Ayodhya Ram Mandir
-
ఆదాయంలో షిర్డీ, వైష్ణోదేవిలను దాటిన అయోధ్య
అయోధ్య: యూపీలోని అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరిగినది మొదలు భక్తులు తండోపతండాలుగా అయోధ్యకు తరలివస్తున్నారు. ఇప్పుడు యూపీలో జరుగుతున్న కుంభమేళాకు వచ్చిన భక్తులు అయోధ్యకు వచ్చి, బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు.ఇక్కడకు వచ్చిన రామభక్తులంతా ఆలయానికి భారీగా విరాళాలు ఇవ్వడంతో పాటు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించుకుంటున్నారు. కానుకల విషయంలో అయోధ్య అటు షిర్డీ, ఇటు వైష్ణోదేవి అలయాలను దాటేసింది. అయోధ్య రామాలయంలో బాల రాముని ప్రాణప్రతిష్ఠ 2024, జనవరి 22న జరిగింది. అప్పటి నుంచి నేటివరకూ 13 కోట్ల మంది బాలరాముణ్ణి దర్శించుకున్నారు.అయోధ్య ఆలయానికి అందుతున్న కానుకల విషయానికొస్తే స్వర్ణదేవాలయం, వైష్ణోదేవి, షిర్డీ ఆలయాలకు మించిన రీతిలో కానుకలు అందుతున్నాయి. గడచిన ఏడాదిలో ఆలయానికి కానుకలు, విరాళాల రూపంలో మొత్తం రూ. 700 కోట్లు అందింది. మహాకుంభ్ ప్రారంభమయ్యాక రూ. 15 కోట్ల ఆదాయం సమకూరింది. దేశంలో అత్యధికంగా ఆదాయం అందుతున్న 10 ఆలయాలలో అయోధ్య మూడవ స్థానానికి చేరింది. ఒక నివేదికను అనుసరించి చూస్తే షిర్డీ ఆలయానికి ఏటా రూ. 450 కోట్ల వరకూ ఆదాయం సమకూరుతుండగా, వైష్ణోదేవికి ప్రతీయేటా రూ. 400 కోట్ల వరకూ ఆదాయం అందుతోంది.ఇది కూడా చదవండి: బిడ్డకు ఊపిరిపోసి, ప్రాణాలొదిలిన బ్రెయిన్ డెడ్ తల్లి.. -
రామాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ కన్నుమూత
అయోధ్య: యూపీలోని అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. శ్రీ రామ జన్మభూమి ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న 87 ఏళ్ల సత్యేంద్ర దాస్ను ఆదివారం లక్నోలోని ఎస్జీపీజీటీలో చేర్చారు. ఆయన డయాబెటిస్, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. న్యూరాలజీ విభాగంలోని ఐసీయూలో చికిత్స పొందుతూ సత్యేంద్ర దాస్ కన్నుమూశారు.1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన సమయంలో దాస్ రామాలయ పూజారిగా వ్యవహరించారు. ఆయన రామాలయంలో ఎక్కువ కాలం ప్రధాన పూజారిగా పనిశారు. దాస్ తన 20 వ ఏట ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకున్నారు. అయోధ్యలో ఆయనకు ఎనలేని గౌరవ మర్యాదలు దక్కాయి. నిర్వాణి అఖాడాకు చెందిన దాస్ నిత్యం అయోధ్యలోనే ఉండేవారు. నాడు రామాలయంలో జరుగుతున్న పరిణామాలపై దేశవ్యాప్తంగా మీడియాకు దాస్ సమాచారం అందించేవారు. 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత భారత రాజకీయాల దిశను మార్చివేసింది. మసీదు కూల్చివేత అనంతరం కూడా దాస్ ప్రధాన పూజారిగా కొనసాగారు.ఇది కూడా చదవండి: మస్క్కు మరింత పవర్ ఇచ్చిన ట్రంప్.. ఉద్యోగులే టార్గెట్ -
అయోధ్య రామాలయానికి ఏడాది.. నిర్మాణం పూర్తయ్యేదెన్నడు?
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నూతన రామాలయానికి నేటితో (జనవరి 22)తో ఒక ఏడాది పూర్తయ్యింది. ఇప్పుడు రామాలయం దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం రామాలయ ప్రాణ ప్రతిష్ఠ వేడుక మొదటి వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా రామ్లల్లాను దర్శనం చేసుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. చలి వాతావరణం ఉన్నప్పటికీ, ఇక్కడికి వస్తున్న రామ భక్తులు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు.శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ హిందూ పంచాంగాన్ని అనుసరించి జనవరి 11న తొలి ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవాన్ని నిర్వహించింది. అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వార్షికోత్సవం సందర్భంగా.. ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు వచ్చినవారు అయోధ్యకు కూడా తరలివస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అయోధ్య ధామ్లో ట్రస్ట్ పలు సదుపాయాలు కల్పించింది. అయోధ్య ఎస్పీ మధుసూదన్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ, అయోధ్యకు భక్తుల రాక అధికంగా ఉన్నందున పోలీసు యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని, ఇన్స్పెక్టర్లు, సబ్-ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు అయోధ్యలో ప్రత్యేక విధులు నిర్వహిస్తున్నారన్నారు. సెక్టార్ జోన్ వద్ద పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. సరయు ఘాట్లో స్నానం చేసిన తర్వాత, భక్తులు నాగేశ్వర్ ధామ్, హనుమాన్ హనుమాన్ గర్హి, రామ్ లల్లాను సందర్శిస్తారని ఆయన తెలిపారు.అందరికీ బాలరాముని దర్శనం కల్పించేందుకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేశామన్నారు. రామ మందిర భవననిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ ఆలయంలోని గ్రౌండ్ ఫ్లోర్, మొదటి, రెండవ అంతస్తుల పనులు మార్చి నాటికి పూర్తవుతాయని తెలిపారు. అదేవిధంగా ఆలయం లోపల ఐకానోగ్రఫీ, ఇతర క్లాడింగ్ పనులు, గ్రౌండ్ ఫ్లోర్, మొదటి ఫ్లోర్ రెండవ ఫ్లోర్ పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh: నాగసాధువులుగా మారిన మహిళా సాధకులు -
Year Ender 2024: నూతన రామాలయం మొదలు వయనాడ్ విలయం వరకూ..
ప్రస్తుతం మనమంతా 2024 చివరి నెల డిసెంబర్లో ఉన్నాం. త్వరలో ప్రపంచం కొత్త సంవత్సరంలోకి ప్రవేశించనుంది. రాబోయే సంవత్సరం కొత్త ఆశలు రేకెత్తిస్తే, గడచిన సంవత్సరం ఎన్నో పాఠాలను అందించింది. ప్రజలంతా నూతన సంవత్సరాన్ని స్వాగతించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో 2024లో జరిగిన ప్రముఖ ఘటనలను ఒకసారి నెమరువేసుకుందాం.జనవరి 2024 నుండి డిసెంబర్ 2024 వరకు దేశంలో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది రియాసీలో జరిగిన సైన్యంపై ఉగ్రదాడి , కోల్కతా అత్యాచారం కేసు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అలాగే వయనాడ్ కొండచరియలు వినాశనానికి కారణంగా నిలిచాయి. ఇదేవిధంగా దేశంలో చోటుచేసుకున్న 10 ప్రధాన సంఘటనలను ఒకసారి గుర్తుచేసుకుందాం.1. రామ మందిర ప్రారంభోత్సవం2024, జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ బాలరాముడు గర్భగుడిలో కొలువయ్యాడు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. దీనిని చూసేందుకు దేశంలోని పలువురు ప్రముఖులు అయోధ్యకు తరలివచ్చారు.2. ఇన్సాట్-3డిఎస్ ఉపగ్రహ ప్రయోగంఈ ఏడాది ఫిబ్రవరిలో ఇస్రో.. దేశంలోనే అత్యంత అధునాతన ఉపగ్రహం ఇన్సాట్-3డీఎస్ను విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లాంచ్ ప్యాడ్ నుంచి ఇస్రో దీనిని ప్రయోగించింది.3. ఎయిర్ ఇండియా సిబ్బంది సమ్మెఈ ఏడాది మేలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బందిలోని ఒక విభాగం సమ్మెకు దిగింది. దీంతో రెండు రోజుల్లో 170కి పైగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. ఫలితంగా వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.4. నీట్ వివాదంజూన్ 4న విడుదలైన నీట్ (యూజీ) 2024 ఫలితాలపై వివాదం నెలకొంది. ఈ పరీక్షలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వచ్చాయి. నిజానికి ఎన్టీఏ ఈ ఫలితాలను జూన్ 4న విడుదల చేసింది. అయితే అంతకుమందు ఎన్టీఏ ఈ ఫలితాలను విడుదల చేసే తేదీని జూన్ 14గా ప్రకటించింది. ఇదొక్కటే కాదు పరీక్షలో 720 మార్కులకు 720 మార్కులు సాధించిన అభ్యర్థుల సంఖ్య ఈసారి 67కి పెరిగింది. ఇది అనుమానాలకు తావిచ్చింది. టాప్ ర్యాంకులు సాధించిన వారిలో ఎనిమిదిమంది విద్యార్థులు హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాయడం విశేషం.5 నెట్ పరీక్ష రద్దు నీట్ పరీక్షకు సంబంధించిన వివాదం కొనసాగుతున్న తరుణంలోనే విద్యా మంత్రిత్వ శాఖ యూజీసీ నెట్-2024ను రద్దు చేయాలని నిర్ణయించింది. పరీక్షలో అవకతవకలు బయటపడటంతో పరీక్షను రద్దు చేశారు. తాజాగా ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ పరీక్షలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరీక్ష జూన్ 18న జరిగింది. 11 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.6. రియాసిలో సైన్యంపై దాడి2024, జూన్ 9న జమ్ముకశ్మీర్లోని రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. దీనిలో తొమ్మిది మంది మృతిచెందారు. 33 మంది గాయపడ్డారు. శివ్ ఖోడి ఆలయం నుంచి కత్రాలోని మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్తున్న ఈ బస్సుపై దాడి జరిగింది.7. వయనాడ్ విలయంఈ ఏడాది జూలై 30న కేరళలోని వయనాడ్లో భారీ వర్షాల కారణంగా నాలుగు వేర్వేరు ప్రదేశాలలో కొండచరియలు విరిగిపడ్డాయి. నాలుగు గ్రామాలు ధ్వంసమయ్యాయి. ఇళ్లు, వంతెనలు, రోడ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో 80 మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా జనం గల్లంతయ్యారు.8. కోల్కతా అత్యాచారం కేసుకోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల ట్రైనీ మహిళా డాక్టర్ మృతదేహాన్ని ఆగస్టు 9 రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి శరీరంపై గాయాలైన గుర్తులు కనిపించాయి. డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.9. బాబా సిద్ధిఖీ హత్య2024 అక్టోబర్ 12న ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఎన్సీసీ నేత బాబా సిద్ధిఖీపై ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కేసులో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. బాబా సిద్ధిఖీ హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ హస్తం ఉందని సమాచారం. సల్మాన్ ఖాన్తో బాబా సిద్ధిఖీకి మంచి సంబంధాలు ఉన్నాయి.10. లోయలో పడిన బస్సుఉత్తరాఖండ్లోని అల్మోరాలో ఒక బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 36 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. బస్సులో కెపాసిటీ కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: Year Ender 2024: హృదయాలను దోచిన ఐదు పర్యాటక ప్రాంతాలు -
Year Ender 2024: అయోధ్యలో నూతన రామాలయం.. ట్రంప్ పునరాగమనం.. ఈ ఏడాదిలో ఆసక్తికర పరిణామాలివే
2024 మరి కొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ ఏడాదిలో అంతర్జాతీయంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇవి యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. ప్రజాస్వామ్యంలో పెద్దపండుగలాంటి లోక్సభ ఎన్నికలు భారతదేశంలో జరగగా, అగ్రరాజ్యం అమెరికాలో ప్రధాన ఎన్నికల ఘట్టం ముగిసింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న రాజకీయాలు, ఆర్థికరంగ పరిణామాలు, క్రీడలు, సైన్స్, టెక్నాలజీ ఇలా మరెన్నో రంగాల్లో చోటుచేసుకున్న పరిణామాలను ఒకసారి గుర్తుచేసుకుందాం.బోయింగ్కు కలసిరాని ఏడాదిఏవియేషన్ దిగ్గజ సంస్థ బోయింగ్ తమ 737 మ్యాక్స్కు గత ఏడాది ఎదురైన సమస్యలు పరిష్కారమవుతాయని భావించింది. అయితే 2024 మొదట్లో అలాస్కా ఎయిర్ బోయింగ్ 737 మ్యాక్స్ 9 జెట్ విమానం ప్రయాణం మధ్యలో దాని వెనుక డోర్ ప్లగ్-ఇన్ పనితీరులో విఫలమయ్యింది. ఈ ఘటనలో ఎటువంటి భారీ ప్రమాదం జరగనప్పటికీ, 737 మ్యాక్స్ 9 తరహాకు చెందిన విమానాల తయారీ నిలిచిపోయింది. ఈ ఏడాది బోయింగ్కు పరిస్థితులు అనుకూలించలేదు. మరోవైపు బోయింగ్కు చెందిన మాజీ క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ జాన్ బార్నెట్ అనుమానాస్పద పరిస్థితులలో మృతి చెందారు.స్టార్లైనర్ అంతరిక్ష నౌక ప్రయోగం విఫలంబోయింగ్ సంస్థ 2024లో చేపట్టిన తొలి మానవసహిత అంతరిక్షయాన ప్రయోగం అర్థాంతరంగా ముగిసింది. వ్యోమగాములను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లిన బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌక వారిని అక్కడే వదిలేసి కిందికి వచ్చేసింది. వ్యోమగాములు సునీత, విల్మోర్లు ఎనిమిది రోజుల మిషన్ కోసం జూన్లో అంతర్జాతీయ స్సేస్ స్టేషన్కు చేరుకున్నారు. వారం రోజుల్లోనే వారు భూమికి తిరిగి రావాల్సి ఉండగా, స్టార్ లైనర్లో లోపాలు తలెత్తాయి. థస్టర్ విఫలమవడం, హీలియం లీక్ కావడంతో సునీత, విల్మోర్లు అక్కడే చిక్కుకుపోయారు. అయితే ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ వచ్చే 2025 ఫిబ్రవరిలో వారిద్దరినీ వెనక్కి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయోధ్యలో నూతన రామాలయం2024 జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకతో ఈ ఏడాది హిందువులకు అత్యంత ఉత్సాహంగా ప్రారంభమయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది హిందువుల కల నెరవేరింది. నాటి నుంచి బాలరాముని దర్శనం కోసం లక్షలాదిమంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు.ట్రంప్ పునరాగమనం2024లో అగ్రగాజ్యం అమెరికాలో జరిగిన ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ విజయం సాధించారు.మరింత ధనవంతుడైన ఎలన్ మస్క్ ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్కి 2024 కలసివచ్చింది. పలు వెంచర్లలో మస్క్ విజయాలను అందుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ విజయంతో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ సంపద ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరింది.ఉక్రెయిన్ చేతికి రష్యా ప్రాంతాలు2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 2024లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 2024 ఆగస్టులో ఉక్రెయిన్ రష్యాలోని కుర్స్క్ ఒబ్లాస్ట్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించింది. ఉక్రెయిన్ ఇతర ప్రాంతాల్లో ఓడిపోయినప్పటికీ కుర్స్క్పై నియంత్రణను కొనసాగించింది.ఇది కూడా చదవండి: Christmas And New Year Trip: రూ. ఐదువేలతో సూపర్ టూర్ ప్లాన్ -
కోర్టులు కదిపిన తేనెతుట్టెలు
దేవుడు అంతటా, అందరిలో ఉన్నాడని నమ్మే గడ్డపై... ఆయనను నిర్ణీత స్థల, కాలాలకే పరిమితం చేసే సంకుచిత రాజకీయ స్వార్థాలు చిచ్చు రేపుతూనే ఉన్నాయి. విభిన్న వర్గాల మధ్య విద్వేషాగ్ని రగిలిస్తున్న ఈ ప్రయత్నాలకు తాజా ఉదాహరణ – యూపీలోని సంభల్ జామా మసీదు వివాదం, దరిమిలా అక్కడ రేగిన హింసాకాండ, ఆస్తి, ప్రాణనష్టం. ఈ ఏడాది జనవరిలో జరిగిన అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపనతో మందిరం – మసీదు వివాదాలు ముగిసిపోతాయని ఎవరైనా ఆశపడితే అది వట్టి అడియాసని మరోసారి తేలిపోయింది. మత రాజకీయాలకూ, వర్గ విభేదాలకూ ప్రార్థనా స్థలాలు కేంద్రాలు కారాదనే సదుద్దేశంతో చేసిన ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం–1991 స్ఫూర్తికే విఘాతం కలిగింది. ప్రార్థనా మందిరాల నిర్మాణమూలాలను తెలుసుకోవాలన్న ఒక వర్గం ఉత్సాహం తప్పేమీ కాదంటూ సర్వోన్నత న్యాయస్థానం ఒక దశలో అదాటున చేసిన వ్యాఖ్యలు చివరకు ఇక్కడకు తెచ్చాయి. వివాదం వస్తే చాలు... దేశంలో ప్రతి చిన్న కోర్టూ అనాలోచితంగా సర్వేలకు ఆదేశించేలా ఊతమిచ్చాయి. ఇది అత్యంత దురదృష్టకర పరిణామం. తాజా ఘర్షణలకు కేంద్రమైన సంభల్లోని షాహీ జామా మసీదు 16వ శతాబ్దికి చెందిన రక్షిత జాతీయ కట్టడం. వారణాసిలోని జ్ఞానవాపి, యూపీలోని మథురలో నెలకొన్న ఈద్గా, మధ్యప్రదేశ్ లోని ధార్లో ఉన్న కమాల్ మౌలా మసీదుల్లో లానే దీనిపై రచ్చ మొదలైంది. అక్కడ కేసులు వేసినవారే ఇక్కడా కోర్టుకెక్కారు. మొఘల్ చక్రవర్తి బాబర్ కాలంలో కట్టిన 3 మసీదుల్లో (పానిపట్, అయోధ్య, సంభల్) ఇదొకటి. ప్రాచీన హరిహర మందిర్ స్థలంలో ఈ మసీదును నిర్మించారని పిటిషనర్ల వాదన. జిల్లా కోర్టులో ఈ నెల 19న కేసు వస్తూనే జడ్జి మసీదులో ఫోటో, వీడియో సర్వేకు ఆదేశిస్తూ, 29వ తేదీ కల్లా నివేదిక సైతం సమర్పించాలన్నారు. తొలి సర్వే ప్రశాంతంగా సాగినా, నవంబర్ 24 నాటి రెండో సర్వే భారీ హింసకు దారి తీసింది. సర్వేకు వచ్చినవారిలో కొందరు జై శ్రీరామ్ నినాదాలు చేశారనీ, దాంతో నిరసనకారులు రాళ్ళురువ్వారనీ వార్త. కాల్పుల్లో అయిదుగురు మరణించారు. అమాయకుల ప్రాణాలు, పట్నంలో సామరస్య వాతావరణం గాలికెగిరి పోయాయి.శతాబ్దాల తరబడి అన్ని వర్గాలూ కలసిమెలసి జీవిస్తున్న చోట విద్వేషాగ్ని రగులుకుంది. ఎన్నో ఏళ్ళుగా ఉన్న అయోధ్య, వారణాసి వివాదాలకు భిన్నంగా సంభల్ కథ చిత్రంగా ఈ ఏడాదే తెర మీదకొచ్చింది. పశ్చిమ యూపీలో సంభల్ జిల్లా మూడు దశాబ్దాలుగా సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)కి కంచుకోట. 1980ల నుంచి అక్కడ అధికారం కోసం బర్ఖ్, మెహమూద్ కుటుంబాలు వేర్వేరు పార్టీల పక్షాన పరస్పరం తలపడుతూ వచ్చాయి. తర్వాత 1990ల నుంచి రెండు వర్గాలూ ఎస్పీతోనే అనుబంధం నెరపుతున్నాయి. అధికారంలో పైచేయి కోసం ఒకే పార్టీలోని ఈ రెండు వర్గాల మధ్య పోరాటమే తాజా హింసకు కారణమని బీజేపీ ప్రచారం చేస్తోంది. హిందూ – ముస్లిమ్ల తర్వాత, ఇక ముస్లిమ్లలోని ఉపకులాల మధ్య చీలికలు తీసుకురావడానికే కాషాయ ధ్వజులు ఈ ప్రచారం చేస్తున్నారని ఎస్పీ ఖండిస్తోంది. మొఘల్ శిల్పనిర్మాణ శైలికి ఈ మసీదు ప్రతీకైతే, ఈ సంభల్ ప్రాంతం విష్ణుమూర్తి పదో అవతారమైన కల్కి వచ్చే ప్రదేశమని హిందువుల నమ్మిక. భిన్న విశ్వాసాల మధ్య సొంత లాభం చూసుకొనే కొందరి రాజకీయంతో సమస్య వచ్చి పడింది. నిజానికి, 1947 ఆగస్ట్ 15కి ముందున్న ధార్మిక విశ్వాసాల ప్రకారమే అన్ని ప్రార్థనా ప్రదేశాలూ కొనసాగాలి. ఒక్క అయోధ్య రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదమే దానికి మినహాయింపని దీర్ఘకాలం క్రితమే కేంద్ర సర్కార్ చేసిన 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం. అయోధ్య తరహాలో మరిన్ని సమస్యలు రాకూడదన్నది దాని ప్రధానోద్దేశం. ఏ ప్రార్థనా స్థలాన్నీ పాక్షికంగా కానీ, పూర్తిగా కానీ ఒక మతవిశ్వాసం నుంచి మరోదానికి మార్పిడి చేయరాదనీ, చర్చ పెట్టరాదనీ చట్టంలోని 3వ సెక్షన్ స్పష్టంగా నిషేధించింది. అయితే, ప్రార్థనా స్థలాల ప్రాచీన స్వరూపమేమిటో నిర్ధారించడం చట్టవిరుద్ధం కాదంటూ 2002 మేలో జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు వివాదాలకు సందు ఇచ్చాయి. అనేకచోట్ల చిన్న కోర్టులు మందిర– మసీదు వివాదాలపై విచారణ చేపట్టి, పర్యవసానాలు ఆలోచించకుండా హడావిడిగా సర్వేలకు ఆదేశిస్తున్నాయి. సంభల్ ఘటన తర్వాతా అజ్మీర్లోని ప్రసిద్ధ షరీఫ్ దర్గాను గుడిగా ప్రకటించాలంటూ దాఖలైన కేసును రాజస్థాన్ కోర్ట్ అనుమతించడం ఓ మచ్చుతునక. సమస్యల్ని తేల్చాల్సిన గౌరవ కోర్టులే ఇలా తేనెతుట్టెల్ని కదిలించడం విషాదం.ప్రార్థనాస్థలాల చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీమ్లో ఇప్పటికే నాలుగు పిటిషన్లున్నాయి. దానిపై నిర్ణయానికి కేంద్రం, కోర్ట్ తాత్సారం చేస్తుంటే ఆ లోగా వారణాసి, మథుర, ధార్, సంభల్, తాజాగా అజ్మీర్... ఇలా అనేక చోట్ల అత్యుత్సాహం వ్యక్తమవుతోంది. ఇది శాంతి, సామరస్యాలకు పెను ప్రమాదం. ఈ ప్రయత్నాలను ఆపేందుకు సర్కారు కానీ, సర్వేలపై జోక్యానికి సుప్రీమ్ కానీ ముందుకు రాకపోవడం విడ్డూరం. ఒక వివాదాస్పద స్థలపు ధార్మిక స్వభావ అన్వేషణ చారిత్రక నిర్ధారణ, పురాతత్వ అన్వేషణతో ఆగుతుందనుకుంటే పొరపాటు. అది మత పరంగా, రాజకీయంగా రావణకాష్ఠమవుతుంది. కాశీ, మథురల్లో, ఇప్పుడు సంభల్ జరుగుతున్నది అదే. ‘ప్రతి మసీ దులో శివలింగాన్ని అన్వేషించాల్సిన పని లేద’ంటూ ఆరెస్సెస్ అధినేత రెండేళ్ళ క్రితం అన్నారు కానీ జరుగుతున్నది వేరు. అధికార వర్గాల అండదండలతోనే ఈ విభజన చిచ్చు రగులుతోందన్నదీ చేదు నిజం. 2019 నవంబర్లో ప్రార్థనా స్థలాల చట్టాన్ని సమర్థించిన సుప్రీమ్ మరోసారి గట్టిగా ఆ పని చేయకుంటే కష్టమే. ఓ హిందీ కవి అన్నట్టు, మసీదులు పోనివ్వండి... మందిరాలు పోనివ్వండి... కానీ రక్తపాతం మాత్రం ఆపేయండి. మతాలకు అతీతంగా మనిషినీ, మానవత్వాన్నీ బతకనివ్వండి! -
జై శ్రీరాం.. ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను: ఆకాశ్ దీప్ (ఫొటోలు)
-
అయోధ్యలో వర్షం నీటి ఎఫెక్ట్.. సీఎం యోగి సీరియస్ యాక్షన్
లక్నో: బీజేపీ, ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు. అయితే, అయోధ్యలో మౌళిక సదుపాయాల విషయంలో స్థానికులు, భక్తులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు అయోధ్యలో పరిస్థితులను తలుచుకుని ఆవేదన చెందుతున్నారు.ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు నిర్మాణం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పీడబ్ల్యూడీ ఇంజనీర్లను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేశారు. అలాగే, అయోధ్యలో 14 కిలోమీటర్ల మేర గుంతలు పడిన రోడ్లకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అయోధ్యకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.ఇదిలా ఉండగా.. ఇటీవల కురిసిన వర్షాలకు అయోధ్యలో మోకాళ్లలోతు నీటితో రోడ్లు, వీధులు చెరువులను తలపిస్తున్నాయి. రామమందిరం సమీపంలోని నివాసాలు పూర్తిగా నీటిలో చిక్కుకున్నాయి. చాలా ప్రాంతాల్లో బైకులు, కార్లు మునిగిపోయాయి. స్థానికులు మోకాళ్లలోతు నీటిలో నడుస్తూ ఇళ్లకు చేరుకుంటున్నారు. వర్షం పడిన ప్రతిసారీ తమకు ఇబ్బందులు తప్పవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామ మందిర దర్శనానికి వచ్చే భక్తుల కూడా కష్టాలు పడుతున్నారని చెబుతున్నారు. వర్షం కారణంగా వీధులు పూర్తి బురదమయంగా ఉండడంతో బైకులు, ఇతర వాహనాలు వీధుల్లోకి రాలేవని పేర్కొంటున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ये जो हर तरफ़ ‘भ्रष्टाचार का सैलाब’ हैउसके लिए भाजपा सरकार ज़िम्मेदार है#Ayodhya pic.twitter.com/LroA87UUTr— Akhilesh Yadav (@yadavakhilesh) June 28, 2024మరోవైపు, అయోధ్యలో ఇటీవల కురిసిన వర్షానికి ఆలయంలో వర్షపు నీరు లీకేజీ అవుతున్నట్టు ఆలయ ప్రధాన పూజారి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆలయ పైకప్పు నుండి వర్షపు నీరు ఆలయం లోపలికి చేరుతోందని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలోని వర్షపు నీటిని బయటకు పంపే ఏర్పాటు కూడా లేదని ఆయన పేర్కొన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో అయోధ్య ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ స్పందిస్తూ వర్షం నీరు వెళ్లేందుకు ఆలయంలో అద్భుతమైన ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. Corruption! Corruption! Corruption!🚨The first rain in Ayodhya exposed the claims of development, more than 10 potholes appeared on RAMPATH. pic.twitter.com/38YLCHJy4A— Gems of Engineering (@gemsofbabus_) June 28, 2024 -
దేశంలో వరుస ఘటనలు.. ప్రకృతి పరంగా కొన్ని.. ప్రమాదాలు మరికొన్ని
ఇటీవల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు వంటి ఊహించని ప్రమాదాలు కొన్ని అయితే, మానవ తప్పిదాలతో జరిగే ఘటనలు మరికొన్ని.. మధ్యకాలంలో గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో అత్యంత తీవ్రతతో ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీటిలో ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించినవి కూడా ఉన్నాయి. వరుస ఘటనలతో ఎటునుంచి ఏ ప్రమాదం పొంచి వస్తుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఢిల్లీ ప్రగతి మైదానం సొరంగంలో పగుళ్లుసెంట్రల్ ఢిల్లీని నగర తూర్పు ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ.. రూ. 777 కోట్లతో ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్ట్ను కేంద్రం చేపట్టింది.. ఇందులో భాగంగా 1.3 కి.మీ. పొడవైన సొరంగం, ఐదు అండర్పాస్లు నిర్మించారు. 2022 జూన్లో ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ టన్నెల్లో నీళ్లు నిలిచిపోవడం, పగుళ్లు రావడం వంటి అనేక లోపాలు వెలుగుచూశాయి. పనుల్లో జాప్యం, నిర్వహణ లేమీ కారణంగా సమస్యలు తలెత్తాయి. అనంతం మళ్లీ కోట్ల రూపాయలతతో డిజైన్ను సరిదిద్ది, మరమ్మతులు చేశారు.జలమయంగా మారిన అయోధ్యఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో వర్ష బీభత్సం కారణంగా రోడ్లపై మోకాళ్ల వరకు నీరు నిలిచిపోయింది. రామమందీర్ సమీపంలోని ఇళ్లలోకి మురుగునీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామమందిరం చుట్టూ హడావిడిగా నిర్మాణ పనులు చేపట్టడంతోనే ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని స్థానికులు అంటున్నారు.మరోవైపు ధ్యలో నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవం జరుపుకొని సరిగ్గా ఆరు నెలలు కూడా పూర్తి కాకముందే.. ప్రధాన గర్భాలయంలో నీరు లీకవడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. చిన్నపాటి వర్షానికే ఆలయం నుంచి నీరు కారుతోందని ఆలయ ప్రధాన ఆర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ పేర్కొన్నారు. రామ్లల్లా విగ్రహం ముందు పూజారి కూర్చునే స్థలం, వీఐపీ దర్శనం కోసం భక్తులు వచ్చే ప్రదేశం వరకూ పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ అవుతోందన్నారు.ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేవాలయం పైకప్పు లీక్ అవడం ఆశ్చర్యంగా ఉందని, ఇలా ఎందుకు జరిగిందని విస్మయం వ్యక్త ంచేశారు. ఇంత పెద్ద ఇంజనీర్ల సమక్షంలోనే ఇలాంటి ఘటన జరగడం చాలా పొరపాటుగా పేర్కొన్నారు.అయితే గర్భగుడి నుంచి వర్షపు నీరు లీకవుతోందన్న వార్తలపై రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా స్పందించారు. ఈ మేరకు ఆలయ ప్రధాన పూజారి ఆరోపణలను తోసిపుచ్చారు. పైకప్పు లీక్ కాలేదని, విద్యుత్ తీగల కోసం అమర్చిన పైపుల ద్వారా నీరు కిందకు వచ్చిందని వివరించారు. జబల్పూర్ ఎయిర్ పోర్టు ప్రమాదంమధ్యప్రదేశ్లోని జబల్పూర్ దుమ్నా ఎయిర్పోర్ట్లో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాలు కారణంగా టెర్మినల్ రూఫ్టాప్ పడిపోయింది. పార్కు చేసిన కారు మీద పడడంతో నుజ్జునుజ్జు అయింది. ప్రమాదానికి కొద్ది సేపటి క్రితమే కారులోంచి ఆదాయపు పన్ను అధికారి, డ్రైవర్ కిందకి దిగారు. లేదంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.ఇక ఈ విమానాశ్రాయాన్ని కొన్ని నెలల క్రితమే రూ.450 కోట్ల వ్యయంతో పునరుద్ధరించారు. కానీ గురువారం కురిసిన వర్షానికి అతలాకుతలం అయింది. దీంతో నాణ్యతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.ఢిల్లీ ఎయిర్పోర్టు టెర్మినల్లో కూలిన రూఫ్ఈ ఘటన జరిగిన ఒక్క రోజుకే ఢిల్లీలోని విమానాశ్రయంలోని టెర్మినల్-1లో పైకప్పు కూలింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు ఘటనాస్థలానికి చేరుకున్న పొలిసు బృందాలు సహాయక చర్యలు అందిస్తున్నాయి. టెర్మినల్ 1లో ప్రమాదం జరగడంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.అయితే ఎయిర్ పోర్టును నిర్మించిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. నాసిరకం మెటీరియల్తో ఎయిర్ పోర్టును నిర్మించిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
Narendra Modi: ప్రతిపక్షాలు గెలిస్తే అయోధ్యపైకి బుల్డోజర్లే
బారాబంకీ/ఫతేపూర్/హమీర్పూర్: కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే అయోధ్య రామమందిరంపైకి బుల్డోజర్లను పంపిస్తాయని, బాలరాముడు మళ్లీ టెంట్లోకి వెళ్లాల్సి వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. బుల్డోజర్లను ఎక్కడికి పంపించాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వద్ద ట్యూషన్ చెప్పించుకోవాలని ఆ రెండు పారీ్టలకు సూచించారు. లోక్సభ ఎన్నికల్లో ఒక్కో దశ పోలింగ్ జరుగుతున్నకొద్దీ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి పేకమేడలా కూలిపోతోందని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాము హ్యాట్రిక్ సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వంలో పేదలకు, యువతకు, మహిళలకు, రైతులకు మేలు చేసే కీలక నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ, ఫతేపూర్, హమీర్పూర్లో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. జూన్ 4వ తేదీ ఇక ఎంతోదూరంలో లేదని, మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్న సంగతి కేవలం మనకే కాదు, మొత్తం ప్రపంచానికి తెలుసని స్పష్టంచేశారు. ఎన్నికల బహిరంగ సభల్లో ప్రధానమంత్రి ప్రసంగాల్లోని విశేషాలివీ.. ఎన్నుకోవాల్సిన ఏకైక పార్టీ బీజేపీ ‘‘దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం అంకితమైన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఒకవైపు, దేశంలో అస్థిరత సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్న ‘ఇండియా’ కూటమి మరోవైపు ఈ ఎన్నికల బరిలో నిలిచాయి. మనకు మంచి చేసే ఎంపీలు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఎంపీలు కావాలి. కేవలం మోదీని దూషిస్తూ ఐదేళ్లు కాలం గడిపే ఎంపీలు మనకు అవసరమా? 100సీసీ ఇంజన్తో 1,000 సీసీ వేగం సాధ్యమా? బలమైన ప్రభుత్వమే అత్యంత వేగవంతమైన అభివృద్ధిని సాధించగలదు. అలాంటి అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. నిజంగా దేశ ప్రగతిని కోరుకుంటే మనం ఎన్నుకోవాల్సిన ఎకైక పార్టీ బీజేపీ. అయోధ్య రామమందిరంపై సమాజ్వాదీ పార్టీ పెద్దలు అనుచితంగా మాట్లాడారు. రామాలయం విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తిరగదోడాలని కాంగ్రెస్ భావిస్తోంది. వారికి సొంత కుటుంబ ప్రయోజనాలు, రాజకీయ అధికారమే ముఖ్యం. కాంగ్రెస్–సమాజ్వాదీ పారీ్టలకు అధికారం అప్పగిస్తే అయోధ్యలో అలయాన్ని బుల్డోజర్లతో కూల్చేస్తారు. రామ్లల్లా మళ్లీ టెంట్లోకి పంపిస్తారు. ఆ రెండు పారీ్టలకు ఓటు బ్యాంకు కంటే ఏదీ ఎక్కువ కాదు. రిజర్వేషన్లపై ప్రతిపక్ష నేతలు దారుణంగా మాట్లాడుతున్నారు. మొత్తం రిజర్వేషన్లను ముస్లింలకే ఇవ్వాలని బిహార్ మాజీ ముఖ్యమంత్రి(లాలూ ప్రసాద్ యాదవ్) అన్నారు. అంటే దళితులు, గిరిజనులు, ఓబీసీలకు అన్యాయం చేయాలా? వారు ఉన్నత స్థాయికి చేరుకోవద్దా?’’ అని మోదీ ప్రశ్నించారు. -
Droupadi Murmu In Ayodhya: అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (ఫొటోలు)
-
BJP: రామనామమే ఎన్నికల బాణం!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి విజయకేతనాన్ని ఎగురవేసేందుకు అస్త్రశ్రస్తాలన్నీ సంధిస్తున్న కాషాయ దళం..హిందీ రాష్ట్రాలతో సహా అనేక రాష్ట్రాల్లో అయోధ్య రామమందిర నిర్మాణ అంశాన్ని ప్రచారాస్త్రంగా మారుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందునుంచే రాముడే ఈసారి తమ ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్ అని ప్రకటించిన బీజేపీ నేతలు..ఇప్పుడే రాముడి చిత్రాలనే ముందుపెట్టి, రామరాజ్యం నినాదాలిస్తూ, హిందూత్వ ఎజెండాతో ఎన్నికల పోరును పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతిపక్షాలపై రామబాణాన్ని ఎక్కుపెట్టి దమ్ముంటే తమ విజయాన్ని ఆపాలని సవాల్ విసురుతున్నారు. హిందీ బెల్ట్లో ‘రాముడే’ అజెండా.. అయోధ్యలో రామమందిరంలో ఈ ఏడాది జనవరిలో రామ్లల్లా ప్రాణప్రతిష్ట సమయంలోనే లోక్సభ ఎన్నికలపై ‘జై శ్రీరామ్’ నినాదం తీవ్ర ప్రభావం చూపుతుందనే వ్యాఖ్యానాలు మొదలయ్యాయి. దేశంలోని 80 శాతం హిందువుల భావోద్వేగాలతో ముడిపడిన రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా హిందూత్వ భావజాలం పట్ల తనకున్న నిబధ్దతను బీజేపీ రుజువు చేసుకుందనే వాదనలు, విశ్లేషణలు వచ్చాయి. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాలన్న ఆహా్వనాన్ని కాంగ్రెస్ సహా మెజార్టీ ప్రతిపక్షాలు తిరస్కరించడం దీనికి మరింత రాజకీయాన్ని పులిమాయి. ఈ అంచనాలకు తగ్గట్లుగానే ప్రస్తుతం హిందీ భాష మాట్లాడే రాష్ట్రాల్లో రాముడే ఎన్నికల ప్రచారాస్త్రంగా మారాడు. ముఖ్యంగా ఉత్తర్ప్రదేశ్, బిహార్, జార్ఖండ్, హరియాణా, హిమాచల్ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రామాలయం, రామరాజ్యం అన్న అంశాల చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఈ రాష్ట్రాల్లో మొత్తంగా 218 లోక్సభ స్థానాలుండగా, గత ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే 166 స్థానాలను గెలుపొందించింది. ఒక్క యూపీలోనే 80 స్థానాలకు గానూ ఒంటిరిగా, 62, మిత్రపక్షాలతో కలిసి 64 సీట్లు సాధించింది. ప్రస్తుత ఎన్నికల్లో యూపీలో సొంతంగా 70 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని సాధించే క్రమంలో హిందుత్వ భావాజాలన్ని మరింత విస్తృతం చేసే క్రమంలో 80 లోక్సభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసంగా 10 వేల మందికి ఉచితంగా అయోధ్య రాముడి దర్శనం కలి్పంచింది. ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేసి వృధ్దులు, మహిళలు, యువతను పెద్ద ఎత్తున ఆకర్షించింది. దర్శనం అనంతరం భక్తుల తిరుగు ప్రయాణ ఏర్పాట్లతో పాటు, వారి వారి ప్రాంతాలకు తిరిగి రాగానే స్థానిక ప్రజలు స్వాగతం పలికేలా, ఈ సందర్భంగా ప్రసాదం, అక్షింతల వితరణ జరిపేలా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ తరహా కార్యక్రమాలనే హిందీ భాష మాట్లాడే అన్ని రాష్ట్రాల నుంచి కొనసాగించి సుమారు 2 కోట్ల మంది భక్తులకు ఉచితంగా రాముడి దర్శనం కలి్పంచింది. ఇది ప్రస్తుత ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికి తోడు యావత్ భారతావణిని విశేషంగా అలరించి రామాయణం టీవీ సీరియల్ ఫేమ్ అరుణ్ గోవిల్ను మీరట్ నుంచి రంగంలోకి దింపడమే గాక, ప్రధాని మోదీ తన తొలి ఎన్నికల ప్రచార సభను అక్కడి నుంచే ఆరంభించి, తన ప్రచారాస్త్రం రాముడని చెప్పకనే చెప్పారు. ఇక మధ్యప్రదేశ్లో బీజేపీ హిందుత్వ కార్డును ఎదుర్కోవడానికి కాంగ్రెస్ అగ్రనేత కమల్నాథ్ తనను తాను హనుమంతుడి భక్తుడిగా ప్రకటించుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఎక్కడ రామాలయం కనిపిస్తే అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చత్తీస్గఢ్లో బీజేపీ ప్రచారాన్ని తట్టుకునేందుకు తమ ప్రభుత్వ హయాంలోనే రామాయణ, కౌసల్య ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని,. రాముడు, సీత బసచేసిన అన్ని ప్రదేశాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో రామ్ వాన్ గమన్ టూరిజం సర్క్యూట్ను ప్రారంభించామని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. మిగతా రాష్ట్రాల్లోనూ ఆయనే.. హిందీ మాట్లాడే రాష్ట్రాలతో పాటు పశి్చమబెంగాల్, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్రలోనూ రాముడి ఆలయం, రామరాజ్యం చుట్టూతే ఎన్నికలు ప్రదక్షిణం చేస్తున్నాయి. రాముడి ఆలయ ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని మోదీ తమిళనాడు రామేశ్వరంలోని శ్రీరామనాధస్వామి ఆలయం, శ్రీరంగంలోని రంగనాధ స్వామి ఆలయం, ధనుష్కోఠి ఆలయాలను దర్శించారు. హిందూత్వ అజెండాతో బీజేపీ ప్రచారాన్ని ముందు పెట్టడంతో అక్కడి అధికార డీఎంకే దీన్ని ఎదుర్కొనేందుకు సనాతన ధర్మానికి తాము వ్యతిరేకమని ప్రచారం చేస్తోంది. ఆ పార్టీ నేత డి.రాజా ఒకడుగు ముందుకేసి ‘జై శ్రీరామ్ నినాదాన్ని తమిళనాడు అంగీకరించదు. బీజేపీ ఐడియాలజీ ఇక్కడ పనిచేయదు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టి తన స్టైల్లో ప్రచారం చేస్తోంది. ఇక పశి్పమ బెంగాల్లో ప్రచారం అంతా రాముడి చుట్టూ తిరుగతోంది. రామనవమి సందర్భంగా ప్రతి వార్డు, బూత్, మండల, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, హనుమాన్ మందిరాల్లో పూజలు సహా రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల కార్యక్రమాలు నిర్వహించింది. బీజేపీ చేస్తున్న ప్రచార హోరుకు తలొగ్గిన ఆ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి రామనవమికి సెలవుగా ప్రకటించింది. మొత్తం మీద రామనామమే ఎన్నికల బాణంగా బీజేపీ తమ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తోంది. -
‘సూర్య తిలక్’ వేడుక.. ట్యాబ్లో వీక్షించిన ప్రధాని
గువహతి:అయోధ్య బాలరాముని నుదుట సూర్యుడు తిలకం దిద్దిన ‘సూర్య తిలక్’ వేడుకను ప్రధాని నరేంద్రమోదీ అస్సాంలో తిలకించారు. బుధవారం నల్బరీ జిల్లాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని సభలోని వారందరినీ సెల్ఫోన్ టార్చ్లైట్ ఆన్ చేసి కాసేపట్లో జరిగే సూర్యతిలక్ ఉత్సవానికి సంఘీభావం తెలపాలని కోరారు. సెల్ఫోన్లైట్ కిరణాలు కూడా పంపాలన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ‘దేశ వాసుల 500 ఏళ్ల కల ఇన్నాళ్లకు నెరవేరింది. అయోధ్యలో రాముని ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఇది తొలి రామ్ నవమి. కాసేపట్లో సూర్యతిలక్ వేడుక జరగనుంది. మీరందరూ మీ సెల్ఫోన్ లైట్లను వెలిగించండి.. జై శ్రీరామ్, జై శ్రీరామ్ నినాదాలివ్వండి’అని ప్రధాని కోరారు. ర్యాలీ తర్వాత ప్రధాని తన వద్ద ఉన్న ట్యాబ్లో సూర్యతిలక్ వేడకను వీక్షించారు. ఈ దృశ్యాలను ఆయన తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో పోస్టు చేశారు. #WATCH | PM Narendra Modi watched the Surya Tilak on Ram Lalla after his rally in Nalbari, Assam "Like crores of Indians, this is a very emotional moment for me. The grand Ram Navami in Ayodhya is historic. May this Surya Tilak bring energy to our lives and may it inspire our… pic.twitter.com/hA0aO2QbxF — ANI (@ANI) April 17, 2024 ఇదీ చదవండి..బాలరాముడికి సూర్య తిలకం -
తొలి శ్రీరామనవమికి అద్భుతంగా ముస్తాబవుతున్న రామ్ లల్లా (ఫొటోలు)
-
Lok Sabha Elections 2024: యూపీ... హస్తినకు గేట్వే
ఉత్తరప్రదేశ్. లోక్సభ ఎన్నికలనగానే అందరి మదిలో మెదిలే రాష్ట్రం. రాజకీయంగానే కాక జనాభాపరంగా, భౌగోళికంగానూ దేశంలో యూపీది ఎప్పుడూ కీలక పాత్రే. 2024 లోక్సభ ఎన్నికల ముంగిట ఇక్కడి రాజకీయ ముఖచిత్రం కూడా కొత్త మలుపులు తిరుగుతోంది. ఆయోధ్య రామమందిరం కల సాకారం చేసి హిందువుల మనసుల్లో గుడి కట్టుకున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరింత దూకుడు పెంచగా, విపక్ష ఇండియా కూటమి కూడా వ్యూహాలకు పదును పెడుతోంది. యూపీ కుంభస్థలాన్ని కొట్టిన పార్టీ హస్తినలో పాగా వేసినట్లేననేది నానుడి. స్టేట్ స్కాన్ దేశ రాజకీయాలకు గుండెకాయ వంటి యూపీలో సత్తా చాటేందుకు పార్టీలన్నీ అ్రస్తాలను రెడీ చేసుకుంటున్నాయి. దేశంలోనే అత్యధికంగా ఏకంగా 80 లోక్సభ స్థానాలున్న రాష్ట్రం యూపీ. దేశాన్నేలే నాయకులను తీర్చిదిద్దడంలోనూ ఈ రాష్ట్రానిది ఘన చరిత్రే. ఏకంగా 8 మంది ప్రధానులను అందించింది యూపీ. ఈ రికార్డుకు మరే రాష్ట్రమూ దరిదాపుల్లో కూడా లేదు... ఈ ఎన్నికలు అత్యంత కీలకం... ఒకప్పుడు కాంగ్రెస్, సమాజ్వాదీ, బహుజన సమాజ్ పార్టీ వంటి పార్టీలకు కంచుకోటగా ఉన్న యూపీలో 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తిస్థాయిలో పాగా వేసింది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రత్యర్థులను మట్టి కరిపించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకుని తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. యూపీలో క్లీన్ స్వీప్ ద్వారానే బీజేపీ వరుసగా రెండుసార్లు బంపర్ మెజారిటీతో హస్తిన పీఠాన్ని చేజిక్కించుకోగలిగింది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఒంటరి పోరు చేసి కకావికలమైంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని ఎస్పీ కలిసి పోటీ చేసినా ప్రభావం చూపలేకపోయాయి. బీజేపీ హవాలో చిన్నా చితకా పార్టీలు సోదిలో కూడా లేకుండా పోయాయి. ఈసారి కూడా యూపీలో సత్తా చాటాలని బీజేపీ ఉవి్వళ్లూరుతోంది. ఎన్నికల షెడ్యూలైనా రాకుండానే తొలి విడతలో అభ్యర్థులను ప్రకటించిన 195 సీట్లలో ఏకంగా 51 స్థానాలు యూపీ నుంచే ఉండటం విశేషం! ఎస్పీ ఈసారి విపక్ష ఇండియా కూటమి భాగస్వామిగా కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తోంది. 2014లో యూపీలో ఏకంగా 71 సీట్లు గెలిచిన బీజేపీ 2019లోనూ 62 స్థానాలు నెగ్గింది. ఎన్డీఏ భాగస్వామి అప్నాదళ్(ఎస్) 2 సీట్లు గెలిచింది. బీఎస్పీ, ఎస్పీ, రాష్ర్టీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ)తో కూడిన మహా కూటమి 15 సీట్లకే పరిమితమైంది. బీఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేసి 10 సీట్లలో విజయం సాధించగా, ఎస్పీ 37 సీట్లలో పోటీ చేసి ఐదే నెగ్గింది. ఆర్ఎల్డీ 3 సీట్లలోనూ మట్టికరిచింది. 67 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానంతో ఘోర పరాజయం మూటగట్టుకుంది. కేవలం సోనియాగాంధీ మాత్రమే రాయ్బరేలీలో నెగ్గారు. అతి పెద్ద రాష్ట్రం కావడంతో యూపీలో ఈసారి మొత్తం ఏడు దశల్లోనూ పోలింగ్ జరుగుతోంది. అయోధ్య.. బీజేపీ బ్రహా్మస్త్రం ఈసారి 400 పైగా లోక్సభ స్థానాలే లక్ష్యంగా బీజేపీ ముందునుంచే చకచకా పావులు కదిపింది. అయోధ్య రామమందిర కలను సాకారం చేయడం హిందువుల ఓట్లను కొల్లగొట్టడం ఖాయమని నమ్ముతోంది. ప్రధాని మోదీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయడం ఎప్పట్లాగే మరింతగా కలిసొస్తుందని భావిస్తోంది. రాష్ట్రంలోనూ బీజేపీ సర్కారే ఉండటం, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి, వేలాది కోట్లతో భారీ ఎత్తున అభివృద్ధి కార్యకలాపాలను చేపడుతుండటమూ బీజేపీకి కలిసొచ్చేదే. యూపీలో రెండుసార్లు బీజేపీ జెండా రెపరెపలాడించిన సీఎం యోగి ఆధిత్యనాథ్ పార్టీకి అదనపు బలం. జాట్ల మద్దతు దండిగా ఉన్న మాజీ ప్రధాని చౌధరి చరణ్ సింగ్ మనుమడు జయంత్ నేతృత్వంలోని ఆర్ఎల్డీ ఇండియా కూటమికి గుడ్బై చెప్పి ఎన్డీఏలో చేరడం కాషాయదళంలో కొత్త జోష్ నింపింది. చరణ్ సింగ్కు భారతరత్న ప్రకటనతో జాట్ల ఓట్లు ఎన్డీఏకేనని బీజేపీ భావిస్తోంది. మరో భాగస్వామి అప్నాదళ్ (ఎస్)కూ యూపీలో మంచి పట్టుంది. ప్రధాని మోదీ ఇప్పటికే రాష్ట్రంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనకు తోడు రాజ్నాథ్సింగ్, సీఎం యోగితో సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా కలియదిరుగుతున్నారు. ‘ఇండియా’ కూటమి పోటీనిచ్చేనా? విపక్ష ‘ఇండియా’ కూటమి యూపీలో ఇంకా కాలూచేయీ కూడదీసుకునే పనిలోనే ఉంది. కూటమి భాగస్వాముల్లో ఎస్పీ 63 సీట్లలో, కాంగ్రెస్ 17 సీట్లలో పోటీ చేసేలా ఒప్పందం కుదిరింది. సోనియా రాజ్యసభకు వెళ్లడంతో రాయ్బరేలీ నుండి ప్రియాంక పోటీ చేసే అవకాశం కన్పిస్తోంది. 2019 పరాజయం నేపథ్యంలో అమేథీలో రాహుల్ గాంధీ ఈసారి బరిలో దిగుతారో, లేదో చూడాలి. ఈ రెండు తప్ప మిగతా 15 స్థానాలకూ కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. వెనకబడ్డ, దళిత, మైనారిటీ వర్గాలపై అఖిలేశ్ బాగా దృష్టి పెట్టారు. కానీ గత ఎన్నికల సరళిని బట్టి చూస్తే, యాదవేతర ఓబీసీలు, జాతవేతర దళిత ఓటర్లను బీజేపీ తనవైపు తిప్పుకునేలా కనిపిస్తోంది. ఇక ఆర్ఎల్డీ గుడ్బై చెప్పడం ఇండియా కూటమికి ఎదురుదెబ్బే. బీఎస్పీ ఈసారి ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఇవన్నీ బీజేపీకి మరింత కలిసొచ్చే అవకాశముందని విశ్లేషకుల అంచనా. ముస్లింల రూటెటు? యూపీ జనాభాలో 19% ఉన్న ముస్లింల ఓట్లపై విపక్షాలు ప్రధానంగా గురి పెడుతున్నాయి. 24 లోక్సభ సీట్లలో వీరు 20 నుంచి ఏకంగా 50 శాతం దాకా ఉన్నారు. దాంతో ఆ స్థానాల్లో వారు కీలకం కానున్నారు. ఈసారి ఎస్పీ, కాంగ్రెస్ జట్టు కట్టేందుకు ముస్లిం ఫ్యాక్టర్ కూడా ప్రధాన కారణమే. 2014, 2019ల్లో అవి విడిగా పోటీ చేయడంతో ముస్లిం ప్రాబల్య స్థానాల్లో బీజేపీ బాగా లాభపడింది. 2019లో ఎస్పీ, బీఎస్పీ నెగ్గిన స్థానాల్లో ముస్లింల ప్రాబల్యమున్నవే ఎక్కువ! రాహుల్ భారత్ జోడో యాత్ర, అఖిలేశ్ పీడీఏ (వెనుకబడిన, దళిత, మైనారిటీ) యాత్రలు యూపీలో ముస్లిం ప్రాబల్య జిల్లాల్లోనే సాగాయి. సర్వేలు ఏమంటున్నాయి...? యూపీలో ఎన్డీఏ కూటమికి ఏకంగా 70 నుంచి 72 సీట్లు రావచ్చని పలు ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇండియా కూటమి ఆరేడు స్థానాలకు మించకపోవచ్చని చెబుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Teena Goswami: ఆడపిల్లే అదృష్టదేవత
పైలట్ టీనా గోస్వామి ఆసక్తికరమైన వీడియోలను ‘పైలట్ మమ్మీ’ శీర్షికతో ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేస్తుంటుంది. తాజాగా పోస్ట్ చేసిన ఒక బామ్మ వీడియో వైరల్గా మారింది. గ్రామీణత ఉట్టిపడే ఆహార్యంతో కనిపిస్తున్న ఒక బామ్మ అయోధ్యధామ్కు వెళ్లే విమానంలోకి మెట్లకు నమస్కరిస్తూ ఎక్కింది. విమానంలో కనిపించిన పైలట్ టీనా గోస్వామిని ఆ΄్యాయంగా పలకరించింది. ‘మన భారతీయ సనాతన సంస్కృతిలో ఆడపిల్ల.. మన లక్ష్మి’ అంటూ టీనాను ఆశీర్వదించింది. బామ్మ కాళ్లకు గౌరవంగా నమస్కరించింది టీనా. రెండు మూడు రోజుల వ్యవధిలోనే ఈ వీడియో ముప్ఫై లక్షల వ్యూస్ దక్కించుకుంది. హృదయాన్ని హత్తుకునే ఈ వీడియో గురించి కామెంట్ సెక్షన్లో ప్రశంసలు వెల్లువెత్తాయి. -
అయోధ్య రాముడిని దర్శించుకున్న సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ కేశవ్ మహారాజ్ తొలిసారి ఐపీఎల్లో భాగం కానున్నాడు. ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్కు మహారాజ్ ప్రాతినిథ్యం వహించనున్నాడు. గతేడాది డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో రూ.50 లక్షల కనీస ధరకు మహారాజ్ను లక్నో సొంతం చేసుకుంది. ఇప్పటికే లక్నో జట్టుతో కేశవ్ మహారాజ్ కలిశాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ప్రస్తుతం లక్నోలోని ఏక్నా స్టేడియంలో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో ఆయోద్య రామమందిరాన్ని మహారాజ్ గురువారం సందర్శించాడు. View this post on Instagram A post shared by Lucknow Super Giants (@lucknowsupergiants) మందిరంలో బాల రాముని విగ్రహాన్ని ఈ ప్రోటీస్ స్టార్ దర్శించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో కేశవ్ షేర్ చేశాడు. అందుకు క్యాప్షన్గా జై శ్రీరామ్ అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా భారత సంతతికి చెందిన కేశవ్ మహారాజ్ రామభక్తుడు అన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో అతడి బ్యాటింగ్కు వచ్చిన ప్రతీసారి ‘‘రామ్ సియా రామ్’’ అంటూ సాగే పాటను ప్లే చేస్తున్నారు.కాగా ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలో భవ్య రామ మందిరంలో బాల రాముడి ప్రతిష్టాపన జరిగిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Keshav Maharaj (@keshavmaharaj16) -
90 ఏళ్ల వయసులో నటి భరతనాట్యం.. నిజంగా గ్రేట్!
వయసుపైబడ్డాక ఏం చేస్తారు? ఆ.. ఏముంది, కృష్ణారామా అంటూ ఓ మూలన కూర్చోవడమే అనుకుంటారు చాలామంది! కానీ ఇక్కడ చెప్పుకునే ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాత్రం ఇప్పటికీ యాక్టివ్గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు, తనకెంతో ఇష్టమైన భరతనాట్యంతో మరోసారి మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఆవిడే వైజయంతిమాల. ఐదేళ్లకే క్లాసికల్ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టిందీవిడ. పదహారేళ్ల ప్రాయంలోనే నటిగా మారింది. 90 ఏళ్ల వయసులో నాట్యం.. వాస్కాయ్(జీవితం) సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్గా రాణించింది. సౌత్లో, బాలీవుడ్లో బడా స్టార్స్తో కలిసి యాక్ట్ చేసింది. కెరీర్లో ఉన్నతస్థానాన్ని చూసిన ఆమె ప్రస్తుత వయసు 90. ఇంత పెద్ద వయసులో అయోధ్యలో భరతనాట్య ప్రదర్శన చేసింది వైజయంతిమాల. అయోధ్యలో రామ్లల్లా రాగసేవ అనే కార్యక్రమం ప్రారంభించారు. జనవరి 27న మొదలైన ఈ ప్రోగ్రామ్ 45 రోజులపాటు కొనసాగనుంది. ఇటీవలే పద్మవిభూషణ్.. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్స్ ఆటపాటలతో అలరిస్తున్నారు. ఈ క్రమంలో వైజయంతిమాల భరతనాట్యంతో అందరినీ అబ్బురపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. టాలెంట్కు వయసుతో పని లేదని నిరూపించారు, మీరు నిజంగా గ్రేట్ అని కామెంట్లు చేస్తున్నారు. నటి బ్యాక్గ్రౌండ్ ఇదే! వైజయంతిమాల 1933 ఆగస్టు 13న జన్మించింది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది 1949లో వాస్కాయ్ అనే తమిళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఇదే మూవీ తెలుగులో జీవితం పేరిట రీమేకైంది. ఇందులోనూ వైజయంతిమాల కథానాయికగా నటించింది. హిందీలో బాహర్(1951) సినిమాతో గుర్తింపు పొందింది. నాగిన్తో స్టార్డమ్ అందుకుంది. దేవదాసు చిత్రంతో అవార్డులు ఎగరేసుకుపోయింది. సద్నా, మధుమతి, గంగ జమున, సూరజ్, చిత్రాలు ఆమె కెరీర్లో గుర్తుండిపోయే సినిమాల జాబితాలో నిలిచాయి. 1968లో కేంద్రప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది. ఈ ఏడాది పద్మవిభూషణ్ వరించడం విశేషం. Vyjayanthimala ji (at the age of 90😳) performing at Ramlala RaagSeva, Ayodhya! 🙏🏽pic.twitter.com/XQFCdrWbFS — Keh Ke Peheno (@coolfunnytshirt) March 1, 2024 చదవండి: ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్.. స్టేజీపై తడబడ్డ స్టార్ సింగర్.. వీడియో వైరల్ -
ఐశ్వర్యరాయ్పై రాహుల్ కామెంట్స్.. సిద్దరామయ్యకు బీజేపీ కౌంటర్
ఢిల్లీ: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం, సినీ నటి ఐశ్వర్యరాయ్పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తీరుపై బీజేపీ నేతలు, ప్రముఖ సింగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాహుల్కు కౌంటర్ కూడా ఇచ్చారు. కాగా, భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ప్రసంగించిన రాహుల్ గాంధీ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్.. దేశాన్ని నడిపించే వ్యక్తులను అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దూరంగా ఉంచారని విమర్శలు చేశారు. అదే సమయంలో బాలీవుడ్ సెలబ్రిటీలు అయిన అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్లను అయోధ్యకు ఆహ్వానించారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే మీరు రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చూశారా. అందులో ఒక్కరైనా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ముఖాలను చూశారా. కానీ ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య బచ్చన్, ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. కానీ దేశాన్ని నిజంగా నడిపించే వ్యక్తులను మనం అంత గొప్ప కార్యక్రమంలో చూడలేదు. వాళ్లు దేశాన్ని ఎప్పటికీ నియంత్రించలేరని గుర్తుంచుకోవాలి. కనీసం రాష్ట్రపతి కూడా లేకపోవడం ఆయా వర్గాలను అవమానించడమేనని తేల్చి చెప్పారు. పారిశ్రామికవేత్తలు, అమితాబచ్చన్ను ఆహ్వానించడం ద్వారా జనాభాలో మిగతా 73 శాతం మందికి ప్రాముఖ్యత లేదని చెప్పినట్టేనని మండిపడ్డారు. దీంతో, రాహుల్ కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. Congress Clown Prince @RahulGandhi now has a dangerous & creepy obsession with successful & self-made women. Frustrated by constant rejections by Indians, Rahul Gandhi has sunk to a new low of demeaning India's Pride Aishwarya Rai. A fourth-generation dynast, with zero… pic.twitter.com/6TA442wWTZ — BJP Karnataka (@BJP4Karnataka) February 21, 2024 ఇక, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ, సింగర్ సోనా మహాపాత్ర స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ కామెంట్స్పై కర్ణాటక బీజేపీ స్పందిస్తూ.. దేశంలో కాంగ్రెస్ను ప్రజలు ఆదరించకపోవడంతో రాహుల్ మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో రాహుల్కే తెలియడం లేదు. రాహుల్ కన్నడిగులను అవమానించారని మండిపడింది. కన్నడ ఆత్మగౌరవం గురించి మాట్లాడే సీఎం సిద్దరామయ్య.. రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తారా? అని ప్రశ్నించింది. సాటి కన్నడ వ్యక్తి(ఐశ్వర్యరాయ్)ని రాహుల్ అవమానిస్తుంటే సీఎం సిద్దరామయ్యా చూస్తూ ఎలా ఊరుకుంటారని మండిపడింది. మహిళలను కూడా కించపరిచే స్థాయికి తిరగజారాడంటూ వ్యాఖ్యలు చేసింది. మరోవైపు.. రాహుల్ వ్యాఖ్యలపై సింగర్ సోనా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా రాజకీయ నాయకులు(రాహుల్ గాంధీ) తమ స్వలాభం కోసం ప్రసంగాల్లో మహిళలను కించపరచడం ఏంటి? అని ప్రశ్నించారు. What’s with politicians demeaning women in their speeches to get some brownie points in a sexist landscape?Dear #RahulGandhi ,sure someone has demeaned your own mother, sister similarly in the past & irrespective you ought to know better? Also, #AishwaryaRai dances beautifully.🙏🏾 — Sona Mohapatra (@sonamohapatra) February 21, 2024 -
secunderabad: అయోధ్యకు బయలుదేరిన మొదటి ట్రైన్
సాక్షి, హైదరాబాద్: అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం అనంతరం దేశవ్యాప్తంగా ప్రజలు బాలరాముడి దర్శించుకోవటానికి భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యకి ప్రయాణికులతో మొదటి ట్రైన్ బయలుదేరింది. 1400 మంది ప్రయాణికులతో ఈ ట్రైన్ మొదలైంది. Flagged off special train to #Ayodhya from Secunderabad Railway station along with MLA Shri @kvr4kamareddy ji, MLA Shri @Dhanpal_Suranna ji, Shri @ShyamSunder_BJP ji and Senior leaders. #JaiShreeRam pic.twitter.com/32M624iMlv — Kontham Deepika BJP (@KonthamDeepika) February 5, 2024 అయోద్య రైలు కోసం రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయోధ్య దర్శనం అనంతరం తిరిగి 9వ తేదీన మళ్ళీ సికింద్రబాద్కు ప్రత్యేక రైలు రానున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. -
అయోధ్యకు క్యూ కట్టిన భక్తులు.. ఇప్పటి వరకు దర్శనాలు, హుండీ..
అయోధ్య: యూపీలోని అయోధ్య మందిరానికి భక్తులు క్యూ కడుతున్నారు. బాలరాముడిని చూసేందుకు దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ఇక, కేవలం 11 రోజుల్లోనే ఏకంగా 25 లక్షల మంది భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో రూ.11 కోట్ల మేర హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కాగా, అయోధ్యలోని బాలక్ రాముడి దర్శన మార్గంలో నాలుగు హుండీలను ఏర్పాటు చేశారు. ఇక, గత 11 రోజుల్లో 25లక్షల మంది భక్తులు బాలరాముడిని దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.8 కోట్లు నగదు రూపంలో, రూ.3.5 కోట్లు చెక్కుల రూపంలో వచ్చాయి. ఇందులో ఆన్లైన్ విరాళాలు కూడా ఉన్నాయి. మొత్తం 14 మందితో కూడిన బృందం ఈ హుండీల్లోని విరాళాలను లెక్కించింది. ఇక, భక్తులు కానుకలు సమర్పించడం నుంచి వాటిని లెక్కింపు వరకూ అంతా సీసీటీవీ కెమెరాల నిఘా పర్యవేక్షణలోనే జరుగుతుందని ఆలయ ట్రస్టు ఆఫీస్ ఇన్ఛార్జి ప్రకాశ్ గుప్తా తెలిపారు. VIDEO | Devotees continue to throng Ayodhya's Ram Mandir for 'darshan' of Ram Lalla. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz)#AyodhyaRamMandir pic.twitter.com/cweNluhV8U — Press Trust of India (@PTI_News) February 2, 2024 ఇదిలా ఉండగా.. భారీసంఖ్యలో వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అయోధ్యలోని బాలరాముడి మందిరంలో స్వామి దర్శన సమయాన్ని ఆలయ నిర్వాహకులు ఇటీవల పొడిగించారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు ఆలయాన్ని సందర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. అంతకుముందు ఆలయ దర్శన వేళలు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే ఉండేవి. #WATCH | Uttar Pradesh: Devotees gather at Rampath for the darshan of Ram Lalla at Shri Ram Janmabhoomi Temple in Ayodhya. pic.twitter.com/tpmVFU2jH0 — ANI (@ANI) February 2, 2024 -
వజ్రాల వ్యాపారి రాముడికి సమర్పించిన విరాళమెంత?
జనవరి 22న అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ట వేడుక శ్రీరాముని జన్మభూమిలో ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా నిర్వహించిన చారిత్రాత్మక ఘట్టాన్న ప్రపంచవ్యాప్తంగా అనేకమంది భక్తులు చూసి తరించారు. 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత, అయోధ్యలో రామ మందిర నిర్మాణంకోసం భక్తులు విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కేవలం 45 రోజుల్లోనే పది కోట్ల మందికి పైగా ప్రజల నుంచి 2,500 కోట్లు వచ్చాయి. రూ. 68 కోట్ల విలువ చేసే బంగారం ఈ క్రమంలో సూరత్కుచెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ లఖీ ఇచ్చిన విరాళం విశేషంగా నిలుస్తోంది. ఇదే రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందిన అతిపెద్ద విరాళంగా భావిస్తున్నారు. రూ. 68 కోట్లు విలువ చేసే 101 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ బంగారాన్ని గర్భగుడి, ఆలయ స్తంభాలు, తలుపులు, బలరాముడి ఆలయంలోని డ్రమ్, త్రిశూల్ వంటి నిర్మాణాలలో ఉపయోగించారట. ఎవరీ దిలీప్ కుమార్ లఖి దిలీప్ కుమార్ లఖి తండ్రి కూడా వజ్రాల వ్యాపారి . 1947లో విభజనకు రెండు సంవత్సరాల ముందు 1944లో జైపూర్ వచ్చారు. చిన్నప్పటి నుండే దిలీప్ కుమార్, కుటుంబ వ్యాపారంలో సాయం చేస్తూ డైమండ్ వ్యాపారంలో రాణించారు. ప్రస్తుతం సూరత్లో ప్రపంచంలోని అతిపెద్ద డైమండ్ పాలిషింగ్ ఫ్యాక్టరీకి యజమాని. 6వేలకు పైగ ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తారు. థాయిలాండ్, అమెరికా, దుబాయ్తో పాటు ప్రపంచవ్యాప్తంగా శాఖలు ఉన్నాయి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 33 కిలోల బంగారం, 2.51 కోట్లు ఇచ్చినట్టు సమాచారం. అలాగే దేశంలోని బిలియనీర్లు ఎంత ఇచ్చారో స్పష్టంగా తెలియనప్పటికీ వారితో పోలిస్తే దిలీప్ చాలా బెటర్ అంటున్నారు నెటిజన్లు. అయోధ్యకు ఆర్థిక ఊతం మరోవైపు వాణిజ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం,అయోధ్య రామమందిరం ఇప్పుడు దేశంలోని అతిపెద్ద పర్యాటక కేంద్రంగా మారబోతోంది. అయోధ్య ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వనుంది. -
వివాదంలో అయోధ్యలోని రెస్టారెంట్ : నోటీసులు
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య అనే నగరం గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తోంది. ప్రతిష్టాత్మకమైన శ్రీ రామ జన్మభూమి దేవాలయం నిర్మాణ ప్రతిపాదన మొదలు, ఇటీవల ఘనంగా రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుక దాకా ప్రతీదీ విశేషంగా నిలుస్తోంది. తాజాగా అయోధ్యలో కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్ ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. తక్కువ ధరల్లో భక్తుల సేవలందించాల్సిన హోటల్ అధిక చార్జీలు వసూలు చేస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. శ్రీరాముడికి ఎంగిలి పళ్లు తినిపించిన అపర భక్తురాలైన శబరి పేరుతో ఏర్నాటైన రెస్టారెంట్ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. శబరి రసోయిలో రెండు కప్పుల టీ , రెండు బ్రెడ్ ముక్కల కోసం ఏకంగా రూ. 252 వసూలు చేసింది. సంబంధిత బిల్లును కస్టమర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, పోస్ట్ చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంత అన్యాయం అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఈ అంశం చివరికి అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ (ఏడీఏ)కి చేరింది. దీంతో సదరు హోటల్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. మూడు రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని రెస్టారెంట్ను ఆదేశించింది, లేని పక్షంలో ఒప్పందాన్ని రద్దు చేస్తామని ఏడీఏ వైస్ చైర్మన్ విశాల్ సింగ్ హెచ్చరించారు. अयोध्या | शबरी रसोई 55 रुपए की एक चाय 65 रुपए का एक टोस्ट राम नाम की लूट है, लूट सके तो लूट pic.twitter.com/rRrl6eRBaB — Govind Pratap Singh | GPS (@govindprataps12) January 24, 2024 ఒప్పందం ప్రకారం బడ్జెట్ కేటగిరీ కింద జాబితా చేయబడిన ఈ రెస్టారెంట్ భక్తులకు , యాత్రికులకు రూ. 10కి ఒక కప్పు టీ, రెండు టోస్ట్లను అందించాల్సి ఉంది. మరోవైపు ఈ ఆరోపణలు సదరు రెస్టారెంట్ ఖండించింది. ఇది ఫ్రీ గా తినాలనుకుని భావించిన కస్టమర్ల పన్నాగమని, బిల్లును సోషల్ మీడియాలో వైరల్ కావడం వెనుక కుట్ర ఉందని శబరి రసోయి రెస్టారెంట్ ప్రాజెక్ట్ హెడ్ సత్యేంద్ర మిశ్రా వ్యాఖ్యానించారు. తమ వద్ద పెద్ద పెద్ద హోటళ్లలో ఉండే సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. అథారిటీ నోటీసులకు సమాధానమిచ్చినట్టు తెలిపారు.. అరుంధతీ భవన్ పేరుతో కొత్తగా నిర్మించిన వాణిజ్య సముదాయంలో శబరి రసోయి ఉంది. ఇది రామ మందిరం సమీపంలోని తెహ్రీ బజార్లో అహ్మదాబాద్కు చెందిన కవాచ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ లిమిటెడ్ దీన్ని ఏర్పాటు చేసింది. -
అయోధ్యలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
శ్రీరాముడు జగదానందకారకుడు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన ఆలయంలో కొలువైన రామ్లల్లా దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. ఆలయ గర్భగుడిలో రామ్లల్లా ప్రతిష్ఠాపన జరిగి వారం రోజులు దాటినా భక్తుల రద్దీ నిరంతరం కొనసాగుతూనే ఉంది. రామ్లల్లాను తనివితీరా దర్శించాలనే కోరిక అయోధ్యకు వచ్చే ప్రతీ ఒక్కరిలోనూ కనిపిస్తోంది. తీవ్రమైన చలి గజగజా వణికిస్తున్నా భక్తులు రామ్లల్లా దర్శనం కోసం బారులు తీరుతున్నారు. పిల్లలు, పెద్దలు, ముఖ్యంగా యువత శ్రీరాముని దర్శించుకునేందుకు అమితమైన ఆసక్తి కనబరుస్తోంది. అయోధ్యకు వచ్చే భక్తుల కోసం పలు సేవా సంస్థలు వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రామ్పథ్ తదితర మార్గాల నుంచి వస్తున్న భక్తుల కోసం ఉచిత భోజనశాలలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రామ్లల్లా సందర్శకుల కోసం నిర్మించిన టెంట్ సిటీని ప్రారంభించారు. దీనిలో 25 వేల మంది భక్తులు బస చేసేందుకు అవకాశం ఉంది. ఈ టెంట్ సిటీలోనూ ఉచిత భోజనశాలలు ఏర్పాటు చేశారు. -
అయోధ్యకు చేరువలో పాదయాత్రికురాలు షబ్నం!
మతపరమైన ఆంక్షలన్నింటినీ దాటుకుని ముంబై నుంచి శ్రీరాముని దర్శనానికి కాలినడకన బయలుదేరిన షబ్నం ఇప్పుడు అయోధ్యకు కొన్ని అడుగుల దూరంలో ఉన్నారు. ఆమె హలియాపూర్లోని అయోధ్య సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇది తన కల నిజమవుతున్న తరుణమని అన్నారు. కొద్దిసేపటిలో రామ్లల్లా దర్శనం చేసుకోబోతున్నానన్నారు. షబ్నం షేక్కు హాలియాపూర్లో స్థానికుల నుంచి ఘనస్వాగతం లభించింది. ముంబైలో ఉంటున్న షబ్నమ్ షేక్ (23) బీకామ్ విద్యార్థిని. రామునిపై ఆమెకు ఉన్న భక్తిప్రపత్తులను ఆమె సోషల్ మీడియాలో వెల్లడిస్తుంటారు. 38 రోజుల క్రితం ఆమె తన ముగ్గురు హిందూ స్నేహితులైన రమణ్ రాజ్ శర్మ, వినీత్ పాండే, శుభమ్ గుప్తాలతో కలిసి అయోధ్యకు కాలినడకన బయలుదేరారు. శనివారం సాయంత్రం హాలియాపూర్లోని ఎక్స్ప్రెస్వే దగ్గర స్థానికులు వారికి స్వాగతం పలికారు. జైశ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ప్రతాప్ ధాబా నిర్వాహకుడు హరి ప్రతాప్ సింగ్, అతని భార్య ప్రీతి సింగ్ షబ్నం బృందానికి స్వాగతం పలికారు. రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకోవాలని వారు కోరారు. షబ్నం వారి అభ్యర్థనను అంగీకరించారు. ఈ సందర్భంగా షబ్నం మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి శ్రీరామ భక్తురాలినని, అయోధ్యకు సమీపానికి చేరుకోవడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాను రెండు రోజుల పాటు అయోధ్యలో ఉండి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలుసుకుని, ఆ తర్వాత తిరిగి ముంబైకి చేరుకుంటానన్నారు. -
రామ్లల్లా దర్శన సమయాల్లో మార్పులు
అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముడు కొలువైన అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. లక్షలాది మంది భక్తులు బాలరాముని దర్శనం చేసుకునేందుకు అర్థరాత్రి నుండే గజగజ వణికిస్తున్న చలిలో సైతం క్యూలలలో వేచివుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. అధిక సంఖ్యలో భక్తులు రామ్లల్లాను చూసేందుకు, పూజలు చేసేందుకు అవకాశాన్ని కల్పించాలని ట్రస్ట్ దర్శన సమయాల్లో మార్పులు చేసింది. ఈ సమాచారాన్ని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) మీడియాకు అందించింది. ఇది కూడా చదవండి: అయోధ్య రామ భక్తులకు శుభవార్త విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి మాట్లాడుతూ రామ భక్తులకు ఇకపై దర్శనానికి మరో గంట సమయం అదనంగా లభిస్తుందన్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు రామ్లల్లా హారతి, దర్శనం కోసం విడుదల చేసిన షెడ్యూల్ వివరాలు.. మంగళ హారతి: ఉదయం 4.30 గంటలకు ఉత్థాన్ హారతి : ఉదయం 6.30 గంటలకు దర్శనం: ఉదయం 7 గంటల నుంచి భోగ్ హారతి: మధ్యాహ్నం 12 గంటలకు సాయంత్రం హారతి: 7.30 గంటలకు రాత్రి భోగ్ హారతి: 9 గంటలకు శయన హారతి: రాత్రి 10 గంటలకు -
అయోధ్య రామ భక్తులకు శుభవార్త
దేశంలోని రామభక్తుల కల నెరవేరింది. అయోధ్యలో రామాలయం నిర్మితమయ్యింది. లక్షలాది భక్తులు రాములోరిని చూసేందుకు తరలివస్తున్నారు. అయితే వారు అక్కడ సరైన వసతి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇకపై ఇటువంటి సమస్యలకు ఫుల్స్టాప్ పడనుంది. అయోధ్య ధామ్లో భక్తుల కోసం 158 కొత్త హోటళ్లను నిర్మించేందుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ హోటళ్లను వీలైనంత త్వరగా నిర్మించనున్నారని సమాచారం. ఈ ఏడాది ఎనిమిది వేల గదులు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతానికి పర్యాటకులకు 175 హోటళ్లు, అతిథి గృహాలు, డేరా సిటీలలో 30 వేల మంది భక్తులకు బస చేసేందుకు ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే రిజిస్టర్ అయిన 158 కొత్త హోటళ్ల నిర్మాణం పూర్తయ్యాక అయోధ్య ధామ్లోని హోటళ్లు, అతిథి గృహాల సంఖ్య 333కి పెరగనుంది. ఇది కూడా చదవండి: తొలిరోజు విరాళాలు రూ.3.17 కోట్లు! యూపీ పర్యాటక మంత్రిత్వ శాఖ అయోధ్యలో నిర్మిస్తున్న హోటళ్లను కాంస్య (ఒక నక్షత్రం), వెండి (రెండు నక్షత్రాలు), బంగారం (త్రీ స్టార్), డైమండ్ (నాలుగు నక్షత్రాలు), ప్లాటినం (ఫైవ్ స్టార్)గా వర్గీకరించే సదుపాయాన్ని కూడా కల్పించింది. కొత్త టూరిజం పాలసీ ప్రకారం నూతనంగా నిర్మితమవుతున్న ఈ హోటళ్లకు ఇంటి పన్ను, నీటి పన్ను, ఇతర పన్నుల్లో 50 శాతం వరకు రాయితీని ప్రభుత్వం అందిస్తోంది. జనరల్ కేటగిరీకి 25 శాతం, మహిళలు, షెడ్యూల్డ్ కులాలకు 30 శాతం సబ్సిడీ కల్పిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ హోటళ్ల నిర్మాణం పూర్తికానున్నదని యూపీ పర్యాటక శాఖ మంత్రి జైవీర్ తెలిపారు. -
గోవా Vs అయోధ్య: హనీమూన్ రచ్చ.. చివరికి..?
అనివార్య పరిస్థితుల్లోనో లేదంటే విభేదాలు, తగాదాలు మితిమీరినా భార్యాభర్తల మధ్య విడాకులకు దారి తీస్తుంది. అయితే బోపాల్లో ఫ్యామిలీ కోర్టుకు చేరిన ఓ విడాకులు కేసు ఒకటి విచిత్రంగా నిలిచింది. గోవా, సౌత్ ఇండియా హనీమూన్ ట్రిప్కు తీసుకెళ్లానంటే భార్య ఎగిరి గంతేసింది. తీరా టూర్ అయిన తరువాత తనకు భర్త నుంచి విడాకులు ఇప్పించాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..? ఫ్రీ ప్రెస్ జర్నల్లోని ఒక నివేదిక ప్రకారం భోపాల్లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. హనీమూన్కు గోవాకు తీసుకెళ్తానని మాట ఇచ్చాడు భర్త. గోవాకి బదులు అయోధ్య, వారణాసికి తీసుకెళ్లాడు అనేది భార్య ఆరోపణ. గోవా, సౌత్ ఇండియా పర్యటనకు భార్య అంగీకరించింది. అయితే ఆ తర్వాత భర్త ఆమెకు సమాచారం ఇవ్వకుండానే అయోధ్య, వారణాసికి విమాన టిక్కెట్లు బుక్ చేశాడు. జనవరి 22న జరిగే రామమందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి తీసుకెళ్లమని తల్లి కోరిన నేపనథ్యంలో ఇలా చేశాడు. అయితే ఈ విషయాన్ని దాచి పెట్టి ట్రిప్కు ఒకరోజు ముందు తాము అయోధ్యకు వెళ్తున్నామని చెప్పాడు. దీంతో తన కంటే కుటుంబ సభ్యులే ఎక్కువ అంటూ ఆగ్రహించింది. అయినా గప్చుప్గా టూర్ కెళ్లి వచ్చింది. చివరికి ఈ కారణంతోనే తనకు విడాకులు కావాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈ దంపతులు ఇద్దరూ హిందూ పుణ్యక్షేత్రాలను సందర్శించి, తిరిగి వచ్చిన 10 రోజుల తరువాత ఈ కేసు కోర్టుకు చేరింది. ప్రస్తుతం వీరిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో ఉన్నారు అధికారులు. -
ప్రపంచంలో అయోధ్యకు పెరిగిన ఖ్యాతి.. ఏడాది చివరికి రూ.4 లక్షల కోట్లు..
అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపన జరిగినప్పటి నుంచి ఈ రోజుకి కూడా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. అయోధ్యలో పెరుగుతున్న రద్దీ చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. దీంతో రానున్న రోజుల్లో దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని.. పర్యాటక రంగంలో ఉత్తరప్రదేశ్ అగ్రగామి అవుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధన విభాగం అంచనా వేసింది. ఈ ఏడాది అయోధ్యను సందర్శించే యాత్రికుల సంఖ్య పెరగడంతో ఉత్తరప్రదేశ్లో దేశీయ, విదేశీ పర్యాటకుల మొత్తం ఖర్చు ఈ ఏడాది చివరి నాటికి 4 లక్షల కోట్ల మార్క్ దాటుతుందని అంచనా వేస్తున్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం మునుపటి కంటే కూడా రూ. 20000 నుంచి రూ. 25000 కోట్లు ఎక్కువని అంచనా..! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం, భారతదేశంలోని ఆధ్యాత్మిక పరిశ్రమను అభివృద్ధి చేయడంలో కేంద్రం కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో ఆధ్యాత్మిక టూరిజంలో ఉత్తరప్రదేశ్ గణనీయ వృద్ధి సాధించనుంది. గంగా నది, వారణాసి, తాజ్ మహల్ వంటి పర్యాటక ప్రదేశాల జాబితాలో అయోధ్య రామాలయం కూడా చేరిపోయింది. 2022లో మాత్రమే 32 కోట్ల మంది దేశీయ పర్యాటకులు ఉత్తరప్రదేశ్ సందర్శించారు. ఇందులో కేవలం అయోధ్యను మాత్రమే సందర్శించిన వారు 2.21 కోట్లు. ఇది 2021తో పోలిస్తే ఏకంగా 200 శాతం ఎక్కువని నివేదికలు చెబుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ 'కాంతి ఘోష్' ప్రకారం, ఉత్తరప్రదేశ్లో దేశీయ పర్యాటకులు దాదాపు రూ. 2.2 లక్షల కోట్లు, విదేశీ పర్యాటకులు రూ.10,000 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే యూపీలో పర్యాటకుల ఖర్చు మొత్తం రూ.2.3 లక్షల కోట్లని తెలుస్తోంది. 2019లో అంతర్జాతీయ పర్యాటక వసూళ్లలో భారతదేశం వాటా 14వ ర్యాంక్తో 2.06 శాతం తక్కువగా ఉండేది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో కూడా, ఇది ఆరవ ర్యాంక్తో కేవలం 7 శాతం వాటాను మాత్రమే కలిగి ఉంది. ఇది రాబోయే రోజుల్లో తప్పకుండా వృద్ధి చెందుతుందని ప్రస్తుత పరిస్థితుల ద్వారా అవగతమవుతోంది. జీడీపీలో ఉత్తరప్రదేశ్ వాటా.. 2028 ఆర్ధిక సంవత్సరం నాటికి భారతదేశం ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని, ఇందులో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ ఏకంగా 500 బిలియన్ డాలర్లగా ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ వృద్ధి భారతదేశ జీడీపీ పెరుగుదలకు దోహదపడుతుంది. ఇదీ చదవండి: భారత్ నెలలో చేసేది అమెరికాకు మూడేళ్లు - కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు 2027 - 2028లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం మూడవ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. అప్పటికి ఆర్ధిక వృద్ధిలో 500 బిలియన్ డాలర్ల మార్కుని అధిగమించే రెండు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటిగా ఉండనుంది. ఇది నార్వే, హంగేరీ మొదలైన యూరోపియన్ దేశాల కంటే ఎక్కువని తెలుస్తోంది. -
తొలిరోజు విరాళాలు రూ.3.17 కోట్లు!.. మూడో రోజు సజావుగా దర్శనాలు!
అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైన రెండవరోజున(బుధవారం) దాదాపు 2.5 లక్షల మంది భక్తులు దర్శనానికి తరలివచ్చారు. మంగళవారం(తొలిరోజు) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేపట్టిన ఆకస్మిక పర్యటన, సూచనల ప్రభావం బుధవారం కనిపించింది. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తాజాగా యాత్రికుల సౌకర్య కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. బాలక్ రాముని దర్శనాలు ప్రారంభమై నేటికి (గురువారం) మూడో రోజు. మొదటి రెండు రోజులు భక్తుల రద్దీతో అనేక ఇబ్బుందులు తలెత్తాయి. ఈ నేపద్యంలో ట్రస్ట్ పలు చర్యలు చేపట్టడంతో ప్రస్తుతం ఆలయంలో భక్తుల దర్శనాలు క్రమపద్ధతిలో సాగుతున్నాయి. రామభక్తుల దర్శనాలు నిరంతరం కొనసాగుతున్నాయి. బాలరాములోరికి భక్తులు కానుకలు, విరాళాలు విరివిగా సమర్పిస్తున్నారు. ఇది కూడా చదవండి: కొనసాగుతున్న భక్తుల వరద ప్రాణప్రతిష్ఠ జరిగినంతనే ఐదేళ్ల బాలరాముడు కోటీశ్వరునిగా మారిపోయాడు. తొలిరోజు శ్రీరాముని దర్శనానికి వచ్చిన భక్తులు రూ.3.17 కోట్ల విరాళాలను సమర్పించారని ట్రస్ట్ తెలిపింది. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ అనంతరం మంగళవారం ఆలయంలోకి సామాన్య భక్తుల ప్రవేశానికి అనుమతి కల్పించారు. రామాలయానికి వచ్చిన సందర్శకుల సంఖ్యకు సంబంధించి గతంలో ఉన్న రికార్డులన్నీ బద్దలయ్యాయి. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో దర్శనం కోసం వారు నానా అవస్థలు పడ్డారు. రాములోరి దర్శనం కోసం వచ్చిన భక్తులు విరాళాలు సమర్పించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధి డాక్టర్ అనిల్ మిశ్రా మాట్లాడుతూ మంగళవారం ఆలయానికి అత్యధిక విరాళాలు అందాయి. ఆన్లైన్లో విరాళాలు అందించడానికి రామభక్తులు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. విరాళాల కోసం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి, పలువురు భక్తులు విరాళాలు అందించారన్నారు. కాగా అయోధ్యకు తరలివచ్చే భక్తులు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారిక వెబ్సైట్ ద్వారా విరాళాలు అందించవచ్చు. ఆలయంలోని హుండీలలో కూడా విరాళాలు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. -
బాలరామున్ని దర్శించుకున్న హనుమాన్..! ఆలయంలో ఆసక్తికర ఘటన
లక్నో: అయోధ్య రామాలయ గుడిలో విచిత్రమైన ఘటన జరిగింది. బాలరాముడు కొలువై ఉన్న గర్భగుడిలోకి ఓ వానరం ప్రవేశించింది. మంగళవారం సాయంత్రం సమయంలో గుడి దక్షిణ ద్వారం గుండా ఓ కోతి ప్రవేశించింది. కొత్త ఆలయాన్ని నిర్మించడానికి ముందు గుడారంలో ఉంచిన బాలరాముని పాత విగ్రహాన్ని చేరుకుంది. ఈ విషయాన్ని అయోధ్య రామాలయ ట్రస్టు ట్విట్టర్ వేదికగా పంచుకుంది. విగ్రహం భద్రత గురించి భద్రతా సిబ్బంది ఆందోళన చెంది, కోతి వైపు పరుగెత్తారు. అయితే, కోతి ప్రశాంతంగా వెనక్కి తిరిగి ఉత్తర ద్వారం వైపు వెళ్లింది. అది మూసివేసి ఉండటంతో భక్తుల రద్దీని దాటి ఎలాంటి హాని చేయకుండా తూర్పు ద్వారం గుండా వెళ్లిపోయింది. బాలరామున్ని దర్శించేందుకు హనుమంతుడు స్వయంగా వచ్చాడని కోతి సందర్శనను దైవానుగ్రహంగా భక్తులు భావించారని ట్రస్ట్ తెలిపింది. आज श्री रामजन्मभूमि मंदिर में हुई एक सुंदर घटना का वर्णन: आज सायंकाल लगभग 5:50 बजे एक बंदर दक्षिणी द्वार से गूढ़ मंडप से होते हुए गर्भगृह में प्रवेश करके उत्सव मूर्ति के पास तक पहुंचा। बाहर तैनात सुरक्षाकर्मियों ने देखा, वे बन्दर की ओर यह सोच कर भागे कि कहीं यह बन्दर उत्सव… — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 23, 2024 కోతిని హనుమంతుని రూపంగా భక్తులు భావిస్తారు. అయితే.. అక్టోబర్ 30, 1990న బాబ్రీ మసీదుపై కరసేవకులు జెండాలను ఎగురవేశారు. ఈ క్రమంలో కరసేవకులను భద్రతా బలగాలు చెదరగొట్టాయి. ఈ క్రమంలో మసీదు గోపురంపై కరసేవకులు అమర్చిన జెండాను తొలగించకుండా ఓ కోతి కాపాడింది. ఇదీ చదవండి: కేంద్ర మంత్రులు అయోధ్యకు వెళ్లకండి: మోదీ -
కేంద్ర మంత్రులు అయోధ్యకు వెళ్లకండి: మోదీ
లక్నో: ఫిబ్రవరిలో అయోధ్యను సందర్శించడం మానుకోవాలని కేబినెట్ మంత్రులను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన తర్వాత భక్తులు భారీ సంఖ్యలో రామమందిరానికి తరలి రావడంతో మోదీ ఈ మేరకు మంత్రులకు విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో కేంద్ర మంత్రులు మార్చి నెలలో అయోధ్యను సందర్శించనున్నట్లు తెలుస్తోంది. వీఐపీల సందర్శనలో ప్రోటోకాల్ల వల్ల భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అయోధ్యకు వెళ్లే ప్రణాళికను మంత్రులు వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ కోరినట్లు తెలుస్తోంది. అయోధ్య రామమందిర నిర్మాణంపై ప్రజల అభిప్రాయాన్ని కూడా ప్రధాని మోదీ మంత్రులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. సోమవారం అయోధ్య ఆలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ నాయకత్వం వహించారు. ఈ వేడుకను దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అగ్రశ్రేణి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు, సెలబ్రిటీలతో సహా అనేక వేల మందిని కార్యక్రమానికి ఆహ్వానించారు. సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆహ్వానితులు దేవుడి దర్శనం చేసుకున్నారు. సాధారణ ప్రజల కోసం మంగళవారం ఉదయం ఆలయ తలుపులు తెరవబడ్డాయి. మొదటి రోజు దాదాపు ఐదు లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు బారులు తీరారు. భక్తులు భారీగా తరలిరావడంతో మంగళవారం దర్శనానికి కొద్దిసేపు విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఇదీ చదవండి: Ayodhya Ram Mandir: తొలి రోజు రాములోరి నిద్ర 15 నిముషాలే! -
తొలి రోజు రాములోరి నిద్ర 15 నిముషాలే!
అయోధ్య నగరి త్రేతాయుగాన్ని తలపిస్తోంది. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడు రాజభవనంలో ఆశీనులు కాగా, లక్షలాది మంది రామభక్తులు ఆయన దర్శనం కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అయోధ్యలో ఎక్కడ చూసినా కాషాయ వస్త్రాలు, కాషాయ జెండాలు కనిపిస్తున్నాయి. అంతటా జై శ్రీరామ్ నినాదాలు వినిపిస్తున్నాయి. బాలరాముడు అద్భుతమైన భవనంలో కూర్చుని, భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. తొలిరోజు రామ్లల్లా దినచర్య ఎలా గడిచిందంటే.. నూతన రామాలయంలో శ్రీరాముడు ఐదేళ్ల చిన్నారి రూపంలో కొలువయ్యాడు. రామనంది సంప్రదాయం ప్రకారం బాలరామునికి సేవలు, పూజలు జరుగుతున్నాయి. రోజంతా బాలరామునికి ఐదు హారతులు అందిస్తున్నారు. అలాగే నైవేద్యాలు సమర్పిస్తున్నారు. తొలిరోజు రామ్లల్లా రెండు గంటలపాటు కూడా గంటలు నిద్రపోలేదు. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులకు నిరంతరం దర్శనం ఇస్తూనే ఉన్నాడు. కేవలం 15 నిముషాలు మాత్రమే రామ్లల్లా నిదురించాడు. అనంతరం దర్శన ద్వారాలు తెరుచుకున్నాయి. రామమందిరం ప్రధాన పూజారి ఆచార్ సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ ‘రాముడు తన భవ్యమైన భవనంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు. త్రేతాయుగం మళ్లీ ప్రారంభమైనట్లుంది. ఐదేళ్ల రూపంలోని బాలరాముని విగ్రహం చూడగానే ఉప్పొంగిపోయాను. తొలిరోజు బాలరాముడు రెండు గంటలపాటు నిద్రించాల్సి ఉండగా, భక్తుల రద్దీ దృష్ట్యా కేవలం 15 నిమిషాల తర్వాత ఆలయ తలుపులు తెరవాల్సి వచ్చింది. లక్షలాది మంది రామభక్తులు నిరంతరం బాలరాముని సందర్శించుకుంటున్నారు’ అని అన్నారు. -
Ayodhya: అయోధ్యకు వెళ్లే బస్సులు రద్దు!
ఢిల్లీ: అయోధ్య బాలక్ రామ్ మందిర్కు ఎగబడుతున్న భక్తులకు, సందర్శకులకు పెద్ద షాకే తగిలింది. అయోధ్య వైపు వెళ్లే బస్సులను రద్దు చేస్తున్నట్లు బుధవారం అక్కడి రవాణా శాఖ ప్రకటించింది. తిరిగి బస్సులు ఎప్పుడు నడుస్తాయనేది ఇప్పట్లో చెప్పలేమని స్పష్టం చేసింది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట తర్వాత ‘బాలక్ రామ్’ దర్శనం కోసం భక్తులు ఎగబడి పోతున్నారు. దేశవ్యాప్తంగా అయోధ్య వైపు అడుగులేస్తున్నారు. తొలిరోజే ఏకంగా ఐదు లక్షల మంది దర్శించుకునేందుకు వచ్చినట్లు ఓ అంచనా. అందులో 3 లక్షల మందిదాకా దర్శించుకోగా.. మరో రెండు లక్షల మంది బయట ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఈ క్రమంలో నిన్న అధికారులకు భక్తుల నియంత్రణ కష్టతరంగా మారింది. ఇదీ చదవండి: బాలక్ రామ్ కోసం.. ఈ నిరీక్షణ చూశారా? దీంతో ఇవాళ కేంద్ర బలగాలను సైతం మోహరించారు. మొత్తం అయోధ్యలో 8 వేలమంది సిబ్బందిని భద్రత కోసమే మోహరించారు. అదే సమయంలో లక్నో, ఇతర ప్రాంతాల నుంచి అయోధ్యకు బస్సుల్లో భక్తులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో రద్దీని నిలువరించేందుకు బస్సు సర్వీసులన్నింటినీ రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తేనే తిరిగి సర్వీసులు నడుపుతామని ఓ అధికారి మీడియాకు వివరించారు. ఇక.. దైవదర్శనం కోసం తొందరపడొద్దని.. రెండు వారాల తర్వాత రద్దీ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయని భక్తులకు, సందర్శకులకు అయోధ్య ఐజీ ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు నిదానంగా రావాలని కోరుతున్నారాయన. -
అయోధ్యలో మరో 13 నూతన ఆలయాలు
అయోధ్యలోని శ్రీరాముని ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. బాలరాముని దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు క్యూ కడుతున్నారు. అయోధ్యను ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశంగా మార్చేందుకు కేంద్ర, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయోధ్యను ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందుతున్నాయి. దీనిలో భాగంగా 13 నూతన ఆలయాలను నిర్మించనున్నారు. వీటిలోని ఆరు ఆలయాలు ప్రధాన మందిర సముదాయం లోపల, ఏడు ఆలయాలు వెలుపల నిర్మితం కానున్నాయి. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి స్వామి గురుదేవ్ గిరీజీ ఈ ప్రణాళిక గురించి తెలియజేశారు. ప్రధాన ఆలయాన్ని పూర్తి చేసే పనులతో సహా అన్ని ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. ప్రధాన ఆలయంలో మొదటి అంతస్తు వరకూ మాత్రమే నిర్మాణం పూర్తయ్యిందని, రెండో అంతస్తు పనులు జరుగుతున్నాయని, అనంతరం శిఖరం, మధ్య గోపురం పనులు జరగాల్సి ఉందని గిరీజీ వివరించారు. రాముని కుటుంబానికి చెందిన ఐదు ప్రధాన ఆలయాల పనులు కొనసాగుతున్నాయని, రాముడు స్వయంగా విష్ణువు అవతారం అయినందున గణపతి, శివుడు, సూర్య దేవుడు, జగదంబ ఆలయాలు కూడా నిర్మితం కానున్నాయని తెలిపారు. ప్రధాన ఆలయానికి నలు మూలల్లో ఈ ఆలయాలు ఉండనున్నాయి. హనుమంతునికి ప్రత్యేక ఆలయం కూడా నిర్మితం కానుంది. ఇప్పటికే ఈ ఆలయాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సీతా రసోయి సమీపంలో అన్నపూర్ణ దేవి ఆలయం నిర్మితం కానుంది. ఆలయ సముదాయం వెలుపల వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, శబరి, జటాయువు తదితర ఆలయాలు నిర్మించనున్నారు. -
ముంబైలో రామ భక్తులపై దాడులు.. నిందితులపై బుల్డోజర్ యాక్షన్
ముంబై: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని మహారాష్ట్రలో తీసిన ర్యాలీలో రాముడి భక్తులపై ఓ వర్గం వారు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబై శివార్లలోని మీరా రోడ్లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. తాజాగా ఆ ప్రాంతంలో(మీరా రోడ్డు) మహారాష్ట్ర సర్కార్ బుల్డోజర్ చర్యకు దిగింది. అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో.. రాముని ఊరేగింపుపై రాళ్లు రువ్విన వారి నివాసాలను బుల్డోజర్లతో కూల్చివేసింది. మీరా రోడ్డులో అక్రమంగా నిర్మించిన కట్టడాలను బుల్డోజర్తో కూలగొట్టింది. దాదాపు 15 అక్రమ బిల్డింగ్లను నేలమట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. కూల్చివేత సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. కాగా అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున ర్యాలీలు చేపట్టారు. అన్ని ప్రాంతాల్లో భక్తి పాటలు, కోలాటాలతో వేడుకగా శ్రీరాముడి ఊరేగింపు నిర్వహించారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మహారాష్ట్రలో చేపట్టిన ర్యాలీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ముంబై శివార్లలోన మీరా రోడ్డులో కార్లు, బైక్లపై కాషాయ జెండాతో ఆదివారం రాముడి శోభా యాత్ర నిర్వహించారు. చదవండి: Ayodhya: బాలక్ రామ్ కోసం.. రెండో రోజూ అవే దృశ్యాలు ఈ ర్యాలీలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మధ్య వాగ్వాదం పెరిగింది. దీంతో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్రలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ క్రమంలోనే బీజేపీ సర్కార్ నిందితుల స్థలాల వద్ద బుల్డోజర్ యాక్షన్ చేపట్టింది. కాగా బుల్డోజర్ యాక్షన్ అనేది ముందుగా ఉత్తర ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రారంభించింది. గొడవలు, కొట్లాటలు, అల్లర్లు వంటి వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లు, స్థలాలను బుల్డోజర్తో కూల్చివేస్తూ వస్తుంది. తరువాత ఇదే పద్దతిని బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అనుసరిస్తన్నాయి. తాజాగా రాజస్థాన్కు బుల్డోజర్ యాక్షన్ వ్యాపించింది. -
Ayodhya: బాలక్ రామ్ కోసం.. రెండో రోజూ అవే దృశ్యాలు
అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట అనంతరం రెండో రోజు.. నేడు (బుధవారం) బాలక్ రామ్ దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు అంటే (నిన్న) మంగళవారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు ఆలయాన్ని ఉదయం ఏడు గంటలకు తెరవనుండగా, తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులు బారులు తీరారు. ప్రాణ ప్రతిష్ట జరిగిన మర్నాడు అంటే మంగళవారం ఐదు లక్షల మంది భక్తులు బాలరాముని దర్శనం చేసుకున్నారు. రాత్రి 9 గంటల వరకు భక్తులు శ్రీరాముని దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించారు. భద్రతా ఏర్పాట్లు సజావుగా సాగేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా మంగళవారం సాయంత్రం అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్యకు తరలివస్తున్న భక్తులు బాలరాముని దర్శనం కోసం ఓపిక పట్టాలని సీఎం కోరారు. #WATCH | Ayodhya, Uttar Pradesh: On the second day after the Pran Pratishtha, devotees gather in huge numbers at Rampath to have darshan of Shri Ram Lalla pic.twitter.com/JMI3AvYPca — ANI (@ANI) January 24, 2024 ఇకపై రామాలయంలో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిరంతర దర్శనం ఉంటుందని జిల్లా యంత్రాంగం, శ్రీరామజన్మభూమి ట్రస్టు తెలిపింది. అయితే హారతి, భోగం కోసం సమయంలో దర్శనాన్ని కొద్దిసేపు నిలిపివేస్తున్నట్లు ట్రస్టు పేర్కొంది. ప్రాణ ప్రతిష్ట అనంతరం సామాన్య భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించగా, తొలిరోజైన మంగళవారం నాడు ఐడు లక్షల మందికిపైగా భక్తులు తమ బాలరాముని దర్శించుకున్నారు. నేడు (బుధవారం) ఉదయం ఇప్పటికే 20 వేల మందికి పైగా భక్తులు దర్శనం కోసం క్యూలో ఉన్నారు. నేటి ఉదయం ప్రవేశ ద్వారం వెలుపల కిలోమీటరుకు పైగా భక్తుల క్యూలు కనిపించాయి. ఈ నేపధ్యంలో పోలీసులు, ఆలయ నిర్వాహకులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. -
తొలుత ఎంపిక చేసిన విగ్రహం ఇదే..
పుణ్యక్షేత్రమైన అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమయ్యింది. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. రామ మందిరంలో కొలువైన బాలరాముడు భక్తులను మైమరపిస్తున్నాడు. రామ్లల్లా విగ్రహంలోని కళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గర్భాలయంలో ప్రతిష్ఠంచేందుకు విగ్రహాల తయారీని తొలుత ముగ్గురు శిల్పకారులకు అప్పగించారు. తరువాత ఆలయంలో ప్రతిష్ఠాపనకు రెండు విగ్రహాలను ఎంపిక చేశారు. అయితే చివరకు మైసూర్కు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ నివాసి సత్యనారాయణ పాండే శిల్ప కళాకారునిగా ఎంతో పేరొందారు. తరతరాలుగా వారి కుటుంబం విగ్రహాలను తయారు చేస్తోంది. సత్యనారాయణ పాండే రామ్లల్లా విగ్రహాన్ని తెల్లని మక్రానా పాలరాయితో తీర్చిదిద్దారు. తొలుత ఈ విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని ట్రస్ట్ భావించిందట. ఈ విగ్రహం ప్రస్తుతం ట్రస్ట్ ఆధీనంలో ఉంది. దీనిని ఎక్కడ? ఎప్పుడు ప్రతిష్ఠించేదీ ట్రస్ట్ త్వరలో వెల్లడించనుంది. జనవరి 22న అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. అనంతరం రామమందిరం తలుపులు సామాన్య భక్తుల కోసం తెరిచారు. ఈ నేపధ్యంలో శ్రీరాముని దర్శనం కోసం దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. -
ఆ దివ్య దరహాసం వెనుక..
రెండు రోజులుగా దేశమంతా ఎటు చూసినా బాలరాముడే. ఎక్కడ విన్నా అతన్ని గురించిన చర్చే. సోషల్ మీడియాలోనూ అయోధ్యలో కొలువుదీరిన రామ్ లల్లా ముచ్చట్లే. అతని ఫొటోలే. అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నది బాలరాముని మందస్మిత వదనం. సమ్మోనమైన ఆ నవ్వుకు సెలబ్రిటీలు మొదలుకుని సామాన్యుల దాకా అందరూ ముగ్ధులవుతున్నారు. అమితమైన కరుణతోపాటు అంతులేని దివ్యత్వాన్ని వర్షిస్తున్న ఆ కళ్లు నిజంగా అద్భుతమంటూ కొనియాడుతున్నారు. అదే సమయంలో బాలలకు సహజమైన అమాయకత్వంతో చూస్తున్న ఆ నయనాల సొగసు వర్ణనాతీతమని ముక్త కంఠంతో చెప్తున్నారందరూ. బాలరాముని కళ్లను అంత అందంగా తీర్చిదిద్దినందుకు మైసూరుకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ ప్రతిభను ఎంత పొడిగినా తక్కువేనంటున్నారు. విగ్రహ రూపకల్పనకు, ముఖ్యంగా కళ్లను అంతలా తీర్చిదిద్దేందుకు ఆయన అక్షరాలా తపస్సే చేశారు. చిన్నపిల్లల ముఖ కవళికలను దగ్గరగా ఒడిసిపట్టేందుకు ఎన్నోసార్లు స్కూళ్లకు వెళ్లారు. శిల్ప శాస్త్రాన్ని ఆమూలాగ్రం పదేపదే అధ్యయనం చేశారు. అరుణ్ దీక్ష, శ్రమ, పట్టుదలకు రాముని కరుణ తోడైందని భార్య విజేత చెబుతున్నారు. విగ్రహ రూపకల్పనకు అనువైన కృష్ణ శిలను ఎంచుకోవడం వంటివాటి వెనక దాగున్న సాంకేతికత మొదలుకుని దాన్ని అత్యంత అందంగా చెక్కేదాకా ప్రతి దశలోనూ అరుణ్ ఎదుర్కొన్న సవాళ్లు తదితరాలను ఆమె మీడియాతో వివరంగా పంచుకున్నారు. శాస్త్ర ప్రమాణాల మేరకు... విగ్రహ తయారీలో అరుణ్ పూర్తిగా శిల్ప శాస్త్ర ప్రమాణాలను అనుసరించారు. ఆ మేరకే బాలరాముని ముఖారవిందపు స్వరూప స్వభావాలను ఖరారు చేశారు. ముఖ్యంగా కళ్లు, ముక్కు, చుబుకం, పెదాలు, చెంపల నిష్పత్తి తదితరాలను శాస్త్రంలో నిర్దేశించిన మేరకు నిర్ణయించారు. ‘‘అరుణ్ చేతిలో నిజంగా అద్భుతమైన కళ దాగుంది. విగ్రహం ఎలా ఉండాలో రామ జన్మభూమి ట్రస్టు ప్రతినిధులు క్లుప్తంగా చెప్పారు. నవ్వుతున్న ముఖం, దివ్యత్వం, ఐదేళ్ల స్వరూపం, రాకుమారుని రాజసం... ఇవీ అరుణ్తో పాటు మరో ఇద్దరు శిల్పులు జీఎల్భట్, సత్యనారాయణ పాండేకు వాళ్లు నిర్దేశించిన ప్రాతిపదికలు. అవి మినహా మిగతాదంతా అరుణ్ ఊహ, భావుకతల ఫలమే. ఇందుకోసం చిన్నపిల్లల స్కూళ్లకు వెళ్లి గంటల కొద్దీ గడిపాడు. వాళ్ల ముఖ కవళికలు, అవి పలికించే భావాలను లోతుగా పరిశీలించాడు. వాటిని పేపర్పై ఎప్పటికప్పుడు స్కెచ్లుగా గీసుకున్నాడు. అవయవాల పొందిక నిమిత్తం శరీర నిర్మాణ శాస్త్ర పుస్తకాలు తిరగేశాడు. అందుకే విగ్రహం అంత వాస్తవికంగానూ, అదే సమయంలో ఎంతో ముగ్ధమనోహరంగానూ రూపుదిద్దుకుంది’’ అని విజేత వివరించారు. ‘‘అరుణ్ నిజంగా అత్యంత అదృష్టశాలి. మా ఆయనతో రాముడే ఇంతటి మహత్కార్యం చేయించుకున్నాడు’’ అంటూ మురిసిపోయారు. గుండ్రని ముఖమండలం... ఉత్తరాది సంప్రదాయంలో రూపొందే శిల్పాల ముఖం, ముఖ లక్షణాలు కాస్త కొనదేరి ఉంటాయి. అయోధ్య బాలరాముని ముఖమండలం గుండ్రని రూపుతో కనువిందు చేస్తోంది. ఇది దక్షిణాదిలో శిల్పాల రూపకల్పనలో ఎక్కువగా కని్పస్తుందని ఢిల్లీలోని ప్రముఖ చరిత్రకారుడు, రచయిత విక్రం సంపత్ అన్నారు. ‘‘కానీ కాస్త చక్కని చుబుకం, ఉబ్బెత్తు చెంపలు, బుల్లి పెదాలు, వాటిపైనే గాక ముఖమంతటా పరుచుకున్న మార్మిక మందహాసం... ఇలాంటి దివ్య లక్షణాలన్నీ బాలరాముని ముఖంలో ప్రస్ఫుటమవుతున్న తీరు మాత్రం నిజంగా అద్భుతమేనని చెప్పారాయన. ఈ విషయంలో శిల్పిగా అరుణ్ పనితనాన్ని ఎంత పొగిడినా తక్కువేనన్నారు. 51 అంగుళాల వెనక... రామ్ లల్లా విగ్రహం ఎత్తును 51 అంగుళాలుగా నిర్ణయించడం వెనక కూడా శాస్త్రీయ కారణాలున్నట్టు విజేత చెప్పారు. ‘‘ఏటా రామనవమి రోజున సూర్య కిరణాలు సరిగ్గా బాలరాముని నుదిటిపై పడాలన్నది ట్రస్టు నిర్ణయం. ఆలయ నిర్మాణం తదితరాల దృష్ట్యా విగ్రహం సరిగ్గా 51 అంగుళాల ఎత్తుంటేనే అది సాధ్యం’’ అన్నారు. అవసరమైన మేరకు పలు విషయాల్లో పలురకాల సాఫ్ట్వేర్ల సాయమూ తీసుకున్నా అంతిమంగా కేవలం సుత్తి, ఉలి ఉపయోగించి విగ్రహాన్ని ఆసాంతం అరుణ్ తన చేతులతోనే చెక్కారని వివరించారు. కృష్ణ శిలే ఎందుకు? విగ్రహ రూపకల్పనకు కృష్ణ శిలనే ఎంచుకోవడం వెనక శాస్త్రీయ కారణాలున్నాయి. ఆమ్లాలతో ఈ శిల ప్రతి చర్య జరపదు. వేడి, తీవ్ర వాతావరణ చర్యలకు కూడా స్పందించదు. ‘‘కనుక పాలు తదితరాలతో అభిషేకం చేసినప్పుడు వాటితో చర్య జరపదు. దాంతో రెండు లాభాలు. వాటిని ప్రసాదంగా తీసుకున్నా ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావమూ ఉండదు. ఈ లక్షణం వల్ల విగ్రహం కనీసం వెయ్యేళ్ల దాకా చెక్కుచెదరదు. దానిపై కనీసం గీత కూడా పడదు’’ అని విజేత వివరించారు. అత్యున్నత నాణ్యతతో కూడిన కృష్ణ శిలలు కొన్నిచోట్ల మాత్రమే దొరుకుతాయి. బాలరామున్ని రూపొందించేందుకు వాడిన కృష్ణ శిల ఆ కోవలోదేనని విజేత చెప్పారు. ఇది మైసూరు సమీపంలోని హెచ్డీ కోటె దగ్గర లభ్యమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అయోధ్య రామ 'ప్రతిష్ట'
అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభం, శ్రీరాముని విగ్రహ ప్రతిష్టతో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ట దేశ వ్యాప్తంగా ద్విగుణీకృతమైంది. వందల ఏళ్ళ నిరీక్షణకు నేటితో తెరపడింది. సనాతన సంప్రదాయవాదులంతా జై మోదీ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది రామభక్తులు చేసిన జైశ్రీరామ్ నినాదం దుందుభి వలె దిక్కులు పిక్కటిల్లేలా మార్మోగింది. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న తరుణంలో, బీజేపీ మళ్ళీ విజయదుందుభి మోగిస్తుందనే విశ్వాసం రెట్టింపు శబ్దం చేస్తోంది. అయోధ్యలో బాలరాముని పునఃప్రతిష్ఠతో చరిత్ర పుటల్లో నరేంద్రమోదీ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్నారు. బీజేపీ కురువృద్ధులైన వాజ్పెయి, అద్వాణీకి కూడా దక్కని ఖ్యాతి మోదీకి దక్కింది. ఐదు వందల ఏళ్ళ ఆధునిక భారతంలో ఏ పాలకుడికి దక్కని కీర్తి మోదీకే దక్కింది. ఈ ఆలయ స్థాపన కోసమే నరేంద్రమోదీని విధి ఎంచుకుందని అద్వాణీ అన్న మాటలు అక్షరసత్యాలు. న్యాయ స్థానాల తీర్పుతో చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఈ మహాక్రతువు సంపూర్ణమైంది. నరేంద్రమోదీ ఈ విధంగా చరిత్రలో గొప్పగా మిగిలిపోనున్నారు. అశేష ప్రశంసలతో పాటు విమర్శలు, వాదనలు వెల్లువెత్తాయి, ఎత్తుతూనే వున్నాయి. ప్రతిపక్షనేతలు, కొందరు పీఠాధిపతులు ఏ రీతిన, ఏ తీరున, ఏ స్థాయిలో వాగ్బాణాలు సంధించినా, బీజేపీ ప్రభుత్వం చెక్కు చెదరలేదు. తను సంకల్పించుకున్న యజ్ఞాన్ని సుసంపన్నం చేసుకుంది. పరమ భక్తి ప్రపత్తులతో నరేంద్రమోదీ నడుచుకున్న వైనం అందరినీ అబ్బురపరిచింది. విగ్రహ ప్రాణప్రతిష్ఠ తర్వాత జాతిని ఉద్దేశించి మోదీ చేసిన ప్రసంగం కూడా ఎంతో ఆకట్టుకుంది. 11రోజులు పాటు ఉపవాస దీక్ష చేసి, విగ్రహ ప్రతిష్ట చేసి, ఉద్వేగభరితమైన ప్రసంగం చేసి కోట్లాదిమందిని ఆయన ఆకట్టుకున్నారు. దేశభాషలలోని అన్ని ప్రసిద్ధ రామాయణాలను కూడా అంతే శ్రద్ధతో విని రామాయణ జ్ఞానాన్ని కూడా పరిపుష్టం చేసుకున్నారు. ఆ జ్ఞాన సంస్కార ఫలంతో శబరి, గుహుడు, ఉడుత నుంచి జటాయువు వరకూ ఆయా పాత్రల నుంచి ఎటువంటి స్ఫూర్తిని పొందాలో జాతికి మోదీ సవివరంగా చాటిచెప్పారు. దేశంలోని ప్రముఖులంతా అయోధ్యలో బారులుతీరారు. కోట్లాదిమంది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అయోధ్యలో ఇక కాల్పులు, కర్ఫ్యూలు ఉండవని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటన చేశారు. అంతకంటే కావాల్సింది ఇంకేముంది? మతకల్లోలాలు లేకుండా శాంతి స్థాపన జరిగితే ఎల్లరకూ సంతోషమే. భిన్న మతాలకు, సంస్కృతులకు ఆలవాలమైన భారతదేశంలో సర్వమత సోదరత్వం సౌందర్య శోభితం. సహనం సదా శక్తిమంతం. మెజారిటీ ప్రజలు హిందువులే అయినప్పటికీ, అందరి ఆలనాపాలనా పాలకుల ప్రథమ కర్తవ్యం. రాజకీయ ప్రయోజనాలు, ఓటుబ్యాంక్ రాజకీయాలు ఉండవచ్చు గాక. దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలి. అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట చిరకాల స్వప్నమే. న్యాయ, రాజకీయ పోరాటలన్నింటినీ అధిగమించి.. రామునికి శాశ్వత మందిరం నిర్మించిన ఘనత నరేంద్రమోదీ సారథ్యంలోనే బీజేపీకే నూటికి నూరు శాతం దక్కుతుంది. దక్కింది కూడా. ఎప్పుడో ఐదు వందల ఏళ్ళ క్రితం 1528 ప్రాంతంలో మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ వద్ద జనరల్ హోదాలో వున్న మీర్ బాఖి అయోధ్యలో మసీదు నిర్మించారు. శ్రీరాముడి జన్మస్థలానికి గుర్తుగా అప్పటికే అక్కడ వెలసి వున్న ఆలయంపై మసీదు నిర్మించారన్నది వాదన. ఇలా మొదలైన ఈ వివాదం రకరకాల రూపు తీసుకుంది. ఇప్పటికి ఆలయం మళ్ళీ వెలసింది. ఈ మొత్తం ఎపిసోడ్లో బీజేపీ అగ్రనేత అద్వాణీ చేపట్టిన రధయాత్రను తలచుకొని తీరాలి. 1990లో చేపట్టిన ఈ యాత్ర ప్రభావం ఈరోజు ఈ ఫలితానికి పునాదియై నిలవడమే కాక, నేటి బీజేపీ ప్రాభవానికి, మోదీ వైభవానికి మూలమై నిలిచింది. చలి ఎక్కువగా ఉందనే కారణంతో అయోధ్య ఉత్సవానికి అద్వాణీ రాలేదు. నిజానికి! గర్భగుడిలో ఈరోజు ప్రవేశం పొందిన ఐదుగురుతో పాటు అద్వాణీ కూడా ఉండవలసింది. కారణాలు ఏవైనా ఆయనకు ఆ ప్రతిష్ట దక్కలేదు. బహుశా! అందుకే ఆయన రాలేదేమో! చట్టపరమైన గండాలన్నింటినీ దాటుకొని, 2020 ఆగస్టు 5 వ తేదీన ఆలయ నిర్మాణానికి శ్రీకారం జరిగి, నేటికి ప్రాణప్రతిష్ఠ పూర్తిచేసుకొని, కోట్లాదిమంది భక్తుల సందర్శనానికి సిద్ధమైంది. వందల సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా వుండేలా నిర్మాణం పూర్తి చేసుకుంది. నేటి నుంచి అయోధ్య గొప్ప పర్యాటక ప్రాంతంగా వెలుగనుంది. రామవిగ్రహ స్థాపన జరిగింది. ఆ శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకొని, సర్వజనహితంగా ధర్మపాలన సాగిస్తే, అదే నిజమైన రామరాజ్యం. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
అయోధ్య రామయ్యకి విలువైన కిరీటం, దాత ఎవరంటే..
వందల ఏళ్ల నీరిక్షణ సాకారమైంది. కోట్లాది మంది భక్తుల కలను నిజం చేస్తూ ఆయోధ్యలో అద్భుతం ఆవిష్కృతమైంది. భవ్య రామమందిరంలో దివ్య రాముడు కొలువుదీరాడు. జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఒక్క అయోధ్యలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ప్రజలు ఈ వేడుకను వైభవంగా జరుపుకున్నారు. జై శ్రీరామ్ అంటూ భక్తి పారవశ్యంలో మునిగితేలారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఎంతోమంది భక్తులు విరాళాలు అందించారు. .దేశ విదేశాలకు చెందిన రామభక్తులు కానుకలు, విరాళాలు సమర్పించారు. రోజూ కూలి పని చేసుకునే వారి నుంచి బడా వ్యాపారుల వరకు తమకు తోచినంతా సాయం చేసి రామలయ నిర్మాణంలో భాగమయ్యారు. ఈ క్రమంలో గుజరాత్లోని సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి ముకేష్ పటేల్రాముడికి భారీ విరాళం అందించారు. ‘ల్యాబ్ డైమండ్ కంపెనీ’ యజమాని అయిన ముకేష్ పటేల్, ఆయన కుటుంబం రాముడికి రూ. 11 కోట్ల విలువైన కిరీటం చేయించారు. కిరీటాన్ని నాలుగు కిలోల బంగారం. వజ్రాలు, జెమ్స్టోన్స్, కెంపులు, ముత్యాలు, నీలమణితో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ మేరకు ముకేష్ తన తండ్రితో కలిసి అయోధ్యను సందర్శించి ప్రాణప్రతిష్ట సందర్భంగా ఈ కిరీటాన్ని ఆలయ ట్రస్ట్ అధికారులకు అందజేశారు. చదవండి: Ayodhya: అయోధ్యకు తొలిరోజు పోటెత్తిన భక్తులు అయోధ్య రామ మందిరానికి ఏకంగా 101 కేజీల బంగారాన్ని అందించినట్టు సమాచారం. ఈ బంగారంతో రామాలయం తలుపులు, గర్భ గుడి, త్రిశూలం మొదలైనవి చేయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత బంగారం ధర ప్రకారం 101 కేజీల బంగారం అంటే రూ.68 కోట్లను దిలీప్ కుటుంబం విరాళంగా ఇచ్చినట్టు భావించాలి. ఇప్పటివరకు రామ మందిర ట్రస్ట్కు వచ్చిన భారీ విరాళాల్లో ఇదే అగ్రస్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా చేపట్టిన విరాళాల సేకరణలో 20 లక్షల మంది కార్యకర్తలు 12.7 కోట్ల కుటుంబాల నుంచి రూ.2100 కోట్లు సేకరించారు. వీరిలో సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ లాఖి, ఆయన కుటుంబం రాముల వారికి భూరి విరాళం ఇచ్చినట్టు సమాచారం. దిలీప్ కుటుంబం అయోధ్య రామ మందిరానికి ఏకంగా 101 కేజీల బంగారాన్ని అందించినట్టు తెలుస్తోంది..ప్రస్తుత బంగారం ధర ప్రకారంరూ.68 కోట్లను దిలీప్ కుటుంబం విరాళంగా ఇచ్చినట్టు భావిస్తున్నారు. ఈ బంగారాన్ని రామాలయ తలుపులు, గర్భగుడి, త్రిశూలం, డమరు, పిల్లర్లకు కేటాయించారు. ఇప్పటివరకు రామ మందిర ట్రస్ట్కు వచ్చిన భారీ విరాళాల్లో ఇదే అధికమని తెలుస్తోంది. మరోవైపు నేటి నుంచి(జనవరి 23) సాధారణ భక్తులకు దర్శనం అనుమతించడంతో అయోధ్యకు భక్తులు పోటెత్తారు. చలిలోనూ ఉదయం మూడు గంటల నుంచి ఆలయం భయట భారీగా క్యూ కట్టి శ్రీరాముడిని దర్శించుకుంటున్నారు. భక్తులకు రెండు స్లాట్లు కల్పించారు. ఉదయం 7గం. నుంచి 11.30 వరకు.. అలాగే.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గం. వరకు రెండు దఫాలుగా భక్తులను అనుమతించనున్నారు. -
అయోధ్యలో పర్యటించిన విజయేంద్ర సరస్వతి స్వామి
కంచి కామకోటి మూలామ్నాయ సర్వజ్ఞ పీఠాధిపతి శంకరాచార్య విజయేంద్ర సరస్వతి స్వామి అయోధ్యలో పర్యటించి యాగశాలలో హోమాలను, రామ మందిరంలో ప్రాణ ప్రతిస్టకు సంబంధించిన క్రతువులను పర్యవేక్షించి ఆశీర్వదించారు. అయోధ్య చేరుకున్న స్వామీజీ నేరుగా శ్రీరాముని కులదేవత అయిన దేవకాళి మందిరాన్ని సందర్శించి పూజలు నిర్వహించి, అనంతరం శంకర మఠాన్ని చేరుకున్నారు. అక్కడ ఆయనకు భయ్యా జోషి ఆహ్వానం పలికారు. అక్కడ రామ షడాక్షరి హోమాలు జరిగిన రామ సన్నిధిలో ఆయన కలశాభిషేకాన్ని నిర్వహించారు. శంకర మఠంలో రామసన్నిధిని శ్రీ జయేంద్ర సరస్వతీ మహాస్వామి ప్రతిష్ఠించారు. అనంతరం విజయేంద్ర సరస్వతీ స్వామి అయోధ్య శంకర మఠం వెబ్సైట్ www.kanchimuttayodhya.in ప్రారంభించారు. రామజన్మ భూమికి వెళ్ళిన స్వామివారికి రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి శ్రీ గోవింద్ దేవ్ జీ మహారాజ్, శ్రీ జ్ఞానేశ్వర్ ద్రావిడ్, శ్రీ లక్ష్మీకాంత్ దీక్షిత్, ఇతర వైదిక పండితులతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. యజ్ఞశాలలో కలయదిరిగిన స్వామి అన్ని కలశాలకు పూలను సమర్పించారు. తర్వాత ప్రధాన కలశానికి మంత్రోచ్ఛారణలతో పూలను సమర్పించి హారతి ఇచ్చారు. శ్రీరాముడిపై ప్రత్యేక మంత్రాలను పూజ్యశ్రీ స్వామివారు ఉచ్ఛరించి కలశపూజ పూర్తి చేశారు. అనంతరం మందిరానికి బయలుదేరిన స్వామివారు ఈ సందర్భంగా శ్రీ జ్ఞానేశ్వర్ శాస్త్రి ద్రావిడ్, శ్రీ లక్ష్మీకాంత్ దీక్షిత్ లు, జరుగనున్న ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక క్రతువులు, పూజా విధి విధానాల గురించి వివరించారు. మందిరంలోకి ప్రవేశించే మొదటి మెట్టుకు కొబ్బరికాయను కొట్టి, అనంతరం గణేశుని చెక్కిన మొదటి రెండు స్తంభాలకు కొబ్బరికాయలను సమర్పించారు. అనంతరం పూజ్య శ్రీ స్వామివారు మహామంటపం, అర్ధ మంటపం సందర్శించి, తర్వాత గర్భగృహానికి వెళ్లారు. అక్కడ ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్ జీ మహారాజ్, కార్యదర్శి చంపత్రాయ్ ఆయనకు ఆహ్వానం పలికారు. నేత్రోన్మీలనం : గర్భగుడిలో నేత్రోన్మీలనం క్రతువును ప్రారంభించి, విగ్రహానికి న్యాసంతో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీరాముడికి ప్రత్యేక ఆభరణాలను సమర్పించారు. స్వామివారికి అర్థమంటపంలో వైదిక మంత్రోచ్ఛారణల నడుమ శాలువను బహుకరించారు. స్వామివారు తిరిగి యజ్ఞశాలకు వెళ్ళారు. ఈ సందర్భంగా దేశానికి సురక్ష, సుభిక్ష, ప్రజలకు సువిద్య కలగాలని ఆశీర్వదించారు. -
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంపై బీఆర్ఎస్ రియాక్షన్
-
రాముడి ప్రాణప్రతిష్ఠ రోజే పిల్లలకు పేర్లు పెట్టుకున్న స్టార్ హీరో.. ఎందుకంటే?
యాక్షన్ ప్రిన్స్, శాండల్వుడ్ నటుడు ధ్రువ సర్జా, ప్రేరణ దంపతులు తమ పిల్లలకు పేర్లు పెట్టారు. తెలుగు వారికి సుపరిచయం అయిన అర్జున్కు ధ్రువ సర్జా మేనళ్లుడు అవుతాడనే విషయం తెలిసిందే. తాజాగా కుటుంబ సభ్యుల సమావేశంలో పిల్లలకు నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్, అర్జున్ సర్జా పాల్గొన్నారు. ఆంజనేయుడికి గొప్ప భక్తుడైన ధ్రువ సర్జా.. తన పిల్లలకు ఏం పేరు పెట్టాలనే ఆసక్తి నెలకొంది. అయితే ఈ క్యూరియాసిటీకి తెర పడింది. దీంతో పాటు తొలిసారిగా ఆయన కుమారుడి ఫోటో కూడా రివీల్ అయింది. అయోధ్యలో, రాముడిని ప్రతిష్టాపన చేసిన రోజున తన పిల్లలకు పేర్లు పెట్టారు. తన కూతురికి రుద్రాక్షి, కుమారుడికి హయగ్రీవ అని నామకరణం చేశారు. వాయుపుత్ర హనుమంతుడు మహిరావణుడిని సంహరించడానికి పంచముఖి ఆంజనేయస్వామిగా అవతరించాడు. పంచముఖి అంటే ఐదు ముఖాలు. ఇందులో హనుమంతుని ముఖంతో సహా నరసింహ, వరాహ, హయగ్రీవ, గరుడతో సహా ఐదు ముఖాలు ఉన్నాయి. అందులో నుంచి హయగ్రీవ అనే పేరును తన కుమారుడికి పెట్టుకున్నాడు ధ్రువ సర్జా.. ధృవ దంపతులకు 2022 ప్రారంభంలో కుమార్తె జన్మించగా.. 2023 సెప్టెంబర్లో ఆయనకు మగబిడ్డ పుట్టాడు. అయోధ్యలో రాముడిని ప్రతిష్టాపన చేసిన రోజున రోజున తన పిల్లలకు పేర్లు పెట్టాలని ఆయన ఇన్నిరోజులు వేచి చూశాడు. హనుమంతుడిని రాముడికి సేవకుడిగా పిలుస్తారు.. అలాంటి ఆంజనేయుడికి పరమ భక్తుడు ధ్రువ సర్జా.. అందుకే రామమందిరంలో జరిగే ప్రత్యేక కార్యక్రమం రోజున పిల్లలకు పేర్లు పెట్టారు. దీనిపై మాట్లాడిన ధృవ సర్జా.. అయోధ్యలో 12.20కి పూజలు జరిగాయి. మేము అదే సమయంలో మా పిల్లలకు పేర్లు పెట్టాము. సంజయ్ దత్ కూడా శివ భక్తుడు. తన కూతురికి రుద్రాక్షి అని పేరు పెట్టడంతో ఆయన సంతోషించాడు. రుద్రాక్ష అంటే ఆ శివుడికి చాలా ఇష్టమైనది అని తెలిసిందే.. త్వరలో కుటుంబ సమేతంగా అయోధ్యకు వెళతామని ఆయన చెప్పాడు. -
అయోధ్యకు జూ ఎన్టీఆర్, ప్రభాస్ వెళ్లకపోవడానికి కారణం ఇదేనా?
వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ క్రతువు వైభవోపేతంగా ప్రారంభమైంది. ఈ వేడుకను చూసేందుకు భారత్లోని అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖలు ఆయోధ్యకు చేరుకున్నారు. అక్కడ వారందరూ సందడిగా కనిపించారు. రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ధనుష్, అమితాబ్ బచ్చన్ ఇలా ఎందరో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయోధ్య నుంచి ఆహ్వానం అందినా కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరు నటీనటులు వెళ్లలేకపోయారు. జూ. ఎన్టీఆర్కు కూడా అయోధ్య నుంచి ఆహ్వానం అందింది కానీ ఆయన వెళ్లలేకపోయాడు. దీనికి ప్రధాన కారణం దేవర షూటింగ్ అని ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతుంది. దేవర సినిమా విషయంలో మేజర్ షెడ్యూల్ను ముందుగానే చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిందట.. అందుకోసం సైఫ్ అలీఖాన్తో ముఖ్యమైన భారీ యాక్షన్ సీన్ను ప్లాన్ చేశారట. కొన్ని వందల మంది ఈ సినిమా షూటింగ్లో రోజూ పాల్గొంటున్నారట. తారక్ పాల్గొనే సీన్ కోసం భారీ సెట్ కూడా నిర్మించారట.. తన వల్ల షూటింగ్ ఆగిపోతే నిర్మాతకు ఇబ్బంది కలుగుతుందని ఆయన భావించారట. దీంతో ఆయోధ్యకు ఆయన వెళ్లలేక పోయారని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో అనుకోకుండా సైఫ్ అలీఖాన్ గాయం కారణంగా ఆస్పత్రిలో చేరడం. ఈ సమాచారం కూడా దేవర యూనిట్కు ఆలస్యంగా తెలువడంతో చివరి నిమిషంలో తారక్ అయోధ్య ట్రిప్ రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి చిత్ర యూనిట్తో పాటు తారక్ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ కారణంతో వెళ్లలేకపోయిన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా అయోధ్యకు వెళ్లలేకపోయారు. మారుతి సినిమా రాజాసాబ్ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తున్న కల్కి సినిమా షూటింగ్ పనిలో ప్రభాస్ బిజీగా ఉన్నారట. కల్కి సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్స్ను చిత్రికరించే పనిలో నాగ్ అశ్విన్ ఉన్నారట. ఈ విషయంపై కూడా ప్రభాస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రీసెంట్గా కృష్ణంరాజు జయంతి కార్యక్రమం జరిగింది. అందులో కూడా ప్రభాస్ కనిపించలేదు. #NTR was one of the first Tollywood stars to get invited, but everything got messed up with a last-minute change yesterday. Initially, it was mentioned that he had a crucial shooting scene for #Devera with #SaifAliKhan, and he didn't want to inconvenience the producer.… pic.twitter.com/kXj8CtV8DP — Haaph Boil (@haaphboil) January 22, 2024 -
ప్రాణ ప్రతిష్ఠ వేళ.. సీతారాముల జననం!
అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ రోజున నెలలు నిండిన పలువురు గర్భిణులు శిశువులకు జన్మనిచ్చేందుకు ప్లాన్ చేసుకుని, వైద్యుల సాయంతో డెలివరీలు చేయించుకున్నారు. ఈ సమయంలో పుట్టిన చిన్నారులకు అబ్బాయి అయితే రాముడు అని, అమ్మాయి అయితే సీత అని పేరు పెట్టారు. ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్లోని జిల్లా మహిళా ఆసుపత్రిలో సోమవారం 13 మంది శిశువులు జన్మించారు. వీరిలో ఎనిమిది మంది నార్మల్ కాన్పులో జన్మించగా, ఐదుగురు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా జన్మించారు. జనవరి 22న తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జిల్లా మహిళా ఆస్పత్రిలో మొదటి శిశువు జన్మించింది. బర్కచ్చా ఖుర్ద్లో నివాసం ఉంటున్న లక్ష్మణ్ భార్య అంజలి బాలికకు జన్మనిచ్చింది. తన కుమార్తెకు సీత లేదా జానకి అని పేరు పెడతానని ఆమె తెలిపింది. 22న తెల్లవారుజామున 3.20 గంటలకు, లాల్గంజ్లోని బర్దిహా నివాసి అమిత్ మిశ్రా భార్య ప్రీతి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి రామ్ లేదా రాఘవ్ అనే పేరు పెట్టాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు శుక్లహా నివాసి బాబుల్ సోంకర్ భార్య పుతుల్ బాలునికి జన్మనిచ్చింది. ఆటోడ్రైవర్ బాబుల్ తనకు అప్పటికే ఓ కొడుకు ఉన్నాడని, ఇప్పుడు జన్మించిన కుమారునికి రామ్ అని పేరు పెట్టనున్నామన్నారు. మిర్జాపూర్కు చెందిన ప్రీతి తెల్లవారుజామున 4.24 గంటలకు, మంజు 11.45 గంటలకు ఆడ శిశువులకు జన్మనిచ్చారు. లాల్గంజ్ మార్కెట్కు చెందిన అన్షు మిశ్రా ఉదయం 11.55 గంటలకు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా మగ శిశువుకు జన్మనిచ్చింది. జిల్లా మహిళా ఆసుపత్రి ప్రసూతి విభాగం వైద్యురాలు జూహీ దేశ్ పాండే మాట్లాడుతూ 22న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఎనిమిది మంది మగ శిశువులు, ఐదుగురు ఆడ శిశువులు జన్మించారని తెలిపారు. ఇది కూడా చదవండి: సామాన్యులకు తెరుచుకున్న రామాలయం.. భక్తుల భారీ క్యూ! -
Ayodhya: అయోధ్యకు తొలిరోజు పోటెత్తిన భక్తులు
అయోధ్య రామాలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. దీంతో నేటి నుంచి సామాన్య భక్తులకు రాములవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం(మంగళవారం) మూడు గంటల నుంచే రామాలయ ప్రధాన ద్వారం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. నేటి నుంచి సామాన్య భక్తులు రాములవారి నూతన విగ్రహాన్ని దర్శించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే భక్తుల్ని నిర్వాహకులు అనుమతిస్తున్నారు. మరోవైపు ఆలయం బయట భారీగా భక్తుల రద్దీ కనిపిస్తోంది. దీంతో అవసరమైతే స్వామివారి దర్శన సమయాన్ని పొడిగించాలని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ యోచిస్తోంది. #WATCH | Ayodhya, Uttar Pradesh: Devotees gather in large numbers at Shri Ram temple on the first day after the Pran Pratishtha ceremony pic.twitter.com/EGo9yr9sXS — ANI (@ANI) January 23, 2024 కాగా రామ్ లల్లా దర్శనం కోసం రెండు స్లాట్లు కేటాయిస్తున్నట్లు నిన్ననే ట్రస్ట్ ప్రకటించింది. ఉదయం 7గం. నుంచి 11.30 వరకు.. అలాగే.. మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 7 గం. వరకు రెండు దఫాలుగా భక్తులను అనుమతిస్తామని ప్రకటించారు. నిత్యపూజలు-సేవలు ఇలా.. ఇక ప్రతీరోజూ మధ్యాహ్నం బాలరామునికి బోగ్ అందించనున్నారు. అలాగే ప్రతి గంటకు పాలు, పండ్లు అందిస్తారు. రామ్లల్లాకు సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం క్రీమ్, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు దుస్తులను ధరింపజేస్తారు. ప్రత్యేక రోజుల్లో రాములోరికి పసుపు రంగు దుస్తులు ధరింపజేస్తారు. రామ్లల్లాకు రోజుకు ఆరుసార్లు హారతి నిర్వహిస్తారు. దీనికి హాజరయ్యేందుకు భక్తులకు పాస్లు జారీ చేస్తారు. ఇప్పటి వరకు రామ్లల్లాకు రోజుకు రెండు హారతులు ఉండేవి. ఇకపై రోజుకు ఆరు హారతులు ఉంటాయని ఆచార్య మిథిలేష్ నందిని శరణ్ తెలిపారు. 👉: అయోధ్య రామ్ లల్లా దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం (ఫొటోలు) -
రామమందిరానికి రూ.1.30 కోట్ల విరాళం
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్లోని జీవీపీఆర్ ఇంజనీర్స్ సంస్థ అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ.1.30 కోట్లు విరాళంగా అందజేసింది. ఈ మొత్తాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రకు చెక్కుల రూపంలో రెండు విడతలుగా అందజేశారు. ఈ మేరకు జీవీపీఆర్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఫౌండర్ చైర్మన్ వీరారెడ్డికి అయోధ్య శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి రావలసిందిగా ప్రత్యేక ఆహ్వానం అందడంతో ఆ సంస్థ చైర్మన్ శివశంకర్రెడ్డి, తన కుటుంబంతో కలిసి ఆయన ఈ వేడుకలో సోమవారం పాల్గొన్నారు. శ్రీరాముడి పూజల్లో కూడా ఆయన పాలుపంచుకున్నారు. -
‘బీజేపీ స్త్రీ వ్యతిరేక పార్టీ.. సీతామాత గురించి మాట్లాడదు’
కోల్కతా: అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ట నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ స్త్రీ వ్యతిరేక పార్టీ మండిపడ్డారు. సోమవారం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. బీజేపీ పార్టీ ఎప్పుడు రాముడి గురించే మాట్లాడుతుందని.. సీత గురించి ఎక్కడా ప్రస్తావించదని తెలిపారు. దీంతో బీజేపీ పార్టీ ఓ స్త్రీ వ్యతిరేక పార్టీ అని అర్థం చేసుకోవచ్చని దుయ్యబట్టారు. అయోధ్య రామ మందిరంలోని రాముడి ప్రాణప్రతిష్ట జరిగిన రోజే మమతా బీజేపీపై మాటల దాడి చేశారు. ‘బీజేపీ వాళ్లు రాముడి గురించే మాట్లాడుతారు. సీతాదేవి గురించి ఎందుకు మాట్లాడరు? వనవాసం సమయంలో కూడా సీతాదేవి రాముడి వెంటే ఉంది. కానీ, బీజేపీ వాళ్లు సీతా దేవి గురించి ఏమాత్రం ప్రస్తావించరు. దీంతో వాళ్లు ఎంతటి స్త్రీ వ్యతిరేకులో తెలుసుకోవచ్చు. తాను దుర్గా మాతను పూజిస్తాను. ఇలాంటి వాళ్లు(బీజేపీ) భక్తి, మతం గురించి ఉపన్యాసాలు ఇవ్వటం సరికాదు’ అని మమతా బెనర్జీ మండిపడ్డారు. తాను ఎన్నికల కోసం మతాన్ని రాజకీయం చేయటాన్ని నమ్మనని తెలిపారు. మత రాజకీయలు ఎప్పుడు చేయనని అన్నారు. అలా చేయటానికి చాలా వ్యతిరేకినని చెప్పారు. రాముడిపై భక్తి, విశ్వాసం కలిగి ఉండటంపై తానను ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. కానీ, ప్రజల ఆహార అలవాట్లపై జోక్యం చేయటాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తానని అన్నారు. ఇక.. మమతా బెనర్జీ అయోధ్య బాల రాముడి ప్రాణప్రతిష్టకు హాజరు కాలేదన్న విషయం తెలిసిందే. చదవండి: కొత్త పథకాన్ని ప్రకటించిన మోదీ -
అయోధ్యకు రాహుల్ ఎందుకు రాలేదు?: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: హిందువులకు నేడు పండగ రోజని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. అయోధ్య కోసం పోరాడిన కర సేవకుల మీద కాల్పులు జరిపారని, సరయు నదిలో గుట్టలుగా శవాలు తేలాయని అన్నారు. అయోధ పోరాటంలో తాను కూడా ఉండటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. నేడు అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్ప నెరవేరిందని పేర్కొన్నారు. కర సేవకుల బలిదానాలు వృథాగా పోలేదని అన్నారు. కరసేవకుల కుటుంబాలకు ఇన్నేళ్లకు అసలైన పండుగ వచ్చిందన్నారు. అయిదు వందలవందల ఏళ్ల స్వప్నం నెరవేరడం ఆషామాషీ కాదని చెప్పారుజ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దాడి జరగలేదన్న బండి సంజయ్.. ప్రజల దృష్టి మరల్చడానికే ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రామమందిర నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. అయోధ్యకు రాహుల్ ఎందుకు రాలేదని నిలదీశారు. ఆలయ నిర్మాణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, వామపక్షాలు ఎందుకు దూరంగా ఉన్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ వల్ల హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయన్నారు. రాముడు అయోధ్యలోనే పుట్టాడని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. రాముడిపై ప్రశ్నిస్తున్న వారు దేశ పౌరులేనా?. నాస్తికులు, హేతువాదులు రాజ్యాంగాన్ని అవమానిస్తారా?.అని మండిపడ్డారు. మీ కుటుంబ సభ్యులను అడగండి.. రాముడు అయోధ్యలో పుట్టాడో లేదో తెలుస్తుందని అన్నారు. ఈ దేశం తిండి తింటూ ఇక్కడి దేవుళ్లను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: Ayodhya Ram Mandir: అయోధ్యలో కన్నుల పండుగగా రామమందిర ప్రారంభోత్సవం -
అయోధ్య వేడుకలో కనిపించని సైఫ్ జంట: ఆసుపత్రిలో చేరిన సైఫ్అలీ ఖాన్?
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా ముగిసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులు మీదుగా జరిగిన ఈ వేడుకకు పలువురు రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్, హీరోలందరూ తరలివచ్చారు. బిగ్బీ అమితాబ్, చిరంజీవితోపాటు,ధనుష్ అలియా భట్-రణబీర్ కపూర్ జంట, విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ దంపతులు, ఆయుష్మాన్ ఖురానా , రణదీప్హుడా, భర్త శ్రీరామ్తో కలిసి మాధురీ దీక్షిత్ , జాకీ ష్రాఫ్ సహా పలువురు సెలబ్రిటీలు అయోధ్య నగరానికి తరలివచ్చారు. ఇంకా చిత్ర నిర్మాతలు రోహిత్ శెట్టి ,రాజ్ కుమార్ హిరానీ నిర్మాత మహావీర్ జైన్ ఇంకా సుభాయ్ఘాయ్ తదితరులు బాలరాముణ్ని దర్శించుకున్నారు.రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఆకాష్ అంబానీ, శ్లోకా అంబానీ, ఇషా అంబానీ, అనిల్ అంబానీ, ఎయిర్టెల్ చీఫ్ తదితర వ్యాపార దిగ్గజాలు కూడా హాజరైన్నారు. #WATCH | Ayodhya: On the Shri Ram Pran Pratishtha ceremony, BJP leader Bansuri Swaraj says, "... The ambience of the whole country has changed for good. My heart feels very happy... I would credit the late Ashok Singhal for this day... This 500-year-long fight was for our… pic.twitter.com/EzMbdn0rDV — ANI (@ANI) January 22, 2024 #WATCH | Actor Dhanush attended the Ayodhya Ram Temple 'Pran Pratishtha' ceremony today pic.twitter.com/r1B7UdVLBp — ANI (@ANI) January 22, 2024 కానీ ఆదిపురుష్ నటుడు సైఫ్ అలీ ఖాన్, అతని భార్య కరీనా కపూర్ జాడ కనిపించలేదు. అయితే మోకాలి , భుజానికి గాయం కారణంగా సైఫ్ సోమవారం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉందని సమాచారం. ఓం రౌత్ దర్శకత్వంలో కృతి సనన్ , ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ఆదిపురుష్లో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. -
Ram Mandir: ‘ భూమ్మీద అత్యంత అదృష్టవంతుడను నేనే’
అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. సర్వాంగ సుందరంగా, నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగింది. గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నేతృత్వంలో మహా గంభీరంగా ప్రాణప్రతిష్ట క్రతువు నిర్వహించారు. రామ్ లల్లా విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ట కర్తగా వ్యవహరించారు. ప్రాణప్రతిష్ట చేసిన బాల రాముడి విగ్రహం జీవకళ ఉట్టిపడుతోంది. ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూర్కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ సుందరంగా చెక్కిన విషయం తెలిసిందే. సోమవారం అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న అరుణ్ యోగిరాజ్ మీడియాతో మాట్లాడారు. ‘నేను ఈ భూమి మీద ఉన్న అదృష్టమైన వ్యక్తిగా భావిస్తున్నాను. భగవాన్ శ్రీ రామ్ లల్లా, మా పూర్వికులు, కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు ఎల్లప్పడూ నాతో ఉంటాయి. ఇప్పటికీ నాకు ఊహాలోకంలో ఉన్నట్లు అనిపిస్తోంది’ అని యోగిరాజ్ పేర్కొన్నారు. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించే రాముని విగ్రహాన్ని ఎంపిక చేయడానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సమావేశంలో ఓటింగ్ నిర్వహించి విషయం తెలిసిందే. ప్రత్యేక శిల్పులు రూపొందించిన మూడు నమూనాల్లో ఒక విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఇందులో యోగి రాజు చెక్కిన బాలరాముని శ్యామవర్ణ విగ్రహం ఎక్కువ ఓట్లు పొందిన అత్యుత్తమ విగ్రహంగా నిలిచింది. రామ్ లల్లా విగ్రహ విశేషాలు.. ► అయోధ్య రామాలయంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ► నల్లరాతిపై చెక్కిన బాల రాముడి ప్రతిమ. నీలమేఘ శ్యాముడంటూ రామాయణంలోని వర్ణనకు అనుగుణంగా ఈ రాతిని ఎంచుకున్నారు. ► రామ్లల్లాను చెక్కిన శిల బరువు దాదాపు 200 కిలోలు. ► ఐదేళ్ల బాలుడి రూపంలో రామ్లల్లా విగ్రహాన్ని రూపొందించారు. ► ఓ చేతిలో బాణం పట్టుకుని, మరో చేతితో ఆశీర్వాదం ఇస్తున్న రూపంలో విగ్రహాన్ని మలిచారు. ► స్వచ్ఛమైన బంగారంతో విల్లంబులు తయారుచేసి బాల రాముడి చేతిలో అలంకరించారు. ► శ్రీరామ నవమి రోజున గర్భగుడిలో సూర్య కిరణాలు పడేలా ఏర్పాట్లు ► శ్రీరాముడికి సూర్య తిలకంలో కిరణాలు పడేలా ఏర్పాట్లు చదవండి: Ayodhya Ram Mandir: భావోద్వేగానికి లోనైన దిగ్గజ నేతలు -
అయోధ్య రాముడికి అంబానీ దంపతుల కానుక.. 33 కేజీల బంగారం?
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామమందిర ప్రాణ ప్రతిష్ఠ ఎట్టకేలకు ముగిసింది. ఈ దివ్య ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించిన ప్రముఖలతోపాటు టీవీల్లో, ఇతర సాధనాల్లో వీక్షించిన కోట్లాదిమంది భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతోపాటు ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ కుటుంబం కూడా ఈ వేడుకలో పాల్గొంది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు అయోధ్యలోని రామమందిరానికి 33 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు ముందు నుంచే ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 33 కేజీల బంగారంతో పాటు అంబానీలు ఆలయానికి మూడు బంగారు కిరీటాలను కూడా విరాళంగా ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి: Ayodhya: అమ్మతో అయోధ్యలో.. సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవో భక్తిపారవశ్యం! ఈ వార్తలు నిజమేనా? అయోధ్య రామమందిరానికి ముఖేష్ అంబానీ దంపతులు మూడు బంగారు కిరీటాలు, 33 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు వచ్చిన ఈ వార్తల్లో నిజం లేదని తెలిసింది. డీఎన్ఏ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. విరాళాల విషయమై న్యూస్చెకర్ (Newschecker) వెబ్సైట్ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యునితో మాట్లాడింది. ఇలాంటి విరాళాలేవీ తమకు అందించలేదని ట్రస్ట్ సభ్యులు ధ్రువీకరించినట్లుగా పేర్కొంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రామ్ లల్లా దర్శనం: సోనూ నిగమ్ భావోద్వేగం, బీ-టౌన్ సెల్ఫీ వైరల్
#AyodhyaRamMandir శతాబ్దాల సుధీర్ఘ నిరీక్షణ ఫలించిన వేళ... ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులు మీదుగా ఘనంగా జరిగింది. ఈ వైభవాన్నిప్రత్యక్షంగా, పరోక్షంగా కన్నులారా వీక్షించిన భక్తుల రామనామ స్మరణతో యావద్దేశం పులకించిపోయింది. ఈ సందర్బంగా కొన్ని విశేషాలు సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమం అనంతరం అక్కడున్న వారినందరినీ ప్రధాని మోదీ పలకరించారు. ప్రముఖగా బాలీవుడ్ నటుడు బిగ్బీ, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్లతోపాటు, రిలయన్స్ అధినేత అంబానీ దంపతులను పలకరించి అభివాదం చేశారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ఆనంద పరవశంలో మునిగి జైశ్రీరామ్ అంటూ నినదించింది. రామ మందిరాన్ని చూసి, ఆనంద పరవశంలో నటి కంగనా రనౌత్. #AyodhaRamMandir pic.twitter.com/KsynLcVD92 — Actual India (@ActualIndia) January 22, 2024 అలాగే ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించేందుకు అయోధ్య తరలివెళ్లిన బాలీవుడ్ నటులు దిగిన సెల్ఫీ కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుకలో బాలీవుడ్ సుభాష్ ఘాయ్ అంబానీ కోడలు శ్లోకా అంబానీతోపాటు బీ-టౌన్ ప్రముఖులతో కలిసి సెల్ఫీ తీసుకోవడం విశేషం. అలాగే బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ భావోద్వేగానికి గురయ్యాడు. అభి కుచ్ బోల్నే కో హై నహీ, బస్ యాహీ (కన్నీళ్లు) బోల్నే కో హై. (ఇపుడిక మాట్లాడానికి ఏమీలేదు ఆనంద బాష్పాలు తప్ప అంటూ ఆయన పరవశించిపోయారు. ప్రాణ ప్రతిష్ట వేడుకకు ముందు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో సోను నిగమ్ 'రామ్ సియారామ్' పాటను ఆలపించారు. #WATCH | Ayodhya, Uttar Pradesh | Singer Sonu Nigam gets emotional; says, "...Abhi kuch bolne ko hai nahi, bas yahi (tears) bolne ko hai."#RamTemplePranPratishtha pic.twitter.com/6yoZ4s8APy — ANI (@ANI) January 22, 2024 #WATCH | Singer Anuradha Paudwal sings Ram Bhajan at Shri Ram Janmaboomi Temple in Ayodhya ahead of the Pran Pratishtha ceremony. pic.twitter.com/ZuKe4w5FCm — ANI (@ANI) January 22, 2024 కాగా ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని తిలకించేందుకు అమితాబ్ బచ్చన్ నుండి సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరకు సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు వైరల్గా మారాయి. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుల గాత్రంతో అయోధ్యనగరి రామభజనలతో ఉర్రూతలూగింది. ప్రాణప్రతిష్ట వేడుకకు ముందు ప్రముఖ గాయకులు రామ్ భజనలు ఆలపించారు. అనురాధ పౌడ్వాల్, శంకర్ మహదేవన్, సోనూ నిగమ్ల మధురమైన గాత్రాలకు రామ్ భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవంలో చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి విజువల్స్
-
ముఖేష్ అంబానీ మరియు అమితాబ్ బచ్చన్ విజువల్స్
-
ప్రాణ ప్రతిష్ట వేళ సెలబ్రెటీలు ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించారంటే..!
అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 500 ఏళ్ల హిందువుల కల సాకారమైంది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాలరాముడిగా కొలువు దీరాడు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సోమవారం బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువులరు సెలబ్రెటీలకు, ప్రముఖులకు ఆహ్వానం అందింది. అయితే వారంతా ఈ ఈవెంట్కి వచ్చిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ టీవీల్లో ఫుల్ మేకప్తో ట్రెండీ దుస్తులతో కనపించేవారంతా ఒక్కసారిగా సంప్రదాయ దుస్తుల్లోకి మారిపోయారు. మనం రోజూ తెరపై చూసిన నటీ నటులేనే అన్నంతగా వారి ఆహార్యం మారిపోయింది. వారంతా ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించారంటే..! ఈ మహత్తర మహోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకున్న బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, ఆమె భర్తతో కలిసి వచ్చింది. కత్రినా బంగారు రంగు చీరలో సంప్రదాయ గృహిణిలా కనిపించగా, ఆమె భర్త చక్కటి తెల్లటి కుర్తా పైజామా, బోల్డ్ డిజైన్లో ఉన్న దుపట్టతో తళుకున్నమన్నాడు. ఇరువురిని చూస్తే రెండు కళ్లవు చాలవు అన్నంత అందంగా సంప్రదాయ బద్ధమైన దుస్తులతో అలరించారు. ఇక 'యానిమల్' హిరో సతీమణి అలియా భట్ సైతం గోల్డెన్ బోర్డర్తో ఉన్న లక్స్ గ్రీన్చీరలో వచ్చింది. పైగా భుజంపై మ్యాచింగ్ శాలువా ధరించి హుందాగా వచ్చింది. ఇక ఆమె భర్త రణబీర్ కపూర్ తెల్లటి ధోతీ కుర్తాలో అదిరిపోయే లుక్క్లో సందడి చేశాడు. అతను కూడా మంచి క్లాసిక్ శాలువా ధరించాడు. పైగా ఇరువురు ఎలాంటి మేకప్ లేకుండా నేచురల్ లుక్లో కనిపించారు. ఇక వారితో పాటు రోహిత్ శెట్టి తెల్లటి కుర్తా సెట్లో అదిరిపోయాడు. ఇక బిగ్బీ, బాలీవుడ్ లెజండరీ నటుడు అమితా బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్ఛన్ కూడా తెల్లటి కుర్తా సెట్లో కనిపించారు. అలాగే కంనా రనౌత్ ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొంది. ఆమె నిన్న అయోధ్యలో చీరకట్టులో చీపురు పట్టుకుని మరీ ఆలయాన్ని శుభ్రం చేసింది. ఇవాళ ఈ ప్రాణ ప్రతిష్ట వేడుకలో నారింజ రంగు చీర, విత్ మ్యాచింగ్ శాలువతో స్టన్నింగ్ లుక్తో కనిపంచింది. ఇక సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మహా సంప్రోక్షణకు ఒక రోజు ముందు ఆయోధ్యకు చేరుకున్నారు. ఆయన ధనుష్తో కలిసి సందడి చేశారు. ఈ వేడుకలో ఆయన తెల్లటి కుర్తా పైజామా సెట్ తోపాటు శాలువా ధరించారు. మరో ప్రముఖ నటి మాదురి దీక్షిత్ గోల్డ్ అంచుతో కూడిన పసుపు రంగు చీర, ఫుల్ హ్యండ్స్ బ్లౌజ్తో తళుక్కుమనిపించింది. ఆమె భర్త తెల్లటి పైజామా, మెరూన్ రంగు కుర్తాను ధరించాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి, రామ్చరణ్లు పారిశ్రామికవేత్త అనిల్ అంబానితో మాట్లాడుతూ కనిపించారు. రామ్ చరణ్ తెల్లటి పైజామా, ఐవరీ కుర్తా ధరించగా, చిరంజీవి ఐవరీ పట్టు ధోతీ, కుర్తా సెట్లో కనిపించారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక ఆయుష్మాన్ ఖురాన్కూడా తెల్లటి కుర్తాలో అందంగా కనిపించారు. అయితే ఇతను నెహ్రు కోట్ డిజైన్ వేర్లో కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి కూడా. ఏదీఏమైనా ఇలాంటి ప్రాణప్రతిష్ట క్రతువుల్లో సినీ తారలు సంప్రదాయ దుస్తులు ధరించి మన ఆచార వ్యవహారాల పట్ల తమకున్న గౌరవాన్ని, ఆసక్తిని చాటుకోవడమే అందరీ మనసులను గెలుచుకున్నారు. అంతేగాదు మనం వెళ్లున్న కార్యక్రమానికి తగ్గట్టు ఉండే ఆహార్యం ఆ మనిషి వ్యక్తిత్వం, వైఖరీ ఏంటన్నది చెప్పకనే చెబుతుంది సుమా!. (చదవండి: బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకను ఓ కళాకారుడి ఆర్ట్లో ఇలా చూడండి!) -
Ayodhya Ram Mandir: 32 ఏళ్ల తర్వాత అయోధ్యకు ఉమాభారతి
అయోధ్యలో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతం అయింది. సర్వాంగ సుందరంగా, నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగింది. గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నేతృత్వంలో మహా గంభీరంగా ప్రాణప్రతిష్ట క్రతువు నిర్వహించారు. రామ్ లల్లా విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ట కర్తగా వ్యవహరించారు. అయితే బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ముందు రామ మందిర ప్రాంగణంలో చోటుచేసుకున్న ఓ ఘటన అక్కడ ఉన్నవారందరినీ భావోద్వేగానికి గురిచేసింది. రామ మందిర నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ దిగ్గజ నేతలు ఉమాభారతి, సాధ్వి రితంబర మందిర ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే భావోద్వేగానికి లోనయ్యారు. వారిరువురు తాము కన్న కల నిజమైందని భావోద్వేగంతో కౌగిలించుకున్నారు. ఈ క్రమంలో సాధ్వి రితంబర కళ్లు చెమర్చాయి. రామ మందిర నిర్మాణమే లక్ష్యంగా పోరాడిన ఈ నేతల కలసాకారమైంది. వారు భావోద్వేగానికి లోనైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. मैं अयोध्या में राम मंदिर के सामने हूं, रामलला की प्रतीक्षा हो रही है।@BJP4India @BJP4MP @ShriAyodhya_ @RamNagariAyodhy pic.twitter.com/2NDjQZhQxH — Uma Bharti (@umasribharti) January 22, 2024 సుమారు 32 ఏళ్ల తర్వాత నేడు రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం అమె అయోధ్యలో అడుగుపెట్టారు. ‘నేను అయోధ్యలోని రామ మందిరం ముందు ఉన్నాను. రామ్ లల్లా దర్శనం కోసం వేచి ఉన్నా’ అని ఉమాభారతి మందిరం ముందు దిగిన ఫొటోను ‘ఎక్స్’ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 1990లో అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ చేపట్టిన ఉద్యమంలో ఉమాభారతి, సాధ్వి రితంబర కీలకమైన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక.. బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని రాజకీయ, సినీ ప్రముఖలు హాజరై తిలకించారు. చదవండి: Ayodhya Ram Mandir: అయోధ్య కొలువుదీరిన బాలరాముడు.. దర్శన వేళలు ఇవే -
శతాబ్దాలు ఎదురుచూడాల్సి వచ్చింది: ప్రధాని మోదీ భావోద్వేగం
అయోధ్య: అయోధ్య రామమందిరం గర్భగుడిలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు హాజరు కావడం తన అదృష్టమని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రామ్లల్లా ఇక టెంట్లో ఉండేపరిస్థితులు లేవని.. దివ్యమైన మందిర గర్భగుడిలోనే ఉంటారని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటాలు, బలిదానాలు, నిష్ట తర్వాత అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందన్నారు. ఇది సామాన్యమైన సమయం కాదని.. కాల చక్రంలో ఎప్పటికీ నిలిచిపోయే అద్భుత సమయయని తెలిపారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో దేశమంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వందల ఏళ్లు ఎదురుచూస్తున్న రామమందిరం కల సాకారమైంది. బాలరాముడు ఎట్టకేలకు అయోధ్యలో కొలువుదీరాడు. భవ్య మందిరంలో దివ్య రామయ్య విగ్రహం ఆవిష్కృతం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. శ్రీరామచంద్రమూర్తికి జై అంటూ ప్రసంగం ప్రారంభించారు. రామ భక్తులందరికీ తన ప్రణామాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న మన రాముడొచ్చాడన్న మోదీ.. ఈ క్షణం ఎంతో ప్రత్యేకమైనదని చెప్పారు. ఎంతో అలౌకిక ఆనందాన్ని ఇస్తోందన్నారు. ఎక్కడ రాముడు కార్యక్రమం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని తెలిపారు. సేవా, చింతర, భక్తిని హనుమంతుడి నుంచి ప్రేరణ పొందాలని అన్నారు. జనవరి 22 చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడుతున్న సరికొత్త అధ్యాయమని చెప్పారు. మోదీ ఇంకా మాట్లాడుతూ.. ‘సరయూ నది, అయోధ్యపురికి నా ప్రణామాలు. నా శరీరం ఇంకా అనుభూతిని ఆస్వాదిస్తోంది. రాముడు క్షమిస్తాడని నాకు నమ్మకం ఉంది. నా మనస్సంతా బాలరాముడి రూపంపైనే ఉంది. త్రేతాయుగంలో రాముడు 14 ఏళ్లు వనవాసం చేశాడు. రాముడి కోసం 14 ఏళ్లుగా ప్రజలు ఎదురు ఎదురు చూశారు. ఈ కలియుగంలో కొన్ని వందల ఏళ్లు రాముడి కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. చదవండి: Ayodhya Ram Mandir: 500 ఏళ్ల కల నెరవేరింది: యోగి ఆదిత్యనాథ్ దేశం మొత్తం ఇవాళ దీపావళి జరుపుకుంటోంది. రామమందిర న్యాయబద్దమైన ప్రక్రియ ద్వారా నిర్మించాం. 500 ఏళ్లుగా రామమందిర నిర్మాణం ఎందుకు జరగలేదో ఒకసారి అందరూ ఆలోచించండి. రాముడు భారతదేశ ఆత్మ. ఈ 11 రోజులు ఉపవాస దీక్ష చేపట్టా. అన్ని రాష్ట్రాల్లోని ఉన్న రాముడి ప్రధాన ఆలయాలు దర్శించుకున్నాను. అన్ని భాషల్లోనూ రామాయనాన్ని విన్నాను. భాష ఏదైనా రాముడు అందరికీ ఆరాధ్య దైవం. రాముడు లోకానికి ఆదర్శం. రాముడు భారత్కు ప్రతిష్ట. రాముడు వివాదం కాదు.. రాముడు సమాధానం. రాముడే భారతదేశానికి విధానం. రాముడు నిత్యం, రాముడు నిరంతరం, రాముడు అనంతం. బానిస సంకెళ్లను తెంచుకున్న కొత్త రాజ్యం ఆవిర్భవించింది. ఈనెల గాలి ప్రతీది దివ్యత్వంతో నిండిపోయింది. ఈ ఘట్టం కోసం శ్రీరాముడు ఎన్నో శతాబ్ధాల పాటు ఎదురు చూశాడు. ఇంత ఆలస్యం జరిగింనందుకు మమ్మల్ని క్షమించమని శ్రీరాముడిని వేడుకుంటున్నా రాముడు తప్పక వస్తాడన్న శబరి ఎదురుచూపులు ఫలించాయి. దేవుడి నుంచి దేశం.. రాముడి నుంచి రాజ్యం ఇది మన నినాదం. త్రేతా యుగంలో రాముడు వచ్చాకే వేలయేళ్లపాటు ఈ దేశం ప్రపంచాన్ని శాసించింది రాబోయే వెయ్యేళ్ల కోసం నేడు పునాదిరాయి వేస్తున్నాం’ అంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు. -
అయోధ్యలో అద్భుత ఘట్టం.. సెలబ్రిటీల సంతోషం
భారతీయులు శతాబ్దాల కాలంగా ఎదురుచూసిన కల సాకారమైంది. ఆనాడు రాముడు 14 ఏళ్లు వనవాసం చేస్తే ఈనాడు.. 500 ఏళ్లకు తాను పుట్టిన అయోధ్యలో కొలువుదీరాడు. సోమవారం (జనవరి 22న) రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. ఈ అద్భుతఘట్టంతో హిందువుల ఒళ్లు పులకరించిపోతోంది. బాలరాముడిని చూసి తన్మయత్వానికి లోనవుతున్నారు. సినీతారలు సైతం అయోధ్య రామమందిర ఆలయ ప్రారంభోత్సవ వేడుకపై సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్యలో రామమందిర ప్రారంభం.. ఐక్యత, ఆధ్యాత్మికతకు చిహ్నాన్ని తెలియజేస్తుంది. ఈ రామమందిర చరిత్రకు సాక్షిగా నిలిచినందుకు చాలా గర్వంగా ఉంది. - మహేశ్బాబు మనందరికీ ఎంత అద్భుతమైన రోజు ఇది.. జై శ్రీరామ్.. -విజయ్ దేవరకొండ Amidst the echoes of history and the sanctity of faith, the grand opening of the Ram Mandir in Ayodhya heralds a timeless symbol of unity and spirituality. Extremely proud to witness history unfold! #AyodhyaRamMandir #JaiShreeRam 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) January 22, 2024 What a beautiful day for all of us ❤️ Jai Shree Ram! — Vijay Deverakonda (@TheDeverakonda) January 22, 2024 Congrats dearest honourable prime minister Modi Saab on another great achievement and another feather in your cap, Jai Shri Ram. Ram mandir will be remembered for years and generations to come and a tribute to all those who laid their lives and sacrificed themselves for this… — Vishal (@VishalKOfficial) January 22, 2024 Bharat has been waiting for this day for over 500 years 🙏 A heartfelt thanks to Sri @narendramodi ji for making this happen 🙏. Jai Sri Ram! #AyodhaRamMandir #PranaPratishta — Vishnu Manchu (@iVishnuManchu) January 22, 2024 #JaiShriRam 🙏🏼 https://t.co/ez0hwECLqs — Brahmaji (@actorbrahmaji) January 22, 2024 Today is truly historic. Euphoria has engulfed the entire world. Am a proud to be a voice amongst the billion chants as our Ram Lalla comes home to Ayodhya. Sare bolo #JaiShriRam !!! #RamMandirPranPrathistha pic.twitter.com/dNdHQdRlhm — Genelia Deshmukh (@geneliad) January 22, 2024 Can't believe I'm lucky enough to witness something as historic & auspicious as #RamMandirPranPrathistha in my lifetime. Proud to see how our entire nation has united to welcome our Ram Lalla back home in Ayodhya! यह दिन इतिहास में उस दिन के रूप में याद रखा जाएगा जब हमारे देश की… pic.twitter.com/GalftZD1Lq — Ajay Devgn (@ajaydevgn) January 22, 2024 From the sacred grounds of Ram Janmabhoomi to the majestic Ram Mandir, a journey woven with faith and resilience 💫 May today usher blessings and prosperity for all. जय भोलेनाथ, जय श्री राम 🙏🏻 pic.twitter.com/KSwE3v5kRo — Sanjay Dutt (@duttsanjay) January 22, 2024 చదవండి: టాలీవుడ్ టూ బాలీవుడ్.. అయోధ్యలో అగ్ర సినీ తారల సందడి -
Ayodhya Ram Mandir: 500 ఏళ్ల కల నెరవేరింది: యోగి ఆదిత్యనాథ్
అయోధ్య: 500 ఏళ్ల కల నెరవేరిందన్నారు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఈ క్షణం కోసం 500 ఏళ్లుగా భారతీయులు ఎదురు చూశారన్నారు. దేశమంతా రామ నామమే మార్మోగుతోందని.. రాంనగరికి వచ్చిన వారందరికీ స్వాగతం చెప్పారు. అన్న్ని దారులూ రామ మందిరానికే దారి తీస్తున్నాయన్నారు. ప్రాణ ప్రతిష్టకు హాజరైన వారి జీవితం ధన్యమైందన్న యోగి.. మనమంతా త్రేతా యుగంలోకి వచ్చినట్లుందని తెలిపారు. బాలరాముడి రూపాన్ని చెక్కిన శిల్పి జీవితం ధన్యమైందని అన్నారు.. ఈ రోజు ప్రతి రామ భక్తుడు సంతోషం, గర్వం, సంతృప్తితో ఉన్నాడని అన్నారు యోగి ఆదిత్యనాథ్. తన ఆలయం కోసం సాక్ష్యాత్తూ శ్రీరాముడే పోరాడాల్సి వచ్చిందన్నారు. అనుకున్న చోటే రామాలయం నిర్మించామని తెలిపారు. కాగా అయోధ్య భవ్య మందిరంలో దివ్య రామయ్య విగ్రహం ఆవిష్కృతం. వైభవంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగింది. అభిజిత్ ముహూర్తంలో రాముడు తొలి దర్శనం ఇచ్చారు. పసిడి కిరీటం, పట్టువస్త్రం, ముత్యాల కంఠాభరణంతో రాముడిని సుందరంగా అలంకరించారు. రమణీయంగా రామయ్య ప్రాణ ప్రతిష్ట మహోజ్వల ఘట్టం జరిగింది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి రామ్లల్లాలకు ప్రధాని మోదీ తొలి హారతి ఇచ్చారు. అయోధ్య రామాలయంపై హెలికాప్టర్తో పూల వర్షం కురిపించారు. సామాన్య భక్తులకు రేపటి నుంచి దర్శనం ఖరారైంది. ఉదయం 7 గంటల నుంచి 11.30 వరకు బాలరాముడి దర్శించుకోవచ్చు. మళ్లీ మధ్యాహ్నం 2 నుంచిరాత్రి 7 గంటల వరకు దర్శన అవకాశం కల్పించారు. చదవండి: అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ట వేడుక.. అప్డేట్స్ -
దర్శకుడిగా టాలీవుడ్ నటుడి తొలి సినిమా.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
టాలీవుడ్ నటుడు ధనరాజ్ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తోన్న చిత్రం "రామం రాఘవం". ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇవాళ అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ ఆవిష్కరించారు. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా 22 మంది సినీ ప్రముఖుల చేతుల మీదుగా పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రం ద్వారా ధన్రాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్నారు. మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో సముద్రఖని , ధనరాజ్ తండ్రీ, కొడుకులుగా కనిపించనున్నారు. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ఒక తండ్రి కొడుకుల కథను అద్భుతంగా తెరమీద ఆవిష్కరిస్తున్నామని దర్శకుడు ధనరాజ్ తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు నటిస్తున్నారు. ఈ సినిమాకు విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానా కథను సమకూర్చగా.. అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల కానుంది. జగమంతా రామమయం 🙏🏻 ఇలాంటి అద్భుతమైన రోజు నా సినిమా టైటిల్ రిలీజ్ చేయడం నా పూర్వజన్మ సుకృతం 🙏🏻Presenting the first look poster of Love that knows no boundaries 💞 A tale of a father and son!🧡🧡@thondankani @DhanrajOffl @Prudhvi_dir @DirPrabhakar #RR #RamamRaghavam pic.twitter.com/zbQ4u8PXJ7 — Dhanraj koranani (@DhanrajOffl) January 22, 2024 -
భావోద్వేగంలో ఉమా భారతి, సాధ్వి రితంభర
నాటి రామమందిర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన ఉమాభారతి, సాధ్వి రితంభర అయోధ్యలో భాద్వేగానికి లోనయ్యారు. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన బీజేపీ నాయకురాలు ఉమాభారతి, సాధ్వి రితంభర భావోద్వేగంతో ఒకరినొకరు కావలించుకున్నారు. నాటి అయోధ్య ఉద్యమ పోరాటాలను గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘ఈ సమయంలో మాటలు లేవు.. భావాలు మాత్రమే కదలాడుతున్నాయి’ అని అన్నారు. పరమ శక్తి పీఠం వ్యవస్థాపకురాలు సాధ్వి రితంభర మాట్లాడుతూ ‘ప్రాణ ప్రతిష్ఠ’ శుభ ఘడియ ఇది.. యావత్ దేశం, యావత్ ప్రపంచం శోభాయమానంగా మారింది. కరసేవకుల త్యాగం అర్థవంతమైంది. రామ్లల్లా మనల్ని అనుగ్రహించేందుకు వచ్చాడు’ అని అన్నారు. ఇది కూడా చదవండి: మారిషస్ నుంచి డెన్మార్క్ ... అంతా రామమయం! #WATCH | Ayodhya, UP: On Ram Temple 'pran pratishtha', Sadhvi Ritambhara, Founder of Param Shakti Peeth and Vatsalyagram, says, " This is the happy hour of 'pran pratishtha', whole Country and the whole world have been decorated...kar sevaks' sacrifices have become… pic.twitter.com/vLp6ORtabZ — ANI (@ANI) January 21, 2024 -
Ayodhya: బియ్యపు గింజలతో సీతారాముడు, అయోధ్య..
సాక్షి, హన్మకొండ: అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతోంది. దీంతో, దేశమంతా రామనామ స్మరణ వినపడుతోంది. మరోవైపు.. కొందరు కళాకారులు రాముడిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ కళాకారుడు బియ్యం గింజలతో సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుడి బొమ్మలు వేసి తన భక్తిని చాటుకున్నాడు. వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా ఎలుకతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అనే ఒప్పంద ఉపాధ్యాయుడు బియ్యం గింజలతో శ్రీరాముడు, సీతా, లక్ష్మణుడు, ఆంజనేయుడు, అయోధ్య ఆలయము నిర్మించి చూపర్లను ఆకట్టు కుంటున్నాడు. బియ్యం గింజలతో వారు చిత్రాలను గీసి రంగులు అద్దాడు. దీంతో, స్వామి వారి ఫొటో ఎంతో అందంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో సుమారు 130 కోట్ల ప్రజలు నివసిస్తున్న శ్రీరామచంద్ర ప్రభు జన్మించిన అయోధ్యలో రాముడి విగ్ర ప్రతిష్ట ప్రారంభ మహోత్సవం జరుగుతోంది. హిందూ ప్రజల కళలు నెరవేరుతున్న సందర్భంగా హిందువుల ఆరాధ్య దైవం రాముడిని స్మరించుకుంటున్నాను. ఉడతా భక్తితో ఈ పేదవాడు బియ్యపు గింజలతో శ్రీరాముడు, సీతా, లక్ష్మణుడు, ఆంజనేయుడు, అయోధ్య ఆలయంను నిర్మించి భగవంతునికి సమర్పిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. -
'హనుమాన్' కలెక్షన్స్.. తొలి భారతీయ సినిమాగా రికార్డు
శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సం, బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇదే సమయంలో టాలీవుడ్లో విడుదలైన హనుమాన్ చిత్రం ఖాతాలో భారీ రికార్డ్ చేరింది. చిన్న సినిమాగా విడుదల అయిన ఈ చిత్రం నేడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుంది. సంక్రాంతి కానుకగా కేవలం రూ. 50 కోట్లతో తెరకెక్కిన హనుమాన్ చిత్రం ఎవరూ ఊహించని వసూళ్లు సాధిస్తోంది. 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు చిత్ర మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2024లో రూ.200 కోట్ల మార్క్ అందుకున్న తొలి భారతీయ సినిమాగా హను- మాన్ రికార్డు కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమా బాలీవుడ్లో దుమ్మురేపింది. నార్త్ ఇండియాలో ఎక్కడ చూసినా కూడా అయోధ్య రాముడు, హనుమాన్ ఈ రెండే పేర్లు మారుమ్రోగుతున్నాయి. ఒక టికెట్ కొంటే ఇంకొకటి ఉచితం నేడు (జనవరి 22) అయోధ్యలో రామ మందింరం ప్రారంభోత్సవం సందర్భంగా యూఎస్ఏలో (USA) పలు ప్రాంతాల్లో ఎంపిక చేసిన స్క్రీన్స్లలో సగం ధరకే టికెట్ విక్రయిస్తున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. అంతే కాకుండా ఇండియాలో కూడా మిరాజ్ సినిమాస్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది. నేడు ఒక్కరోజు హనుమాన్ సినిమాకు 'బై వన్ గెట్ వన్'(ఒకటి కొంటే ఇంకొకటి ఉచితం) ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించింది. బుక్ మైషోలో 'MIRAJBOGO' అనే కోడ్ ఉపయోగించి ఈ ఆఫర్ను వినియోగించుకోవచ్చని తెలిపింది. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ చిత్రంలో తేజ సజ్జా హీరోగా, అమృత అయ్యార్ హీరోయిన్గా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్తో పాటు సముద్రఖని, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ వంటి తదితురులు కీలక పాత్ర పోషించారు. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్స్పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నైజాం ఏరియాలో మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని పంపిణీ చేశారు. जय श्री राम 🙏 With the divine blessings of Lord Shree Ram, #HanuManRAMpage continues to soar higher at the Box-office ❤️🔥 2️⃣0️⃣0️⃣ CRORE WORLDWIDE collections for #HANUMAN in just 10 Days 🔥💥 Nizam Release by @MythriOfficial ❤️🔥 A @PrasanthVarma film 🌟ing @tejasajja123… pic.twitter.com/S1gjf0RKYr — Mythri Movie Makers (@MythriOfficial) January 22, 2024 -
Prana Pratishtha: అసలేంటీ ప్రాణ ప్రతిష్ట?
అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఈ నెల 16 నుంచే ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా రామ జన్మభూమి ట్రస్ట్ ప్రాయశ్చిత్తం, సరయూనది ఒడ్డున దశవిద్ స్నానం, విష్ణుపూజ, గోదాన్, రామ్ లల్లా విగ్రహంతో నగరమంతా ఊరేగింపు తదితార కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇవాళే మరికొద్దిసేపటిలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరగనుంది. పైగా కొన్ని రాష్ట్రాల్లో ఈ రోజు సెలవు రోజుగా ప్రకటించాయి కూడా. దేశమంతా ఈ వేడుక నేపథ్యంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇక ఈ మహోత్సవ కార్యక్రమాలు చివరి దశకు చేరుకోనున్నాయి కూడా. ఈ సందర్భంగా అస్సలు ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటీ? ఎందుకని చేస్తారు? ఎలా చేస్తారు తదితరాల గురించి తెలుసుకుందాం! ప్రాణ ప్రతిష్ట అంటే.. ప్రాణ ప్రతిష్ట అంటే దేవాలంయలో పూజలు క్రతువు చేసేందుకు ముందుగా చేసే ఒక సంప్రదాయం. ప్రాణప్రతిష్ట అంటే అర్థం జీవం ఇవ్వడం. ప్రాణ్ అంటే ప్రాణ శక్తి, ప్రతిష్ట అంటే స్థాపన అని అర్థం. ఆ ఆచారంతో దైవాన్ని విగ్రహంలోకి ఆవాహనం చేయడం. ఈ క్రతువు దేవుని విగ్రహాన్ని సజీవంగా చేస్తుంది. ఏ దేవుడి విగ్రహ ప్రతిష్టాపన జరిగినా.. ఈ ఆచారం కచ్చితంగా నిర్వహిస్తారు. వేదాలు, పురాణాల ఆధారంగా చాలా శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ నేపథ్యంలోనే ఈ నెల 16 నుంచి అందుకు సంబంధించిన ప్రాయశ్చిత్తం దగ్గర నుంచి రామ్లాల్ విగ్రహాన్ని ఊరేగించడం వరకు అన్ని కార్యక్రమాలను రామ జన్మభూమి ట్రస్ట్ నిర్వహించింది. ఆ తరువాత ఆలయ గర్భగుడిని సరయు నది పవిత్ర జలంతో శుద్ధి చేస్తారు. ఆ తర్వాత రాముడి విగ్రహాన్ని ఆలయంలో ఉంచారు. ఈ పూజ ప్రధాన ఉద్దేశ్యం దేవుడిని విగ్రహంలోకి ఆవాహనం చేసి ప్రాణం పోయడం. ఈ తతంగాలతో విగ్రహం లోపల శాశ్వతంగా దేవుని ఉనికి ఉండేలా చేస్తారు. దీంతో ఆ తర్వాత ఆలయంలో జరిగే పూజలు, వ్రతాలు ఆ దేవుడు స్వీకరిస్తాడని నమ్ముతారు. అలాగే ఆయన తమ గోడు విని కోరికలు తీరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేగాదు ప్రజలు విగ్రహాన్ని కేవలం ఓ వస్తువు లేదా రాయిగా చూడరు సాక్షాత్తు ఆ జగదభి రాముడు తమ కోసం ఇక్కడ కొలువుదీరి తమ పూజలు, అర్చనలు స్వీకరిస్తాడని భక్తు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అదీగాక ఇవాళ జరుగుతున్న ఈ వేడకను తిలకించేందుకు సెలబ్రెటీలు, ప్రముఖులే గాక దేశం నలుమూలల నుంచి అయోధ్యకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఎలా జరుగుతుందంటే.. ముందుగా విగ్రహాన్ని కనీసం ఐదు పవిత్ర నదిజలాలతో స్నానం చేయిస్తారు. ఆ తర్వాత నీరు ధాన్యంతో నిమజ్జనం చేస్తారు. దీంతో విగ్రహంలో పవిత్రత వస్తుందని పురాణ వచనం. ఆ తర్వాత ఆవుపాలతో స్నానం చేసి శుభ్రమైన గుడ్డతో తుడుస్తారు. ఆ తర్వాత కొత్త బట్టలు ధరింపచేస్తారు. ఆచారంలో భాగంగా చందనం అద్దుతారు. ఇక విగ్రహాన్ని వాస్తు ప్రకారం సరైన దిశలో పెట్టడం జరగుతుంది. సాధారణంగా సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కున పెట్టడం జరుగుతుంది. వేదాలు, పూర్ణాహుతి శ్లోకాలతో పుష్పాలు, ధూపం, నైవేధ్యం వంటివి దేవుడికి సమర్పించడం జరగుతుంది. అయితే ఈ వేడుక మాత్రం 84 సెకన్లు మాత్రమే ఉంటుంది. ఈ ఘట్టం మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగుతుంది. ముందుగా ఆయన విగ్రహం కళ్లకు గంతలు తొలగించి, చిన్న బంగారు కర్రతో కాజల్ని బాలారాముని పూయడం జరుగుతుంది. ఆ తర్వాత అద్దంలో రాముడికి ముఖాన్ని చూపుతారు. చివరిగా 108 దీపాలతో మహా ఆరతి ఇచ్చి ఈ పవిత్రోత్సవాన్ని ముగించడం జరగుతుంది. గుడ్డతో ఎందుకు కప్పి ఉంచుతారంటే.. ప్రాణ ప్రతిష్టకు ముందు విగ్రహ స్వచ్ఛతను కాపాడుకునేందుకు ముఖాన్ని కప్పి ఉంచడం జరుగుతుంది. శాస్త్రోక్తంగా ప్రాణ ప్రతిష్ట పూజ కార్యక్రమాలు జరిపేంత వరకు అలా గుడ్డతో కప్పి ఉంచుతారు. ఇలా దేవి నవరాత్రలప్పుడూ, గణపతి నవరాత్రుల్లో కూడా చేయడం మనం గమనించే ఉంటాం. అందులోనూ 500 నిరీక్షణ తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఈ పవిత్రోత్సవాన్ని మరింత కట్టుదిట్టమైన ఆచార వ్యవహారాలతో వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా కన్నుల పండగగా జరుపుతోంది రామజన్మభూమి ట్రస్ట్. దీన్ని పురుస్కరించుకుని రాష్ట్రాలలోని ప్రతి రామాలయంలో ఘనంగా పూజలు, అన్నదానాలు నిర్వహిస్తున్నారు. దేశమంతటా ఎటూ చూసిన రామనామ స్మరణతో మారుమ్రోగిపోతోంది. (చదవండి: బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకను ఓ కళాకారుడి ఆర్ట్లో ఇలా చూడండి!) -
అయోధ్య రాముడి దర్శన వేళలు ఇవే..
ఢిల్లీ: అయోధ్యలో అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 500 ఏళ్ల హిందువుల కల సాకారమైంది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాలావతారంలో కొలువు దీరాడు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సోమవారం బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట క్రతువు జరిగింది. మేషలగ్నం అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగింది. విగ్రహ ప్రతిష్టకు కర్తగా వ్యవహరించారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్లతో పాటు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొన్నారు. ప్రాణప్రతిష్ట సమయంలో ఆలయం మీద నుంచి హెలికాఫ్టర్లతో పూల వర్షం కురిపించారు. #WATCH | First visuals of the Ram Lalla idol at the Shri Ram Janmaboomi Temple in Ayodhya pic.twitter.com/E0VIhkWu4g — ANI (@ANI) January 22, 2024 రామనామ స్మరణతో అయోధ్య మారుమోగిపోయింది. అదే సమయంలో జై శ్రీరామ్ నినాదంతో కోట్లాది హిందువులు పులకరించి పోయారు. సకలాభరణలతో అలంకరించిన బాలరాముడు.. కమలంపై కొలువుదీరాడు. కుడి చేతిలో బాణం.. ఎడమ చేతిలో విల్లు ఉంది. ఆ దివ్యరూపం సోషల్ మీడియాకు చేరగా.. తన్మయంతో భక్తులు పులకరించిపోతున్నారు. దర్శన వేళలు ఇవే అయోధ్య రామ మందిర సామాన్యుల దర్శనం కోసం స్లాట్లు కేటాయించారు. రేపటి నుంచి అంటే.. మంగళవారం ఉదయం 7గం. నుంచి 11.30 వరకు, అలాగే మధ్యాహ్నాం 2గం. నుంచి 7 వరకు భక్తులకు అనుమతిస్తారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అయోధ్యలో సచిన్, జడేజా, అనిల్ కుంబ్లే.. వీడియో వైరల్
భారత దేశ చరిత్రలో చిరస్మరణీయమైన ఘట్టానికి సమయం అసన్నమైంది. అయోధ్య నగరంలోని భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు మరి కాసేపట్లో తెరలేవనుంది. సోమవారం మధ్యాహ్నం 12: 20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. రామ జన్మభూమిలో జరిగే ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు ప్రముఖులు ఆయోద్యకు క్యూ కడుతున్నారు. దీంతో అయోధ్య పురి మొత్తం భక్తులతో నిండిపోయింది. భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్ అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Sachin Tendulkar reached Ayodhya#RamMandirPranPrathistha | #AyodhyaRamMandirpic.twitter.com/HuHQE9NxhR — Don Cricket 🏏 (@doncricket_) January 22, 2024 వీరితో పాటు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా అయోధ్యకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా భారత స్టార్ ఆల్రౌండర్ ,రవీంద్ర జడేజా కూడా అయోధ్య పుర వీధుల్లో కన్పించాడు.. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Virat Kohli reaches Ayodhya for Ram Mandir Pran Pratishtha 🛕#ViratKohli #RamMandir #Ayodhya #CricketTwitter pic.twitter.com/k132x5UNv9 — InsideSport (@InsideSportIND) January 22, 2024 -
బాలరాముడి సన్నిధిలో వ్యాపారవేత్తలు..
భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా మొదలైంది. 500 ఏళ్ల కల సాకారమవుతున్న తరుణమిది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఈ శుభకార్యానికి దేశంలోని దాదాపు 7000 మంది హాజరుకానున్నారు. ఇప్పటికే చాలామంది ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. మరికొందరు కాసేపట్లో చేరుకుంటారని తెలిసింది. కార్యక్రమానికి హాజరైన కొందరు ప్రముఖ వ్యాపారవేత్తల గురించి తెలుసుకుందాం. ముఖేశ్ అంబానీ దంపతులు Mukesh Ambani, chairperson of Reliance Industries, and Nita Ambani, founder and chairperson of Reliance Foundation, arrived at the Shri Ram Janmabhoomi Temple in Ayodhya for the Ram Temple Pran Pratishtha ceremony.#RamMandirPranPrathistha #Ambani pic.twitter.com/6JrXhw41yG — Jist (@jist_news) January 22, 2024 #Thalaivar #Superstar #Rajinikanth - @sachin_rt - #Ambani #NitaAmbanipic.twitter.com/F7v7kKcqu2 — Rajinikanth Fans (@Rajni_FC) January 22, 2024 ఆకాశ్ అంబానీ దంపతులు #WATCH | Akash #Ambani, Chairman of #RelianceJio Infocomm Ltd along with his wife #ShlokaMehta, arrives at Shri Ram Janmabhoomi Temple in #Ayodhya to attend #RamMandirPranPrathistha ceremony He says, “This day will be written in the pages of history, we are happy to be here.”… pic.twitter.com/etNXVXYBUM — Hindustan Times (@htTweets) January 22, 2024 జోహో వ్యవస్థాపకులు శ్రీధర్వెంబు దంపతులు #AyodhyaRamMandir consecration: 'Very blessed to be here,' says Zoho founder Sridhar Vembu | #RamMandirPranPrathistha #Ayodhya |https://t.co/Ojp14JxdIA — Business Today (@business_today) January 22, 2024 ఈజ్మైట్రిప్ సహ వ్యవస్థాపకులు, నిశాంత్పిట్టి #WATCH | Ayodhya, Uttar Pradesh: Co-founder of EaseMyTrip, Nishant Pitti says "This is like a historic moment for every Indian. We got goosebumps as soon as we came here..." pic.twitter.com/dDHkUzuzIz — ANI (@ANI) January 22, 2024 జీ సంస్థల ఎండీ, పునీత్గోయెంకా As I arrived at Ayodhya early this morning for the auspicious occasion of Pran Pratishtha, I received a message that the deal that I have spent 2 years envisioning and working towards had fallen through, despite my best and most honest efforts. I believe this to be a sign from… pic.twitter.com/gASsM4NdKq — Punit Goenka (@punitgoenka) January 22, 2024 -
ఆర్ట్లో..బాల ప్రాణ పత్రిష్ట వేడుక ఘట్టం మొత్తం ఇలా..!
బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు అయోధ్య సుందరంగా ముస్తాబయ్యింది. ఇవాళే మరొకొద్దిపేపటిలో ఈ వేడుకు కన్నుల పండుగగా జరగనుంది. దీంతో దేశమంతా ఓ పండుగ వాతావరణంలా ఉంది. ఎక్కడ చూసినా, ఎటూ చూసిన జై శ్రామ్ అనే నినాదాలతో మారుమ్రోగిపోతోంది. అయితే ఈ వేడుకను మానస్ సాహు అనే కళాకారుడు తన ఇసుక ఆర్ట్తో చాలా చక్కగా చిత్రీకరించాడు. జస్ట్ కొద్ది నిమిషాల వ్యవధిలోని ఆ బాల రాముడి ఆలయ శంకుస్థాపన నుంచి ప్రాణ ప్రతిష్టకు వరకు జరిగే తతంగం అంతా చాలా చక్కగా రూపొందించాడు. చూస్తే మనం అయోధ్యలో ఉన్నామా! అనిపించేంత అందంగా తీర్చిదిద్దాడు. అయోధ్యలోని భవ్య రామమందిరం గర్భగుడిలోని బాల రాముడి విగ్రహాన్ని మన కళ్ల ముందు సాక్షాత్కారించేలా చేశాడా! అన్నంతగా కళాత్మక దృష్టితో సృష్టించాడు. ఇక సాహు గత రెండు దశాబ్దాలుగా ఈ శాండ్ ఆర్ట్తో పలు యానిమేషన్ ప్రయోగాలు చేస్తున్నాడు. అంతేగాదు ఈ ఇసుక కళను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ప్రముఖ కళాకారుడు కూడా ఆయనే. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆయన యూనిమేషన్తో కూడిన ఇసుక కళతో సహజత్వాన్ని ఉట్టిపడేలా చేస్తాడు. అందువల్లే ఈ ఆయన వేసిన ఆర్ట్ చూస్తే..ఈ బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలో నిజంగా ఆ పాల్గొన్నామా! అనే భావన కలుగుతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, బాల రాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం ఇవాళ మధ్యాహ్నాం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు ఇప్పటికే అయోధ్యకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు, సెలబ్రేటీలు చేరుకున్నారు. Sand Animation shows the Pran Pratishtha ceremony of Ram Lalla. #RamMandir #RamMandirPranPratishta #JaiShreeRam @PMOIndia @PakPMO @myogiadityanath @AmitShah @rajnathsingh @dpradhanbjp @sambitswaraj @SudhanshuTrived pic.twitter.com/M1ihrcHejZ — Manas sahoo (@SandArtistManas) January 21, 2024 (చదవండి: అయోధ్య రాముడుకి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేది వీరే!) -
500 ఏళ్లుగా ఎవరూ చేయలేదు థాంక్స్ మోడీ..!
-
శ్రీరామ మందిరం వెయ్యేళ్లు చెక్కుచెదరకుండా..నిపుణులు ఏమంటున్నారు?
