● బరిలో మొత్తం 8 మంది అభ్యర్థులు
● బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా పోటీ
రాయచూరు రూరల్: జిల్లాలో మంగళవారం ఓటింగ్కు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లాధికారి చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. సోమవారం ఎల్వీడీ కళాశాల ఆవరణలో పోలింగ్ అధికారులకు పోలింగ్ సామగ్రి, ఈవీఎంలను అందించి విలేకరులతో మాట్లాడారు. లోక్సభ పరిధిలో 20,10,437 మంది ఓటరు్ుల్లన్నారన్నారు. 2203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, 10,336 మంది అధికారులు, సిబ్బందిని నియమించామన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు. రాయచూరులో 8 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలిపారు.