కొనసాగుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌ | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌

Published Tue, May 7 2024 12:15 AM

కొనసాగుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): జిల్లాలో హోం ఓటింగ్‌ ప్రక్రియ సోమవారం ముగిసింది. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా ఇంటి నుంచి ఓటు వేసేలా ఎన్నికల సంఘం వృద్ధులు, దివ్యాంగులకు అవకాశం క ల్పించింది. జిల్లాలో హోం ఓటింగ్‌ కోసం 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు 330 మంది దరఖాస్తు చేసుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నెల 3న ప్రారంభమైన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ 8వరకు కొనసాగనుంది. పార్లమెంట్‌ ఎన్నికల విధుల్లో పాల్గొనే 6,832 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకుంటున్నా రు. మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీఓ కార్యాలయాలతోపాటు చెన్నూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటర్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్లలో ఓటు వేస్తున్నారు. ఓటింగ్‌ సరళిని ఎప్పటికప్పుడు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సంతోష్‌ అడిగి తెలుసుకుంటున్నారు. సోమవారం వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ను దాదాపు మూడు వేల మంది వరకు వినియోగించుకున్నట్లు సమాచారం.

 
Advertisement
 
Advertisement