
కోట్లాది మంది రామభక్తుల ఆకాంక్ష త్వరలో కనులముందు నిలవబోతోంది. జనవరి 22న అయోధ్యలో రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 22న దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొననుంది.
అయోధ్యలో ఇప్పటికే ఉత్సవ వాతావరణం కనిపిస్తోంది. బీహార్కు చెందిన కళాకారులు అయోధ్యలో అద్భుత కళాకృతిని తీర్చిదిద్దారు. 14 లక్షల దీపాలతో రాముని ఆకృతిని రూపొందించారు. ఈ కళాఖండాన్ని బీహార్ మొజాయిక్ కళాకారుడు అనిల్ కుమార్ తన సహోద్యోగులతో కలిసి తీర్చిదిద్దారు.
కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే శనివారం అయోధ్యకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యలో బీహార్ కళాకారుల బృందం ఏడు రోజుల పాటు శ్రమించి 14 లక్షల దీపాలతో పరాక్రమ రూపంలోని శ్రీరాముని ఆకృతిని తీర్చిదిద్దిందని తెలిపారు. 14 ఏళ్ల అజ్ఞాతవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. నవ భారత యువకులలో ‘శౌర్యం’ ఉండాలనే సందేశాన్ని ఈ రూపం అందిస్తున్నదని పేర్కొన్నారు. ఈ ఆర్ట్వర్క్లో ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ల ఛాయాచిత్రాలు కూడా ఉన్నాయి. దీపాలతో ‘జై శ్రీరామ్’ ఆకృతిని కూడా రూపొందించారు.
ఇది కూడా చదవండి: అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట.. అతిథులకు అపూర్వ కానుక
अयोध्या धाम के साकेत महाविद्यालय में श्रीराम कर्मभूमि न्यास सिद्धाश्रम बक्सर द्वारा 14 लाख दीयों से भगवान श्रीराम का पराक्रमी स्वरूप, श्रीरामलला मंदिर, आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, मा. मुख्यमंत्री योगी आदित्यनाथ जी छवि उकेरी गई। इस कार्य में लगे सभी कलाकारों को बधाई। pic.twitter.com/7YrPs9LoVQ
— Ashwini Kr. Choubey (@AshwiniKChoubey) January 13, 2024