బోయినపల్లి(చొప్పదండి): రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక శివారులోని మిడ్మానేరు ప్రాజెక్టు నీటిగుంతలో పడి చందుర్తి మండలం జోగాపూర్కు చెందిన యువకుడు పుల్లయ్య(20) సోమవారం మృతిచెందాడు. హెడ్కానిస్టేబుల్ మురళి తెలిపిన వివరాలు. పుల్లయ్య తన తల్లితో కలిసి వేములవాడలో నివసిస్తున్నాడు. ఆరు నెలలుగా కొదురుపాకకు చెందిన కల్లెం రాజయ్య వద్ద గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. మిడ్మానేరు ప్రాజెక్టులో నీరు తగ్గడంతో అక్కడక్కడ గుంతల్లో నీరు నిలిచి ఉంది. ఈ క్రమంలో పుల్లయ్య గ్రామానికి చెందిన సాయిలుతో కలిసి మిడ్మానేరు పరిసరాలకు వెళ్లాడు. మధ్యాహ్నం స్నానం చేస్తానని చెప్పి నీటిగుంత వద్దకు వెళ్లాడు. కాగా చాలా సమయం గడిచినా పుల్లయ్య రాకపోవడంతో సాయిలు నీటిగుంత పరిసరాల్లో చూశాడు. అక్కడ చెప్పులు, కట్టె కనిపించడంతో గ్రామస్తులకు సమాచారం అందించాడు. మత్స్యకారులు తెప్పెతో నీటి గుంతలో వెతికి పుల్లయ్య మృతదేహాన్ని బయటకు తీశారు. నీటిగుంతలో స్నానానికని వెళ్లి ఈతరాక తన కుమారుడు మృతి చెందాడని తల్లి వజ్రవ్వ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.