ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి | Sakshi
Sakshi News home page

ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

Published Tue, May 7 2024 1:00 AM

ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

● కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా

జగిత్యాల: లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. సోమవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని పరిశీలించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరూ ఓటు వేసేలా చూడాలని అధికారులను ఆదేశించా రు. ఇప్పటివరకు 1430మంది ఓటర్లు దరఖాస్తు చే సుకున్నారని, 660మంది మాత్రమే పోస్టల్‌ బ్యాలె ట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడం జరి గిందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రామ్మోహన్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ పేదల ప్రభుత్వం

మేడిపల్లి: కాంగ్రెస్‌ పేదల ప్రభుత్వమని విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని మోత్కురావుపేట, రాజలింగంపేట్‌, పసునూరు, గోవిందారం, దేశాయిపేట, ఈదుల లింగంపేట, మాన్నెగూడం, కమ్మరిపేట, వెంకట్రావుపేట, రాగోజీపేట, ఒడ్యాడ్‌ గ్రామాల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధి రాజేందర్‌రావుకు మద్దతుగా ప్రచారం చేశారు. పలువురు పార్టీలో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. గల్ఫ్‌ కార్మికులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందన్నా రు. పార్టీ మండల అధ్యక్షుడు నరేశ్‌ రెడ్డి, రమేశ్‌రెడ్డి, చేపూరి నాగరాజు, మార్గం నర్సరెడ్డి, సాయిని గంగారెడ్డి, మాదం వి నోద్‌, రేండ్ల మధు, భర్కం రాజశేఖర్‌ పాల్గొన్నారు.

 
Advertisement
 
Advertisement