ఎన్నికల సామగ్రితో తరలిన సిబ్బంది | Sakshi
Sakshi News home page

ఎన్నికల సామగ్రితో తరలిన సిబ్బంది

Published Tue, May 7 2024 3:55 AM

ఎన్ని

హొసపేటె: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం జరగనున్న పోలింగ్‌కు ముందస్తుగా సోమవారం మస్టరింగ్‌ పనులు ప్రారంభించి పోలింగ్‌ బూత్‌లకు కేటాయించారు. పోలింగ్‌ బూత్‌లకు తీసుకెళ్లేందుకు అధికారులు, సిబ్బంది మస్టరింగ్‌ కేంద్రానికి హాజరయ్యారు. వారిని తీసుకెళ్లేందుకు నగరంలోని లిటిల్‌ ఫ్లవర్‌ కళాశాల ఆవరణలో బస్సులు, ట్రక్కులు, ఇతర వాహనాలను సిద్ధంగా ఉంచారు. అధికారులు, సిబ్బందికి అల్పాహారం, మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ కేంద్రాలను కేటాయించిన సమాచారాన్ని అధికారులు కూడా అక్కడే ఉండి వీక్షించారు. వీవీప్యాట్‌, ఈవీఎం యంత్రాలతో పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది బయలుదేరారు. పోలింగ్‌ అధికారులు, సిబ్బందిని కూడా బస్సులో ఆయా పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు నగరసభ, పురసభ, పట్టణ పంచాయతీ, గ్రామ పంచాయతీ సిబ్బందిని నియమించారు.

ఎన్నికల సామగ్రితో తరలిన సిబ్బంది
1/2

ఎన్నికల సామగ్రితో తరలిన సిబ్బంది

ఎన్నికల సామగ్రితో తరలిన సిబ్బంది
2/2

ఎన్నికల సామగ్రితో తరలిన సిబ్బంది

Advertisement
 
Advertisement