#Ayodhya Ram Mandir అయోధ్య శ్రీరాముని మందిరి ఆధునిక ఇంజినీరింగ్లో ఒక అద్భుతమని, ఇది కేవలం బలమైన భూకంపాలు ,అత్యంత తీవ్రమైన వరదలను తట్టుకునేలా తయారు చేసినట్టు, అయోధ్య రామమందిరాన్ని నిర్మిస్తున్న దేశీయ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ప్రకటించింది. దీంతో అయోధ్య రామ మందిర నిర్మాణ శైలి చర్చల్లో నిలిచింది. నిజంగానే ఇది వెయ్యేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంటుందా? దీనికి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలున్నాయి లాంటి ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలో బిల్డింగ్ రీసెర్చ్ సంస్థలు, నిపుణులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. నూతనంగా నిర్మించిన రామమందిరంలో నేడు(జనవరి 22న) అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్న 12:29:08 సెకన్లకు బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రధాని మోదీ చేతులు మీదుగా అత్యంత ఘనంగా నిర్వహించారు. జనవరి 24 నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతిస్తారు. ఐఐటీ చెన్నై ఇంజనీర్లు, నిపుణుల సలహాలు సూచనలతో, అయోధ్యలో ఎల్ అండ్ టీ సంస్థ నిర్మిస్తున్న శ్రీరామ దేవాలయం కేవలం ప్రార్థనా స్థలంగానే కాకుండా ప్రాచీన విశ్వాసం , ఆధునిక విజ్ఞాన సమ్మేళనంగా నిలవబోతోంది. ఇదీ చదవండి: సుదృఢ నిర్మాణం... సుందర రూపం.. రామాలయం! ఈ ఆలయ నిర్మాణ విశేషాలు ► టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్వహణతో లార్సెన్ అండ్ టూబ్రో ఖచ్చితమైన ప్రణాళిక, వినూత్న నిర్మాణ సాంకేతికతలతో నిర్మస్తోంది. సంప్రదాయ నగారా శైలి, వాస్తు శిల్పం ఆధారంగా ఆ ఆలయాన్ని రూపొందించారు. సిమెంట్ , ఇనుముతో కాకుండా పూర్తిగా రాతితో నిర్మించారు. ఇతర పదార్థాలతో పోలిస్తే రాయికి ఎక్కువ జీవితకాలం, మంచి మన్నిక ఉండటంతోపాటు, భూకంపాలను కూడా తట్టుకుంటుందని భావిస్తున్నారు. ఇది 6.5 తీవ్రతతో కూడిన భూకంపాన్ని కూడా తట్టుకోగలదు. ఈ ఆలయానికి1,000 సంవత్సరాల వరకు మరమ్మతులు అవసరం లేదని అంచనా. ఈ ప్రాంతంలోని వరద రికార్డులను కూడా పరిశీలించిన ఇంజనీర్లు, భవిష్యత్తులో ఎలాంటి వరదలు రాకుండా సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. #WATCH | Ram Lalla idol at the Shri Ram Janmaboomi Temple in Ayodhya.#RamMandirPranPrathistha pic.twitter.com/kKivThGh67 — ANI (@ANI) January 22, 2024 ► ఆలయ నిర్మాణంలో అత్యంత ముఖ్యమైన శాస్త్రీయ ఆవిష్కరణలలో ఒకటి దీని పునాది. ఫ్లై యాష్, దుమ్ము రసాయనాలతో తయారు చేయబడిన 56 పొరల కాంపాక్ట్ కాంక్రీటు మిశ్రమంతో 15 మీటర్ల మందపాటి రోల్డ్ కాంపాక్ట్ కాంక్రీటుపై దీన్ని ఏర్పాటు చేశారు. ► 21 అడుగుల మందపాటి గ్రానైట్ పునాదితో దీన్ని మరింత పటిష్టం చేశారు. ఇది ఆలయాన్ని తేమ నుండి రక్షిస్తుంది. నిర్మాణ ప్రక్రియలో ప్రత్యేకమైన సవాళ్లు ముఖ్యంగా సెల్ఫ్-కాంపాక్ట్ కాంక్రీటు ఉష్ణోగ్రతను 18 డిగ్రీల కంటే తక్కువ పరిసర ఉష్ణోగ్రత వద్ద నిర్వహించడం. ఇందుకోసం ఆన్-సైట్ ఐస్ క్రషింగ్ ప్లాంట్లతో బయటి ఉష్ణోగ్రతల ప్రభావాన్ని తగ్గించడానికి పునాదిని రాత్రిపూట మాత్రమే నిర్మించారు. ► 150 మంది ఇంజనీర్లు, వేలాది మంది నిపుణులైన కార్మికులు ఇందుకు కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డారు. 360 స్తంభాలతో నిర్మించిన రామ మందిర సముదాయం 380 అడుగుల పొడవు(తూర్పు-పశ్చిమ దిశ), 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది ► చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సలహా మేరకు ఇంజనీర్లు 15 మీటర్ల మేర మట్టిని తవ్వి పైమట్టిని తొలగించారు. ఆ తర్వాత రీ-ఇంజినీరింగ్ చేసిన మట్టితో నింపారు. రీ-ఇంజనీరింగ్ మట్టి 14 రోజులలో రాయిగా ఘనీభవిస్తుంది. ఇలా మొత్తం 47 పొరలు జాగ్రత్తగా వేశారు. ►ఆలయ నిర్మాణంలో రాయిని ఉపయోగించడంపై రూర్కీలోని CISR-సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CBRI) డైరెక్టర్ ప్రశంసించారు. ఇది ఇతర పదార్థాల కంటే ఎక్కువ కాలం ఉంటుంది. అలాగే నిర్మాణంలో ఇనుము తుప్పు పడుతుందనే ఆందోళన కూడా ఉండదని పేర్కొన్నారు. One of my friends working with L&T posted at Ayodhya RAM mandir site sent this video of temple from inside. Absolutely amazing. Stunningly beautiful. Absolutely Divine. A symphony in stone. 👍👏🙏👍🙏🏻🙏🏻 pic.twitter.com/8Ge45FrRkn — Jandial Naresh (@JandialNaresh) January 21, 2024 మరో విశిష్టత, శ్రీరామనవమికి అద్భుత దృశ్యం ఈ ఆలయంలో CBRI రూపొందించిన ప్రత్యేకమైన నూన్ రిఫ్లెక్షన్ మరింత ఆశ్యర్యంగా నిలుస్తోంది. శ్రీరామ నవమి సమయంలో మధ్యాహ్న సమయంలో ఈ మందిరంలోని విగ్రహాల నుదుటిని సూర్యకిరణాలు తాకే అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఇది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పెంచుతుందని కంపెనీ చెబుతోంది. -
అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట.. సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ స్పెషల్ విషెస్
భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం అయోధ్య నగరం అందంగా ముస్తాబైంది. అయోధ్య గర్భగుడిలో రామ్లల్లా కొలువుదీరబోతున్నాడు. 500 ఏళ్ల నాటి హిందువుల కల కాసేపట్లో నెరవేరనుంది. అయోధ్యలోని రామమందిరం 'ప్రాణ ప్రతిష్ఠ' మహోత్సవం కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సోమవారం మధ్యాహ్నం 12: 20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకను ప్రత్యేక్షంగా వీక్షించేందుకు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సెలబ్రెటీలు అయోధ్యకు చేరుకున్నారు. చాలా మంది క్రికెట్ దిగ్గజాలతో పాటు ప్రస్తుత తరం క్రికెటర్లకు సైతం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలను పంపించింది. రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ స్పందించాడు. భారత్కు తన శుభాకాంక్షలను తెలియజేశాడు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి నమస్తే.. ఈ రోజు భారత దేశ చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. దక్షిణాఫ్రికాలో ఉన్న భారత సంతతి ప్రజలకు నా శుభాకాంక్షలు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఘనంగా జరగాలని కోరుకుంటున్నాను. అందరిలోనూ శాంతి, సామరస్యం, ఆధ్యాత్మిక జ్ఞానోదయం తీసుకురావాలి. జై శ్రీరామ్’’ అని ఇన్స్ట్రాగ్రామ్లో కేశవ్ మహరాజ్ పేర్కొన్నాడు. కాగా కేశవ్ మహారాజ్ భారత సంతతికి చెందినవాడన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా రామభక్తుడు కూడా. ఇటీవల కాలంలో అతడి బ్యాటింగ్కు వచ్చిన ప్రతీసారి ‘‘రామ్ సియా రామ్’’ అంటూ సాగే పాటను ప్లే చేస్తున్నారు. చదవండి: BBL 2024: పాకిస్తాన్ బ్యాటర్కు ఊహించని షాకిచ్చిన బోర్డు.. ఎయిర్ పోర్ట్ నుంచే రిటర్న్!? Keshav Maharaj wishes everyone ahead of the Pran Pratishtha of Lord Rama in Ram Temple. pic.twitter.com/zU00hr7DgJ — Mufaddal Vohra (@mufaddal_vohra) January 21, 2024 -
రాముడు మతాన్ని మించిన వ్యక్తి - ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే పారిశ్రాక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టవేళ ఒక ఫోటోను తన ఎక్స్ (ట్విటర్) వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం. ఈ రోజు నా మండే మోటివేషన్ ఆశ్చర్యం కలిగించలేదు, ఎందుకంటే అయోధ్య రాముడు మతాన్ని మించిన వ్యక్తి, ఒకరి విశ్వాసం ఏమైనప్పటికీ.. మనమందరం గౌరవంగా, మంచి విలువలతో జీవించడానికి అంకితమైన వ్యక్తి భావనకు ఆకర్షితులౌతాము. అతని బాణాలు చెడును, అన్యాయాన్ని దూరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. రామరాజ్య పాలన అనేది సమాజం ఆకాంక్ష, రామ్ అనే పదం ప్రపంచానికి చెందినదని.. ఆనంద్ మహీంద్రా రాముని ఫోటో షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: అయోధ్యకు వ్యాపారవేత్తల క్యూ.. ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్.. వేలమందిని ఆకర్శించింది. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. యావత్ భారతదేశం మొత్తం ఈ రోజు రామ నామం జపిస్తోంది. ఈ రోజు అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆనంద్ మహీంద్రా కూడా హాజరుకానున్నారు. It won’t surprise you that my #MondayMotivation this morning is the #MaryadaPurushottam Lord Ram. Because he is a figure that transcends Religion. No matter what one’s faith, we are all drawn to the concept of a being that is dedicated to living with honour and with strong… pic.twitter.com/MLX4tWYsft — anand mahindra (@anandmahindra) January 22, 2024 -
Ayodhya: గర్భిణిల ఎదురుచూపు.. బాలుడైతే..
సాక్షి, మహబూబాబాద్: భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం అయోధ్య నగరం అందంగా ముస్తాబైంది. గర్భగుడిలో రామ్లల్లా కొలువుదీరబోతున్నాడు. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని తిలకించడానికి దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా రామ నామస్మరణ జరుగుతోంది. మరోవైపు.. తెలంగాణలోని మహబూబాబాద్ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట గడియల కోసం కొందరు గర్భిణీలు ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో వారు ప్రసవించాలని కోరుకుంటున్నారు. ఆ సమయంలో తమ బిడ్డలకు జన్మనివ్వాలని అనుకుంటున్నారు. వివరాల ప్రకారం.. అయోధ్యలో నేడు రాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ప్రసవల కోసం గర్భిణీలు ఎదురుచూస్తున్నారు. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో శుభ గడియ కోసం గర్భిణీల వేచిచూస్తున్నారు. ఈ సమయంలో ప్రసవంలో పుత్రుడు జన్మిస్తే రాముడిగా.. ఆడపిల్ల జన్మిస్తే సీతమ్మగా పేరుగా పేరు పెట్టుకుంటామని చెబుతున్నారు. కాగా, దేశమంతా ఎదురు చూస్తున్న శుభ ముహూర్తాన సీతారాములకు జన్మనివ్వాలని గర్భిణీలు ఆరాటపడుతున్నారు. ఇక, పురిటి నొప్పులు వస్తున్నప్పటికీ నేడు శుభ ముహూర్తం కోసం వారు ఎదురు చూస్తున్నారు. -
హారతి వేళ.. హెలికాప్టర్ నుంచి పూలవాన!
మరికొద్ది సేపట్లో అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ సందర్భంగా రాములోరికి హారతులు పట్టే సమయాన ఆలయంపై ఆర్మీ హెలికాప్టర్లు పూల వర్షం కురిపించనున్నాయి. బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా 30 మంది కళాకారులు తమ సంగీత ప్రతిభను చాటనున్నారు. హారతి సమయంలో అతిథులంతా గంటలు మోగించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రామాలయంలోనికి ప్రధాని నరేంద్ర మోదీ అడుగిడనున్నారు. ఈ చారిత్రాత్మక ఉత్సవంలో దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థలు, ఆలయ ప్రతినిధులు భాగస్వాములు కానున్నారు. కార్యక్రమం అనంతరం ప్రధాని ప్రసంగించనున్నారు. మొత్తం 121 మంది ఆచార్యుల ఆధ్వర్యంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి సమక్షంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇది కూడా చదవండి: ప్రాణప్రతిష్ఠకు అద్వానీ, జోషి దూరం? -
అయోధ్య శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ.. హాజరైన అగ్ర సినీ తారలు వీళ్లే!
ప్రతి ఒక్క భారతీయుని కల నెరవేరుతున్న రోజు ఇది. 500 ఏళ్ల కల సాకారమవుతున్న తరుణమిది. ప్రతి భారతీయుడు ఎన్నో దశాబ్దాలుగా వేచి చూసిన క్షణమిది. అయోధ్యలో శ్రీరామమందర నిర్మాణం 500 ఏళ్లనాటి కల నేడు నెరవేరబోతోంది. ఇంతటి అద్భుతమైన ఈ మహాఘట్టాన్ని వీక్షించేందుకు ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి కళ్లు అయోధ్య వైపే. ఆ క్షణాలను భక్తితో ఆస్తాదించేందుకు ఇప్పటికే అయోధ్యాపురికి చేరుకున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రముఖ అగ్ర సినీ తారలంతా శ్రీరామనామం జపిస్తూ అయోధ్యలో అడుగుపెట్టారు. ఈ అద్భుతమైన మహాత్తర వేడుకను వీక్షించేందుకు వెళ్లిన సినీతారలపై ఓ లుక్కేద్దాం. అయోధ్యకు మెగాస్టార్ దంపతులు.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో బయలుదేరిన చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్కు అయోధ్యలో ఘనస్వాగతం లభించింది. వీరితో పాటు పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు అయోధ్యకు బయలుదేరి వెళ్లారు. టాలీవుడ్ హీరో సుమన్ ఇప్పటికే అయోధ్యకు బయలుదేరి వెళ్లారు. అయోధ్యలో బాలీవుడ్ తారల సందడి శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ వీక్షించేందుకు బాలీవుడ్ అగ్రతారలంతా హాజరవుతున్నారు. బిగ్బీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, మాధురీ దీక్షిత్ నానే, జాకీ ష్రాఫ్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, ఆయుష్మాన్ ఖురానా, రణబీర్ కపూర్, అలియా భట్ నిర్మాతలు రాజ్కుమార్ హిరానీ, మహావీర్ జైన్, రోహిత్ శెట్టి రామ మందిరంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి వెళ్లారు. వీరితో పాటు అనుపమ్ ఖేర్, కంగనా రనౌత్, సినీ నిర్మాత మధుర్ భండార్కర్, వివేక్ ఒబెరాయ్, సింగర్ సోనూ నిగమ్, మనోజ్ జోషి ఇప్పటికే అయోధ్యలో అడుగుపెట్టారు. అయోధ్యలో తలైవా సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ సైతం ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠను తిలకించేందుకు నటుడు ధనుశ్ కూడా బయలుదేరి వెళ్లారు. #WATCH | Ayodhya, Uttar Pradesh | Actor Suman says, "Congratulations and best wishes to PM Modi and CM Yogi Adityanath. These two are like Ram and Lakshman and had this temple come up here, I think has been God's doing. He created them to build this temple...This will be the… pic.twitter.com/bvi94YgnfN — ANI (@ANI) January 22, 2024 VIDEO | Actors @SrBachchan, @juniorbachchan, BJP leader @rsprasad, industrialist Anil Ambani reach Ayodhya Ram Mandir to attend the Pran Pratishtha ceremony.#RamMandirPranPratishtha #AyodhyaRamMandir pic.twitter.com/yibxh5Xbuf — Press Trust of India (@PTI_News) January 22, 2024 #WATCH | Telegu superstars Chiranjeevi and Ram Charan at the Shri Ram Janmabhoomi Temple in Ayodhya to attend the Ram Temple Pran Pratishtha ceremony #RamMandirPranPrathistha pic.twitter.com/1vhq7yhX1Z — ANI (@ANI) January 22, 2024 MegaStars ✨ #RamCharan and #Chiranjeevi garu are being Welcomed in Ayodhya 🚩#RamMandirPranPrathistha 🕉️🙏pic.twitter.com/WbUcOsvtaQ — Ujjwal Reddy (@HumanTsunaME) January 22, 2024 Yehi janmbhoomi hai param pujya Shri Ram ki, ek naye yug ka aarambh 🚩 pic.twitter.com/TBFAtWAYu3 — Kangana Ranaut (@KanganaTeam) January 22, 2024 Actors Madhuri Dixit Nane, Vicky Kaushal, Katrina Kaif, Ayushmann Khurrana, Ranbir Kapoor, Alia Bhatt and filmmakers Rajkumar Hirani, Mahaveer Jain and Rohit Shetty left for Ayodhya to attend the Pran Pratishtha ceremony at the Ram Temple. pic.twitter.com/WDpI9cWCPT — ANI (@ANI) January 22, 2024 -
సుదృఢ నిర్మాణం... సుందర రూపం.. రామాలయం!
#ShriRamJanmabhoomiMandir అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ట వైభవానికి సర్వం సిద్ధమైంది. ఈ అంగరంగ వైభవానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ వేడుకను కనులారా తిలకించేందుకు అతిరథ మహారథులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, క్రికెటర్లు, మూవీ రంగ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు అంతా ఇప్పటికే అయోధ్యా నగరానికి చేరుకున్నారు. మరోవైపు శ్రీరామ జన్మభూమి మందిర్ను వెయ్యి సంవత్సరాలు చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మించామని ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో వెల్లడించింది. 70 ఎకరాల విస్తీర్ణంలో , 161.75 అడుగుల ఎత్తు, 380 అడుగుల పొడవు , 249.5 అడుగుల వెడల్పుతో విస్తరించి ఉన్న ఆ ఆలయ సముదాయం కలిగి ఉంది. డిజైన్ ఐదవ శతాబ్దంలో దాని మూలాలున్న నాగారా నిర్మాణ శైలిలో దీన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ప్రధాన శిఖరంతో పాటు మూడు అంతస్తులు, నృత్య మండప్, రంగ్ మండప్, గూఢ్ మండప్, కీర్తన మండప్ , ప్రార్థనా మండప్ అనే ఐదు మండపాలు ఉన్నాయి. దీని తయారీకి రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లా నుంచి గులాబీ రంగు బన్సీ పహార్పూర్ రాళ్లను కొనుగోలు చేశారు.అంతేకాదు భారీ భూకంపాలను (జోన్ 4) సైతం తట్టుకునేలా రూపొందించింది. ఆలయానికి ఇరువైపులా 390 స్తంభాలు, 6 మక్రానా పాలరాతి స్తంభాలు ఉన్నాయి. వాటిలో 10 వేలకు పైగా శిల్పాలు, ఇతివృత్తాలు భక్తులను అబ్బురపరుస్తాయి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి మే 2020 నుండి, దాదాపు మూడేళ్లలో కాంప్లెక్స్ను డిజైన్ చేసి నిర్మించిన శ్రీరామ జన్మభూమి ఆలయానికి 1000 సంవత్సరాల వరకు ఎలాంటి నష్టం జరగదని ఎల్ అండ్ టీ తెలిపింది. దాదాపు 1,500 మంది కళాకారుల బృందం రాళ్లపై క్లిష్టమైన శిల్పాలను తయారుచేశారని, QR కోడ్లతో 26,500 వ్యక్తిగత రాళ్లను పర్యవేక్షించడానికి స్టోన్ ట్రాకింగ్ అప్లికేషన్ను ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది. వెయ్యేళ్ల పాటు వెలుగొందేలా, ఓర్పుకు చిహ్నంగా ఈ ఇంజినీరింగ్ అద్భుతం నిలుస్తుందని కంపెనీ ఛైర్మన్ , ఎండీ సుబ్రహ్మణ్యన్ అన్నారు. దీని పునాదికి ఐఐటీ సంస్థల సహాయం కూడా తీసుకున్నామని చెప్పారు. ఈ ఆలయంలోని ప్రతి రాయిని ఎంతో శ్రద్ధగా, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతిష్ఠించామని ఎల్అండ్ టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎంవీ సతీష్ వెల్లడించారు. దీన్ని ఒక దేవాలయంగా మాత్రమే కాకుండా, అద్భుత ఇంజనీరింగ్ కళాఖండమని, ఇది తమ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. #WATCH | Actor Vivek Oberoi and singer Sonu Nigam arrive at Shri Ram Janmaboomi Temple in Ayodhya to attend the Pranpratishtha ceremony. Vivek Oberoi says, "It's magical, spectacular. I have seen so many images of it. But when you see it before your eyes, it seems that you are… pic.twitter.com/U7YAFATnct — ANI (@ANI) January 22, 2024 #WATCH | Actor Vivek Oberoi and singer Sonu Nigam arrive at Shri Ram Janmaboomi Temple in Ayodhya to attend the Pranpratishtha ceremony. Vivek Oberoi says, "It's magical, spectacular. I have seen so many images of it. But when you see it before your eyes, it seems that you are… pic.twitter.com/U7YAFATnct — ANI (@ANI) January 22, 2024 -
అయోధ్యకు వ్యాపారవేత్తల క్యూ..
అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి సుమారు 7000 మంది అతిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇందులో పారిశ్రామిక వేత్తలు, సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు ఉన్నారు. బాలరాముని ప్రాణప్రతిష్టకు హాజరయ్యే పారిశ్రామిక వేత్తలు రతన్ టాటా ముఖేష్ అంబానీ నీతా అంబానీ కుమార్ మంగళం బిర్లా అజయ్ పిరమల్ ఆనంద్ మహీంద్రా అజయ్ శ్రీరామ్ కె కృతివాసన్ కె సతీష్ రెడ్డి పునీత్ గోయెంకా SN సుబ్రహ్మణ్యన్ మురళి దివి ఎన్ఆర్ నారాయణ మూర్తి నవీన్ జిందాల్ నరేష్ ట్రెహాన్ అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రాణప్రతిష్ఠకు అద్వానీ, జోషి దూరం?
అయోధ్యలో నేడు జరిగే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి హాజరకావడంలేదంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. తీవ్రమైన చలి వాతావరణం కారణంగా అద్వాని అయోధ్యకు వెళ్లడం లేదని సమాచారం. రామమందిర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన లాల్ కృష్ణ అద్వానీతో పాటు బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి కూడా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకావడం లేదని తెలుస్తోంది. పెరుగుతున్న వయస్సు, ఆరోగ్య సంబంధిత సమస్యల దృష్ట్యా ఈ సీనియర్ నేతలిద్దరూ బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి లాల్ కృష్ణ అద్వానీ 90వ దశకంలో రామమందిర ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన నేతృత్వంలో 1990లో గుజరాత్లోని సోమనాథ్ నుంచి బీజేపీ రథయాత్రను ప్రారంభించింది. ‘మందిర్ వహీ బనాయేంగే’ నినాదంతో లాల్ కృష్ణ అద్వానీ రామమందిర ఉద్యమాన్ని సామాన్య ప్రజలలోకి తీసుకెళ్లారు. విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్తో పాటు ఇతర ప్రముఖులు స్వయంగా ఎల్కె అద్వానీ ఇంటికివెళ్లి, శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇది కూడా చదవండి: మారిషస్ నుంచి డెన్మార్క్ ... అంతా రామమయం! రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ‘96 ఏళ్ల వయస్సులో ఉన్న లాల్కృష్ణ అద్వానీ,90 ఏళ్ల వయస్సు కలిగిన మురళీ మనోహర్ జోషిలను ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించాం. అయితే వారు వయస్సు, అనారోగ్య కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమానికి హాజరుకాలేని స్థితిలో ఉన్నారని’ తెలిపారు. -
ప్రాణప్రతిష్ఠకు ముందు ఇంటిలో సీఎం యోగి పూజలు!
అయోధ్య రామాలయంలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన గురువులను స్మరించుకుని, పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన సోషల్ మీడియా సైట్లో షేర్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇలా రాశారు.. 'అయోధ్యధామ్లోని శ్రీరాముడి జన్మస్థలంలో నేడు జరుగుతున్న రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం శతాబ్ధాల పోరాట ఫలితం. ఈ సందర్భంగా దిగ్విజయ్నాథ్ మహరాజ్, మహంత్ అవేద్యనాథ్ మహారాజ్లకు ఉద్వేగభరితమైన నివాళులు అర్పిస్తున్నాను.. జై జై శ్రీ రామ్!’ అని రాశారు. श्री अयोध्या धाम में श्रीराम जन्मभूमि पर आज हो रही प्रभु श्री रामलला के नूतन विग्रह की प्राण-प्रतिष्ठा से पीढ़ियों का संघर्ष एवं सदियों का संकल्प पूर्ण हुआ है। इस अवसर पर युगपुरुष ब्रह्मलीन महंत दिग्विजयनाथ जी महाराज और राष्ट्रसंत ब्रह्मलीन महंत अवेद्यनाथ जी महाराज के प्रति… pic.twitter.com/slW5UjNUoC — Yogi Adityanath (@myogiadityanath) January 22, 2024 సీఎం యోగి మరో ట్వీట్లో ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు... ‘ఇది అద్భుతమైన, మరపురాని, అతీంద్రియ క్షణం.. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో శ్రీరాముని పవిత్ర జన్మస్థలమైన అయోధ్యధామ్లో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. నేడు ప్రధాని నేతృత్వంలో అసంఖ్యాక రామభక్తుల నిరీక్షణకు తెరపడనుంది. భక్తి సాగరంలో మునిగిన దేశమంతా రామనామం స్మరిస్తోంది’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు లండన్ సాధ్విల బృందం! -
నార్వేను అధిగమించనున్న ఉత్తరప్రదేశ్ - ఎలా అంటే?
సుమారు 500 సంవత్సరాల హిందువుల కల నెరవేరే రోజు, యావత్ ప్రపంచం భారత్ వైపు చూసే రోజు రానే వచ్చింది. ఈ రోజు బాలరాముని దర్శనం కేవలం ప్రముఖులకు మాత్రమే.. రేపటి నుంచి సామాన్య భక్తులు దర్శనం చేసుకునే సదుపాయం కల్పించనున్నట్లు సమాచారం. దీంతో ఉత్తరప్రదేశ్ ఆర్థికంగా వేలకోట్లు ఆర్జిస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నివేదికలు చెబుతున్నాయి. రామ మందిర నిర్మాణంతో అయోధ్య భారతదేశంలో సందర్శించదగ్గ పర్యాటక ప్రదేశం కానుంది. గతంలో కంటే ఎక్కువ మంది పర్యాటకులు అయోధ్యకు చేరుకునే అవకాశం ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను భారీగా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. 2024-25 ఉత్తరప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ రూ.20000 నుంచి రూ.25000 కోట్లు పెరుగుతుందని చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్ర పర్యాటకరంగం ఆదాయం రెట్టింపు అవుతుందని, ఇప్పటికే అయోధ్యలో హోటల్స్, రెస్టారెంట్స్, ఇతర వ్యాపారాలు భారీగా సాగుతున్నాయి. ఇదీ చదవండి: అంబానీ ఇల్లు.. అంతా రామమయం.. వీడియో వైరల్ 2022లో ఉత్తరప్రదేశ్ సందర్శించిన పర్యాటకులు 32 కోట్లు, ఇందులో 2.21 కోట్లమంది జనాభా అయోధ్యకు వచ్చారు. పర్యాటకులు ద్వారా వచ్చిన ఆదాయం రూ. 2 లక్షల కోట్లు అని తెలుస్తోంది. పర్యాటకులను ఆకట్టుకోవడంలో ముందంజలో ఉన్న ఉత్తరప్రదేశ్, అయోధ్య రామ మందిర నిర్మాణంతో మరింత ఆదాయం పొందనుంది. 2027 నాటికి ఉత్తరప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ 500 బిలియన్ డాలర్లు దాటుతుందని, దేశ జీడీపీలో ఇది 10శాతం అని చెబుతున్నారు. 2027-28 నాటికి జీడీపీ వెయిటేజ్లో ఉత్తరప్రదేశ్ 2వ స్థానం పొందుతుందని సమాచారం. నార్వే జీడీపీని అప్పటికి ఉత్తరప్రదేశ్ అధిగమించే అవకాశాలు చాలానే ఉన్నాయి. -
నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచిన టెలికాం కంపెనీలు.. ఎందుకంటే..
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కాసేపట్లో జరగబోతుంది. రామ మందిర ప్రారంభ వేడుకల్లో కార్పొరేట్ సంస్థలు సందడిగా పాల్గొంటున్నాయి. దాదాపు 7000 మంది అతిథులు కార్యక్రమానికి హాజరుకానున్నారు. దేశంలోని కోట్లమంది ఈ క్రతువును పరోక్షంగా టీవీలు, సామాజిక మాధ్యమాలు, ఇతర మీడియాల్లో వీక్షించే అవకాశం ఉంది. దాంతో ఇప్పటికే టెలికాం సంస్థలు అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ప్రతిష్టాపన పూర్తయిన తర్వాత రోజూ మూడు నుంచి ఐదు లక్షల మంది సందర్శకులు అయోధ్యను సందర్శించే అవకాశం ఉందని అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో దేశీయ టెలికాం సంస్థలైన వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ అయోధ్యలో తమ నెట్వర్క్ సామర్థ్యాన్ని మెరుగుపరిచాయి. రామమందిర ప్రతిష్ఠాపన నేపథ్యంలో అయోధ్యలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో నెట్వర్క్ మౌలిక సదుపాయాలు, సామర్థ్యాన్ని పెంచినట్లు తెలిపాయి. దీంతో వినియోగదారులు స్పష్టమైన వాయిస్ కాల్స్, హై-స్పీడ్ డేటా, వీడియో స్ట్రీమింగ్ వంటి సదుపాయాల్ని పొందొచ్చని చెప్పాయి. ఇదీ చదవండి: అయోధ్యలో హూటల్ రూం ధర ఎంతంటే..? అయోధ్య రైల్వే స్టేషన్, రామమందిర ప్రాంగణం, విమానాశ్రయం, ప్రధాన ప్రాంతాలు, నగరంలోని హోటళ్లతో సహా అన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో తమ నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచినట్లు వెల్లడించాయి. లఖ్నవూకు అనుసంధానించే హైవేలతో సహా నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో పటిష్ట సిగ్నలింగ్ కోసం స్పెక్ట్రమ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచినట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. అదనపు నెట్వర్క్ సైట్లు, అంతరాయం లేని నెట్వర్క్ అందించటం కోసం ఆప్టిక్ ఫైబర్ కేబుల్ను ఏర్పాటు చేసినట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. -
అయోధ్యకు లండన్ సాధ్విల బృందం!
శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశంలోని నలుమూలల నుంచి రామభక్తులు అయోధ్య నగరానికి చేరుకుంటున్నారు. 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత జరుగుతున్న ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విదేశాల నుంచి కూడా రామభక్తులు తరలివస్తున్నారు. లండన్కు చెందిన మహిళల బృందం ఇప్పటికే అయోధ్య చేరుకుంది. వారిలో కొందరు మనస్తత్వవేత్తలు, మరికొందరు జీవశాస్త్రవేత్తలు ఉన్నారు. వీరు సాధ్విలుగా మారారు. వీరంతా తమ ఉద్యోగాలను వీడి, సన్యాసం స్వీకరించారు. సాధ్వి అవధి మాట్లాడుతూ తాను తన చిన్నతనంలో అయోధ్యకు వచ్చానని, ఇప్పుడు రామ్లల్లా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చానని తెలిపారు. అయోధ్యకు తరలివచ్చిన సాధ్వి అవక్షి మాట్లాడుతూ ‘తామంతా సాధ్విలం, అశుతోష్మావారి అనుచరులం. రామ్లల్లా పవిత్రోత్సవంలో పాల్గొనేందుకు వచ్చాం. ఇది సనాతనీయులకు అపూర్వమైన రోజు. దీని వెనుక ఎన్నో ఏళ్ల పోరాటం ఉంది. ఇప్పుడు ప్రపంచ వేదికపై హిందువులు బహిరంగంగా ఉత్సవం జరుపుకునే అవకాశం వచ్చిందని’ అన్నారు. సాధ్వి గాబ్రియేల్ మాట్లాడుతూ ‘నాలోని భక్తే నన్ను రామ్లల్లాకు దగ్గర చేసింది. అందరూ అయోధ్య రాముని గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ సానుకూల శక్తి అపారంగా ఉంది. కొన్ని యుగాలుగా మనకు మార్గదర్శకంగా నిలిచిన రామాయణం, హిందూ సంస్కృతి, వేదాలు, మంత్రాలు మనల్ని సన్మార్గంలో నడిపిస్తున్నాయి. సాధ్వి అవక్షి డబుల్ పీహెచ్డీ చేశారు. బ్రిటిష్ ప్రభుత్వ విభాగంలో ఫిజియాలజిస్ట్గా పనిచేశారు. ఆమె తన ఉద్యోగాన్ని వదులుకొని సాధ్వీగా మారారు. గాబ్రియెల్.. బ్రిటన్లో జీవశాస్త్రవేత్తగా పనిచేశారు. పదవీ విరమణ పొందాక, సాధ్విగా మారారు. ఇది కూడా చదవండి: మారిషస్ నుంచి డెన్మార్క్ ... అంతా రామమయం! -
అయోధ్య చేరుకున్న మెగాస్టార్ దంపతులు
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు హాజరు కానున్నారు. 500 ఏళ్లనాటి భారతీయుల కల సాకారమవుతున్న వేళ.. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. ఇలాంటి మహత్తర కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న చిరంజీవి, సురేఖ దంపతులు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకున్నారు. మధ్యాహ్నం.. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మెగాస్టార్ కుటుంబం పాల్గొననుంది. మెగాస్టార్, రామ్ చరణ్ అయోధ్యకు పయనమైన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. ఇప్పటికే అయోధ్య ఆహ్వానం రావడాన్ని తన పూర్వ జన్మ సుకృతమని మెగాస్టార్ ట్వీట్ చేశారు. ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. నా ఆరాధ్య దైవం హనుమంతుడు నన్ను వ్యక్తిగతంగా ఆహ్వానించినట్లుగా భావిస్తున్నానని చిరంజీవి తన్మయత్వానికి లోనయ్యారు. MegaStars ✨ #RamCharan and #Chiranjeevi garu are being Welcomed in Ayodhya 🚩#RamMandirPranPrathistha 🕉️🙏pic.twitter.com/WbUcOsvtaQ — Ujjwal Reddy (@HumanTsunaME) January 22, 2024 Creating history Evoking history Everlasting in History This is truly an overwhelming feeling.. I consider this invitation a godsend opportunity to witness the consecration of Ram Lalla at Ayodhya. That glorious chapter, when the excruciating wait of generations of Indians… — Chiranjeevi Konidela (@KChiruTweets) January 21, 2024 -
నేడు అయోధ్యలో ఏ సమయానికి ఏం జరగనుంది?
