తల్లిదండ్రులే కాదు.. కొడుకులు, కూతుళ్లు కూడా.. | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులే కాదు.. కొడుకులు, కూతుళ్లు కూడా..

Published Sun, Oct 20 2024 2:00 AM | Last Updated on Sun, Oct 20 2024 2:00 AM

తల్లిదండ్రులే కాదు.. కొడుకులు, కూతుళ్లు కూడా..

హసన్‌పర్తి: మొక్కలను కన్నబిడ్డల్లా చూసుకున్నారు. వృత్తిలో భాగంగా రోజూ నీళ్లు పట్టారు. ఇప్పుడవి నీడనిస్తున్నాయి. అదే మాదిరిగా చిన్నప్పటి నుంచే ప్రోత్సాహాన్నందిస్తూ.. కొడుకులు, కూతుళ్లకు ప్రేరణ అందించారు. వారిని సైతం ప్రభుత్వ కొలువులు సాధించేలా చేశారు. ధర్మసాగర్‌ మండలం పీసరకు చెందిన బానోతు వాలియా– శాంతమ్మ దంపతులు ఉద్యోగ రీత్యా ఎస్సారెస్పీ క్యాంప్‌ క్వార్టర్స్‌లో ఉంటూ తోటమాలిగా పని చేశారు. వీరికి ముగ్గురు కుమారులు రాజు, రంగన్న, రాజేశ్‌, ముగ్గురు కూతుళ్లు పార్వతి, అరుణ, అపర్ణ వీరంతా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వీరంతా ప్రభుత్వ ఉద్యోగాలు (రాజేశ్‌ మినహా) సాధించారు. రాజు కొత్తగూడెం భద్రాచలంలో అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తుండగా.. రంగయ్య (జైళ్ల శాఖ)లో పనిచేస్తున్నారు. రాజేశ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ (యూఎస్‌)లో విధులు నిర్వహిస్తున్నాడు. పార్వతి కరీంనగర్‌ కమిషనరేట్‌లో సూపరిటెండెంట్‌గా పనిచేస్తున్నారు, అరుణ పరకాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, అపర్ణ ఆదిలాబాద్‌లో మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పెద్ద అల్లుడు పోరిక ఓంకార్‌ సింగ్‌ నీటిపారుదల శాఖలో పనిచేస్తుండగా.. రెండో అల్లుడు గణేశ్‌ కూడా టీచరే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement