సమ్మె యోచనలో వైద్యమిత్రలు
దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం వైద్యమిత్రలు సమ్మెలోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. సమస్యలకు పరిష్కారం చూపకపోతే ఈ నెల 29వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిధిలోని పనిచేస్తున్న అన్ని కేడర్ల ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు ఆరోగ్యశ్రీ స్థానంలో వచ్చే బీమాలో తమను తీసుకుంటారా లేక బీమా కంపెనీ ఉద్యోగులే నూతన పథకాన్ని అమలు చేస్తారా అన్న అనుమానాలు కూడా వారిని వేదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగ భద్రతకే ముప్పు ఏర్పడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment