నారాయణఖేడ్: మహారాష్ట్ర నాందేడ్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జిగా జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ నియమితులయ్యారు. ఆ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలుపొందిన చవాన్ బలవంతరావు ఇటీవల ఆకస్మికంగా మృతిచెండడంతో త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో సురేశ్ షెట్కార్ను పార్టీ అధిష్టానం నాందేడ్ పార్లమెంట్ ఇన్చార్జిగా నియమించింది. బుధవారం తన అధ్యక్షతన నాందేడ్ లోక్సభ పరిధిలోని నాందేడ్ నార్త్, సౌత్, భోకర్, నయాగావ్, డెగ్లూర్, ముత్ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి ఘనస్వాగతం పలికారు. అనంతరం లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం దిశానిర్దేశం చేశారు.
విద్యార్థుల క్షేత్ర పర్యటన
మెదక్జోన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివే బీఎస్సీ, బీజెడ్సీ తృతీయ సంవత్సరం విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా బుధవారం పట్టణంలోని జిల్లా మత్స్యశాఖ కార్యాలయాన్ని సందర్శించారు. చేపపిల్లల పెంపకం గురించి సంబంధిత అధికారులు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ విశ్వనాథం, వినోద్కుమార్, నాగరాణి విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment