మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు
సిద్దిపేటజోన్: సామాజిక బాధ్యతగా తోటివారికి సేవ చేసే అలవాటుతో పాటు పిల్లల్లో మానవీయ విలువలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చా రు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ట్రెస్మా ఆధ్వర్యంలో గురువందనం కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులపై ఉందన్నారు. ప్రస్తుతం చిన్న పిల్లలు మొబైల్ పట్ల ఆసక్తి పెంచుకుంటున్నారని, పిల్లలను దూరంగా ఉంచేలా తల్లిదండ్రులు, గురువులు పనిచేయాలన్నారు. చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెరిగేలా ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో పదో తరగతి ఉత్తమ ఫలితాల్లో టీచర్ల పాత్ర ఎంతో ఉందన్నారు. ఇక్కడి పిల్లలు ప్రపంచ వ్యాప్తంగా దేశవిదేశాల్లో ఉన్నత చదువులు. ఉద్యోగాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. సమాజహితంగా ప్రయివేటు టీచర్లు సైతం పనిచేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, సిద్దిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరాం, ట్రెస్మా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment