రెండో రోజూ స్వల్పమే.. | Sakshi
Sakshi News home page

రెండో రోజూ స్వల్పమే..

Published Sat, Apr 20 2024 1:45 AM

నల్లగొండ : ధర్మ సమాజ్‌ పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన తలారి రాంబాబు - Sakshi

నల్లగొండ: నల్లగొండ లోక్‌సభ స్థానానికి రెండో రోజైన శుక్రవారం మరో నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజు నలుగురు అభ్యర్థులు ఆరుసెట్ల నామినేషన్లు దాఖలు చేయగా రెండో రోజు మాత్రం నలుగురు అభ్యర్థులు ఒక్కో సెట్‌ నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. దీంతో రెండురోజుల్లో ఎనిమిది మంది అభ్యర్థులు పది సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. రెండో రోజు నామినేషన్లను జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ హరిచందన స్వీకరించారు.

నామినేషన్లు సమర్పించింది వీరే..

రెండో రోజు స్వతంత్ర అభ్యర్థులుగా ఇద్దరు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. అందులో బండారు నాగరాజు, కిన్నెర యాదయ్య ఉన్నారు. అలాగే ధర్మసమాజ్‌ పార్టీ అభ్యర్థిగా తలారి రాంబాబు నామినేషన్‌ సమర్పించారు. మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (యునైటెడ్‌) అభ్యర్ధిగా వసుకుల మట్టయ్య నామినేషన్‌ దాఖలు చేశారు. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి తరఫున ఒక నామినేషన్‌ సెట్‌ దాఖలు కాగా ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరు ఒకటి, ఇద్దరు రెండు సెట్ల చొప్పున, ప్రజావాణి పార్టీ, సోషలిస్టు పార్టీ, ధర్మసమాజ్‌ పార్టీ, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ తరఫున ఒక్కొక్కరు ఒక్కో సెట్‌ నామినేషన్లు దాఖలు చేశారు.

భువనగిరి ఎంపీ స్థానానికీ అంతంతే..

సాక్షి, యాదాద్రి: లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా భువనగిరి స్థానానికి రెండో రోజు శుక్రవారం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్‌, బీజేపీ నుంచి బూర నర్సయ్యగౌడ్‌, సోషలిస్ట్‌ పార్టీ (ఇండియా) అభ్యర్థిగా రచ్చ సుభద్రారెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా మెగావత్‌ చందునాయక్‌, రేకల సైదులు ఒక్కో సెట్‌ చొప్పున నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే తెలిపారు. మొదటి, రెండో రోజు కలిపి మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు తొమ్మిది సెట్ల నామినేషన్లు వేశారు.

అట్టహాసంగా సీపీఎం అభ్యర్థి నామినేషన్‌

సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్‌ అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జహంగీర్‌ వెంట సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండమడుగు నర్సింహ ఉన్నారు. అలాగే బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ బూరనర్సయ్యగౌడ్‌ మొదటి సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే జన సమీకరణ చేయకుండా సాదాసీదాగా వచ్చి నామినేషన్‌ వేశారు.

నల్లగొండ లోక్‌సభ స్థానానికి

ఎనిమిది నామినేషన్లు

రెండు రోజులు నలుగురు అభ్యర్థుల చొప్పున దాఖలు

మొత్త పది సెట్ల నామినేషన్‌లు

భువనగిరిలో నామినేషన్‌ దాఖలు చేస్తున్న బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌
1/3

భువనగిరిలో నామినేషన్‌ దాఖలు చేస్తున్న బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌

భువనగిరిలో నామినేషన్‌ అందజేస్తున్న సీపీఎం అభ్యర్థి జహంగీర్‌, చిత్రంలో బీవీ రాఘవులు
2/3

భువనగిరిలో నామినేషన్‌ అందజేస్తున్న సీపీఎం అభ్యర్థి జహంగీర్‌, చిత్రంలో బీవీ రాఘవులు

3/3

Advertisement

తప్పక చదవండి

Advertisement