గౌడ కులస్తుల సమస్యలపై మంత్రి పొన్నం ఏనాడు మాట్లాడలేదు | Sakshi
Sakshi News home page

గౌడ కులస్తుల సమస్యలపై మంత్రి పొన్నం ఏనాడు మాట్లాడలేదు

Published Tue, May 7 2024 4:45 AM

గౌడ కులస్తుల సమస్యలపై మంత్రి పొన్నం ఏనాడు మాట్లాడలేదు

కరీంనగర్‌టౌన్‌: కరీంనగర్‌లో రెండుసార్లు ఓటమిపాలైన పొన్నం ప్రభాకర్‌కు ఇక్కడ మొఖం చెల్లక, గౌడ కులస్తుల ఓట్లు దండుకోవడానికి హుస్నాబాద్‌ వెళ్లాడని, మాయమాటలతో గౌడ కులస్తుల ఓట్లతో గెలిచి మంత్రిగా కొనసాగుతున్న పొన్నం ప్రభాకర్‌ వారి సమస్యల కోసం ఎప్పుడైనా మాట్లాడారా.. కొట్లాడారా..? అని బీజేపీ నాయకుడు, గౌడ జాగృతి కల్లు గీత కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రంగు సంపత్‌ గౌడ్‌ ప్రశ్నించా రు. సోమవారం కరీంనగర్‌ ఎంపీ కార్యాలయంలో మాట్లాడుతూ మంత్రి పొన్నంకు గౌడ కులస్తుల సమస్యలు పట్టవన్నారు. గతంలో మార్క్‌ఫెడ్‌ చైర్మ న్‌గా, పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ప్రభాకర్‌ ఏ రోజు గౌడ కులస్తుల సమస్యల కోసం మాట్లాడలేదన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉండి మంత్రి హో దాలోనూ గౌడ కులస్తుల సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన చేయకపోవడాన్ని ప్రతీఒక్కరు గమనించాలన్నారు. బీసీ ఎంపీ అభ్యర్థి బండి సంజ య్‌ కుమార్‌పై వ్యక్తిగత, అనవసర దూషణలు చేస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో బీసీ సమాజం పొన్నంకు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నేతలు ప్రకా్‌శ్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.

గౌడ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు రంగు సంపత్‌గౌడ్‌

 
Advertisement
 
Advertisement