పేద విద్యార్థులకు సీట్లు కేటాయించాలి | Sakshi
Sakshi News home page

పేద విద్యార్థులకు సీట్లు కేటాయించాలి

Published Tue, May 21 2024 11:10 AM

పేద విద్యార్థులకు సీట్లు కేటాయించాలి

మెదక్‌ కలెక్టరేట్‌: విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్‌ పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు ఉచిత అడ్మిషన్లు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు బాల్‌రాజ్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ రమేశ్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో 15 ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయని.. ప్రతి పాఠశాల 25 మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత అడ్మిషన్లు ఇవ్వాలని కోరారు. ఈ నిబంధన విద్యాహక్కు చట్టంలో ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు.

Advertisement
 
Advertisement
 
Advertisement