రీరిలీజ్‌.. టాలీవుడ్‌లో ఇప్పుడిదే ట్రెండ్‌! | Vikramarkudu, Siva, Murari, Eto Vellipoindhi Manasu Movies Are Ready To Re-Release, Check Release Dates Inside | Sakshi
Sakshi News home page

Re-Release Movies In August: రీరిలీజ్‌.. టాలీవుడ్‌లో ఇప్పుడిదే ట్రెండ్‌!

Published Tue, Jul 23 2024 5:04 PM | Last Updated on Tue, Jul 23 2024 6:00 PM

Vikramarkudu, Siva And Other Two Movies Are Ready To Rerelease

రీరిలీజ్‌ అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండింగ్‌గా మారింది. స్టార్‌ హీరోల బ్లాక్‌ బస్టర్‌ మూవీస్‌ వరుసగా మళ్లీ థియేటర్స్‌లో సందడి చేస్తున్నాయి. అభిమానుల డిమాండ్‌ మేరకు నచ్చిన సినిమాలను మళ్లీ రిలీజ్‌ చేస్తూ నిర్మాతలు సొమ్ము చేసుకుంటున్నారు. టెక్నాలజీ వాడుకొని అత్యంత నాణ్యమైన 4కేలో సినిమాను రిలీజ్‌ చేస్తుండడంతో అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఆయా చిత్రాలను మళ్లీ థియేటర్స్‌లో చూసేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు.ఇప్పటికే టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు కొన్ని రీరిలీజ్‌ అయి మంచి వసూళ్లను సాధించాయి. ఇక ఇప్పుడు వరుసగా నాలుగు సూపర్‌ హిట్‌ చిత్రాలు మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్స్‌లోకి రాబోతున్నాయి. అవేంటో చూసేయండి.

దర్శకధీరుడు రాజమౌళి, మాస్‌ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘విక్రమార్కుడు’. 2006లో రిలీజ్‌ అయిన ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలించింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత  మళ్లీ ఈ మూవీ థియేటర్స్‌లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. జులై 27న  ఈ మూవీని రీరిలీజ్‌ చేస్తున్నామని మేకర్స్‌ ప్రకటించారు.

మహేశ్‌బాబు హీరోగా, కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం ‘మురారి’. 2001లో విడుదలైన ఈ ఫ్యామిలీ డ్రామా.. బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. మణిశర్మ అందించిన సంగీతం, పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర వహించింది. మహేశ్‌ని ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరకు చేసిన చిత్రమిది. దాదాపు 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. మహేశ్‌ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్‌ 9న ఈ చిత్రాన్ని 4కే వెర్షన్‌లో రిలీజ్‌ చేయనున్నారు.

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘శివ’ కూడా రీరిలీజ్‌కు రెడీ అవుతోంది. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా ... అక్టోబర్‌ 5, 1989లో విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టడమే కాదు టాలీవుడ్‌ గతినే మార్చేసింది. ఈ తరం అక్కినేని అభిమానుల కోసం ఈ చిత్రం మరోసారి థియేటర్‌లో సందడి చేయనుంది. నాగార్జున బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్‌ 29న ఈ చిత్రాన్ని రీరిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా అమల, శుభలేఖ సుధాకర్, రఘువరన్, తనికెళ్లభరణి తదితరులు నటించారు.

ప్రేమ కథలకు పెట్టింది పేరు గౌతమ్‌ మీనన్‌. ఆయన తెరకెక్కించిన క్యూట్ లవ్ స్టోరీ 'ఎటో వెళ్లిపోయింది మనసు'. నాని-సమంత జంటగా నటించిన ఈ ప్రేమకథా చిత్రం 2012 డిసెంబర్‌ 14 విడుదలైన మంచి విజయాన్ని సాధించింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ  ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీని ఆడియన్స్‌ ముందుకు రాబోతుంది.  ఆగస్ట్ 2న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ రీ రిలీజ్ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement