పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఐదో రోజు 13 మంది నామినేషన్లు | Sakshi
Sakshi News home page

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఐదో రోజు 13 మంది నామినేషన్లు

Published Tue, May 7 2024 5:30 AM

-

నల్లగొండ: ఖమ్మం–వరంగల్‌–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి సోమవారం ఐదో రోజు 13 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి ముండ్ర మల్లికార్జునరావు, ధర్మ సమాజ్‌ పార్టీ నుంచి బరిగల దుర్గాప్రసాద్‌, నేషనల్‌ నవక్రాంతి పార్టీ నుంచి కర్ని రవితో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా పులిపాక సుజాత, చీదల్ల వెంకట సాంబశివరావు, చీదల్ల ఉమామహేశ్వరి, తాడిశెట్టి క్రాంతి కుమార్‌, అయితగోని రాఘవేంద్ర, బక్క జడ్సన్‌, బుగ్గ శ్రీకాంత్‌, పాలకూరి అశోక్‌ కుమార్‌, దేశగాని సాంబశివరావు నామినేషన్లు వేశారు. వీరంతా తమ నామినేషన్‌ పత్రాలను నల్లగొండ కలెక్టర్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి సీహెచ్‌. మహేందర్‌కు అందజేశారు.

 
Advertisement
 
Advertisement