సూర్య ఘర్‌ పథకంపై అవగాహన కల్పించండి | - | Sakshi
Sakshi News home page

సూర్య ఘర్‌ పథకంపై అవగాహన కల్పించండి

Published Sun, Oct 27 2024 10:04 PM | Last Updated on Sun, Oct 27 2024 10:04 PM

సూర్య ఘర్‌ పథకంపై అవగాహన కల్పించండి

సూర్య ఘర్‌ పథకంపై అవగాహన కల్పించండి

చిలకలపూడి(మచిలీపట్నం): కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సూర్య ఘర్‌ పథకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ డీకే బాలాజీ సూచించారు. ఏపీసీపీడీసీఎల్‌ జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ ఎం.భాస్కరరావుతో శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో సూర్య ఘర్‌ పథకంపై కలెక్టర్‌ చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇందుకోసం జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని ఈ నెల 30వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని నోడల్‌ అధికారి భాస్కరరావు కు కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ పాల్గొన్నారు.

జ్యూయలరీ పార్కులో జాబ్‌మేళా

కోనేరుసెంటర్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, డీఆర్‌డీఏ సీ–డాప్‌ల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమంలో భాగంగా శనివారం మండల పరిధిలోని పోతేపల్లి ఇమిటేషన్‌ జ్యూయలరీ పార్క్‌ మెంబర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ హాలులో జాబ్‌ మేళా నిర్వహించారు. ఈ మేళాలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.నరేష్‌ కుమార్‌, జిల్లా వొకేషనల్‌ ఉపాధి కల్పన అధికారి సత్య బ్రహ్మం, మచిలీపట్టణం ఇమిటేషన్‌ జ్యూయలరీ పార్క్‌ మెంబర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కార్యదర్శి అంకెం జితేంద్ర కుమార్‌ పాల్గొన్నారు. ఈ జాబ్‌మేళాలో 50 మంది నిరుద్యోగులు పాల్గొనగా 14 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

కలెక్టర్‌ బాలాజీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement