Rerelease
-
రామ్చరణ్తో పోటీపడేంతవాడివా సిద్ధూ...
సిద్ధు జొన్నలగడ్డ చిన్నస్థాయి నుంచి సినీ పరిశ్రమలో స్టార్ బాయ్గా ఎదగడం సినీ పరిశ్రమలోని ఔత్సాహిక నటీనటులకు పెద్ద ప్రేరణ. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో హోదా సాధించాడు. అయితే ఇదేమీ అలవోకగా సాధించేసింది కాదు. దాదాపుగా దశాబ్ధంన్నర పాటు పడిన కష్టం దీని వెనుక ఉంది. సీనియర్ హీరో రవితేజలాగా అత్యంత చిన్న స్థాయి పాత్రలు వేస్తూ పెద్ద స్టార్గా ఎదిగిన వర్ధమాన హీరోల్లో సిద్ధూ ముందు వరుసలో ఉంటాడు.డీజే టిల్లు 1, 2 భాగాలు సిద్ధూని ఒకేసారి పెద్ద స్టార్గా మార్చేశాయి. అతని తదుపరి సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. సిద్ధు జొన్నలగడ్డ డిజె టిల్లు ద్వారా పూర్తిగా వన్మ్యాన్ షో చేశాడని చెప్పాలి. ఆ సినిమాలో వెరైటీ మాడ్యులేషన్తో యాక్షన్, కామెడీని పండించి సరికొత్త హీరోయిజాన్ని రుచి చూపించిన సిద్ధూ ఆ సినిమాకి కధారచయితగా కూడా వ్యవహరించడం విశేషం. జోష్ సినిమాలో చిన్నపాత్రతో మొదలైన సిద్ధూ జొన్నలగడ్డ కెరీర్ తర్వాత కూడా డాన్ శీను, భీమిలి కబడ్డి జట్టు..లాంటి పలు చిత్రాల్లో అలాంటి పాత్రలతోనే కొనసాగింది. ఆ తర్వాత ఈ యువ హీరో లైఫ్ బిఫోర్ వెడ్డింగ్లో తొలిసారిగా ప్రధాన పాత్రలో అరంగేట్రం చేసిన సిద్ధూ హీరోగా మారి గుంటూరు టాకీస్ వంటి ఎ సర్టిఫైడ్ చిత్రాల ద్వారా హిట్స్ దక్కించుకున్నాడు. అదే విధంగా తను నటించిన చిత్రాల్లో కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా కోవిడ్ సమయంలో ధియేటర్లలో విడుదలకు నోచుకోలేక కేవలం ఓటీటీలో మాత్రమే విడుదలైంది.పెద్దలకు మాత్రమే అన్నట్టుగా రూపొందిన ఈ చిత్రం అప్పట్లో రొమాంటిక్ మూవీగా హిట్ టాక్ తెచ్చుకుంది కూడా. ఆ తర్వాత మారిన పరిణామాల్లో సిధ్దూకి డిజె టిల్లు తెచ్చిపెట్టిన క్రేజ్ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేస్తే బాగుంటుందనుకున్నారు. యూత్లో సిధ్దూకి ఉన్న ఫాలోయింగ్ని దృష్టిలో ఉంచుకుని వాలెంటైన్స్ డే సందర్భంగా ధియేటర్లలో విడుదల చేసేశారు కూడా. ఇక్కడ గమనించాల్సిన విశేషం ఏమిటంటే అదే రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ చిత్రం రీ రిలీజ్ కూడా ఉండడం.అప్పట్లో ఆరెంజ్ సినిమా కు విమర్శకుల ప్రశంసలు వచ్చినప్పటికీ కమర్షియల్గా ఫ్లాప్ చిత్రంగానే నిలిచింది. ఈ నేపధ్యంలో ఈ సినిమా రీ రిలీజ్ అదే రోజు సిద్ధూ జొన్నలగడ్డ సినిమా రీ రిలీజ్ ఉండడం సినీ వర్గాల్లో ఆసక్తి నింపాయి. మరో చెప్పుకోదగ్గ విశేషం... నాటి ఆరెంజ్ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ సైతం సంతోష్ అనే చిన్న పాత్రలో నటించాడు. ఆ సినిమాలో హీరో రామ్ చరణ్కి పోటీగా హీరోయిన్ ని ప్రేమలో పడేలా చేసే ముగ్గురు అబ్బాయిల్లో ఒకడిగా చేశాడు. ఆసక్తికరంగా... సిద్ధూ ఆరెంజ్ చిత్రాన్ని రూపొందించిన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలోనే తదుపరి జాక్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఈ వారం ఆసక్తికరంగా, సిద్ధు ’ఇట్స్ కాంప్లికేటెడ్’ (కృష్ణ అండ్ అతని లీల) పేరుతో ఆరెంజ్కి పోటీగా విడుదలైంది. ఓ యువ హీరో సినిమా రీ రిలీజ్కు నోచుకోవడం కూడా ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. అయితే ముందూ వెనుకా చూసుకోకుండా సిద్ధూ తన సినిమాని రామ్చరణ్ సినిమా రీ రిలీజ్ రోజునే విడుదల చేయడంతో ఇప్పుడు వీరిద్దరిని పోలుస్తూ కామెంట్ చేయడం మొదలైంది. మరోవైపు రీరిలీజ్లో సిద్ధూ చిత్రం పూర్తిగా చతికిలబడగా రామ్ చరణ్ ఆరెంజ్ అనూహ్యంగా భారీ కలెక్షన్లు సాధించింది.తెలుగు చిత్రసీమలో సిద్ధూ ఎదుగుదల ప్రశంసించదగ్గదే. స్థిరత్వం అంకితభావంతో సినీ పరిశ్రమలో ఒక నటుడి జీవితం ఎలా మారుతుందో చెప్పడానికి సిద్ధూ ఒక ఉదాహరణ. అయితే పెద్దగా అండదండలు లేని హీరోల స్టార్ డమ్ ఎప్పుడూ నిలకడగా ఉండడం తెలుగు చిత్రసీమలో సాధ్యం కాదని సిధ్దూ గుర్తించాలి. అన్ని రకాలుగా తమకన్నా పెద్ద హీరోలతో పోటీ పడే విషయంలో యువ హీరోలు కాస్త వివేకంతో వ్యవహరించాలని సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. -
50 ఏళ్ల వేడుక.. రజనీకాంత్ ఇండస్ట్రీ హిట్ సినిమా రీరిలీజ్
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన నరసింహ రీరిలీజ్ కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. 1999లో వచ్చిన ఈ చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో నీలాంబరిగా చాలా పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ (Ramya Krishnan) నటించారు. ఇందులో శివాజీ గణేశన్, సౌందర్య,నాజర్,అబ్బాస్ తదితరులు నటించారు. తమిళ్లో సంచలన విజయం అందుకున్న ఈ మూవీ తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం నుంచి రజనీకాంత్కు ఇక్కడ మార్కెట్ కూడా పెరిగింది.(ఇదీ చదవండి: 'డాకు మహారాజ్'కు తారక్ ఫ్యాన్స్ అన్ స్టాపబుల్ వార్నింగ్)దర్శకుడు కేఎస్ రవికుమార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ నరసింహ (Narasimha) సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాదితో రజనీకాంత్ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి అవుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తాను ఈ మూవీని రీరిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఎప్పుడు థియటర్స్లోకి తీసుకొచ్చే విషయాన్ని ఆయన చెప్పలేదు. కానీ, ఈ చిత్రం 2025 ఆగష్టులో విడుదల కావచ్చని తెలుస్తోంది. రజనీ నటించిన తొలి సినిమా అపూర్వ రాగంగళ్ 1975 ఆగస్టు 18న విడుదలైంది. దీంతో అప్పటికి ఆయన ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి అవుతాయి. ఆ సమయానికి నరసింహ సినిమాను రీరిలీజ్ చేయాలని ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలుపెడుతున్నారు. ఈ మధ్య కాలంలో రజనీ నటించిన హిట్ చిత్రాలు మళ్లీ బిగ్ స్క్రీన్స్పై సందడి చేశాయి. అందులో భాషా, బాబా, దళపతి ఉన్నాయి. ఇప్పుడు నరసింహ మూవీ మళ్లీ విడుదల కానున్నడంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు.నరసింహ సినిమా 1999లో 200 ప్రింట్స్తో విడుదలైంది. ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. 86 థియేటర్ సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. చాలా ప్రాంతాలలో 200 రోజులకు పైగా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 50 కోట్లు రాబట్టింది. ఆ సమయంలో అమెరికాలో రూ. 3 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత రజనీ లుక్ను బీడీలు, సిగరెట్లు పొగాకు వంటి వాటిపై ట్రేడ్మార్క్గా రైట్స్ కొనుగోలు చేశారు. -
రవితేజకు 'నంది అవార్డు' తెచ్చిన సినిమా రీరిలీజ్పై ప్రకటన
మాస్ మహారాజా రవితేజ- డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా రీరిలీజ్ కానుంది. ఈమేరకు తాజాగా విడుదులైన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, థియేటర్లలో డిజాస్టర్గా నిలిచిన ఈ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 2008లో విడుదలైన 'నేనింతే' చిత్రంలో రవితేజ,శియా గౌతం జోడీగా మెప్పించారు. పూరి దర్శకత్వానికి చక్రి సంగీతం తోడైతే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మ్యూజికల్గా ఈ చిత్రంలోని చాలా పాటలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి.సుమారు 16 ఏళ్ల తర్వాత నేనింతే చిత్రం రీరిలీజ్ కానుంది. రవితేజ బర్త్డే సందర్భంగా జనవరి 26న విడుదల చేస్తున్నట్లు చిత్ర మేకర్స్ ప్రకటించారు. ఈమరకు ఒక పోస్టర్ను కూడా అభిమానులతో పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో తమ టాలెంట్ చూపించాలని చాలామంది హైదరాబాద్ వస్తుంటారు. అలా కృష్ణ నగర్లో అడుగుపెట్టిన వారి కష్టాలను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూ.. దర్శకుడు పూరి జగన్నాథ్ నేనింతే మూవీని తెరకెక్కించాడు. చిత్ర పరిశ్రమలో సక్సెస్ కావడం వెనుక దాగి ఉన్న కష్టాలను చాలా ఎమోషనల్గా ఈ మూవీలో పూరి చూపించాడు. ఈ మూవీ కమర్షియల్గా ఫెయిల్యూర్ అయినప్పటికీ ఉత్తమ నటుడిగా రవితేజకు నంది అవార్డు దక్కింది. ఇదే చిత్రానికి గాను ఉత్తమ మాటల రచయితగా పూరీ జగన్నాథ్, ఉత్తమ ఫైట్ మాస్టర్స్గా రామ్ లక్ష్మణ్లకు నంది అవార్డ్స్ లభించాయి.నేనింతే సినిమాలో రవితేజకు జోడీగా శియా గౌతమ్ హీరోయిన్గా తొలి పరిచయం అయింది. ఆమెకు అదితి గౌతమ్ అని మరో పేరు కూడా ఉంది. నేనింతే చిత్రంలో శియా నటనకు మంచి గుర్తింపు దక్కింది. అయినా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే, ముంబయికి చెందిన వ్యాపార వేత్తతో రీసెంట్గా ఆమె పెళ్లి కూడా అయిపోయింది. నేనింతే చిత్రంలో బ్రహ్మానందం, వేణుమాధవ్, సుప్రీత్, సుబ్బరాజు కీలక పాత్రల్లో కనిపించారు. ఇదే మూవీలో డైరెక్టర్లు హరీష్ శంకర్, వీవీ వినాయక్, కోన వెంకట్తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి కూడా గెస్ట్ రోల్స్ కనిపించడం విశేషం. -
చిరంజీవి హిట్ సినిమా.. 28 ఏళ్ల తర్వాత రీరిలీజ్
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో సూపర్ హిట్ సినిమా హిట్లర్ రీరిలీజ్ కానుంది. 1997లో సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలైంది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రంభ కథానాయికగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, దాసరి నారాయణ రావు, రామిరెడ్డి కీలకపాత్రలు పోషించారు. సుమారు 28 ఏళ్ల తర్వాత హిట్లర్ సినిమా రీరిలీజ్ కానున్నడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.అయిదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా చిరు నటన హిట్లర్ చిత్రంలో అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి కోటీ అందించిన సంగీతం చాలా హిట్ అయింది. నటుడు, రచయిత ఎల్. బి. శ్రీరామ్ ఈ చిత్రానికి డైలాగ్స్ అందించడం విశేషం. 42 సెంటర్స్లలో హిట్లర్ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. చిరు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఈ సినిమా జనవరి 1న రీరిలీజ్ కానుంది. 'అంతొద్దు - ఇది చాలు' అన్న డైలాగు ఈ చిత్రం నుంచే ట్రెండ్ అయింది. ఇన్నేళ్లు అయినా ఈ డైలాగ్ మీమ్స్ రూపంలో ఇప్పటికీ సోషల్మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. 'నడక కలిసిన నవరాత్రి' అనే పాటకు చాలామంది అభిమానులు ఉన్నారు. అప్పట్లో ఆ సాంగ్ సూపర్ హిట్. ఇందులో 'అబీబీ.. అబీబీ.. అంటూ సాగే పాటకు చిరు ఎవర్గ్రీన్ స్టెప్ వేశారు. దీనికి లారెన్స్ నృత్యాలు సమకూర్చారు.చిరు సినిమాను రెండుసార్లు రిజెక్ట్ చేసిన ఇంద్రజ'యమలీల' సినిమా హిట్తో మంచి క్రేజ్లో ఉన్న నటి ఇంద్రజకు చిరుతో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే, దానిని ఆమె కాదనుకుంది. మొదట అల్లుడా మజాకా సినిమాలో మెగాస్టార్కు చెల్లిగా ఇంద్రజను అనుకున్నారు. కానీ, ఆమె నటించకపోవడంతో ఆ ఛాన్స్ నటి ఊహ దక్కించుకుంది. అలాగే హిట్లర్ సినిమాలో కూడా చిరు పక్కన మళ్లీ సోదరిగా నటించే అవకాశం దక్కింది. అప్పుడు కూడా తనకు డేట్స్ వీలు కాకపోవడంతో నో చెప్పింది. అలా రెంసార్లు చిరంజీవి ప్రాజెక్ట్లను ఆమె తిరస్కరించింది. అయితే, ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అసలు విషయం చెప్పింది. చిరు చెల్లిగా నటిస్తే ఆయనతో డ్యాన్స్ చేసే అవకాశం ఉండదని భావించి ఆ చిత్రాలను తిరస్కరించానని ఆమె పేర్కొంది. తాను చిరుకు అభిమానినని ఆయనతో కలిసి ఒక పాటకు అయినా డ్యాన్స్ చేయాలనేది తన కోరిక అని ఆమె పేర్కొంది. -
నా ఛాతీలో దమ్ముంది
‘నా కలర్ నలుపు... కానీ, నా క్యారెక్టర్ ఎరుపు’ అంటూ నటుడు అశోక్ కుమార్ చెప్పే డైలాగ్తో ‘ఈశ్వర్’ సినిమా ట్రైలర్ ఆరంభమైంది. ప్రభాస్ హీరోగా పరిచయమైన చిత్రం ‘ఈశ్వర్’. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీదేవి విజయ్కుమార్ హీరోయిన్గా నటించారు. బ్రహ్మానందం, శివ కృష్ణ, రేవతి ఇతర పాత్రలు పోషించారు. కొల్ల అశోక్ కుమార్ నిర్మించిన ఈ సినిమా 2002 నవంబరు 11న రిలీజై హిట్గా నిలిచింది.కాగా ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘ఈశ్వర్’ సినిమాని అదే రోజు 4కే క్వాలిటీలో రీ రిలీజ్ చేస్తోంది లక్ష్మీ నరసింహా మూవీస్. ఈ నేపథ్యంలో ఈ మూవీ రీ రిలీజ్ ట్రైలర్ని విడుదల చేశారు. రీ ఇంట్రడ్యూసింగ్ ప్రభాస్ అంటూ రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే... ‘నీ చేతిలో డబ్బుంటే... నా ఛాతీలో దమ్ముంది రా, ఈ రోజు ఆ పోరి సంగతి అటో ఇటో తేల్చేస్తాను, ప్రేమించింది మర్చిపోవడానికి కాదు’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగులు ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: ఆర్పీ పట్నాయక్. -
ఖడ్గంలో నన్ను తీసుకోవద్దన్నారు: శ్రీకాంత్
‘‘ఖడ్గం’ సినిమాలో నన్ను తీసుకోవద్దని నిర్మాత మధు మురళిగారు అన్నారు. కానీ కృష్ణవంశీ ధైర్యం చేసి, ఆయన్ని ఒప్పించి నన్ను తీసుకున్నారు. నా జీవితంలో ఈ సినిమాని మర్చిపోలేను. తరాలు మారినా దేశభక్తి చిత్రాలన్నింటిలో ‘ఖడ్గం’ గొప్ప చిత్రం. ఈ మూవీ మళ్లీ విడుదలవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని శ్రీకాంత్ అన్నారు. రవితేజ, శ్రీకాంత్, ప్రకాశ్రాజ్, శివాజీ రాజా, షఫీ, సోనాలీ బింద్రే, సంగీత తదితరులు ప్రధానపాత్రల్లో నటించిన సినిమా ‘ఖడ్గం’. కృష్ణవంశీ దర్శకత్వంలో సుంకర మధు మురళి నిర్మించిన ఈ సినిమా 2002 నవంబర్ 29న విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది.కాగా ఈ నెల18న ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కృష్ణవంశీ మాట్లాడుతూ – ‘‘భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశంతో ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టాను’’ అని చెప్పారు. ‘‘ఖడ్గం’లో నేను చేయనని చెప్పాను. కానీ, ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నిటిలో నాకు మంచి పేరు వచ్చింది మాత్రం ఈ సినిమాతోనే’’ అన్నారు శివాజీ రాజా. ‘‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చదివి ఏడేళ్లుగా అవకాశం కోసం వేచి చూస్తున్న సమయంలో నాకు దొరికిన అవకాశం ‘ఖడ్గం’. ఈ సినిమాలో చాన్స్ ఇచ్చి నా వనవాసం ముగింపునకు కారణమైన కృష్ణవంశీగారికి కృతజ్ఞతలు’’ అని నటుడు షఫీ తెలిపారు. -
ఊహించలేని ట్విస్ట్లతో 'తుంబాడ్'.. రీ-రిలీజ్ ట్రైలర్ చూశారా..?
రీ రిలీజ్ ట్రెండ్ అన్ని చిత్రపరిశ్రమలలో కొనసాగుతుంది. తెలుగు, హిందీ అనే తేడా లేకుండా ప్రతిచోటా ఒకప్పటి హిట్ సినిమాల్ని మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటి వరకు మీరు లవ్ స్టోరీస్, యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ సినిమాలను రీ-రిలీజ్లో చూసి ఉంటారు. ఇప్పుడు హారర్ సినిమా చూసేందుకు సిద్ధంగా ఉండండి.హారర్ జానర్లో ట్రెండ్ సెట్ చేసిన మూవీ అంటే చాలామంది చెప్పే పేరు 'తుంబాడ్'. ఈ సినిమా సెప్టెంబర్ 13న దేశవ్యాప్తంగా రీ-రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. 2018లో విడుదలైన ఈ సినిమా ఆ సమయంలో పెద్దగా మెప్పించలేదు. అయితే, కరోనా సమయంలో అమెజాన్ ప్రైమ్లో తుంబాడ్ విడుదలైంది. అప్పుడు మాత్రం ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడా సినిమాను బిగ్ స్క్రీన్ మీదే చూడాలనుకునే అభిమానులు సెప్టెంబర్ 13న చూడొచ్చు. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని రీ-రిలీజ చేయనున్నారు. మహారాష్ట్రలోని 'తుంబాడ్' అనే గ్రామంలో దాగి ఉన్న నిధి గురించి సాగే అన్వేషణతో ఈ చిత్ర కథ ఉంటుంది. అత్యాశ మనిషికి ఎలాంటి పరిస్థితికి దిగజారుస్తుందో తండ్రీకొడుకుల పాత్రలతో తుంబాడ్లో చక్కగా చూపించారు. అనేక సన్నివేశాలను రీషూట్ చేయాల్సి రావడంతో.. ఈ చిత్రం ఆరేళ్ల పాటు షూటింగ్ జరుపుకుందట.! -
మా జీవితాలను మార్చింది: హరీష్ శంకర్
‘‘సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందిన ఈ రోజుల్లో ‘గబ్బర్ సింగ్’ రిలీజ్ అయి ఉంటే ఎంత బాగుండేదో అని నా మనసులో చిన్న వెలితి ఉండేది. ఆ వెలితి ఇప్పుడు తీరింది. అప్పుడు మిస్ అయిన డిజిటల్ హంగామాని మళ్లీ క్రియేట్ చేసి ఇస్తున్న మా అన్న గణేశ్కి, సత్యనారాయణకి థ్యాంక్స్. ‘గబ్బర్ సింగ్’ మా జీవితాలను మార్చేసిన సినిమా’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. పవన్ కల్యాణ్, శ్రుతీహాసన్ జంటగా నటించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. బండ్ల గణేశ్ నిర్మించిన ఈ చిత్రం 2012 మే 11న విడుదలైంది. ఈ నెల 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘గబ్బర్ సింగ్’ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో శనివారం ప్రెస్ మీట్లో హరీష్ శంకర్ మాట్లాడుతూ – ‘‘గబ్బర్ సింగ్’ డబ్బింగ్ సమయంలోనే ఈ మూవీ పక్కా బ్లాక్బస్టర్ అన్నారు పవన్ కల్యాణ్గారు. నా అభిమానులు కోరుకునేది ఇవ్వబోతున్నావ్’’ అన్నారు. ‘‘నన్ను నేను నమ్మలేని పరిస్థితిలో పవన్ కల్యాణ్గారు నమ్మి, నన్ను నిర్మాతగా నిలబెట్టారు. నేను, హరీష్, దేవిశ్రీ ప్రసాద్... అందరూ ప్రేమించి ఈ సినిమా చేశాం. ఏడేళ్లుగా నేను సినిమా తీయకపోవడం బాధగా ఉంది... మళ్లీ సినిమాలు తీస్తా’’ అన్నారు బండ్ల గణేశ్. డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ, నటుడు రమేశ్రెడ్డి మాట్లాడారు. -
ఆరేళ్లు తీసిన క్రేజీ హారర్ సినిమా.. థియేటర్లలో రీ రిలీజ్
రీ రిలీజ్ ట్రెండ్ ప్రస్తుతం చాలా ఫేమస్. తెలుగు, హిందీ అనే తేడా లేకుండా ప్రతిచోటా ఒకప్పటి హిట్ సినిమాల్ని మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఇప్పటికే చూశాం కదా అని అనుకోకుండా బిగ్ స్క్రీన్పై చూసి ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ టైంలో మురారి, ఇంద్ర, మాస్.. ఇలా ఓ రేంజులో అలరించాయి. ఇప్పటివరకు అన్నీ మాస్ మూవీస్ వచ్చాయి కానీ ఈ ట్రెండ్లోనే తొలిసారి ఓ హారర్ మూవీ రిలీజ్ కాబోతుంది.(ఇదీ చదవండి: అమ్మ చిరకాల కోరిక తీర్చిన ఎన్టీఆర్)హారర్ జానర్లో ట్రెండ్ సెట్ చేసిన మూవీ అంటే చాలామంది చెప్పే పేరు 'తుంబాడ్'. రెగ్యులర్ హారర్ టైపు స్టోరీ కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కించారు. అయితే నిర్మాతలకు డబ్బుల్లేక 2012 నుంచి దాదాపు ఆరేళ్ల పాటు విడతల వారీగా షూటింగ్ చేశారు. ఫైనల్గా 2018లో థియేటర్లలో రిలీజ్ చేస్తే ఓ మాదిరి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఓటీటీలో అది కూడా లాక్ డౌన్లో ఈ సినిమాని తెగ చూశారు. ఇప్పుడు దీన్నే సెప్టెంబరు 13న మళ్లీ దేశంలో పలుచోట్ల రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.'తుంబాడ్' విషయానికి వస్తే.. 1918లో మహారాష్ట్రలోని కలమేడ్ గ్రామం. వినాయక్ రావు (సోహం షా) తన తల్లి, సోదరుడితో కలిసి నివసిస్తుంటాడు. ఊరి గుడిలో నిధి దాగి ఉందన్న వార్త విని, దాని కోసం వెతుకుతుంటాడు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అత్యాశ అనే స్టోరీ లైన్తో తీసిన ఈ మూవీలో ఊహించని హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ అందిస్తాయి. థియేటర్లలో మంచి ఎక్స్పీరియెన్స్ కావాలనుకుంటే ఈ మూవీ మాత్రం అస్సలు మిస్సవ్వొద్దు.(ఇదీ చదవండి: ఏఆర్ రెహమాన్ కూతురికి విచిత్రమైన కష్టాలు) -
‘వన్స్ మోర్’ అంటున్న ఫ్యాన్స్.. పాత సినిమాలే సరికొత్తగా!
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ... ఇలా భాష ఏదైనా ప్రస్తుతం ‘వన్స్ మోర్’ అంటూ రీ రిలీజ్ల ట్రెండ్ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా ఈ ట్రెండ్ తెలుగులో ఇంకాస్త ఎక్కువగా ఉంది. గతంలో సూపర్ హిట్గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు. స్టార్ హీరోల పుట్టినరోజు కావచ్చు లేదా ఆ సినిమాకి ఏదైనా ప్రత్యేకమైన రోజు కావచ్చు... సందర్భం ఏదైనా రీ రిలీజ్కి హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా రీ రిలీజ్లో కూడా ఆయా సినిమాలు భారీగానే కలెక్షన్స్ కొల్లగొడుతుండటం కూడా ఓ కారణం. ఆయా హీరోల అభిమానులు, ప్రేక్షకులు కూడా ‘వన్స్ మోర్’ అంటూ ఆ సినిమాలను బిగ్ స్క్రీన్పై చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గత చిత్రాలను 4కె క్వాలిటీతో అందిస్తుండటంతో ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. చిరంజీవి ‘ఇంద్ర’ ఈ నెల 22న విడుదల కాగా, నాగార్జున ‘శివ’, పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’, ప్రభాస్ ‘ఈశ్వర్, డార్లింగ్’, ధనుష్ ‘త్రీ’ వంటి సినిమాలు రీ రిలీజ్కి రెడీ అవుతున్నాయి. ఆ విశేషాల్లోకి...మొక్కే కదా అని... ‘వీరశంకర్ రెడ్డి... మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’, ‘షౌకత్ అలీఖాన్... తప్పు నావైపు ఉంది కాబట్టి తలదించుకుని వెళుతున్నా... లేకుంటే తలలు తీసుకెళ్లేవాణ్ణి’, ‘సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది... ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది’.. వంటి డైలాగులు ‘ఇంద్ర’ సినిమాలో చిరంజీవి చెబుతుంటే అభిమానుల, ప్రేక్షకుల ఈలలు, కేకలు, చప్పట్లతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘ఇంద్ర’. బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్తీ అగర్వాల్, సోనాలీ బింద్రే హీరోయిన్లుగా నటించారు. వైజయంతీ మూవీస్పై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా చిరంజీవి బర్త్ డే కానుకగా 2002 జూలై 22న విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచింది. ప్రత్యేకించి మణిశర్మ సంగీతం, పాటలకు తగ్గట్టు చిరంజీవి డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ‘ఇంద్ర’ విడుదలైన 22 ఏళ్లకు సరిగ్గా చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమాని మళ్లీ విడుదల చేశారు మేకర్స్. రీ రిలీజ్లోనూ థియేటర్లలో మెగా ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. ప్రత్యేకించి పాటల సమయంలో స్క్రీన్ వద్దకు వెళ్లి డ్యాన్సులు వేస్తున్నారు. 22 ఏళ్లకు రీ రిలీజైన ‘ఇంద్ర’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళుతుండటం విశేషం. సైకిల్ చైన్తో... నాగార్జున నటించిన చిత్రాల్లో రెండు సూపర్ హిట్ చిత్రాలు మళ్లీ వెండితెర పైకి రానున్నాయి. ఒకటి ‘శివ’, మరోటి ‘మాస్’. సైకిల్ చైన్ చేతికి చుట్టి విలన్లను రఫ్ఫాడించే ట్రెండ్ సెట్ చేసిన చిత్రం ‘శివ’. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అమల హీరోయిన్గా నటించారు. ఈ సినిమా ద్వారా రామ్గోపాల్ వర్మ దర్శకునిగా పరిచయమయ్యారు. కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు, గ్యాంగ్లు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం స్టూడెంట్స్ని ఎలా ఉపయోగించుకుంటారు? విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తారు? ఇలాంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి సరికొత్త ట్రెండ్ని సృష్టించారు వర్మ. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న రిలీజై బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్ హిట్గానూ నిలిచింది. ఈ సినిమాని ‘శివ’ (1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసిన రామ్గోపాల్ వర్మ అక్కడ కూడా హిట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే దాదాపు 35 ఏళ్లకి ‘శివ’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 29న నాగార్జున బర్త్ డే సందర్భంగా ‘శివ’ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. అంటే.. మరోసారి సైకిల్ చైన్ చేతికి చుట్టి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించేందుకు రానున్నాడు శివ. మమ్మమ్మాస్ ‘వచ్చే నెల ఒకటో తారీఖుకి నువ్వు ఉండవ్.. పదిహేనో తారీఖుకి నీకు భయమంటే ఏంటో తెలుస్తుంది.. ఇరవయ్యో తారీఖుకి నిన్ను ఎదిరించడానికి ఒక మగాడు వచ్చాడని జనానికి తెలుస్తుంది.. ఇరవైఅయిదో తారీఖుకి పబ్లిక్కి నువ్వంటే భయం పోతుంది.. ఒకటో తారీఖు నువ్వు ఫినిష్’ అంటూ తనదైన స్టైల్లో నాగార్జున చెప్పిన డైలాగ్స్ ‘మాస్’ చిత్రంలోనివి. కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకునిగా పరిచయమైన చిత్రం ‘మాస్’. ఈ మూవీలో జ్యోతిక, ఛార్మీ కౌర్ హీరోయిన్లు. అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ సినిమా 2004 డిసెంబరు 23న విడుదలై సూపర్హిట్గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. కాగా దాదాపు 20 ఏళ్లకు మమ్మమ్మాస్ అంటూ ‘మాస్’ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 29న నాగార్జున పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ నెల 28న ‘మాస్’ సినిమాని రీ రిలీజ్ చేస్తోంది యూనిట్. తిక్క చూపిస్తా... ‘నాక్కొంచెం తిక్కుంది... కానీ దానికో లెక్కుంది... నా తిక్కేంటో చూపిస్తా... అందరి లెక్కలు తేలుస్తా’ అంటూ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్స్ మెగా అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన హిందీ బ్లాక్బస్టర్ మూవీ ‘దబాంగ్’కి తెలుగు రీమేక్గా తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’లో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. బండ్ల గణేశ్ నిర్మించిన ఈ సినిమా 2012 మే 11న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ ప్రేక్షకులను అలరించాయి. కాగా 12 ఏళ్ల తర్వాత ‘గబ్బర్ సింగ్’ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.ధూల్పేట్ ఈశ్వర్ప్రభాస్ నటించిన రెండు సూపర్ హిట్ చిత్రాలు మళ్లీ విడుదల కానున్నాయి. ఒకటి... ఆయన తొలి చిత్రం ‘ఈశ్వర్’. మరోటి ‘డార్లింగ్’. నటుడు కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ చిత్రసీమలో అడుగుపెట్టిన తొలి చిత్రం ‘ఈశ్వర్’. ఈ మూవీతో టాలీవుడ్లో హీరోగా పరిచయమైన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్గా నటించారు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ధూల్పేట్ ఈశ్వర్గా ప్రభాస్ తన మాస్ హీరోయిజమ్ను చూపించారు. కె. అశోక్ కుమార్ నిర్మించిన ఈ సినిమా 2002 నవంబరు 11న విడుదలై, ఘన విజయం సాధించింది. ఆర్పీ పట్నాయక్ సంగీతం ఈ చిత్ర విజయానికి ప్లస్ అయింది. దాదాపు 22 ఏళ్లకు మరోసారి ‘ఈశ్వర్’ మూవీ విడుదలకు ముస్తాబవుతోంది. అక్టోబరు 23న ప్రభాస్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘ఈశ్వర్’ని రీ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. లవర్ బాయ్ డార్లింగ్ ప్రభాస్ లోని లవర్ బాయ్ని చక్కగా తెరపై చూపించిన చిత్రం ‘డార్లింగ్’. ఎ. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం 2010 ఏప్రిల్ 23న విడుదలై బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. ప్రత్యేకించి ప్రభాస్–కాజల్ ఒకరినొకరు ఆట పట్టించుకునే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం కూడా ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. పద్నాలుగేళ్ల తర్వాత ‘డార్లింగ్’ మరోసారి విడుదలకు సిద్ధమవుతోంది. అక్టోబరు 23న ప్రభాస్ బర్త్ డేని పురస్కరించుకుని ‘డార్లింగ్’ని రిలీజ్ చేస్తున్నారు. సో.. తన బర్త్డే సందర్భంగా ‘ఈశ్వర్, డార్లింగ్’ సినిమాలతో ఫ్యాన్స్కి డబుల్ ధమాకా ఇవ్వనున్నారు ప్రభాస్. మళ్లీ కొలవెరి ధనుష్ నటించిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘3’. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. కస్తూరి రాజా విజయలక్ష్మి నిర్మించిన ఈ చిత్రం 2012 మార్చి 30న రిలీజై హిట్గా నిలిచింది. రామ్గా ధనుష్, జననిగా శ్రుతీహాసన్ల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రత్యేకించి టీనేజ్ ప్రేమికుడిగా, మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిగా ధనుష్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా హిట్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ హైలైట్గా నిలిచింది. ముఖ్యంగా ధనుష్ పాడిన ‘వై దిస్ కొలవెరి డి’ పాట సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కాగా పన్నెండేళ్ల తర్వాత ‘త్రీ’ని మరోసారి పాన్ ఇండియా స్థాయిలో రీ రిలీజ్ చేయనుంది యూనిట్. సెప్టెంబర్ 14న రిలీజ్ చేయనున్నారని టాక్. ఇవే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా రీ రిలీజ్ కానున్నా యని టాక్. -
శంకర్ దాదా వస్తున్నాడు
శంకర్ దాదాగా చిరంజీవి మరోసారి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు. ఆయన హీరోగా జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన చిత్రం ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ (2004). ఈ సినిమాలో సోనాలీ బింద్రే హీరోయిన్గా నటించగా, శ్రీకాంత్ ఏటీఎం పాత్రలో సందడి చేశారు. కామెడీ అండ్ ఎమోషనల్ మూవీగా రూపొందిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా జేఆర్కే పిక్చర్స్ ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తోంది. ‘‘సంజయ్ దత్ హీరోగా నటించిన హిందీ మూవీ ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’కి తెలుగు రీమేక్గా రూపొందిన చిత్రం ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’. ఈ మూవీలో తన నటనతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు చిరంజీవి. అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో కూడా అందరి మనసుని హత్తుకునేలా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. ఈ నెల 22న ఎక్కువ థియేటర్స్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని జేఆర్కే పిక్చర్స్ ప్రతినిధులు తెలిపారు. -
అమెరికాలో మురారి రీ-రిలీజ్
-
ఆ పిచ్చి మన వాళ్లకే ఉంది: రవితేజ
టాలీవుడ్లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు అన్ని వారి వారి బర్త్డే సందర్భంగా మళ్లీ థీయేటర్స్లో సందడి చేస్తున్నాయి. ఆ సినిమాలు విడుదలైనప్పుడు రానన్ని కలెక్షన్స్ రీరిలీజ్ టైమ్లో వస్తున్నాయంటే.. పాత సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తున్నారో తెలుసుకోవచ్చు. తాజాగా మహేశ్ బాబు మురారి సినిమా ఆయన బర్త్డే సందర్భంగా ఆగస్ట్ 9న రీరిలీజై దాదాపు 7.32 కోట్ల కలెక్షన్స్ని రాబట్టి చరిత్ర సృష్టించింది. అయితే పాత సినిమాలు మళ్లీ థియేటర్స్లోకి వచ్చి భారీగా కలెక్షన్స్ రాబట్టడం ఆశ్యర్యానికి గురి చేస్తుందని అంటున్నాడు మాస్ మహారాజా రవితేజ. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రీరిలీజ్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రీరిలీజ్ ట్రెండ్ మన(టాలీవుడ్) దగ్గరే ఉంది. నిజంగా మన ప్రేక్షకులను దేవుళ్లు అనొచ్చు. వాళ్లు సినిమాను ఎంతలా ప్రేమిస్తారో ఈ రీరిలీజ్ కలెక్షన్స్ని చూస్తే అర్థమవుతుంది. ఒక పాత సినిమాను మార్నింగ్ 6.30 థియేటర్స్కి వెళ్లి చూడడం ఆశ్యర్యంగా అనిపిస్తుంది. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు రిలీజ్ అయితే ఉదయం 7 గంటలకు వెళ్లి చూసేవాళ్లం. అవి కొత్త సినిమాలు కాబట్టి అంత మార్నింగ్ వెళ్లేవాళం. కానీ ఇప్పటి ప్రేక్షకులు ఉదయం 5 గంటలకే వెళ్లి చూస్తున్నారు. నిజంగా వాళ్లు చాలా గ్రేట్. ఇలాంటి పిచ్చి మనవాళ్లకు తప్ప ఎక్కడా లేదు’ అని రవితేజ అన్నారు. ఇక నీకు ఏ సినిమా రీరిలీజ్ కావాలని ఉంది అని యాంకర్ అడగ్గా.. అమితాబ్ బచ్చన్ ‘షోలే’ అని రవితేజ బదులిచ్చాడు. కాగా, గతంలో రవితేజ ‘విక్రమార్కుడు’, ‘వెంకీ’ సినిమాలు కూడా రీరిలీజై మంచి వసూళ్లను రాబట్టాయి. -
మురారి రిరిలీజ్.. దద్దరిల్లిన థియేటర్స్..
-
థియేటర్లో పెళ్లి చేసుకున్న మహేశ్ బాబు ఫ్యాన్!
తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ గత ఏడాదిగా కొనసాగుతూనే ఉంది. మహేశ్, పవన్ పాత సినిమాల్ని థియేటర్లో మళ్లీ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నారు. అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్.. ఇలా దాదాపు అందరి హీరోల పాత మూవీస్ రీ రిలీజ్ అయ్యాయి. తాజాగా మహేశ్ 'మురారి'కి ఎక్కడలేనంత హైప్ వచ్చింది.(ఇదీ చదవండి: యాంకర్ అనసూయ 'సింబా' సినిమా రివ్యూ)హైదరాబాద్లోని కూకట్పల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లాంటి చోట్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఓ థియేటర్లో అయితే ఓ అభిమాని నిజంగానే తాళిబొట్టు కట్టి పెళ్లి చేసుకున్నాడు. మరో అభిమాని ఏకంగా అక్షతలు పంచుతూ వైరల్ అయిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు వైరల్ అయిపోతున్నాయి.(ఇదీ చదవండి: దైవం మహేష్ రూపేణ.. వారి కోసం 'మహేశ్' ఎంత ఖర్చు చేస్తున్నాడో తెలుసా..?)Nijam ga pelli cheskunaru🤣🔥 #Murari4K pic.twitter.com/kRABlUVBWM— VardhanDHFM (@_VardhanDHFM_) August 9, 2024Brahmaramba lo akshinthalu panchuthunnaru 😭#Murari4K @urstrulyMahesh pic.twitter.com/UcG6WE2QAS— 28 (@898SAG) August 9, 2024Theaters ❎ Marriage Functions ✅#Murari4K #MaheshBabu𓃵 pic.twitter.com/kcquN8Njxr— Addicted To Memes (@Addictedtomemez) August 9, 2024Kukatpally Mass 🔥 #Murari4K pic.twitter.com/VlOMbTNvGQ— ʌınɐʎ (@CoolestVinaay) August 9, 2024 -
మళ్లీ ఎటో వెళ్లిపోయింది మనసు...
ప్రేమకథలను ఇష్టపడే వారి జాబితాలో ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ (2012) సినిమా కూడా ఉంటుంది. నాని, సమంత లీడ్ రోల్స్లో నటించగా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. రేష్మా, ఎస్. వెంకట్, సి. కల్యాణ్, సీవీ రావు నిర్మించిన ఈ సినిమాకు ఇళయరాజా అందించిన బాణీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.కాగా ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమా రీ రిలీజ్ కానుంది. లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ ఆగస్టు 2న ఈ సినిమాను మళ్లీ విడుదల చేయనున్నారు. ‘‘ప్రస్తుతం తెలుగులో రీ–రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. ఈ ఫీల్ గుడ్ లవ్స్టోరీ సినిమా మళ్లీ ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు నిర్మాతలు. -
రీరిలీజ్.. టాలీవుడ్లో ఇప్పుడిదే ట్రెండ్!
రీరిలీజ్ అనేది ఇప్పుడు టాలీవుడ్లో ట్రెండింగ్గా మారింది. స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ మూవీస్ వరుసగా మళ్లీ థియేటర్స్లో సందడి చేస్తున్నాయి. అభిమానుల డిమాండ్ మేరకు నచ్చిన సినిమాలను మళ్లీ రిలీజ్ చేస్తూ నిర్మాతలు సొమ్ము చేసుకుంటున్నారు. టెక్నాలజీ వాడుకొని అత్యంత నాణ్యమైన 4కేలో సినిమాను రిలీజ్ చేస్తుండడంతో అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఆయా చిత్రాలను మళ్లీ థియేటర్స్లో చూసేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు.ఇప్పటికే టాలీవుడ్లో స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలు కొన్ని రీరిలీజ్ అయి మంచి వసూళ్లను సాధించాయి. ఇక ఇప్పుడు వరుసగా నాలుగు సూపర్ హిట్ చిత్రాలు మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్స్లోకి రాబోతున్నాయి. అవేంటో చూసేయండి.దర్శకధీరుడు రాజమౌళి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ‘విక్రమార్కుడు’. 2006లో రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలించింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ మూవీ థియేటర్స్లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. జులై 27న ఈ మూవీని రీరిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు.మహేశ్బాబు హీరోగా, కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం ‘మురారి’. 2001లో విడుదలైన ఈ ఫ్యామిలీ డ్రామా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మణిశర్మ అందించిన సంగీతం, పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర వహించింది. మహేశ్ని ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరకు చేసిన చిత్రమిది. దాదాపు 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రం రిలీజ్ కానుంది. మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న ఈ చిత్రాన్ని 4కే వెర్షన్లో రిలీజ్ చేయనున్నారు.ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘శివ’ కూడా రీరిలీజ్కు రెడీ అవుతోంది. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా ... అక్టోబర్ 5, 1989లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు టాలీవుడ్ గతినే మార్చేసింది. ఈ తరం అక్కినేని అభిమానుల కోసం ఈ చిత్రం మరోసారి థియేటర్లో సందడి చేయనుంది. నాగార్జున బర్త్డే సందర్భంగా ఆగస్ట్ 29న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా అమల, శుభలేఖ సుధాకర్, రఘువరన్, తనికెళ్లభరణి తదితరులు నటించారు.ప్రేమ కథలకు పెట్టింది పేరు గౌతమ్ మీనన్. ఆయన తెరకెక్కించిన క్యూట్ లవ్ స్టోరీ 'ఎటో వెళ్లిపోయింది మనసు'. నాని-సమంత జంటగా నటించిన ఈ ప్రేమకథా చిత్రం 2012 డిసెంబర్ 14 విడుదలైన మంచి విజయాన్ని సాధించింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీని ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఆగస్ట్ 2న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ రీ రిలీజ్ చేస్తున్నారు. -
రీరిలీజ్కి రెడీ అయిన సమంత సినిమా!
టాలీవుడ్లో ఇప్పుడు రీరిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోహీరోయిన్ల హిట్ సినిమాలను మళ్లీ థియేటర్స్లో ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలు రీరిలీజ్ అయి..మంచి వసూళ్లను రాబట్టాయి. ఇక ఇప్పుడు సమంత నటించిన ఓ సినిమా కూడా రీరిలీజ్ కాబోతుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత, నాని జంటగా నటించిన చిత్రం ‘ఎటో వెళ్లిపోయింది మనసు’. పన్నెండేళ్ల క్రితం వచ్చిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీని మళ్లీ ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు.ఆగస్ట్ 2న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ రీ రిలీజ్ చేస్తున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం, ఇళయరాజా సంగీతం ఈ సినిమాను క్లాసిక్గా నిలబెట్టాయి. ఇళయరాజా అందించిన మెలోడీ గీతాలు ఇప్పటికీ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటాయి. మళ్లీ ఈ చిత్రాన్ని వీక్షించి నాటి రోజుల్లోకి వెళ్లేందుకు ఆడియెన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. -
జీవితంలో ఏ సినిమాను మర్చిపోలేను: ఉపేంద్ర
ఉపేంద్ర నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘ఏ’. ఉపేంద్ర సరసన చాందిని నటించారు. 1998లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్బస్టర్గా నిలిచింది. పాతిక సంవత్సరాల తర్వాత ఈ సినిమాను తెలుగులో రీ రిలీజ్ చేస్తున్నారు. ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ చిత్రం తెలుగులో 4కేలో ఈ నెల 21న రీ రిలీజ్ కానుంది.ఈ సినిమా రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘నా జీవితంలో నేను మర్చిపోలేని సినిమా ‘ఏ’. ఈ సినిమాను థియేటర్స్లో చూసి, ఈ తరం ప్రేక్షకులు షాక్ అవుతారు’’ అన్నారు. ‘‘ఛత్రపతి, యోగి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను రీ రిలీజ్ చేశాం. ఇప్పుడు ‘ఏ’ సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు చందు ఎంటర్టైన్మెంట్ స్థాపకుడు లింగం యాదవ్. ‘‘ఏ’ రిలీజ్ ప్రమోషన్స్ కోసం ఓ చిన్న వీడియో కావాలని ఉపేంద్రగారిని అడిగితే, స్వయంగా హైదరాబాద్ వచ్చి సినిమాను ప్రమోట్ చేస్తానని చెప్పి ఆశ్చర్యపరిచారు’’ అన్నారు నిర్మాత సైదులు. -
స్క్రీన్పై సమంతతో రొమాంటిక్ సీన్స్.. చైతూ రియాక్షన్ ఏంటంటే?
నాగచైతన్య-సమంత.. టాలీవుడ్లో ఈ జోడీకి స్పెషల్ క్రేజ్ ఉంది. కలిసి కెరీర్ మొదలుపెట్టిన వీళ్లిద్దరూ ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కానీ ఏమైందో ఏమో గానీ నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎవరి కెరీర్ పరంగా వాళ్లు బిజీ అయిపోయారు. అలాంటిది ఇప్పుడు మళ్లీ వీళ్లిద్దరి గురించి మాట్లాడుకునేలా చేశారు. ఇంతకీ అసలేం జరిగింది?(ఇదీ చదవండి: 'బాహుబలి' నిర్మాతల హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతూ-సమంత.. జంటగా నాలుగు సినిమాలు చేశారు. వీటిలో అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటించిన 'మనం'లో భార్యభర్తలుగా నటించారు. తాజాగా ఈ మూవీ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రీ రిలీజ్ చేశారు. హైదరాబాద్లోని దేవి థియేటర్లో గురువారం సాయంత్రం షో వేయగా.. అక్కినేని ఫ్యామిలీకి చెందిన చైతూ, సుప్రిత తదితరులు హాజరయ్యారు.ఇక ఈ సినిమాలో తాతతో ఉన్న సీన్స్ చూస్తూ ఎమోషనల్ అయిన చైతూ.. సమంతతో రొమాంటిక్ సన్నివేశాలు వస్తున్నప్పుడు మాత్రం సైలెంట్గా ఉండిపోయాడు. కానీ థియేటర్లో ఉన్న ఫ్యాన్స్ మాత్రం అరిచి గోల గోల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: చరణ్-తారక్పై మనసు పారేసుకున్న హాలీవుడ్ భామ.. ఏం చెప్పిందంటే?)#NagaChaitanya reaction for #ChaySam Pelli Scene at #Manam Re Release 💖🔥🔥@Samanthaprabhu2 @chay_akkineni #ManamReRelease#NagaChaitanya#Samantha pic.twitter.com/KYRzcMdbyt— Ungamma (@ShittyWriters) May 23, 2024 -
‘మనం’ రీరిలీజ్.. అనూప్ రూబెన్స్ మ్యూజికల్ వీడియో వైరల్
అక్కినేని హీరోల సీనీ కెరీర్లో ‘మనం’ చాలా ప్రత్యేకమైన మూవీ. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి నటించిన ఈ చిత్రం 2014 మే 23న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంలో అనుప్ రూబెన్స్ సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో సూపర్ హిట్గా నిలిచాయి. ఎక్కడ చూసిన ‘మనం’ పాటలే వినిపించేవి. ఆ మెలోడీ సాంగ్స్ ఇప్పటికీ మార్మోగిపోతూనే ఉంటాయి. ‘మనం’ విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా మళ్లీ ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. నేడు(మే 23)సాయంత్రం హైద్రాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని దేవీ థియేటర్లో మనం రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మనం’ మ్యూజికల్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. మనం వచ్చి పదేళ్లు అయిన సందర్భంగా అనూప్ ఈ వీడియోను రిలీజ్ చేశాడు. అనూప్ కీ బోర్డు మీద వాయించిన ట్యూన్స్ మళ్లీ ట్రాన్స్ లోకి తీసుకెళ్ళాయి.అనూప్ ప్రస్తుతం యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తీస్తోన్న పాన్ ఇండియా మూవీకి, గౌరీ రోనంకి తీస్తోన్న చిత్రానికి, ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నారు. అంతే కాక సుమంత్ హీరోగా సంతోష్ తెరకెక్కిస్తున్న సినిమాకు, సక్సెస్ ఫుల్ కాంబో అయిన ఆది సాయి కుమార్తో కృష్ణ ఫ్రమ్ బృందావనం సినిమాకు, విజయ్ కొండ, ఆకాష్ పూరి దర్శకత్వంలో వస్తున్న చిత్రానికు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. View this post on Instagram A post shared by Annapurna Studios (@annapurnastudios) -
19 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అవుతున్న హిట్ సినిమా.. అదేంటంటే?
గత కొన్నాళ్ల నుంచి తెలుగు, తమిళ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. కొత్త సినిమాలు సరిగా ఆడకపోయేసరికి హిట్ చిత్రాల్ని మళ్లీ థియేటర్లకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో 'అపరిచితుడు' చేరింది. విక్రమ్, సదా జంటగా నటించిన ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు. విక్రమ్ను మూడు ఢిఫరెంట్ షేడ్స్లో అద్భుతంగా ఈ చిత్రంలో శంకర్ చూపించారు. హాలీవుడ్ చిత్రాలకు దీటుగా తెరకెక్కించారు.(ఇదీ చదవండి: అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్)2005లో తెలుగులో ఓ అనువాద చిత్రంలా కాకుండా స్ట్రెయిట్ మూవీలానే విడుదలై బయ్యర్లకు వసూళ్ల వర్షం కురిపించింది. కథ, కథనాలు, దర్శకుడి స్టైలిష్ దర్శకత్వం, నటుడు విక్రమ్ నటనా ప్రతిభ ప్రేక్షకలను విపరీతంగా ఆకట్టుకుంది. మల్టీపుల్ పర్సనాలిటీ డిజాస్టర్ కారణంగా మామూలు మనిషి సూపర్ హీరోగా మారి సమాజంలో జరుగుతున్న అరాచకాలను, కాలరాస్తూ, తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైనా నరకాన్ని అనుభవించేలా శిక్షలు వేసే పాత్రలో నటుడు విక్రమ్ నటన గురించి ఎంత చెప్పినా చాలదు.ఇకపోతే ఫ్రెంచ్ భాషలోకి డబ్ అయిన తొలి ఇండియన్ చిత్రం అపరిచితుడు కావడం విశేషం. అలాంటి ఈ సినిమాని ఇప్పుడు మళ్లీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు 700 థియేటర్లలో విడుదలకు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులు కూడా కాస్త ఆసక్తి చూపిస్తున్నారు.(ఇదీ చదవండి: యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్) -
రీరిలీజ్కు రెడీ అయిన అపరిచితుడు.. ఏకంగా 700 థియేటర్స్లో!
తమిళసినిమా: ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో రీ రిలీజ్ల కాలం నడుస్తోందనే చెప్పాలి. కొత్త చిత్రాలు ఆశించిన ప్రేక్షకాదరణ పొందకపోవడంతో రీ రిలీజ్ చిత్రాలే థియేటర్లను కాపాడుతున్నాయి. ఆ జాబితా లో అపరిచితుడు చిత్రం చేరుతోంది. నటుడు విక్రమ్, సదా జంటగా నటించిన తమిళ చిత్రం అన్నియన్ చిత్రానికి తెలుగు అనువాదం అపరిచితుడు. గ్రేట్ డైరెక్టర్ శంకర్ సృష్టి ఈ చిత్రం. నటుడు విక్రమ్ను మూడు ఢిఫరెంట్ షేడ్స్లో అద్భుతంగా ఈ చిత్రంలో శంకర్ చూపించారు. హాలీవుడ్ చిత్రాలకు దీటుగా తెరకెక్కించిన అపరిచితుడు చిత్రం 2005లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. తెలుగులో ఓ అనువాద చిత్రంలా కాకుండా ఒక భారీ నేరు చిత్రంలా విడుదలై బయ్యర్లకు వసూళ్ల వర్షం కురిపించింది. కథ, కథనాలు, దర్శకుడి స్టైలిష్ దర్శకత్వం, నటుడు విక్రమ్ నటనా ప్రతిభ ప్రేక్షకలను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పట్లోనే అత్యంత భారీ బడ్జెట్లో రూపొందిన అపరిచితుడు చిత్ర క్లైమ్యాక్స్ సన్నివేశాల కోసమే 120 కెమెరాలతో 270 డిగ్రీల రొటేషన్ ఫొటోగ్రఫీ టెక్నిక్తో చిత్రీకరించారు దర్శకుడు శంకర్. ఇదే టెక్నాలజీతో రూపొందిన హాలీవుడ్ చిత్రం మ్యాట్రిక్స్ కంటే అపరిచితుడు చిత్రాన్ని శంకర్ బ్రహ్మండంగా తెరకెక్కించారు. దాదాపు 200 మంది స్టంట్ కళాకారులతో చిత్రీకరించిన ఫైట్ దృశ్యాలను చూస్తుంటే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తోంది. నెదర్లాండ్లోని పుష్పాల ఎగ్జిబిషన్లో చిత్రీకరించిన ఇందులోని పాట మరో హైలెట్. మల్టీపుల్ పర్సనాలిటీ డిజాస్టర్ కారణంగా మామూలు మనిషి సూపర్హీరోగా మారి సమాజంలో జరుగుతున్న అరాచకాలను, కాలరాస్తూ, తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైనా నరకాన్ని అనుభవించేలా శిక్షలు వేసే పాత్రలో నటుడు విక్రమ్ నటన గురించి ఎంత చెప్పినా చాలదు. అదేవిధంగా ఫ్రెంచ్ భాషలోకి అనువాదం అయిన తొలి ఇండియన్ చిత్రం అపరిచితుడు. కాగా అలాంటి అపరిచితుడు చిత్రం ఇప్పుడు మళ్లీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు 700 థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది. -
ప్రభుదేవా హిట్ సినిమా 'ప్రేమికుడు' రీ-రిలీజ్
ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా సూపర్ హిట్ సినిమా ప్రేమికుడు రీ-రిలీజ్ కానుంది. మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించారు. అందాల నటి నగ్మ ఇందులో హీరోయిన్గా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాను నిర్మాతలు రమణ, మురళీధర్ రిలీజ్ చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ రీ- రిలీజ్ కి సంబంధించిన వేడుక తాజాగా చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీనివాస్, శోభారాణి పాల్గొన్నారు.ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా సూపర్ హిట్ సినిమా ప్రేమికుడు రీ-రిలీజ్ కానుంది. మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించారు. అందాల నటి నగ్మ ఇందులో హీరోయిన్గా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాను నిర్మాతలు రమణ, మురళీధర్ రిలీజ్ చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ రీ- రిలీజ్ కి సంబంధించిన వేడుక తాజాగా చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ, ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీనివాస్, శోభారాణి పాల్గొన్నారు.30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా మళ్లీ మే 1న 300కు పైగా థియేటర్లలో ఘనంగా రీ- రిలీజ్ అవుతోంది. బుకింగ్స్ ఓపెన్ అయి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఎస్. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, నగ్మా జంటగా 30 సంవత్సరాల క్రితం వచ్చి యువతను ఆకట్టుకున్న సినిమా. ఇప్పటికి కూడా ఆ సినిమాలోని పాటలు యువతనే కాకుండా అందరినీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి.ఈ సినిమాలో ప్రభుదేవా తండ్రిగా ఎస్. పి. బాలసుబ్రమణ్యం గారు నటించడం సినిమాకే పెద్ద ప్లస్ అయింది. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే పాటలో ప్రభుదేవాతో సమానంగా ఎస్. పి. బాలు గారు డాన్స్ చేయడం విశేషం. టేకిట్ ఈజీ పాలసీ, ఓ చెలియా నా ప్రియ సఖియా పాటలు ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయేలా సాంగ్స్ ఉన్నాయి. ఒక మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా అప్పటి రోజుల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. నిర్మాత మురళీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ : ప్రేమికుడు సినిమాని 30 సంవత్సరాల తర్వాత మళ్లీ సీ ఎం ఆర్ సంస్థ పైన మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాము. బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా మాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు వారికి మా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సినిమా రిలీజ్కు అంగీకరించి మాకు సహకరిస్తున్న మా మెగా ప్రొడ్యూసర్ కొంచెం మోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అని అన్నారు. -
మమ్మీ తిరిగొస్తోంది
హాలీవుడ్ హారర్ బ్లాక్బస్టర్ ఫిల్మ్ ‘ది మమ్మీ’ రీ రిలీజ్కు సన్నాహాలు మొదలయ్యాయి. స్టీఫెన్ సోమర్స్ దర్శకత్వంలో 1999లో విడుదలైన ‘ది మమ్మీ’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ యాక్షన్ అడ్వెంచరస్ హారర్ ఫిల్మ్లో బ్రెండెన్ ఫ్రేజర్, రాచెల్ వీజ్, జాన్ హాన్యా, ఆర్నాల్డ్ వోస్లూ, జోనాథన్ హైడ్ లీడ్ రోల్స్లో నటించారు. జేమ్స్ జాక్స్, సీన్ డేనియల్ నిర్మించిన ‘ది మమ్మీ’ సినిమాను 1999 మే 7న యూనివర్సల్ పిక్చర్స్ పంపిణీ చేసింది. ఈ సినిమా విడుదలై పాతిక సంవత్సరాలు సమీపిస్తున్న సందర్భంగా ఏప్రిల్ 26న థియేటర్స్లో రీ రిలీజ్ చేస్తున్నట్లుగా యూనివర్సల్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. -
మళ్లీ హ్యాపీ డేస్
కాలేజ్ బ్యాక్డ్రాప్ చిత్రాల్లో ‘హ్యాపీ డేస్’ (2007) ఓ ట్రెండ్ సెట్టర్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ యూత్ఫుల్ చిత్రం విడుదలై పదిహేడేళ్లయింది. వరుణ్ సందేశ్, తమన్నా భాటియా, నిఖిల్ సిద్ధార్థ్ తదితరుల కాంబినేషన్లో అమిగోస్ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో మంచి వసూళ్లతో సంచలన విజయం సాధించింది. శేఖర్ కమ్ముల టేకింగ్, నటీనటుల పెర్ఫార్మెన్స్, మిక్కీ జే మేయర్ సంగీతం, విజయ్ సి. కుమార్ కెమెరా పనితనం అన్నీ అద్భుతంగా కుదిరిన ఈ చిత్రం ఇప్పుడు మళ్లీ విడుదల కానుంది. ఏప్రిల్ 12న ఈ చిత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ సినిమాస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రీరిలీజ్కు రెడీ అవుతోన్న సూపర్ హిట్ లవ్ స్టోరీ
ప్రేక్షక్షుల ముందుకు మరోసారి వచ్చేందుకు ప్రేమికుడు సిద్ధం అవుతున్నాడు. ప్రభుదేవా హీరోగా, నగ్మా హీరోయిన్గా రూపొందిన చిత్రం ‘ప్రేమికుడు’(తమిళంలో ‘కాదలన్’). శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1994లో విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ మూవీలోని ‘ముక్కాలా ముక్కాబులా’, ‘ఊర్వశి ఊర్వశి’, ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’, ‘అందమైన ప్రేమరాణి’.. వంటి పాటలన్నీ యువతను ఉర్రూతలూగించాయి. క్లాసిక్ హిట్గా రూపొందిన ‘ప్రేమికుడు’ తెలుగులో రీ రిలీజ్కి సిద్ధమవుతోంది. తెలుగు రీ రిలీజ్ హక్కులను నిర్మాతలు మురళీధర్ రెడ్డి, రమణ దక్కించుకున్నారు. సీఎల్ఎన్ మీడియా ద్వారా త్వరలో సినిమా రిలీజ్కు సన్నాహాలు చేస్తున్నారు. అతి త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. -
మళ్లీ థియేటర్లలోకి ఉదయ్ కిరణ్.. కల్ట్ సినిమా రీ రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్లో హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వాళ్లలో ఉదయ్ కిరణ్ ఒకడు. లవ్ స్టోరీలతో చాలా తక్కువ టైమ్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించిన ఇతడు.. ఆ తర్వాత సరైన ఛాన్సుల్లేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అతడి పుట్టినరోజు లేదా వర్థంతి సందర్భంగా ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటి జనరేషన్ కోసం ఉదయ్ కిరణ్ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. ఇతడి కల్ట్ మూవీ రీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. (ఇదీ చదవండి: కోట్లు విలువ చేసే కారు కొన్న 'ఆదిపురుష్' రైటర్.. రేటు ఎంతో తెలుసా?) ఉదయ్ కిరణ్, అనిత హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'నువ్వు నేను'. తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సునీల్ కామెడీ టైమింగ్, ఆర్పీ పట్నాయక్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రచ్చ లేపాయని చెప్పొచ్చు. పెద్దగా అంచనాలు లేకుండా 2001 ఆగస్టు 10న రిలీజైంది. తొలి ఆట నుంచే సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది. అప్పట్లో అద్భతమైన సక్సెస్ అందుకున్న ఈ సినిమాని తిరిగి థియేటర్లలో ఇప్పుడు విడుదల చేయబోతున్నారు. ఈ మార్చి 21న బిగ్ స్క్రీన్పై సందడి చేయనుంది. ఒకవేళ ఉదయ్ కిరణ్ స్క్రీన్ మ్యాజిక్ చూడాలనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ కాకండి. (ఇదీ చదవండి: ఆ మూడు సినిమాలే నా కెరీర్ని మలుపు తిప్పాయి: మహేశ్ బాబు) -
ఉపేంద్ర కల్ట్ సినిమా రీరిలీజ్.. కోటి బడ్జెట్తో విడుదల చేస్తే..
కన్నడ చరిత్రలో ఓ సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన మూవీ 'A'.. ఇప్పుడు ఈ కల్ట్ సినిమా రీరిలీజ్ చేసేందకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఉపేంద్ర, చాందినీ జోడిగా నటించిన ఈ సినిమా 1998లో విడుదలైంది. మొదట కన్నడలో రిలీజ్ అయిన ఈ సినిమా తర్వాత తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. కేవలం కోటిన్నర రూపాయలతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 20 కోట్లు రాబట్టి అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. ఉపేంద్ర హీరోగా ఎంట్రీ ఇచ్చింది కూడా 'A' మూవీతోనే.. దీనికి కథ, డైరెక్షన్ కూడా ఆయనే అందించడం విశేషం. ఇండియన్ సినిమా చరిత్రలో రివర్స్ స్క్రీన్ప్లేతో తెరకెక్కిన ఏకైక సినిమాగా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. అందుకే ఈ కథను చూసి అర్థం చేసుకోవడానికి ప్రేక్షకులను అనేకసార్లు చూసేలా చేసింది. చిత్ర పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ వంటి చీకటి నిజాల గురించి ఓపెన్గానే 25 ఏళ్ల క్రితమే ఉపేంద్ర ఈ చిత్రం ద్వారా చెప్పాడు. చలనచిత్ర దర్శకుడు, హీరోయిన్ పాత్రల మధ్య జరిగే ప్రేమకథ చుట్టూ కథ తిరుగుతుంది. త్వరలో ఈ సినిమా రీరిలీజ్ కానుంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వీదుల్లో ఉపేంద్ర నడుచుకుంటూ దురభిమానంతో హీరోయిన్ వెంటపడిన సీన్ ఇప్పటికీ అనేకసార్లు యూట్యూబ్లలో చూసే ఉంటారు. రియల్ సంఘటనను ఆధారం చేసుకుని ఆ సీన్ తీసినట్లు ఉపేంద్ర చెప్పాడు. ఈ సినిమాలో మితిమీరిన అడల్ట్ సీన్స్,డైలాగ్స్ ఉండటంతో సెన్సార్ దెబ్బ గట్టిగానే పడింది. అన్నీ కట్స్ పోను కేవలం 20 నిమిషాల నిడివి మాత్రమే మిగిలింది. దీంతో మళ్లీ కొన్ని సీన్స్లలో మార్పులు చేసి సినిమాను విడుదల చేశారు.. సీన్స్లలో మార్పులు చేసి విడుదల చేస్తేనే అంత వైలెంట్గా ఉన్నాయి.. అదే ఎలాంటి కట్స్ లేకుండా విడుదల చేసి ఉంటే ... ఎలా ఉండేదో సినిమా చూసిన వారి ఊహలకే వదిలేయాలి. క్లైమాక్స్ను కాస్త తికమకగా ఉన్నా సినిమా కాన్సెప్ట్ మాత్రం అందరినీ మెప్పిస్తుంది. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 25 ఏళ్లు దాటింది. ఇప్పుడు 'A' మూవీని రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర తర్వాత శివరాజ్కుమార్తో ఓం సినిమాను తీసి బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.. ఆ సినిమా కూడా ఇప్పటి వరకు 550 సార్లు రీరిలీజ్ అయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉపేంద్ర డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని ప్రశాంత్ నీల్ చెప్పారు. ఆయన డైరెక్షన్కు పెద్ద ఫ్యాన్ను అంటూ ఆయన చెప్పడం విశేషం. -
Oy! Re Release: థియేటర్లో యువతి మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్
ప్రస్తుతం టాలీవుడ్లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ప్రతి నెల నాలుగైదు పాత సినిమాలను మళ్లీ ఒక్కరోజు థియేటర్స్లో ప్రదర్శిస్తున్నారు. అయితే మొన్నటి వరకు కేవలం స్టార్ హీరోల సినిమాలు మాత్రమే రీరిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు గతంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలన్నీ మళ్లీ రీరిలీజ్ చేస్తున్నారు. ప్రేమికుల రోజు ఏకంగా 9 సినిమాలను రీరిలీజ్ అయ్యాయి. అయితే వాటిల్లో ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అయిన మూవీ ఓయ్. సిద్ధార్థ్, షామిలీ హీరోయిన్లుగా నటించిన ఈ ప్రేమకథా చిత్రం 2009లో రిలీజైంది. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. కానీ టీవీల్లోకి వచ్చిన తర్వాత విశేష ప్రేక్షకాదరణ పొందింది. ముఖ్యంగా యువత ఈ చిత్రాన్ని బాగా ఆదరించింది. అందుకే ప్రేమికుల రోజు ఈ మూవీని మళ్లీ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు థియేటర్ లో ఓయ్ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అయ్యారు. దానికి ఈ వీడియోనే నిదర్శనం. రీరిలీజ్లో భాగంగా నిన్న వైజాగ్లోని ఓ థియేటర్స్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ మూవీ చూసేందుకు వచ్చిన ఓ అమ్మాయి.. తన డ్యాన్స్తో అదరగొట్టేసింది. ఎల్లో శారీలో వచ్చిన ఆ యువతి.. ఓయ్ సినిమాలోని ప్రతి పాటకు ఊర మాస్ స్టెప్పులేసి ఆకట్టుకుంది. హీరోయిన్కు ఏ మాత్రం తీసిపోని విధంగా స్టెప్పులేస్తూ..అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. Finally lengthy video mikosam🌝 🤌 rampp asalu dance 🥵❤️#OyeReRelease #OyeMovie Thanks for the movie @AnandRanga 💥 pic.twitter.com/DEBKaMC3WV — Iconboy (@bunny_tweetz) February 14, 2024 -
వాలెంటైన్ డే స్పెషల్.. ఈ ప్రేమకథ చిత్రాలు మీ కోసమే!
ప్రతి మనిషికి ప్రాణం ఉన్నట్లే .... ప్రతి మనసుకు ఓ ప్రేమకథ ఉంటుంది. ఒకరి ప్రేమ సఫలం... మరొకరిది విఫలం... ఇంకొకరిది త్యాగం... ఇలా ఒక్కో ప్రేమకథది ఒక్కో ముగింపు. మరి.. రానున్న ప్రేమకథా చిత్రాల్లో ఏ కథ ముగింపు ఎలా ఉంటుందో వెండితెర పైనే చూడాలి. ‘పడ్డారండి ప్రేమలో మరి..’ అంటూ సిల్వర్ స్క్రీన్ కోసం కొందరు హీరోలు–హీరోయిన్లు ప్రేమలో పడ్డారు. ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ ప్రేమకథా చిత్రాల గురించి తెలుసుకుందాం. సైనికుడి ప్రేమకథ... ‘ఛత్రపతి’, ‘మిర్చి’, ‘బాహుబలి’, ‘సలార్’... ఇలా యాక్షన్ చిత్రాలే కాదు.. ప్రభాస్ కెరీర్లో ‘వర్షం’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘రాధేశ్యామ్’ వంటి ప్రేమకథా చిత్రాలు కూడా ఉన్నాయి. తాజాగా ప్రభాస్ మరో ప్రేమకథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. 2022లో ‘సీతారామం’ వంటి బ్లాక్బస్టర్ ప్రేమకథను ఇచ్చిన హను రాఘవపూడి మరో ప్రేమకథను రెడీ చేశారు. పీరియాడికల్ లవ్స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తారని టాక్. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఇందులో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్గా నటిస్తారనీ టాక్. అలాగే ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘రాజా సాబ్’ ఒకటి. ఫ్యాంటసీ హారర్ ఎలిమెంట్స్తో పాటు ఓ మంచి లవ్ట్రాక్ కూడా ఈ చిత్రంలో ఉందట. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్, రిద్దీ కుమార్ హీరోయిన్లు. మరో లవ్స్టోరీ... ‘లవ్స్టోరీ’ (2021) చిత్రం తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి కలిసి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మరో ప్రేమకథా చిత్రం ‘తండేల్’. నాగచైతన్యతో ‘ప్రేమమ్’ వంటి లవబుల్ సినిమా తీసిన చందు మొండేటి ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రంలో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి నటిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరంలకు చెందిన మత్స్యకారులు 2018లో గుజరాత్కు వలస వెళ్లి, సముద్రంలో చేపల వేటను కొనసాగిస్తుంటారు. ఓ 24 మంది మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు బందీలుగా చిక్కుతారు. వీరిలో ఓ మత్స్యకారుడి వివాహం జరిగి ఏడాది మాత్రమే అవుతుంది. భార్య గర్భవతిగా ఉన్న సమయంలో ఆ మత్స్యకారుడు పాకిస్తాన్లో బందీ కాబడతాడు. ఈ వ్యక్తి జీవితం ఆధారంగా ‘తండేల్’ను ప్రేమకథప్రాధాన్యంగా తీస్తున్నారు మేకర్స్. ప్రేమికులే శత్రువులయితే... విడిపోయిన ప్రేమికులు శత్రువులుగా ఎదురుపడితే అనే కాన్సెప్ట్తో రూపొందుతున్న లవ్స్టోరీ మూవీ ‘డెకాయిట్’. ‘ఒక ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. అడివి శేష్, శ్రుతీహాసన్ జంటగా నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాతో కెమెరామేన్ షానీ డియోల్ దర్శకుడిగా మారారు. రెండు ప్రేమకథల్లో... గత ఏడాది ‘బేబీ’ అనే లవ్స్టోరీ మూవీతో హిట్ అందుకున్నారు హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్య (విరాజ్ మరో లీడ్ రోల్ చేశారు). ఈ ‘బేబీ’ జోడీ రిపీట్ అవుతోంది. ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేశ్ ఈ సినిమాకు కథ అందించగా, రవి నంబూరి దర్శకుడిగా పరిచయం కానున్నారు. అలాగే మరో లవ్స్టోరీ ‘డ్యూయెట్’ కూడా చేస్తున్నారు ఆనంద్ దేవరకొండ. ఈ ఎమోషనల్ లవ్స్టోరీ ఫిల్మ్లో రితికా సింగ్ కథానాయిక. మిథున్ వరదరాజ కృష్ణన్ దర్శకత్వం వహిసున్నారు. ఇలా ఒకేసారి రెండు ప్రేమకథా చిత్రాల్లో నటిస్తున్నారు ఆనంద్ దేవరకొండ. డబుల్ లవ్... డీజే టిల్లు ఓ డిఫరెంట్ లవర్. పిచ్చిగా ప్రేమిస్తాడు. ఆ ప్రేమలో తేడా వస్తే ప్రేయసినైనా జైలుకు పంపిస్తాడు. అలాంటి డీజే టిల్లు మళ్లీ లవ్లో మునిగాడు. మరి.. ఈసారి అతని లవ్స్టోరీ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలంటే మార్చి 29వరకు ఆగాల్సిందే. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న చిత్రం ‘టిల్లు స్క్వేర్’. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘డీజే టిల్లు’కి సీక్వెల్గా ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు ‘తెలుసు కదా’ అనే లవ్స్టోరీ కూడా చేస్తున్నారు సిద్ధు జొన్నలగడ్డ. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లు. లైలా లవ్వు... ‘అశోకవనంలో అర్జున కల్యాణం’, ‘ఓరి.. దేవుడా!’, ‘పాగల్’ వంటి లవ్స్టోరీ చిత్రాల్లో నటించారు విశ్వక్ సేన్. ఈ యంగ్ హీరో రీసెంట్గా మరో లవ్స్టోరీకి పచ్చజెండా ఊపారు. ఆ సినిమా పేరు ‘లైల’. ఈ సినిమాలో తానే టైటిల్ రోల్ చేస్తూ, స్వీయ దర్శకత్వం వహిస్తానని ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు విశ్వక్. దిల్ రుబా... కెరీర్లో తొలి సినిమానే ‘రాజావారు రాణిగారు’ వంటి లవ్స్టోరీ చేశారు కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’, ‘సమ్మతమే’, ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రాల్లో మంచి లవ్ట్రాక్ ఉంది. ఇప్పుడు ఈ యంగ్ హీరో ఓ కంప్లీట్ లవ్స్టోరీ సినిమా చేస్తున్నారు. విశ్వ కరుణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ అని తెలిసింది. ఈ సినిమాకు ‘దిల్ రుబా’ టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా లవ్స్టోరీస్ ఎక్కువగా అబ్బాయిల దృష్టి కోణంలో నుంచి వస్తుంటాయి. ఓ అమ్మాయి తన ప్రేమకథను చెబితే ఎలా ఉంటుంది? అనే అంశం ఆధారంగా వస్తున్న చిత్రం ‘ది గాళ్ ఫ్రెండ్’. ‘చి.ల.సౌ’ వంటి సినిమా తీసిన నటుడు– దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ కొత్త లవ్స్టోరీకి దర్శకుడు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ∙అభిషేక్ పచ్చిపాల, నజియ ఖాన్, జబర్దస్త్ ఫణి, సతీష్ సారిపల్లి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జస్ట్ ఏ మినిట్’. పూర్ణస్ యశ్వంత్ దర్శకత్వంలో అర్షద్ తన్వీర్, ప్రకాశ్ ధర్మపురి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా నుంచి తాజాగా ‘నువ్వంటే ఇష్టం’ అనే పాటను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మంగళవారం విడుదల చేశారు. యస్. కె భాజీ ఈ సినిమాకు స్వరకర్త. ఇంద్ర , కోమల్ నాయర్, దీపు, స్వాతి శర్మ, ఇమ్రాన్, షీతల్ భట్ లీడ్ రోల్స్ చేసిన చిత్రం ‘ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు’. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని ‘నా కల..’ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ విడుదల చేశారు. లక్ష్మణ్ జెల్ల దర్శకత్వంలో చంద్ర ఎస్. చంద్ర, డా. విజయ రమేష్ రెడ్డి నిర్మించిన చిత్రం ఇది. శ్రవణ్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఈ ప్రేమికల దినోత్సవం (ఫిబ్రవరి 14) సందర్భంగా ఇప్పటికే విడుదలైన కొన్ని ప్రేమకథా చిత్రాలు మళ్లీ రిలీజ్ కానున్నాయి. ఆ వివరాలు... ►సిద్ధార్థ్, షామిలీ హీరోహీరోయిన్లుగా ఆనంద్ రంగ దర్శకత్వం వహించిన ‘ఓయ్!’ (2009), దుల్కర్ సల్మాన్– మృణాళ్ ఠాకూర్ జోడీగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘సీతారామం’ (2022), గత ఏడాది విడుదలైన ‘బేబీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సూర్య ద్విపాత్రాభినయం చేసిన తమిళ చిత్రం ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ (2008) తెలుగు అనువాదం సైతం రీ రిలీజ్ అవుతోంది. ఇలా మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. -
ముత్తు మళ్లీ వస్తున్నాడు
పాతికేళ్ల క్రితం రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘ముత్తు’ (1995) ఒకటి. రజనీకాంత్ మాస్ యాక్షన్, కామెడీ, చిత్రకథానాయిక మీనాతో ‘థిల్లానా.. థిల్లానా..’ అంటూ చేసిన డ్యాన్స్ ఆయన అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాయి. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘ముత్తు’ మళ్లీ తెరపైకి రానున్నాడు. డిసెంబర్ 12న రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా పది రోజుల ముందు (డిసెంబర్ 2) ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక.. ఈ నాలుగుప్రాంతాల్లోని థియేటర్లలో ‘ముత్తు’ మళ్లీ విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్. -
22 ఏళ్ల తర్వాత కమల్హాసన్ సినిమా రిలీజ్
లోకనాయకుడు కమలహాసన్ నట విశ్వరూపానికి ఒక మచ్చుతునక 'ఆళవందాన్'. నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించిన భారీ చిత్రమిది. సురేష్కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కమలహాసన్ కథను అందించారు. ఇదే మూవీలో హీరో కమ్ విలన్గా కమల్ ద్విపాత్రాభినయం చేశారు. సైకలాజికల్ స్టోరీతో తీసిన ఈ చిత్రం.. 2001 నవంబర్ 12న విడుదలైంది. కొన్ని కారణాల వల్ల అప్పట్లో హిట్ కాలేదు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు) ఈ సినిమాలో అన్నదమ్ములుగా కమలహాసన్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. బాలీవుడ్ బ్యూటీస్ మనీషాకొయిరాల, రవీనా టాండన్ హీరోయిన్లుగా నటించారు. 22 ఏళ్ల క్రితం విడుదలైన ఆళవందాన్ చిత్రాన్ని నిర్మాత భాను ఇప్పుడు మళ్లీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో ఇది 'అభయ్' పేరుతో యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడీ చిత్రాన్నే చిన్నచిన్న మార్పులు చేసి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000 థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు పేర్కొని పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మధ్యే కమలహాసన్ 'వేట్టైయాడు విళైయాడు' చిత్రం ఇటీవల మళ్లీ విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ఆ చిత్రానికంటే బెటర్గా ఆళవందాన్ చిత్రం కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంటుందని భావించవచ్చు. (ఇదీ చదవండి: ఫౌల్ గేమ్ ఆడి దొరికిపోయిన శివాజీ.. మళ్లీ శోభాశెట్టితో పనికిరాని గొడవ!) -
అది నా అదృష్టం
చిరంజీవి హీరోగా, శ్రీకాంత్ కీలక పాత్రలో జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో రూపొందిన హిట్ ఫిల్మ్ ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’. ఈ సినిమా నవంబరు 4న థియేటర్స్లో రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో నాగబాబు, శ్రీకాంత్ రీ రిలీజ్ ట్రైలర్ను విడుదల చేశారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘హిందీ చిత్రం ‘మున్నాభాయ్ ఏంబీబీఎస్’ తెలుగు రీమేక్ గురించి వినగానే, హీరో పక్కన ఉండే పాత్ర నాకే రావాలనుకున్నాను. అలాగే వచ్చింది. ఇప్పటికీ నన్ను ‘ఏటీఎం’ (శ్రీకాంత్ పాత్ర పేరు) అని పిలుస్తుంటారు. అన్నయ్య (చిరంజీవి)తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం’’ అన్నారు. -
కమల్ హాసన్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘నాయకుడు’ మళ్లీ వచ్చేస్తున్నాడు
తమిళసినిమా: కమలహాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందిన నాయకన్(తెలుగులో ‘నాయకుడు’) చిత్రం ఎంత సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. 36 ఏళ్ల క్రితం తమిళం, తెలుగు భాషల్లో విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. ఈ చిత్రం ద్వారా నటి శరణ్య కథానాయకిగా పరిచయం అయ్యారు. జనకరాజ్, విజయం ఎంవీ వాసుదేవరావు, ఢిల్లీ గణేష్ తార నటించిన ఈ చిత్రంలో కమలహాసన్ వరదరాజన్ మొదలియార్ అనే ముంబైకి చెందిన అండర్ వరల్డ్ డాన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అందులో ఆయన బాల్య దశ నుంచి చివరి వరకు కమలహాసన్ అద్భుతంగా నటించి మెప్పించారు. నాయకన్ చిత్రం కమలహాసన్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అంతేకాకుండా ఈ చిత్రంలోని నటనగాను ఆయన ఉత్తమ జాతీయ అవార్డు అందుకున్నారు. అదే చిత్రానికి ఉత్తమ కళాదర్శకుడుగా తోటతరణి ఉత్తమ ఎడిటర్గా బి.లెనిన్ జాతీయ అవార్డులను అందుకున్నారు. అలాంటి నాయకన్ ఇప్పుడు మరోసారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దీన్ని ఏటీఎల్ ప్రొడక్షన్ అధినేత మధురాట్ డిజిటల్ టెక్నాలజీతో కమలహాసన్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 3న తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను కమలహాసన్ వీరాభిమానిగా ఈతరం ప్రేక్షకులు కూడా నాయకన్ చిత్రాన్ని చూడాలని తలంపుతో డిజిటల్ ఫార్మెట్లో రూపొందించి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కమలహాసన్ నటించిన వేట్టైయాడు విళైయాడు చిత్రం ఇటీవల మళ్లీ విడుదలై ఆరు వారాలపాటు ప్రదర్శింపబడి మంచి వసూళ్లను రాబట్టిందని చెప్పారు. కాగా నాయకన్ చిత్రం అంతకంటే మంచి వసూళ్లను రాబడుతుందని నమ్మకం ఉందన్నారు. త్వరలోనే ఈ చిత్ర ట్రైలర్ను కమలహాసన్ చేతులమీదుగా ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. నాయకన్ చిత్రాన్ని తమిళనాడులోని 120 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. -
'రీ-రిలీజ్' ట్రెండ్.. ప్లస్ల కంటే మైనస్లే ఎక్కువ!
రీ-రిలీజ్ సినిమాలు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ట్రెండ్ ఇదే. ఈ హీరో- ఆ హీరో అని తేడా లేదు. పుట్టినరోజు వస్తుందంటే చాలు.. ఆయా హీరోల పాత మూవీస్ని థియేటర్లలో మళ్లీ విడుదల చేస్తున్నారు. అభిమానులతోపాటు సాధారణ ప్రేక్షకులూ వాటిని స్క్రీన్పై చూసి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఈ ట్రెండ్ వల్ల ఇండస్ట్రీకి ప్లస్ కంటే మైనస్లే అనిపిస్తుంది. వాళ్ల పైత్యం! స్టార్ హీరోల ఫ్యాన్స్ అందరూ చెడ్డోళ్లు కాదు. కానీ వాళ్లలోని కొందరు మాత్రం అభిమానం అనే ముసుగు వేసుకుని ఎక్కడలేని పైత్యం బయటపెడుతున్నారు. ఉదాహరణకు చెప్పుకుంటే.. ఈ మధ్యే ప్రభాస్ 'యోగి' సినిమాని రిలీజ్ చేశారు. చాలామంది చూసి ఎంజాయ్ చేశారు. హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్ లో సినిమా చూడటానికి వచ్చిన కొందరు మాత్రం.. ఖాళీ కూల్డ్రింక్ కేసులు విరగ్గొట్టారు. మరోచోట స్క్రీన్ చింపేశారు. ఇది నిజంగా పైత్యానికి పరాకాష్ట అని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: అప్పు ఎగ్గొట్టిన స్టార్ హీరో.. వేలానికి ఖరీదైన విల్లా!) అందరూ అంతే! అయితే అభిమాని అని చెప్పుకునే ఎక్కడలేని పైత్యం అంతా చూపించేది ఏదో ఓ హీరో ఫ్యాన్స్ మాత్రమే అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే అందరు హీరోల ఫ్యాన్స్ అలానే తగలడ్డారు. ఎంజాయ్ చేయడానికి, పైత్యం చూపించడానికి మధ్య ఉన్న గీతని దాటేస్తున్నారు. వీళ్లు ఇలా చేయడం వల్ల పలు థియేటర్ యాజమానులు.. రీ రిలీజ్ సినిమాలంటేనే భయపడుతున్నారు. లక్షల్లో నష్టం రీ రిలీజ్ల వల్ల స్టార్ హీరోల సినిమాలకు కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కుతున్నాయి.. ఈ వార్తల వల్ల థియేటర్ యజమానుల నష్టాలు పెద్దగా బయటకు రావట్లేదు. ఈ ట్రెండ్ దెబ్బకు థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఫ్యాన్స్ డ్యాన్స్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మైకంలో కుర్చీలు విరగ్గొట్టడం, స్క్రీన్ చించేయడం లాంటివి చేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే.. వచ్చిన డబ్బుల కంటే పెట్టుబడే ఎక్కువవుతోంది. (ఇదీ చదవండి: ఆ ఇల్లు వల్లే ధనుష్-ఐశ్వర్య విడిపోయారా..?) చిన్న సినిమాలకు దెబ్బ తెలుగులో చిన్న సినిమాలకు ఉండే ఆదరణే అంతంత మాత్రం. టాక్ చాలా బాగుంటే తప్ప.. ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి వాటిని చూడరు. అలాంటిది ఇప్పుడు ఈ రీ రిలీజ్ చిత్రాల వల్ల.. ప్రతివారం పలు చిన్న మూవీస్ విడుదలవుతున్నా ఆడియెన్స్ వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇలా రీ రిలీజ్ ట్రెండ్ వల్ల చిన్న సినిమాలు బలవుతున్నాయి. మరీ ఎక్కువైపోతున్నాయి! రీ రిలీజ్ అనేది ఎప్పుడో ఓసారి చేస్తే.. ప్రేక్షకులకు కూడా ఓ సరదాలా ఉంటుంది. అదేదో ఉద్యమం.. పనిగట్టుకుని మరీ స్టార్ హీరోల సినిమాల్ని రిలీజ్ చేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే మాత్రం రెగ్యులర్ చిత్రాలు- పాత సినిమాలు.. ఇలా దేనిపై కూడా ఆసక్తి లేకుండా తయారైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరి రీ రిలీజ్ ట్రెండ్కి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో ఏంటో? (ఇదీ చదవండి: జబర్దస్త్ ఆర్టిస్ట్పై కేసు నమోదు) -
రీరిలీజ్ చిత్రాలపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు
ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో రీరిలీజ్ల హవా ఎక్కువగా సాగుతోంది. స్టార్ హీరోల పాత సినిమాలను మళ్లీ విడుదల చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు కొంతమంది నిర్మాతలు. అభిమానులు తమ హీరోల ఓల్డ్ మూవీస్ని థియేటర్లలో మళ్లీ చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొన్ని సినిమాలు అయితే ఊహించని రీతిలో కలెక్షన్స్ రాబట్టాయి. అయితే ఈ రీరిలీజ్ చిత్రాలు బడా నిర్మాతకు కాసుల వర్షం కురిపిస్తుంటే.. చిన్న నిర్మాతలకు మాత్రం భారీ నష్టాన్ని మిగులుస్తోంది. పెద్ద సినిమాలు పోటీలో లేని డేట్ చూసుకొని చిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటే.. అదే రోజు రీరిలీజ్ పేరుతో బడా చిత్రాలను రావడం తమకు ఇబ్బందిగా మారిందని చిన్న నిర్మాతలు వాపోతున్నారు. (చదవండి: వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ.. ఇంత డిప్రెషన్లో ఉందా?) తాజాగా ఇదే విషయంపై ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ సక్సెస్ మీట్లో నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ.. చిన్న సినిమాల విడుదల రోజు పెద్ద సినిమాలను రీరిలీజ్ చేయడం ఆపాలని డిమాండ్ చేశాడు. శుక్రవారం కాకుండా సోమ, మంగళ వారాల్లో రీరిలీజ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. (చదవండి: రాజమౌళిపై రేణు దేశాయ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?) ‘చిన్న సినిమాకి వీకెండ్ స్కోప్ దొరకడమే చాలా కష్టం. అలాంటి స్కోప్లో మళ్లీ రీరిలీజ్లు అని పాత సినిమాలు విడుదల చేయడం మాలాంటి చిన్న నిర్మాతలకు ఇబ్బంది కలిగిస్తోంది. అలా అని రీరిలీజ్ చిత్రాలను నేను వ్యతిరేకం కాదు. కానీ చిన్న చిత్రాలు విడుదలయ్యే రోజు పెద్ద చిత్రాలను రీరిలీజ్ చేయొద్దని నా విజ్ఞప్తి. శుక్రవారం కాకుండా సోమ, మంగళవారాల్లో రీరిలీజ్ చేస్తే బాగుంటుంది. ఇదే విషయంపై త్వరలో ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా ఫిర్యాదు చేస్తా’అని అన్నారు. కాగా, ఆగస్ట్ 18న మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంతో పాటు మరో రెండు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. అదే రోజు ప్రభాస్ యోగితో పాటు ధనుష్ ‘రఘువరన్ బీటెక్’కూడా థియేటర్స్లో మళ్లీ విడుదలైంది. -
రీ- రిలీజ్ సినిమాలకు ఎందుకంత క్రేజ్..?
ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇప్పుడు బాక్సాఫీసు వద్ద మళ్లీ రిలీజ్ అయి సందడి చేస్తున్నాయి. గతంలో ‘రీళ్లు’లో థియేటర్లకు వచ్చి సందడి చేసిన చిత్రాలు ఇప్పుడు 4 k టెక్నాలజీతో ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతున్నాయి. స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారి చిత్రాలను రీరిలీజ్ చేస్తున్నారు. ఈతరం సినీ ప్రియులను అలా నాటి తరంలోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇండియాలో ఈ ట్రెండ్ను సెట్ చేసింది టాలీవుడ్ మాత్రమేనని చెప్పవచ్చు. భారీగా ఆదాయం ఒక సినిమాను రీరిలీజ్ చేయడం మంచి లాభదాయకంగా ఉంటుందని సూపర్ స్టార్ కృష్ణ సోదరడు ఆదిశేషగిరిరావు ఒకప్పడు అన్నారు. ఒక సినిమా రిజల్యూషన్ను 4కేలో మార్చడానికి దాదాపు రూ.10లక్షల ఖర్చు అవుతుందని పలువురు సినీ ట్రేడర్స్ పేర్కొన్నారు. ఒరిజినల్ ప్రింట్ను తక్కువ ధరకే పొందగలిగితే. రీరిలీజ్ పక్కాగా మంచి లభాదయకమైన బిజినెస్ అని వారు తెలిపారు. 'పోకిరి'తో నాంది టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్కు 'పోకిరి' సినిమానే నాంది పలికందని చెప్పాలి. 2006లో మహేశ్- పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తెలుగు సినిమా చరిత్రలో బెస్ట్ యాక్షన్ ఫిల్మ్గా 'పోకిరి' నిలిచింది. ఈ చిత్రాన్ని మహేశ్ పుట్టిన రోజు సందర్భంగా 2022లో ఆగస్టు 9న అమెరికాలో మళ్లీ విడుదల చేశారు. ఒక్క రోజులో 320 ‘షో’ల్లో ప్రదర్శితమైన ‘పోకిరి’ సుమారు రూ.1.75 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత ఇండియాలో కూడా విడుదల చేశారు. ఈ సినిమా ద్వారా వచ్చిన డబ్బును ఆయన అభిమానులు ఛారిటీలకు ఇచ్చారు. గుండెకు సంబంధించిన జబ్బులతో బాధపడుతున్న వారికి ఆపరేషన్లు జరిపించేలా ప్లాన్ చేశారు. ఒకే నెలలోనే ప్రభాస్ సినిమాలు రీరిలీజ్ అయిన సినిమాల్లో ప్రభాస్ నటించిన మూడు సినిమాలు ఒకే నెలలో విడుదలయ్యాయి. ఆయన నటించిన రెబెల్, బిల్లా, వర్షం రీ రిలీజ్లో భారీగా సందడి చేశాయి. రెబల్ మొదటిసారిగా విడుదలైనప్పుడు ఫ్లాప్ టాప్ తెచ్చుకుంది. కానీ రీ రిలీజ్ సమయంలో మంచి వసూళ్లు సాధించింది. అలాగే బిల్లా, వర్షం సినిమాలకు కూడా భారీగానే కలెక్షన్లు వచ్చాయి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ మార్కెట్ భారీగా పెరిగిపోయింది. అందువల్ల ఆయన సినిమాలకు డిమాండ్ కూడా అదే రేంజ్లో ఉంది. ఎవరైనా రీ రిలీజ్ చేయవచ్చా ఈ విధానంలో కాపీ రైట్ సమస్య ఉంటుంది. కాబట్టి ఏదైనా సినిమాను రీ రిలీజ్ చేయాలంటే ఆ సినిమాకు చెందిన నిర్మాతల అంగీకారంతో కూడిన పత్రాన్ని ల్యాబ్స్కు అందిస్తే.. ఆయా సినిమాలను రీ మాస్టరింగ్ చేస్తాయి. ఈ మార్కెట్పై అవగాహనతో పాటు ఆసక్తి ఉంటే ఎవరైనా ఒక సినిమాను రీ రిలీజ్ చేయవచ్చు. ఇప్పటికే మా హీరోది ఫలానా సినిమా రీ రిలీజ్ చేయండంటూ సోషల్ మీడియా వేదికగా చాలా మంది అభిమానులు అభ్యర్థిస్తున్నారు. గతంలో బ్లాక్ బ్లస్టర్ హిట్ అందుకున్న ఇంకా ఏయే సినిమాలు భవిష్యత్తులో సందడి చేస్తాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే. సింహాద్రితో మరో ట్రెండ్ ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటి సింహాద్రి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రీ-రిలీజ్ చేశారు. కానీ ఇక్కడ ఆయన ఫ్యాన్స్ కొత్త ట్రెండ్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు సింహాద్రి రీ-రిలీజ్ సినిమాకు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కూడా గ్రాండ్గా జరిపారు. అలా ఏ మాత్రం కొత్త సినిమాలకు తగ్గకుండా తమ అభిమాన హీరో పాత చిత్రాలను ఆదరిస్తున్నారు. ఇలాంటి సమయంలో నష్టమే చిత్ర పరిశ్రమలో ప్రతి శుక్రవారం సినిమా జాతకాలు మారిపోతుంటాయి. వారం వారం ఎన్నో చిత్రాలు విడుదలవుతున్నాయి. అయితే చిన్న సినిమాలు విడుదలైన సమయంలో రీ రిలీజ్ చిత్రాలను విడుదల చేస్తే వారు భారీగా నష్టపోతున్నారు. అప్పుడు కొత్త సినిమాలకు టికెట్లు తెగడం లేదు. ఒక్క సినిమాకు ఎంత సమయం? గతంలో సినిమాలను 'రీళ్ల' ద్వారా మాత్రమే చిత్రీకరించేవారు. వాటిని ప్రస్తుత టెక్నాలజీ ఉన్న థియేటర్లలో ప్రదర్శించటం వీలు కాదు. కాబట్టి ఆ రీళ్లను ఇప్పటి సాంకేతికతకు తగ్గట్టు మార్చాలి. ప్రతి ఫ్రేమ్ను స్కాన్ చేసి 4k విజువల్స్లోకి తీసుకొస్తేనే రీ రిలీజ్కు అవకాశం ఉంటుంది. ఇది కొంత మేరకు సమయం పడొచ్చు. అందుకు గాను సుమారుగా 3 నెలల వరకు ఉంటుంది. ఇందులో స్కానింగ్, గ్రేడింగ్, రీస్టోరేషన్ అనే మూడు పద్ధతులను అనుసరించి 4k విజువల్స్లోకి మారుస్తారు. ఆశ్చర్యపోయిన హీరో సూర్య 15 ఏళ్ల క్రితం విడుదలైన సినిమాను రీ రిలీజ్ చేస్తే అసలు కలెక్షన్స్ వస్తాయా అనుకున్నారు. అందులో సూర్య తమిళ హీరో కాబట్టి పెద్దగా అంచనాలు లేకుండా 'సూర్య సన్నాఫ్ కృష్ణన్'ను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 350 థియేటర్లలో విడుదల చేశారు. ఈ సనిమాకు గాను సుమారు రూ 3.5 కోట్లు కలెక్ట్ చేసిందని టాక్. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు థియేటర్లలో వస్తున్న విశేష స్పందన చూసి హీరో సూర్య సైతం సంతోషంతో సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
అందుకే మళ్లీ ‘యూనివర్సిటీ’ని రిలీజ్ చేస్తున్నా: ఆర్. నారాయణమూర్తి
‘‘విద్యార్థులు, నిరుద్యోగుల ఆవేదన, కష్టాలు, వారి తల్లిదండ్రుల కన్నీళ్లను ‘యూనివర్సిటీ’లో చూపించాను. వేసవి, వడగాల్పుల వల్ల ఈ చిత్రాన్ని ప్రేక్షకులు సరిగ్గా చూడలేకపోయారు.. అందుకే మళ్లీ విడుదల చేస్తే జనాలకు బాగా చేరువ అవుతుందని రిలీజ్ చేస్తున్నాను’’ అని ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఆర్. నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘యూనివర్సిటీ’ జూన్ 9న విడుదలైంది. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ‘‘పదో తరగతి పేపరు లీకేజీలు, గ్రూప్ 1, 2లాంటి ఉద్యోగ పరీక్ష ప్రశ్నా పత్రాల లీకేజీలు జరుగుతుంటే విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్ ఏం కావాలి? అనే సందేశంతో ఈ సినిమా తీశాను. విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాను’’ అన్నారు. -
సింహాద్రి రీరిలీజ్ రికార్డులు ఎన్ని..?
-
ధోని బయోపిక్ రీరిలీజ్.. సుశాంత్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్
దిగంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అభిమానులకు గుడ్న్యూస్. ఆయన నటించిన సూపర్ హిట్ మూవీ 'ఎంఎస్ ధోనీ ది అన్ టోల్డ్' స్టోరీ సినిమా ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అలా ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపాయి. చదవండి: అందుకే మేం విడాకులు తీసుకున్నాం.. నాగచైతన్య ఓపెన్ కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ నటించిన ఎంఎస్ ధోనీ సినిమాను రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 2016లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ ధోని పాత్రలో నటించగా, దిశా పటానీ, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు ముందు, ఆ తర్వాత కూడా పలు క్రీడాకారుల బయోపిక్తో సినిమాలు వచ్చినా 'ఎంఎస్ ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీ' అంతగా ఏ సినిమా ప్రభావం చూపలేదు..వసూళ్లు సాధించలేదు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కూడా నడుస్తుండటంతో అటు క్రికెట్, ఇటు సినీ అభిమానుల కోసం ఈ సినిమాను మే12న మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. చదవండి: ఈ జన్మకు నువ్వు మాత్రమే.. ఆ ఙ్ఞాపకాలతో బతికేస్తాను : అలేఖ్య రెడ్డి Maahi phir aa raha hai!! M.S. Dhoni: The Untold Story Re-Releasing in cinemas on 12th May in Hindi, Tamil and Telugu#MSDhoniTheUntoldStory @msdhoni #sushantsinghrajput @starstudios_ @advani_kiara @DishPatani @AnupamPKher @bhumikachawlat pic.twitter.com/bOFtEaup4X — Ramesh Bala (@rameshlaus) May 4, 2023 -
సూపర్ స్టార్ కృష్ణ 'మోసగాళ్లకు మోసగాడు' రీరిలీజ్
వెండితెరపై సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాల గురించి చెప్పనక్కర్లేదు. తెలుగు తెరకు ఎన్నో సాంకేతిక హంగులను పరిచయం చేసిన కృష్ణ నటించిన తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు. 52 ఏళ్ల కిందట రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.పద్మాలయా స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆ సినిమా కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయింది. చదవండి: ట్యాక్సీ డ్రైవర్గా చిరంజీవి.. అదిరిపోయిన 'భోళా శంకర్' పోస్టర్ ఇప్పుడీ చిత్రం రీరిలీజ్కు సిద్ధమైంది. మే31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా 4k టెక్నాలజీతో సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఆది శేషగిరిరావు ప్రెస్మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..''పద్మాలయ సంస్థకు ఫౌండేషన్ మోసగాళ్లకు మోసగాడు. మా బ్యానర్లో ఎన్ని సినిమాలు వవచ్చినా ఈ సినిమా చాలా ప్రత్యేకం. కృష్ణ గారి బర్త్డేకి నివాళిగా, అభిమానుల కోరిక మేరకు సినిమాను రీరిలీజ్ చేస్తున్నాం. బర్త్డే రోజున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు(సోమవారం)అల్లూరి సీతారామరాజు రిలీజ్ అయ్యి 48 సంవత్సరాలు కావడంతో ఈరోజున ప్రెస్మీట్ పెట్టాము. కృష్ణ గారి మెమోరియల్గా మ్యూజియం కట్టడానికి ఇక్కడ ప్రభుత్వం స్థలం కేటాయిస్తామన్నారు. అయితే ఇక్కడే ఉన్న మా సొంత స్థలంలో పనులు చేయిస్తున్నాము'' అని ఆది శేషగిరిరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ్, బి గోపాల్, అశ్వినిదత్, నిర్మాత రామలింగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: కానిస్టేబుల్ పరీక్షలో బలగం ప్రశ్న, దిల్ ఖుష్ అయిన డైరెక్టర్ -
అజిత్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. మళ్లీ తెరపైకి ‘అమరావతి’
నటుడు అజిత్ ఇప్పుడు మాస్ పాత్రలతో స్టార్ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన నట పయనం ప్రేమ కథా చిత్రంతోనే మొదలైంది. అజిత్ నటించిన తొలి చిత్రం అమరావతి. నటి సంఘవి నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని చోళా క్రియేషన్స్ పతాకంపై చోళా పొన్నురంగం నిర్మించారు. మొదట్లో టీవీ సీరియల్ నిర్మించిన ఈయన ఆ తరువాత సినీ రంగ ప్రవేశం చేసి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. కాగా నటుడు అజిత్ను అమరావతి చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేసింది ఈయనే. వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రంగా 1993లో రూపొందిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అమరావతి చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దానికి ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో సరికొత్త హంగులు అద్ది నటుడు అజిత్ పుట్టిన రోజును పురస్కరించుకుని మే 1వ తేదీన మళ్లీ తెరపైకి తీసుకురావడానికి నిర్మాత చోళ పొన్నురంగం సన్నాహాలు చేస్తున్నారు. (చదవండి: సక్సెస్ లేని రకుల్.. మాస్ మసాలా పాత్రల కోసం వెయిటింగ్..) దీని గురించి ఆయన మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ తాను అజిత్ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన అమరావతి చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించిందన్నారు. కాగా తాజాగా అజిత్ అభిమానుల కోరిక మేరకు ఆ చిత్రాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మళ్లీ రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. దీనిని సుమారు 400 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అందుకు అజిత్ అభిమానులు థియేటర్ల యాజమాన్యం సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
ఎన్టీఆర్ బర్త్డే.. గందరగోళంలో అభిమానులు!
టాలీవుడ్లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. తమ అభిమాన హీరోల బర్త్డే సందర్భంగానో.. లేదా 10, 20 ఇయర్స్ పూర్తి చేసుకున్నారనో..ఇలా మొత్తంగా ఏదో ఒక కారణంతో హిట్ సినిమాలను మళ్లీ థియేటర్స్లో ప్రదర్శిస్తున్నారు. ఫ్యాన్స్ నుంచి కూడా రీరిలీజ్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకే ఈ మధ్య స్టార్ హీరోల పుట్టిన రోజు నాడు ఏదో ఒక సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేశ్బాబు, పవన్ కల్యాన్, చిరంజీవి లాంటి హీరోల సినిమాలు రీరిలీజై మంచి వసూళ్లను రాబట్టాయి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలు రీరిలీజ్కు రెడీ అవుతున్నాయి. మే 20న ఎన్టీఆర్ బర్త్డే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమాలను థియేటర్స్లో ప్రదర్శించబోతున్నారు. మే 20న 'సింహాద్రి' సినిమాని భారీస్థాయిలో రీరిలీజ్ చేయాలని అభిమానులు నిర్ణయించారు. దీంతో పాటు ‘ఆది’, ‘నిన్ను చూడాలని’ చిత్రాలను కూడా విడుదల చేయబోతున్నారు. ఆది చిత్రాన్ని అయితే మే 20 నుంచి 28 వరకు ప్రదర్శించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 'నిన్ను చూడాలని' చిత్రాన్ని మే 19న ప్రదర్శిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. గందరగోళంలో ఫ్యాన్స్ సాధారణంగా స్టార్ హీరోల బర్త్డే రోజు ఏదో ఒక్క సినిమా మాత్రమే..అది కూడా ఒక్క రోజే రీరిలీజ్ చేస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ బర్త్డే (ఏప్రిల్ 8) సందర్భంగా ‘దేశముదురు’ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఒక్క సినిమా కావడంతో ఫ్యాన్స్ అంతా ఆ చిత్రాన్ని వీక్షించారు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మాత్రం గందరగోళానికి గురవుతున్నారు. ఒకేసారి పలు సినిమాలను రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తుండటంతో ఏ సినిమా చూడాలో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు. అయితే మెజారీటీ ఫ్యాన్స్ మాత్రం ‘సింహాద్రి’కే మొగ్గు చూపుతున్నారు. మరికొంతమంది అయితే ‘ఆది’, ‘సింహాద్రి’ రెండూ చూస్తామని కామెంట్ చేస్తున్నారు. Ninnu Chudalani release ani evadu cheppadu ra Kapu lanja kodaka 💦💦💦💦 Ila direct ga edche kante … ma Mo cheekachu kadha ra @NagaBabuOffl @KChiruTweets https://t.co/0gzMJCear4 — #MassAmmaMoguduNTR (@CHARanhassan4) April 11, 2023