ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ బాలిక మృతి | - | Sakshi
Sakshi News home page

ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ బాలిక మృతి

Published Mon, Oct 21 2024 2:22 AM | Last Updated on Mon, Oct 21 2024 2:22 AM

ప్రేమోన్మాది దాడిలో  గాయపడ్డ బాలిక మృతి

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి

చేస్తున్నందుకే ఘాతుకం..

బద్వేలు అర్బన్‌/కడప కార్పొరేషన్‌/కడప రూరల్‌: వైఎస్సార్‌ జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలంలో ప్రేమోన్మాది లైంగిక దాడికి పాల్పడి పెట్రోల్‌ పోసి నిప్పంటించిన హత్యాయత్నం ఘటనలో తీవ్రగాయాలపాలై కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రొద్దుటూరు దస్తగిరమ్మ (16) ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా సాయంత్రం బద్వేలులో అంత్యక్రియలు జరిగాయి. మరోవైపు.. ‘నా బిడ్డ లేకలేక పుట్టింది. నిష్కా రణంగా ఆమెను తగలబెట్టిన వాడిని నాకు అప్పగించండి’.. అని మృతురాలు దస్తగిరమ్మ తల్లి హుసేనమ్మ డిమాండ్‌ చేశారు. రిమ్స్‌ మార్చురీ వద్ద ఆమె మీడియా ఎదుట విలపిస్తూ.. ఉన్నత చదువులు చదివి పైకి ఎదగాల్సిన ఆమెను అన్యాయంగా చంపేసిన వాడిని అలాగే తాను మట్టుబెడతానన్నారు. కాగా, దస్తగిరమ్మ తనను పెళ్లి చేసుకోవాలని తరచూ కోరుతున్నందున, ఆమెను అడ్డుతొలగించుకోడానికే విఘ్నేష్‌ ఈ హత్యచేశాడని, అతను విచారణలో కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడని ఎస్పీ హర్షవర్థన్‌రాజు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement