నేడు పాలిటెక్నిక్‌ ఎంట్రెన్స్‌ | Sakshi
Sakshi News home page

నేడు పాలిటెక్నిక్‌ ఎంట్రెన్స్‌

Published Fri, May 24 2024 8:15 AM

నేడు పాలిటెక్నిక్‌ ఎంట్రెన్స్‌

ములుగు: డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బండారుపల్లిలోని టీజీ మోడల్‌ స్కూల్‌లో నేడు నిర్వహించనున్న పాలిటెక్నిక్‌ ఎంట్రెన్స్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌, జిల్లా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఈ మేరకు పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు, నెంబరింగ్‌, టేబుల్స్‌ను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రెండు సెంటర్లలో 675 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్న 1.30గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ వెంట హాల్‌టికెట్‌, హెచ్‌బీ పెన్సిల్‌, పెన్ను, రబ్బరు, చెక్‌మార్‌లను తెచ్చుకోవాలన్నారు. అసిస్టెంట్‌ కో ఆర్డినేటర్‌గా రజినీ లత, స్పెషల్‌ అబ్జర్వర్‌గా విజయమోహన్‌, అబ్జర్వర్లుగా విజయ్‌కుమార్‌, శివకుమార్‌లు వ్యవహరిస్తారని తెలిపారు. ముగ్గురు సభ్యుల స్పెషల్‌ స్క్వాడ్స్‌ నిత్యం తనిఖీలు చేస్తుంటారని వివరించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement