గురుకుల ప్రవేశ పరీక్షకు హాల్‌ టికెట్ల విడుదల | Sakshi
Sakshi News home page

గురుకుల ప్రవేశ పరీక్షకు హాల్‌ టికెట్ల విడుదల

Published Fri, Apr 19 2024 2:40 AM

-

తుని రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు ఈ నెల 25న పరీక్ష జరుగుతుందని కన్వీనర్‌, ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ హేమలత ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. 5, 6, 7, 8 తరగతులు, (ఏపీఆర్‌ఎస్‌ సెట్‌ 2024) విద్యార్థులకు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. కళాశాలలకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. అభ్యర్థులు తమ ఐడీ, పుట్టిన తేదీతో ఏపీఆర్‌ఎస్‌.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ వైబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరిజిల్లాలో అభ్యర్థులు హాల్‌టికెట్లతో పరీక్షా కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలన్నారు.

గంట ముందు హాజరు కావాలి

గోకవరం: ఏపీ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష జిల్లా ప్రధాన కేంద్రంలో ఈనెల 25న జరుగుతుందని భూపతిపాలెం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌, జిల్లా కోఆర్డినేటర్‌ బి.రవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 5, 6, 7, 8వ తరగతులకు, జూనియర్‌, డిగ్రీ కళాశాలలకు అదేరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఐదు గంటల వరకు జరుగుతుందన్నారు. పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు సంబంధిత వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. అభ్యర్ధులు పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలన్నారు.

Advertisement
Advertisement