No Headline
2019 ఎన్నిల ముందు టీడీపీ సర్కారు హడావుడిగా 68 చెరువులకు నీరు ఇచ్చేందుకు రూ.224.31 కోట్లతో అనుమతులు ఇచ్చి 13 శాతం మాత్రమే పనులు చేయించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం భూసేకరణ, డిజైన్స్కి అనుమతులతో పాటు, ఫారెస్ట్ భూములకు స్టేజ్–1, స్టేజ్–2 అనుమతులు ఇప్పించి వేగవంతంగా పనులు పూర్తి చేయించింది. అప్పటి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని టీడీపీ హయాంలోని 68 చెరువులకు మరో 12 చెరువులను చేర్చి మొత్తం 80 చెరువులకు నీరిచ్చేటట్లు పనులు చేయించారు. ఫలితంగా ఈ పథకం ద్వారా డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలోని 57 గ్రామాలకు, 10,130 ఎకరాలకు తాగు, సాగు నీరు అందుతుంది. అయితే, ఈ ఏడాది నిర్వహణ నిధులు లేక భారీ వర్షాలు కురిసినా హంద్రీనీవా కాల్వ నుంచి చెరువులు నింపలేని పరిస్థితి. ఇప్పటి వరకు 10.73 టీఎంసీల నీటిని మాత్రమే పంపింగ్ చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 19 చెరువుల్లో మాత్రమే జలకళ ఉంది. వాస్తవంగా 70కిపైగా చెరువులకు నింపేందుకు అవకాశం ఉంది. అయితే, కూటమి సర్కారు నిధులు ఇవ్వకపోవడంతో తామేమీ చేయలేకపోతున్నామని ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి.
తుగ్గలి మండలం జి.ఎర్రగుడి చెరువులో నీరు లేక చెట్లు పెరిగిన దృశ్యం
కళతప్పిన చెరువులు
Comments
Please login to add a commentAdd a comment