ఖమ్మంమయూరిసెంటర్: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అటకెక్కించిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని పలు డివిజన్లలో సోమవారం ఏర్పాటుచేసిన ఆయన రోడ్షో, కార్నర్ మీటింగ్ల్లో ఆయన మాట్లాడారు. పధ్నాలుగేళ్లు అలుపెరుగని పోరాటం చేసిన కేసీఆర్ తెలంగాణను సాధించారని తెలిపారు. ఆపై అధికారంలోకి వచ్చాక ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయగా.. ఇప్పుడు కాంగ్రెస్ అధి కారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే పథకాలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. పింఛన్ పెంచకపోగా, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం హామీ ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్నాళ్లు తాగునీటి సమస్య లేదని, కానీ ఇప్పుడు నగరంలో ఎక్కడ చూడసినా వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నాయని తెలిపారు. ఈమేరకు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామను గెలిపించి కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని పువ్వాడ కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు బుర్రి వెంకట్, పగడాల శ్రీవిద్య, శీలంశెట్టి వీరభద్రం, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్