‘ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది’ | Sakshi
Sakshi News home page

‘ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది’

Published Sat, Apr 20 2024 1:45 AM

లక్ష్మణమూర్తిని సన్మానిస్తున్న డీఈవో - Sakshi

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని జిల్లా విద్యాశాఖ అధికారి సీహెచ్‌ జనార్దన్‌రావు అన్నారు. శుక్రవారం నగరంలోని సుభాష్‌నగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అల్లాడి లక్ష్మణమూర్తి ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా లక్ష్మణమూర్తి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఖాజా నజీరొద్దీన్‌, మండల విద్యాధికారి మధుసూదనాచారి, గోగులకొండ మోహన్‌, కటకం రమేశ్‌, గాజుల రవీందర్‌, మోతె చంద్రశేఖర్‌రెడ్డి, జాన్‌ సుధాకర్‌, రాజిరెడ్డి, మహేందర్‌ రెడ్డి, ప్రభాకర్‌రావు, ఖాజా మంజూర్‌ అలీ, అశోక్‌ రావు తదితరులు, పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement