రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ | - | Sakshi
Sakshi News home page

రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్‌

Published Sun, Oct 20 2024 7:16 AM | Last Updated on Sun, Oct 20 2024 7:16 AM

రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్‌

నర్సాపూర్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రైతుబంధు ఇవ్వకుండా రైతులను మోసం చేస్తుందని బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శేఖర్‌ ఆరోపించారు. శనివారం పట్టణంలో బస్టాండ్‌ వద్ద పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. రైతుబంధు ఇవ్వకుండా రైతులను మోసం చేసిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్‌ పూర్తిగా విఫలం అయిందన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు శివకుమార్‌, వెంకటేష్‌గౌడ్‌, శ్రీనివాస్‌రెడ్డి, బబియానాయక్‌, పరేమేశ్వర్‌రాజు, భిక్షపతిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

నిజాంపేటలో నిరసన

నిజాంపేట(మెదక్‌): మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయాలని సీఎం దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక పంట కోతకు వచ్చిన రైతు భరోసా నిధులు విడుదల చేయలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రభుత్వం వెంటనే రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్‌ నాయకులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement