వీనులవిందుగా గాన కచేరి | Sakshi
Sakshi News home page

వీనులవిందుగా గాన కచేరి

Published Tue, May 7 2024 4:10 AM

వీనులవిందుగా గాన కచేరి

ప్రశాంతి నిలయం: సత్యసాయి మాతృమూర్తి ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా సోమవారం సాయంత్రం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్‌ సభా మందిరంలో సంగీత కచేరి నిర్వహించారు. ప్రముఖ సంగీత విద్వాంసురాలు మాళవికా సుందర్‌ బృందం చక్కటి గాత్రంతో భక్తులను మైమరిపించారు. సుమారు గంట పాటు సంగీత కచేరి సాగింది. కళాకారులను ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్‌ రాజు ఘనంగా సన్మానించారు. అంతకుముందు పట్టణంలోని సమాధి రోడ్డులో గల సత్యసాయి తల్లిదండ్రుల సమాధుల వద్ద వేడుకలను నిర్వహించారు. సత్యసాయి తల్లిదండ్రులు పెద్ద వెంకమరాజు, ఈశ్వరమ్మ సమాధులను ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు ఈశ్వరమ్మను, సత్యసాయిని కీర్తిస్తూ భక్తిగీతాల్ని ఆలపించారు.

Advertisement
 
Advertisement