కర్నూలు(అర్బన్): పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరుగా వి.రామచంద్రారెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయన జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్యను మర్యాద పూర్వకంగా కలిశారు. వైఎస్సార్ కడప జిల్లాలో ఈఈగా విధులు నిర్వహిస్తున్న రామచంద్రారెడ్డికి ప్రభుత్వం ఎస్ఈగా పదోన్నతి కల్పించి ఇక్కడకు బదిలీ చేసింది. 1989లో అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఏఈఈ గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన రామచంద్రారెడ్డి 1998లో డీఈఈగా, 2018లో ఈఈగా పదోన్నతి పొంది నేడు ఎస్ఈగా బాధ్యతలు చేపట్టారు.
యువకుడి ఆత్మహత్య
దేవనకొండ: మండలంలోని పి.కోటకొండ గ్రా మంలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన జరీనాబీకి ఇద్దరు కుమారులు. వీరిలో మొదటి కుమారుడు రెండేళ్ల క్రితం చనిపోయాడు. రెండో కుమారుడైన షఫీబాషా (22)ఇంటర్ వరకు చదువుకుని ప్రైవేట్ వాహన డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత ఇంటికి వచ్చిన తల్లి గమనించి చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. చేదోడుగా ఉన్న రెండో కుమారుడు కూడా మృతిచెందడంతో ఆమె శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా యువకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం
వెల్దుర్తి(కృష్ణగిరి): వెల్దుర్తి సమీపంలోని 44వ జాతీయ రహదారిలో ఉన్న ప్రైవేట్ గ్రానైట్ పరిశ్రమ వద్ద గురువా రం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతి చెందాడు. దాదాపు 55 ఏళ్లు ఉన్న అతనికి రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వార సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment