అసత్య ప్రచారం చేస్తే సహించం | Sakshi
Sakshi News home page

అసత్య ప్రచారం చేస్తే సహించం

Published Tue, May 7 2024 5:40 AM

అసత్య ప్రచారం  చేస్తే సహించం

బిజినేపల్లి: బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తనపై నిరాధర ఆరోపణలు, అసత్య ప్రచారం చేస్తే సహించనని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్‌కు నిజమైన ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అని, నకిలీ ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి అంటూ ఇటీవల ఆర్‌ఎస్‌పీ మాట్లాడటంపై మండిపడ్డారు. సోమవారం తిమ్మాజిపేటలో మండలస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మతితప్పి మాట్లాడుతున్నారని.. ఇదేవిధంగా ప్రవర్తిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజలు తిరస్కరించిన వ్యక్తిని పక్కన పెట్టుకుని ఎలా తిరుగుతున్నావని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు. ప్రజలకు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ కుచుకూళ్ల దామోదర్‌రెడ్డి, జెడ్పీటీసీలు రోహిణి, సుమిత్ర, నాయకులు శ్రీనివాస్‌ బహదూర్‌, దానం బాలరాజ్‌, లక్ష్మీనారాయణ, ఉస్మాన్‌ రావూఫ్‌, దేవస్వామి, నాగసాయిలు, బెన్నీ, మనోహార్‌ తదితరులు ఉన్నారు.

 
Advertisement
 
Advertisement