ట్రాక్టర్‌ ఇంజిన్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ ఇంజిన్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి

Published Tue, May 7 2024 3:55 AM

ట్రాక

హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలో ట్రాక్టర్‌ ఇంజిన్‌ బోల్తా పడి డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చిక్కజోగిహళ్లి తండాలో సోమవారం చోటు చేసుకుంది. కూడ్లిగి తాలూకాకు చెందిన మృతుడి తండ్రి జోగజ్జర హనుమంతప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కానాహొసహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అనుమానం పెనుభూతమైంది

భర్త చేతిలో భార్య హతం

రాయచూరు రూరల్‌: శీలాన్ని శంకించిన భర్త చేతిలో భార్య హత్యకు గురైన ఘటన జిల్లాలోని ముదగల్‌లో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం ముదగల్‌–తావరగేరా రోడ్డులో భర్త నాగలింగ తన భార్య ముత్తమ్మ(28)ను హత్య చేశాడు. వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవించేవారు. ఇటీవలే ఉడుపికి వలస వెళ్లిన వారు ఆదివారం ఉదయం ముదుగల్‌కు వచ్చారు. ఇద్దరి మధ్య డబ్బు విషయంలో గొడవ జరగడంతో భార్యను ఊరి బయటికి తీసుకెళ్లి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ముత్తమ్మ వద్ద ఏడాది వమస్సుగల కుమార్తె ఉంది. వేసవి తాపానికి అస్వస్థతకు గురి కావడంతో చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. మూడేళ్ల కుమారుడిని నాగలింగ తన వెంట తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

చెరువులో పడి

బాలుడి మృతి

రాయచూరు రూరల్‌: గొర్రెలకు నీరు తాపడానికెళ్లిన బాలుడు కాలు జారి చెరువులో పడి ఈత రాక దుర్మరణం పాలైన ఘటన సోమవారం మస్కి తాలూకా బసాపురలో చోటు చేసుకుంది. మృతుడిని తాలూకాలోని బసాపురలో గొర్రెలు కాస్తున్న ఆనంద్‌ శివప్ప(9) అనే బాలుడిగా గుర్తించారు. కనకప్ప పొలంలోని చెరువులో దాహం తీర్చుకోవడానికి చెరువు వద్దకు వెళ్లి అందులో పడి ఈత రాక పోవడంతో శివప్ప అక్కడికక్కడే మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మస్కి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

కారు బోల్తా.. ఇద్దరు మృతి

దావణగెరె జిల్లాలో రోడ్డు ప్రమాదం

పెళ్లి నుంచి ఇంటికెళ్తుండగా ఘటన

సాక్షి,బళ్లారి: భగభగమండే ఎండలకు టైర్‌ పేలి కారు బోల్తా పడడంతో దావణగెరె జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. సోమవారం దావణగెరె జిల్లా హుణసెకట్టె సమీపంలో వేగంగా వెళుతున్న కారు టైర్‌ ఎండవేడిమికి బరస్ట్‌ అయి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దావణగెరె జిల్లా హరిహర తాలూకా సారథి గ్రామానికి చెందిన కొట్రేశప్ప(60), హుబ్బళ్లి ఈరమ్మ(54) అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ వివాహ వేడుకను ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై దావణగెరె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కారు, బైక్‌ ఢీకొని

ఒకరు దుర్మరణం

రాయచూరు రూరల్‌: జిల్లాలోని లింగసూగూరు తాలూకా ముదగల్‌లో కారు బైక్‌ను ఢీకొనడంతో ఒకరు దుర్మరణం పాలైన ఘటన లింగసూగూరు తాలూకాలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి లింగసూగూరు తాలూకా ముదగల్‌–తావరగేరా రోడ్డులో ద్విచక్ర టీవీఎస్‌ వాహనాన్ని షిఫ్ట్‌ కారు ఢీకొనడంతో టీవీఎస్‌ మోపెడ్‌ నడుపుతున్న భీమన్న(55) అనే వ్యక్తి మరణించినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ట్రాక్టర్‌ ఇంజిన్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి
1/6

ట్రాక్టర్‌ ఇంజిన్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి

ట్రాక్టర్‌ ఇంజిన్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి
2/6

ట్రాక్టర్‌ ఇంజిన్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి

ట్రాక్టర్‌ ఇంజిన్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి
3/6

ట్రాక్టర్‌ ఇంజిన్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి

ట్రాక్టర్‌ ఇంజిన్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి
4/6

ట్రాక్టర్‌ ఇంజిన్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి

ట్రాక్టర్‌ ఇంజిన్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి
5/6

ట్రాక్టర్‌ ఇంజిన్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి

ట్రాక్టర్‌ ఇంజిన్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి
6/6

ట్రాక్టర్‌ ఇంజిన్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి

 
Advertisement
 
Advertisement