేసులో రోజుకో కొత్త ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సోమవారం అరకలగూడు ఎమ్మెల్యే ఏ మంజు, నవీన్గౌడ అనే వ్యక్తిపై సిట్కు ఫిర్యాదు చేసారు. నవీన్గౌడ తన ఫేస్బుక్లో అరకలగూడు ఎమ్మెల్యే ఏ మంజుకు ఏప్రిల్ 21న అరకలగూడులోని మారుతి కల్యాణ మండపంలో ప్రజ్వల్కు సంబంధించిన పెన్డ్రైవ్ ఇచ్చానని, ఆ తరువాతే వీడియోలు వైరల్ అయ్యాయని పోస్టు పెట్టాడు. దీంతో ఎమ్మెల్యే ఏ మంజు నవీన్గౌడపై బెంగళూరులోని సిట్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. శివాజీనగర: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి పదవి కోసం గొడవ జరుగుతూనే ఉందని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర అన్నారు. తాము ప్రతిపక్షంలో సంతోషంతో ఉన్నామని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయం, ఏ విధమైన ఆపరేషన్ చేసే ప్రసక్తే లేదని చెప్పారు. సోమవారం నగరంలో శాంతినగరలో విలేకరులతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ సర్కారు పతనం గురించి మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే ఏమి చెప్పారనేది తనకు తెలియదన్నారు. అయితే లోక్సభ ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్లో ఎలాంటి కల్లోలం జరుగుతుందో తాను చెప్పనన్నారు. ఎన్నికల ఫలితాలు ఏ విధమైన ప్రభావమైనా చూపవచ్చు. అందుకు తాము బాధ్యులం కాదని అన్నారు. దీనిని బట్టి కేంద్ర రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను బట్టి బీజేపీ మరోసారి ఆపరేషన్కు ప్రణాళిక సిద్ధం చేస్తోందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అందుకు అనుగుణంగానే షిండే ప్రకటన చేశారని రాజకీయ నాయకులు భావిస్తున్నారు.
ఏక్నాథ్ షిండే వ్యాఖ్యల గురించి మాట్లాడిన బీజేపీ మాజీ మంత్రి అశ్వత్థనారాయణ, కాంగ్రెస్ ప్రభుత్వం పతనానికి తాము ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఆ పార్టీలో సీఎం పదవి కోసం సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ మధ్య పెద్ద సంఘర్షణ జరుగుతోంది. వారి ఎమ్మెల్యేలే ప్రభుత్వం పడిపోతుందని చెబుతున్నారు. మేం ఇందులో ఏమీ జోక్యం చేసుకోము అని అన్నారు.
ఆపరేషన్ కోసం హస్తం ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేసే అవకాశం త్వరలో ఏమైనా జరగొచ్చన్న విజయేంద్ర
మహా సీఎం షిండే వ్యాఖ్యలతో ఊతం
సర్కారు భద్రమన్న సీఎం సిద్దరామయ్య మా సర్కారును ఏమీ చేయలేరు: సిద్దు శివాజీనగర: మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే మాదిరిగా కర్ణాటకలో సర్కారును కూల్చివేసే ఆపరేషన్ చేసేందుకు సాధ్యపడదని, బీజేపీ నేతలు భ్రమల్లో బతుకుతున్నారని సీఎం సిద్దరామయ్య అన్నారు. గతంలో ఆపరేషన్ చేసేందుకు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారని, అయితే ఇది సాధ్యపడదు. అంతా వారి భ్రమ అని అన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఓటమి పాలవుతోందన్నారు. రాష్ట్రంలో తాము 20 ఎంపీ సీట్లలో గెలుపొందుతామన్నారు.
షిండే ఏమన్నారు?
ఇటీవల మహారాష్ట్రలోని సతారాలో మాట్లాడిన సీఎం షిండే.. కర్ణాటకలో ప్రభుత్వ పతనానికి తెరవెనుక సర్కస్ జరుగుతోందని చెప్పారు. తాను ఇటీవల కర్ణాటకలో ఒక సభకు వెళ్లడమైనది. కర్ణాటకలో నాథ అనే ఆపరేషన్ సాగుతోందని అన్నారు. డీకేతో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ శాసనసభా ఎన్నికల తరువాత బీజేపీ ఎమ్మెల్యేలైన ఎస్.టీ.సోమశేఖర్, శివరామ్ హెబ్బార్లు ఆ పార్టీ నుంచి దూరంగా ఉంటున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనలేదు. బీజేపీపైనే విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాయకులతో నిరంతరం టచ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో హెబ్బార్, సోమశేఖర్ సోమవారం డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ను కలిశారు. సదాశివనగర ఆయన నివాసంలో మంతనాలు జరపడం కుతూహలానికి దారితీసింది.