ప్రమాదకర విద్యుత్‌ లైన్లపై సమాచారమివ్వండి | - | Sakshi
Sakshi News home page

ప్రమాదకర విద్యుత్‌ లైన్లపై సమాచారమివ్వండి

Published Sat, Sep 28 2024 1:26 AM | Last Updated on Sat, Sep 28 2024 1:26 AM

ప్రమాదకర విద్యుత్‌ లైన్లపై సమాచారమివ్వండి

సారంగాపూర్‌(జగిత్యాల): పంట పొలాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ లైన్లపై వెంటనే సమాచారమిస్తే సత్వరం సవరిస్తామని టీజీఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ సాలియానాయక్‌ అన్నారు. శుక్రవారం పొలంబాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని కోనాపూర్‌, పెంబట్ల, జగిత్యాల రూరల్‌మండలం గుల్లపేట తదితర గ్రామాల్లోని వ్యవసాయ విద్యుత్‌ లైన్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులు తమ మోటార్ల వద్ద తప్పనిసరిగా కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పొలాల వద్ద విద్యుత్‌ ప్రమాదాల బారిన పడకుండా ఐఎస్‌ఐ మార్కు ఉండి పూర్తి నాణ్యతతో ఉన్న పంపుసెట్లు, పైపులు, స్టార్టర్లు, ఫ్యూజులు, కేబుల్‌వైర్లను వినియోగించాలని పేర్కొన్నారు. విద్యుత్‌ సరఫరా, ఇతర లైన్లలో సమస్య వచ్చినా వెంటనే సంబంధిత సిబ్బందికి సమాచారం అందించి, ప్రమాదాల బారినపడకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఆయన వెంట టెక్నికల్‌ డీఈ గంగారాం, జగిత్యాల రూరల్‌ ఏడీఈ హరీశ్‌, ఏఈ సతీశ్‌, సిబ్బంది ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement