కోరుట్ల: సీఎం రేవంత్ రెడ్డి నోరు విప్పుతే తిట్ల పురాణం తప్ప ఏ ఒక్క మాట మంచిగా మాట్లాడిన దాఖలాలు లేవని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. కోరుట్లకు చెందిన కౌన్సిలర్ ముజాఫర్ అహ్మద్ (సజ్జు) కొద్దిరోజుల క్రితం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన విషయం తెల్సిందే. గురువారం విద్యాసాగర్ రావు సమక్షంలో తిరిగి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం విద్యాసాగర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాకముందు రాష్ట్రం ఎలా ఉండేది..? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎలా ఉంది..? ఎంత అభివృద్ధి జరిగింది..? కాంగ్రెస్ పాలనలో ఏమవుతోందో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం హైడ్రాపై పెట్టిన దృష్టి ప్రజాసంక్షేమంపై పెడితే బాగుంటుందని హితవు పలికారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, నాయకులు ఫయీం, మురళి, కౌన్సిలర్లు సత్యం, బట్టు సునీల్, తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటివరకు ఒక్కమంచి మాట మాట్లాడలేదు
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన కౌన్సిలర్
Comments
Please login to add a commentAdd a comment