రైతులను పట్టించుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వం | Sakshi
Sakshi News home page

రైతులను పట్టించుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వం

Published Wed, May 8 2024 3:55 AM

రైతులను పట్టించుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వం

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలో అకాల వర్షానికి మార్కెట్‌ యార్డులో తడిసిపోయిన వరి ధాన్యాన్ని మంగళవారం ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పరిశీలించారు. ఈ ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని మార్కెటింగ్‌ అధికారులను కోరడంతో వారు అంగీకరించారు. అనంతరం విలేకరులతో ఎంపీ, మాజీ మంత్రి మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూశామన్నారు. నకిలీ విత్తనాలు లేకుండా చర్యలు తీసుకున్నామని, రైతులకు సకాలంలో పిండి సంచులు అందజేశామన్నారు. అయితే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి వివిధ పంటలను రైతులు పండిస్తే ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

 
Advertisement
 
Advertisement