గ్రీన్‌బక్కెట్‌ పార్శిల్‌ హోటల్‌లో చోరీ | Sakshi
Sakshi News home page

గ్రీన్‌బక్కెట్‌ పార్శిల్‌ హోటల్‌లో చోరీ

Published Mon, May 6 2024 11:55 PM

-

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ పట్టణంలోని గ్రీన్‌బక్కెట్‌ బిర్యానీ పార్శిల్‌ హోటల్‌లో సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో చోరీ జరిగింది. హోటల్‌ వెనుక భాగం నుంచి ఓ బాలుడు లోనికి చొరబడి దొంగతనానికి పాల్పడినట్లు ఆ హోటల్‌ యజమాని నాగేందర్‌ తెలిపాడు. ముగ్గురు వ్యక్తులు బయట ఉన్నట్లు సీసీ ఫుటేజీలో రికార్డు అయినట్లు తెలిపాడు. మొత్తం రూ.8వేల నగదుతో పాటు ఒక సెల్‌ఫోన్‌ దొంగలించినట్లు వివరించాడు. కాగా చోరీకి పాల్పడిన బాలుడు నిర్మల్‌లో పట్టుబడినట్లు తెలిపాడు. ఈ నలుగురే ఇదివరకు రెండుసార్లు తమ హోటల్‌లో చోరీకి పాల్పడినట్లు వివరించారు.

గంజాయి స్వాధీనం

తాంసి: భీంపూర్‌ మండలంలోని బెల్సరీ రాంపూర్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రదీప్‌ కుమార్‌ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు సోమవారం గ్రామంలో తనిఖీలు చేపట్టగా గ్రామానికి చెందిన దాంజీ, భీంరావు నివాసాల్లో గంజాయిని గుర్తించారు. వారి వద్ద నుంచి 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.1.28 లక్షలు ఉంటుందని ఎస్సై తెలిపారు.

 
Advertisement
 
Advertisement