3.2 కిలోల వెండి తొడుగు సమర్పణ | Sakshi
Sakshi News home page

3.2 కిలోల వెండి తొడుగు సమర్పణ

Published Wed, May 8 2024 5:45 AM

3.2 కిలోల వెండి తొడుగు సమర్పణ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మల్లేశ్వర స్వామి వారి నిత్య పూజలకు ఉపయోగించే చెక్క బల్లకు అవసరమైన 3.2 కిలోల వెండి తొడుగును దాతలు మంగళవారం సమర్పించారు. విజయ వాడకు చెందిన కాంట్రాక్టర్‌ గుంటుపల్లి వెంకట్రావు దంపతులు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. మల్లేశ్వర స్వామి ఆలయంలో పూజలకు వినియోగించే చెక్కబల్లకు రూ.3 లక్షలతో 3.200 కిలోల వెండిరేకుతో తయారు చేయించిన తొడుగును ఆలయ ఈఓ కె.ఎస్‌.రామరావు, అర్చకులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దర్శనం కల్పించారు. దాతలకు ఆలయ ఈఓ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

 
Advertisement
 
Advertisement