నెహ్రూసెంటర్: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. శనివారం రాత్రి ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అన్ని వార్డులను పరిశీలిస్తూ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, సిబ్బంది సమయ పాలన పాటించాలన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ ఆర్ఎంఓ డాక్టర్ జగదీశ్వర్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment