కొల్చారం(నర్సాపూర్): దళితులపై దాడులు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం నర్సాపూర్ డివిజన్ కార్యదర్శి నాగరాజు, ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రభాకర్ డిమాండ్ చేశారు. శనివారం గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ.. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా మండలంలోని తుక్కాపూర్ గ్రామంలో తలెత్తిన వివాదం కారణంగా దళితులపై జరిగిన దాడిని హేయమైన చర్యగా పేర్కొన్నారు. మానవుడు అంతరిక్షంలోకి వెళ్తున్న తరుణంలో దళితులపై దాడులకు దిగుతూ శారీరకంగా, మానసికంగా హింసిస్తున్న సందర్భాలు తరచూ చోటు చేసుకుంటున్నాయన్నారు. ఈ మధ్యకాలంలో నర్సాపూర్ నియోజకవర్గంలో మరీ ఎక్కువగా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం దురదుష్టకరమన్నారు. దాడి చేసిన వారిపై పోలీసులు ఈ నెల 11న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినప్పటికీ, అరెస్టు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ నేతల ఒత్తిడితోనే పోలీసులు వెనక్కు తగ్గుతున్నారంటూ ఆరోపించారు. సోమవారంలోగా అరెస్టు చేయకుంటే రంగంపేటలోని అంబేడ్కర్ విగ్రహం వేదికగా దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు ప్రచార కార్యదర్శి ఆకుల పెంటయ్య, జర్నలిస్ట్ జైపాల్, దళిత సంఘాల నాయకులు దుర్గయ్య, పాపయ్య, దేవయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.
దళిత సంఘాల నాయకులు
Comments
Please login to add a commentAdd a comment