డీకే అరుణ గెలుపు కోసం కష్టపడాలి | Sakshi
Sakshi News home page

డీకే అరుణ గెలుపు కోసం కష్టపడాలి

Published Sun, May 5 2024 1:30 AM

డీకే అరుణ గెలుపు కోసం కష్టపడాలి

మద్దూరు: పాలమూరు సమగ్రాభివృద్ధి కోసం అరుణమ్మను గెలిపించుకోవాలని, ఈ ప్రాంత సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న ఆమె గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కర్ణాటక రాష్ట్రం కోలార్‌ ఎంపీ మునిస్వామి కార్యకర్తలకు సూచించారు. శనివారం మద్దూరులోని బీజేపీ కార్యాలయంలో మద్దూరు, కొత్తపల్లి మండలాల కార్యకర్తలతో పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంపై సమీక్ష నిర్వహించారు. అసంపూర్తిగా ఉన్న శక్తి కేంద్రాల ఇన్‌చార్జులను, అసంపూర్తిగా ఉన్న కమిటీలను పూర్తి చేసుకోవాలని, బూత్‌ కమిటీ మెంబర్లు ప్రతి ఇంటికి వెళ్లి దేశంలో మోదీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు వివరించాలన్నారు. మూడో సారి మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పని అయిపోయిందని, బిడ్డ జైలుకు పోయింది, కొడుకుపై కేసు అయింది, అయ్య ఎటుపోతాడో తెలియని పరిస్థితి అని ఎద్దేవా చేశారు. ‘పాలమూరు కోసం అరుణమ్మ, దేశం కోసం మోదీ’ అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో రతంగ్‌పాండు రెడ్డి, రఘురామయ్యగౌడ్‌, శంకర్‌, సాయిలు, రవికుమార్‌, చందుగౌడ్‌, రాములు, చిరంజీవిరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, భవాని, ఆంజనేయులు, గుందప్ప, నర్సింహ, భరత్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement