ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం చేసి రంగురంగుల పూలతో అలంకరించారు. అర్చకుడు శ్రీనివాసచార్యులు మంత్రోచ్ఛరణలతో ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రాంగణంలో లక్ష్మీహవన కార్యక్రమం నిర్వహించారు.
కల్తీ చేస్తే కఠిన చర్యలు
జగిత్యాల: తినుబండారాల్లో కల్తీ చేస్తే కఠిన చ ర్యలు తప్పవని ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష అ న్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు ఆ యిల్షాప్ల్లో తనిఖీలు చేపట్టారు. ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీసే నాణ్యత లేని ఆయిల్ను విక్రయిస్తే క ఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకుని ల్యాబ్కు పంపించనున్నట్లు తెలిపారు. ఆమె వెంట సిబ్బంది ఉన్నారు.
అధిక సంఖ్యలో హాజరుకావాలి
జగిత్యాల: గురుకుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 28న (శనివారం) హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరుకావాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తిరుకోవెల శ్యామ్సుందర్, అంబటి భూమేశ్వర్ పిలుపునిచ్చారు. శుక్రవారం సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అశాసీ్త్రయమైన పాఠశాలల పనివేళలు, సొంత భవనాల నిర్మాణం, కేర్ టేకర్ నియామకం, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఉపాధ్యాయుల రెగ్యులరేషన్, తదితర 24 డిమాండ్లపై మహాధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సంఘం బాధ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment