ఆ శిలాఫలకాలకు కోడ్‌ వర్తించదు | Sakshi
Sakshi News home page

ఆ శిలాఫలకాలకు కోడ్‌ వర్తించదు

Published Fri, Apr 19 2024 1:05 AM

-

నంద్యాల(సిటీ): సార్వత్రిక ఎన్నికల కోడ్‌ కంటే ముందే అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్మించిన శిలాఫకాలకు ఎంసీసీ (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) నిబంధనలు వర్తించవని మున్సిపల్‌ కమిషనర్‌ నిరంజన్‌ రెడ్డి గురువారం తెలిపారు. ఎంసీసీ అమలులో ఉన్నప్పు డు లబ్ధిదారులకు పంపిణీ చేయదలచిన లబ్ధికార్డులు, ప్రతిష్టించిన శిలాఫలకాలపై సీఎంలు, మంత్రులు, ఇతర రాజకీయ నాయకుల ముఖ చిత్రాలు వెలువరించడం చట్టరీత్యా నిషేధమన్నారు. జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాహుల్‌ కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత ముద్రించే విద్యుత్‌ బిల్లులు, నీటి పన్ను రశీదు తదితర వాటిపై ఎలాంటి రాజకీయ పార్టీల గుర్తులు, ఫొటోలు, సందేశాలు లేకుండా చర్యలు చేపట్టామన్నారు.

Advertisement
Advertisement