జగిత్యాల: తెలంగాణ శ్వాసగా జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. శుక్రవారం బాపూజీ జయంతి సందర్భంగా అంగడిబజార్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేసిన వ్యక్తి అని, మంత్రి పదవీని సైతం త్యాగం చేసి 90 ఏళ్ల వయస్సులో జంతర్మంతర్ వ ద్ద ఎముకలు కొరికే చలిలో దీక్ష చేసిన గొప్ప తెలంగాణ వాది అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి, పద్మశాలీ సేవ సంఘం నాయకులు పాల్గొన్నారు.
తొలితరం ఉద్యమ నాయకుడు
తొలితరం ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. శుక్రవారం బాపూజీ జయంతి సందర్భంగా బాపూజీ విగ్రహానికి నివాళి అర్పించిన అనంతరం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్, టెక్స్టైల్ యూనివర్సిటీకి బాపూజీ పేరు పెట్టడం అభినందనీయమన్నారు. ఆర్డీవో రఘువరణ్, బీసీ సంక్షేమాధికారి సాయిబాబా, కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బాపూజీ ఆశయసాధనకు కృషి చేయాలి
కోరుట్లటౌన్: తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో పోరాడిన మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని కార్గిల్ చౌరస్తా వద్ద బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బాపూజీ ఆశయసాధనకు అందరూ కృషి చేయాలన్నారు. ప్రతీ ఒక్కరు చేనేత వస్త్రాలు ధరించి, చేనేత రంగానికి తోడ్పాటు అందించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు గుంటుక ప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు, పద్మశాలీ జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
● ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్
Comments
Please login to add a commentAdd a comment