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో మరికొద్ది సేపట్లో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన 16 ఆచారాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు అయోధ్యలో ఏడంచెల భద్రత కల్పించారు. ఎస్పీజీ, ఎన్ఎస్జీ కమాండోలను అయోధ్య అంతటా మోహరించారు. డ్రోన్లతో అయోధ్య అంతటా నిఘా కొనసాగుతోంది. నేడు అయోధ్యకు మొత్తం 7,140 మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ రోజు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠతో పాటు జరిగే కార్యక్రమాల వివరాలివే.. దేవకినందన్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీరామ కథా పారాయణం. అయోధ్యలో ప్రముఖంగా వెలుగొందుతున్న వంద ప్రదేశాలలో ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంస్కృతిక ఊరేగింపు. యూపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1500 మంది జానపద నృత్య కళాకారుల ప్రదర్శనలు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రాంతీయ సాంస్కృతిక కేంద్రాలకు చెందిన 200 మంది కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు. రామకథా పార్కులో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు రాంలీలా ప్రదర్శన. సాయంత్రం 6.30 నుండి 7 గంటల వరకు శ్రీరామునికి సరయూ హారతి. రాత్రి 7 నుంచి 7.30 వరకు రామ్ కి పైడిపై ప్రొజెక్షన్ షో. రామకథా పార్కులో రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాటేకర్ సిస్టర్స్ సారధ్యంలో రామకథా గానం. తులసీ ఉద్యానవనంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శర్మ బంధుచే భజన కార్యక్రమం రాత్రి 7.45 నుండి 7.55 వరకు రామ్ కీ పైడి వద్ద బాణసంచా కాల్చడం. కన్హయ్య మిట్టల్ సారధ్యంలో రామకథా పార్క్ వద్ద రాత్రి 8 నుండి 9 గంటల వరకు భక్తి సాంస్కృతిక కార్యక్రమం. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు తులసి ఉద్యానవనంలో రఘువీర పద్మశ్రీ మాలినీ అవస్థి సారధ్యంలో ప్రత్యేక కార్యక్రమం. #WATCH | Ayodhya, Uttar Pradesh: Morning visuals from Ram Janmabhoomi premises ahead of the Pran Pratishtha ceremony of Ram Temple, today. pic.twitter.com/qIRiYVgnei — ANI (@ANI) January 22, 2024 నూతన రామాలయంలో నేటి మధ్యాహ్నం 12:29:08 గంటల నుంచి 12:30:32 గంటల వరకు.. అంటే 84 సెకన్ల కాలంలో గర్భగుడిలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ నేపధ్యంలో ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఓర్చాలో 5100 మట్టి దీపాలను వెలిగించారు. -
శ్రీరాముని కోసం సీనియర్ నటి ప్రత్యేక గీతం..!
సీనియర్ నటి సుకన్య దక్షిణాది సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో కథానాయకిగా పలు చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగుతున్నారు. ఇకపోతే సుకన్యలో నాట్య, సంగీత కళాకారిణి, గాయని, గీత రచయిత కూడా ఉన్నారనే విషయం చాలా మందికి తెలియదు. తాజాగా నటి సుకన్య శ్రీరాముని కోసం ఓ భక్తి గీతాన్ని రూపొందించింది. అయోధ్య శ్రీరామచంద్రుని ఆలయ నిర్మాణం సాకారమవుతున్న తరుణంలో ఈ విషయాన్ని ఆమె మీడియాకు వెల్లడించారు. ఈ ఆలయం నిర్మాణం ప్రారంభించిన సమయంలో తన ముఖంపై గీసుకున్న శ్రీరామ్ అనే చిత్రలేఖనం అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో విశేష ప్రాచుర్యం పొందిందన్నారు. తాజాగా 500 ఏళ్ల నాటి కల జనవరి 22న సాకారం కాబోతోన్న వేళ తాను రూపొందించిన జై శ్రీరామ్ భక్తిరస గీతాన్ని వీడియోగా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. శ్రీరామ నామ మహిమ, ఆయన పరాక్రమం, రామాయణం కథను ఆవిష్కరించే విధంగా తాను రూపందిస్తున్న జై శ్రీరామ్ ఆడియోను ఆ శ్రీరాముని ఆలయ నిర్మాణంలో భాగంగా సమర్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
మారిషస్ నుంచి డెన్మార్క్ ... అంతా రామమయం!
అయోధ్యలోని నూతన రామాలయంలో నేడు బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న నేపధ్యంలో దేశం మొత్తం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. అయోధ్యలో మారుమోగుతున్న హర్షధ్వానాల ధ్వని ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రామభక్తులు బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగే అద్భుత క్షణాల కోసం ఎదురుచూస్తున్నారు. హిందువులే కాదు ఇతర మతాల వారు కూడా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసేందుకు అమితమైన ఉత్సాహం చూపిస్తున్నారు. 50కి పైగా దేశాలలో వివిధ మాధ్యమాల సాయంతో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకను చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. లండన్ వీధుల్లో జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటుతుండగా, బ్రిటన్లో నిర్వహించిన కారు ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ దేశంలోని సుమారు 250 దేవాలయాల్లో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నేపాల్లో.. నేపాల్లోని జనక్పూర్లో గల జానకీమాత ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. జనక్పూర్ మేయర్ మనోజ్ కుమార్ సాహా.. బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భారతదేశ ప్రజలకు, ముఖ్యంగా అయోధ్యవాసులకు శుభాకాంక్షలు తెలిపారు నేపాల్కు భారత్తో సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. శ్రీరాముని అత్తమామల స్వస్థలం అయిన జనక్పూర్లో నేడు దీపోత్సవం జరగనుంది. ఇది కూడా చదవండి: అయోధ్యకు ఎలా వెళ్లాలి? దర్శనానికి ఏం చేయాలి? కెనడాలో.. కెనడాలోని అంటారియో పరిధిలోగల ఓక్విల్లే, బ్రాంప్టన్ నగరాల్లో నేటి రోజును ‘అయోధ్య రామ మందిర దినోత్సవం’గా ప్రకటించాయి. బ్రాంప్టన్ మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్, ఓక్విల్లే మేయర్ రాబ్ బర్టన్ మాట్లాడుతూ అయోధ్యలో జరిగే శ్రీరామ మందిర ప్రారంభోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు సాంస్కృతికంగా, చారిత్మాకంగా ఎంతో ముఖ్యమైనదని అన్నారు. శతాబ్దాల నాటి కల సాకరమయ్యిందని మేయర్లిద్దరూ పేర్కొన్నారు. మారిషస్లో.. ద్వీప దేశమైన మారిషస్లోని అన్ని దేవాలయాలు ‘ప్రాణప్రతిష్ఠ’ సందర్బంగా దీపాలతో వెలుగులు పంచనున్నాయి. 48 శాతం హిందూ జనాభా ఉన్న మారిషస్లోని అన్ని దేవాలయాల్లో రామాయణ పారాయణం జరగనున్నది. హైకమిషనర్ హేమండోయిల్ దిలామ్ మాట్లాడుతూ ఈ ఉత్సవం భారతదేశానికే కాకుండా మారిషస్ ప్రజలకు కూడా ఎంతో ముఖ్యమైనదని అన్నారు. మారిషస్ ప్రభుత్వం నేడు హిందూ ఉద్యోగులకు రెండు గంటల సెలవులు ఇచ్చింది. ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు మారిషస్లోని 100 ప్రదేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇది కూడా చదవండి: ప్రాణ ప్రతిష్ఠను ‘ప్రత్యక్షం’గా చూడటమెలా? డెన్మార్క్లో.. డెన్మార్క్లోని హిందూ స్వయంసేవక్ సంఘ్.. అయోధ్యలోని రామ మందిరంలో జరిగే బాలరాముని ప్రాణప్రతిష్ట వేడుక సందర్భంగా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. డానిష్ అంబాసిడర్ పూజా కపూర్ మాట్లాడుతూ ఈ వేడుక సందర్భంగా భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయారన్నారు. దీర్ఘకాలంగా కొనసాగిన రామాలయ వివాదాన్ని పరిష్కరించి, ఆలయాన్ని ఏర్పాటు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్నవారికి అయోధ్య అక్షతలు పంపిణీ చేశారు. న్యూజిలాండ్లో.. అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా న్యూజిలాండ్ రెగ్యులేషన్ మంత్రి డేవిడ్ సేమౌర్ మాట్లాడుతూ ‘జై శ్రీరామ్... ప్రధాని నరేంద్ర మోదీ సహా భారతీయులందరికీ అభినందనలు. 500 ఏళ్ల తర్వాత రామ మందిర నిర్మాణం సాధ్యమైంది. ప్రధాని మోదీ నాయకత్వమే దీనికి కారణం. ఈ ఆలయం చాలా గొప్పది. రాబోయే వెయ్యి సంవత్సరాల పాటు నిలిచివుంటుంది. ప్రధాని మోదీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. భారతదేశంలోని కోట్లాదిమంది ప్రజలు మోదీకి అండగా నిలిచారు’ అని పేర్కొన్నారు. ఫ్రాన్స్లో.. ఫ్రాన్స్ రాజధాని పారిస్లోని ఈఫిల్ టవర్ కూడా ‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుకలకు ముస్తాబయ్యింది. ఫ్రాన్స్లోని ప్యాలెస్ డి లా చాపెల్లో నేటి మధ్యాహ్నం 12 గంటలకు భారీ రథయాత్ర బయలుదేరనుంది. ఈఫిల్ టవర్ సమీపంలోని ప్యాలెస్ డి ట్రోకాడెరో సమీపంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ రథయాత్ర ముగియనుంది. దీనికి ముందు ఉదయం 10.30 గంటలకు లా చాపెల్లే సమీపంలో విశ్వకళ్యాణ యాగం నిర్వహించనున్నారు. థాయ్లాండ్లో.. భారతదేశానికి 3,500 కిలోమీటర్ల దూరంలోని థాయ్లాండ్లోనూ మరో అయోధ్య ఉంది. దీనిని ఆ దేశంలో ‘అయుతయ’ అని పిలుస్తారు. బ్యాంకాక్లోని విశ్వహిందూ పరిషత్ సభ్యులు అయుతయతో సహా థాయ్లాండ్లోని అన్ని హిందూ దేవాలయాలలో రామ మందిర ప్రతిష్టాపన వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేశారు. దేశంలోని పలు నగరాల్లో ‘అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ’ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. -
Ayodhya Ram Mandir: అయోధ్యలో దీపోత్సవం
Ram mandir pran pratishtha Live Updates సాయంత్రం 5.30:.. సోమవారం, జనవరి 22 అయోధ్యలో దీపోత్సవం సరయూ నది ఒడ్డున 14 లక్షల దీపాలు వెలిగించిన భక్తులు దీప కాంతులతో వెలిగిపోతున్న సరయూ తీరం దేశ వ్యాప్తంగా ఇంటింటా రామజ్యోతి రామ్ కీ పైడీ, కనక్ భవన్, గుప్తర్ ఘాట్, సరయూ ఘాట్, లతా మంగేష్కర్ చౌక్, మనిరామ్ దాస్ చావ్నీ దీపాలతో అలంకరణ रामज्योति! #RamJyoti pic.twitter.com/DTxg2QquTT — Narendra Modi (@narendramodi) January 22, 2024 సాయంత్రం 4గం.. సోమవారం, జనవరి 22 బాల రాముడి విగ్రహ ప్రతిష్టతో చారిత్రక ఘట్టం పూర్తి రేపటి నుంచి సామాన్య భక్తులకు భగవాన్ రామ్ లల్లా దర్శనం వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ ద్వారా రామ దర్శనం మొదటి స్లాట్ ఉదయం 7 నుండి 11:30 వరకు రెండో స్లాట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఉదయం 6:30కు ఆలయంలో జాగ్రన్ , శృంగార్ హరతి హరతికి ఒక రోజు ముందుగానే బుకింగ్. రాత్రి 7 గంటలకు సాయంత్రం హారతి సమయం ఒకరోజు ముందుగానే బుకింగ్ చేసుకోవాలి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రస్ట్ వెబ్సైట్లో బుకింగ్ 3గం:10ని.. సోమవారం, జనవరి 22 రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకున్నవారికి ప్రధాని మోదీ సన్మానం పూలు జల్లి కృతజ్ఞతలు తెలిపిన మోదీ. 2గం:12ని.. సోమవారం, జనవరి 22 ఈరోజు మన రాముడు వచ్చేశాడు: ప్రధాని నరేంద్ర మోదీ జై శ్రీరామచంద్రమూర్తి జై అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ రామ భక్తులందరికీ నా ప్రణామాలు ఈరోజు మన రాముడు వచ్చేశాడు ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న మన రాముడు వచ్చేశాడు ఈ క్షణం ఎంతో ప్రత్యేకమైనది ఇది సామాన్యమైన సమయం కాదు రాముడు భారతదేశ ఆత్మ రాముడు భారతదేశానికి ఆధారం ఎక్కడ రాముడు కార్యక్రమం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు ఎంతో చెప్పాలని ఉన్నా.. నా గొంతు గద్గదంగా ఉంది నా శరీరం ఇంకా స్పందించే స్థితిలో లేదు ఎంతో అలౌకిక ఆనందంలో ఉన్నాను అన్ని భాషల్లోనూ రామాయణాన్ని విన్నాను గర్భగుడిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట నా చేతులు మీదుగా జరగడం నా అదృష్టం జనవరి 22వ తేదీ చరిత్రలో నిలిచిపోతుంది మన రాముడు టెంట్లో ఉండే పరిస్థితులు ఇక లేవు మన రాముడు ఇకపై దివ్యమైన మందిరంలో ఉంటారు రాముడి దయవల్ల మనమందరం ఈ క్షణానికి సాక్షులమయ్యాం ఈ నేల, గాలి ప్రతీది దివ్యత్వంతో నిండిపోయింది ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడుతున్న సరికొత్త అధ్యాయం ఇంత ఆలస్యం జరిగినందుకు మమ్మల్ని క్షమించమని శ్రీరాముడిని వేడుకుంటున్నా త్రేతాయుగంలో శ్రీరాముడు కేవలం 14 ఏళ్ల వనవాసానికి వెళ్లాడు కలియుగంలో రాముడు వందలయేళ్లపాటు వనవాసం చేశాడు భారత న్యాయవ్యవస్థకు ఈరోజు నేను నమస్కరిస్తున్నా న్యాయబద్ధంగానే శ్రీరాముడి మందిర నిర్మాణం జరిగింది ఈరోజు దేశ వ్యాప్తంగా దేవాలయాల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి దేశ ప్రజలందరూ ఇవాళ దీపావళి జరుపుకుంటున్నారు ఇంటింటా రాముడి దీపజ్యోతి వెలిగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఈ రోజు మనకు శ్రీరాముడి మందిరం దొరికింది బానిస సంకెళ్లను తెంచుకున్న కొత్త రాజ్యం ఆవిర్భించింది ఈ అనుభూతిని ప్రతి రామ భక్తుడు అనుభవిస్తున్నాడు రాముడు వివాదం కాదు.. ఒక సమాధానం రాముడు వర్తమానమే కాదు.. అనంతం రాముడు అందరివాడు రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారిని అయోధ్యకు ఆహ్వానిస్తున్నా ఇవాళ్టి ఈ చరిత్ర వేలయేళ్లపాటు నిలిచిపోతుంది రాబోయే వెయ్యేళ్ల కోసం నేడు పునాదిరాయి వేస్తున్నాం సేవా, చింతన భక్తిని.. హనుమంతుడి నుంచి ప్రేరణ పొందాలి రాముడు తప్పక వస్తాడన్న శబరి ఎదురుచూపులు ఫలించాయి దేవుడి నుంచి దేశం.. రాముడి నుంచి రాజ్యం ఇది మన నినాదం నేను సామాన్యుడిని, బలహీనుడినని భావిస్తే.. ఉడత నుంచి ప్రేరణ పొందండి 2గం:10ని.. సోమవారం, జనవరి 22 మోదీ గొప్ప తపస్వి: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ ఆనందం మాటల్లో చెప్పలేనిది. అయోధ్యలో బాలరాముడితోపాటు భారత కీర్తి తిరిగొచ్చింది. మోదీ గొప్ప తపస్వి ప్రధాని మోదీ కఠిన నియమాలు పాటించారు. ఈ కార్యక్రమాన్ని వర్ణించేందుకు మాటలు చాలడం లేదు కష్టకాలలంలో ప్రపంచశాంతికి ఇది దిక్సూచిలాంటింది ఎందరో త్యాగాల ఫలితం ఇవాళ్టి సువర్ణ ఆధ్యాయం 1గం:58ని.. సోమవారం, జనవరి 22 యోగి భావోద్వేగ ప్రసంగం 50ం ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది ఎన్నో తరాలు ఈ క్షణం కోసం నిరీక్షించాయి ఈ అద్భుత ఘట్టాన్ని వర్ణించేందుకు నాకు మాటలు రావడం లేదు దేశంలోని ప్రతీ పట్టణం, గ్రామం అయోధ్యగా మారింది ప్రతీ ఒక్కరూ ఆనంద భాష్పాలతో అయోధ్య వైపు చూశారు కలియుగం నుంచి త్రేతాయుగంలోకి వచ్చామ్మా? అనే భావన నెలకొంది ప్రతీ రామ భక్తుడు సంతృప్తి.. గర్వంతో ఉన్నాడు తన ఆలయం కోసం సాక్షాత్తూ శ్రీరాముడే పోరాడాల్సి వచ్చింది ఆ మహాసంకల్పం మోదీ చేతుల మీదుగా పూర్తయ్యాయింది బాలరాముడి రూపాన్ని చెక్కిన శిల్పి జీవితం ధన్యమైంది #WATCH | Uttar Pradesh CM Yogi Adityanath says, "The entire country has become 'Rammay'. It seems that we have entered Treta Yug..."#RamMandirPranPrathistha pic.twitter.com/6Sd7lJrOy8 — ANI (@ANI) January 22, 2024 1గం:55ని.. సోమవారం, జనవరి 22 మోదీ కఠోర దీక్ష విరమణ అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కోసం నరేంద్ర మోదీ కఠోర ఉపవాసం ప్రధాని మోదీ 11 రోజుల కఠోర దీక్ష దీక్ష విరమింపజేసిన గోవింద్ దేవ్ గిరి మహారాజ్ మోదీకి వెండి ఆలయ నమునా ఇచ్చిన.. బంగారు ఉంగం ఇచ్చిన ట్రస్ట్ 11 రోజులపాటు మోదీ కఠోర దీక్ష చేశారు: గోవింద్ దేవ్ గిరి మహారాజ్ దేశవ్యాప్తంగా ఆయన అన్ని ఆలయాలు తిరిగారు: గోవింద్ దేవ్ గిరి మహారాజ్ కొబ్బరి నీళ్లు తాగి నేల మీద పడుకున్నారు: గోవింద్ దేవ్ గిరి మహారాజ్ ఇలాంటి సంకల్ప బలం ఉన్న వ్యక్తి దేశ నాయకుడు కావడం గర్వకారణం: గోవింద్ దేవ్ గిరి మహారాజ్ #WATCH | PM Narendra Modi breaks his fast after the ‘Pran Pratishtha’ ceremony at the Shri Ram Janmaboomi Temple in Ayodhya. #RamMandirPranPrathistha pic.twitter.com/Zng1IHJ2FJ — ANI (@ANI) January 22, 2024 1గం:33ని.. సోమవారం, జనవరి 22 అయోధ్య రాముడి దర్శన వేళలు ఇవే అయోధ్యలో శాస్త్రోక్తంగా జరిగిన ప్రాణ ప్రతిష్ట మహోత్సవం రేపటి నుంచి సామాన్యుల సందర్శనకు అనుమతి రెండు స్లాట్ల కేటాయింపు ఉదయం 7 నుంచి 11గం.30ని వరకు.. మధ్యాహ్నాం 2గం. నుంచి 7 గం. వరకు అనుమతి 1గం:28ని.. సోమవారం, జనవరి 22 ఎటు చూసినా భావోద్వేగమే! అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో దేశమంతటా భావోద్వేగ సన్నివేశాలుఔ దేశమంతటా రామ నామ స్మరణం కాషాయ వర్ణంతో మురిసిపోతున్న హిందూ శ్రేణులు ఆలింగనంతో కంటతడిపెట్టిన బీజేపీ నేత ఉమాభారతి, సాధ్వీ రీతాంభరలు రామ మందిర ఉద్యమంలో కీలకంగా వ్యహరించిన ఈ ఇద్దరూ 1గం:16ని.. సోమవారం, జనవరి 22 రామ్ లల్లాకు తొలి హారతి అయోధ్య రామ మందిరంలో కొలువు దీరిన శ్రీరామ చంద్రుడు రమణీయంగా సాగిన ప్రాణప్రతిష్ట క్రతువు కర్తగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ బాలరాముడి అవతారంలో కొలువు దీరిన వైనం పసిడి కిరీటం, పట్టు వస్త్రం సమర్పణ దేశమంతటా రామ భక్తుల సందడి రామ్ లల్లాకు తొలి హారతి ఇచ్చిన ప్రధాని మోదీ రామయ్యకు మోదీ సాష్టాంగ నమస్కారం #WATCH | PM Modi performs 'Dandavat Pranam' at the Shri Ram Janmaboomi Temple in Ayodhya. #RamMandirPranPrathistha pic.twitter.com/kAw0eNjXRb — ANI (@ANI) January 22, 2024 12గం:54ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యలో అపూర్వ ఘట్టం.. తొలి దర్శనం అయోధ్య రామ మందిరంలో జరిగిన ప్రాణ ప్రతిష్ట మహోత్సవం రామ్ లల్లా తొలి దర్శనం రామనామస్మరణతో ఉప్పొంగిపోతున్న హిందూ హృదయాలు గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నేతృత్వంలో మహాగంభీరంగా జరిగిన ప్రాణప్రతిష్ట క్రతువు పద్మపీఠంపై ధనుర్ధారియై బాలరాముడి తొలి దర్శనం మెడలో రత్నాల కాసుల మాల స్వర్ణాభరణాలతో బాలరాముడు తలపై వజ్రవైడ్యూరాల్యతో పొదిగిన కిరీటం పాదాల వద్ద స్వర్ణ కమలాలు సకలాభరణాలతో బాలరాముడి నుదుట వజ్రనామం 84 సెకన్ల దివ్య ముహూర్తంలో సాగిన ప్రాణ ప్రతిష్ట క్రతువు ఆ సమయంలో అయోధ్య ఆలయంపై హెలికాఫ్టర్లతో పూల వర్షం Prime Minister Narendra Modi performs 'aarti' of Ram Lalla idol at the Shri Ram Janmaboomi Temple in Ayodhya.#RamMandirPranPrathistha pic.twitter.com/EDjYa3yw7V — ANI (@ANI) January 22, 2024 12గం:30ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతం అయోధ్యలో నూతన రామ మందిరంలో కొలువుదీరనున్న బాలరాముడు రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కర్తగా ప్రధాని నరేంద్ర మోదీ జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగుతున్న దేశం మరికొద్ది నిమిషాల్లో బాలరాముడికి ప్రాణప్రతిష్ట 12గం:26ని.. సోమవారం, జనవరి 22 గర్భాలయంలోకి ప్రధాని మోదీ ప్రత్యేక పూజల అనంతరం గర్భగుడిలోకి మోదీ గర్భాలయంలో ప్రాణప్రతిష్ట పూజల్లో ప్రధాని మోదీ మోదీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, గవర్నర్ ఆనందీ బెన్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా వేదమంత్రాల నడుమ కొనసాగుతున్న బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట క్రతువు 12గం:20ని.. సోమవారం, జనవరి 22 ప్రారంభమైన ప్రాణప్రతిష్ట మహోత్సవం అయోధ్య రామ మందిరంలోకి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు బాలరాముడి కోసం పట్టు పీతాంబరాలు, ఛత్రం, పాదుకలు తీసుకొచ్చిన మోదీ వెంట ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ #WATCH | Prime Minister Narendra Modi arrives at Shri Ram Janmaboomi Temple in Ayodhya to participate in the Ram Temple Pran Pratishtha ceremony pic.twitter.com/XkLf1aV1hh — ANI (@ANI) January 22, 2024 12గం:00ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యలో అపురూప క్షణాలు అయోధ్యలో రామయ్య కొలువుదీరే అపురూప క్షణాలు ఆసన్నం మరికాసేపట్లో రామ మందిరంలో రామయ్య విగ్రహాన్ని ప్రతిష్టించనున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మధ్యాహ్నం 12.20 నుంచి ఒంటి గంట మధ్య అభిజిత్ లగ్నంలో ఈ వేడుక ప్రాణప్రతిష్ఠను 84 సెకన్ల దివ్య ముహూర్తంలో నిర్వహణ మధ్యాహ్నం 12.29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు దివ్యముహూర్తం ముందుగా రామ్లల్లా విగ్రహ కళ్లకు ఆచ్ఛాదనగా ఉన్న వస్త్రాన్ని తొలగింపు బంగారంతో చేసిన చిన్న కడ్డీతో శ్రీరాముడికి కాటుక దిద్దడం ఆపై రామ్లల్లాకు చిన్న అద్దాన్ని చూపిస్తారు ఆ తర్వాత 108 దీపాలతో ‘మహా హారతి’ ఇవ్వడంతో ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగుస్తుంది 11గం:43ని.. సోమవారం, జనవరి 22 ఆలయంపై పుష్పవర్షం.. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఆలయంపై హెలికాప్టర్లతో పుష్పవర్షం 25 రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు రెండు గంటల పాటు మంగళ వాయిద్యాలు మోగిస్తారు వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు.. కర్తలుగా వ్యవహరిస్తాయి ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు 7 వేల మంది పాల్గొననున్నారు వారిద్దరు రామలక్ష్మణుల్లా రామమందిరాన్ని నిర్మించారు: సినీ నటుడు సుమన్ సినీనటుడు సుమన్ అయోధ్య రామ మందిరానికి చేరుకున్నారు ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు అభినందనలు: సుమన్ వారిద్దరు రామలక్ష్మణుల మాదిరిగా కష్టపడి రామాలయాన్ని నిర్మించారు రామాలయ నిర్మాణానికి భగవంతుడు వారికి సహకరించారు శ్రీరాముడు మతానికి అతీతుడు: ఆనంద్ మహీంద్రా శ్రీరాముడు మతానికి అతీతుడు: ఆనంద్ మహీంద్రా మన విశ్వాసాలు ఏవైనా.. గౌరవం, బలమైన విలువలతో జీవించడానికి అంకితమైన మహావ్యక్తి రాముడు అనే భావనకు ఆకర్షితులవుతాం ఆయన బాణాలు చెడు, అన్యాయాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి ‘రామరాజ్యం’ అనే ఆదర్శ పాలన భావన నేడు అన్ని సమాజాల ఆకాంక్ష ఇప్పుడు ‘రామ్’ అనే పదం యావత్ ప్రపంచానికి చెందింది: ఆనంద్ మహీంద్రా 11గం:29ని.. సోమవారం, జనవరి 22 సాయంత్రం దాకా మోదీ ఇక్కడే ఉదయం 11 గంటల ప్రాంతంలో రామజన్మభూమికి చేరుకున్న ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ఠ క్రతువు పూర్తయిన తర్వాత భక్తులనుద్దేశించి ప్రసంగం ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో అయోధ్యలోని కుబర్ తిలాలో ఉన్న శివ మందిర్ను సందర్శన సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఢిల్లీకి పయనం అయోధ్య ప్రాణప్రతిష్ట.. అంతటా ఇలా.. New York Celebrates Arrival of "Shree Ram"#RamMandirPranPrathistha #RamMandirAyodhya #AyodhyaRamMandir #AyodhyaSriRamTemple #AyodhyaJanmBhoomi #RamMandirInauguration pic.twitter.com/5kJGjUEMEr — One World News (@Oneworldnews_) January 22, 2024 At Eiffel tower Paris. 🥳 Jai Shri Ram 🚩#JaiShriRam #RamLallaVirajman #RamMandirPranPratishta #AyodhaRamMandir #Ayodhya #AyodhyaRamMandir pic.twitter.com/mOZVCBZJF1 — Secular Chad (@SachabhartiyaRW) January 22, 2024 New York Celebrates Arrival of "Shree Ram"#RamMandirPranPrathistha #RamMandirAyodhya #AyodhyaRamMandir #AyodhyaSriRamTemple #AyodhyaJanmBhoomi #RamMandirInauguration pic.twitter.com/5kJGjUEMEr — One World News (@Oneworldnews_) January 22, 2024 San Francisco 🇺🇸 turned into Ayodhya 🇮🇳 for a night to celebrate the RamMandir Inauguration 🚩 Jai Shree Ram 🙏#RamMandirPranPrathistha pic.twitter.com/M3eQQMFym1 — SaNaTaNi ~ 𝕏𝐎𝐍𝐄 🚩 (@xonesanatani) January 22, 2024 श्री राम के दर्शन करने पहुंचे भारतीय क्रिकेटर।।।#जयश्रीराम #अयोध्या #JaiSriRam #AyodhyaRamMandir pic.twitter.com/DedGNBdMs6 — Hriday Singh (@hridaysingh16) January 22, 2024 11గం:22ని.. సోమవారం, జనవరి 22 కాసేపట్లో ప్రాణప్రతిష్ట అయోధ్యలో ప్రధాని మోదీ దేశమంతటా రామనామస్మరణ సర్వోన్నతంగా నిర్మించిన రామ మందిరం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం జాబితాలో చోటు ఐదేళ్ల బాలరాముడి అవతారంలో రామ్ లల్లా కాసేపట్లో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఇప్పటికే రామజన్మ భూమికి భారీగా భక్తజనం 11గం:00ని.. సోమవారం, జనవరి 22 మరో దీపావళిలా.. దేశ వ్యాప్తంగానే కాదు.. విదేశాలలో అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట వేడుకలు అన్ని ఆలయాల్లో.. ప్రత్యేకించి రామాలయం, హనుమాన్ గుడిలలో ప్రత్యేక పూజలు జై శ్రీరామ్ నినాదాలతో.. భక్తి శ్రద్ధలతో వివిధ కార్యక్రమాల నిర్వహణ ఆలయాల్లోనే కాదు.. ప్రతీ ఇంటా దీపం రావణుడిపై జయం తర్వాత శ్రీరాముడు రాక సందర్భంగా దీపావళి ఇప్పుడు అయోధ్య మందిర నేపథ్యంలో దీపాలంకరణలతో.. మరో దీపావళిలా దివ్యోత్సవం 10గం:45ని.. సోమవారం, జనవరి 22 భారీగా ప్రముఖులు.. భద్రత కాసేపట్లో అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట పాల్గొననున్న ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకున్న అన్ని రంగాల ప్రముఖులు అన్ని రాష్ట్రాల నుంచి సినీ రంగాల ప్రముఖులు పలువురు రాజకీయ ప్రముఖులు 12 గంటల నుంచి ప్రాణ ప్రతిష్ట క్రతువు ప్రారంభం 10గం:40ని.. సోమవారం, జనవరి 22 తెలంగాణ అంతటా.. ఆధ్యాత్మిక శోభ అయోధ్య రామ మందిర బాలరాముడి ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో తెలంగాణలో కోలాహలం పలు ఆలయాలు సుందరంగా ముస్తాబు అర్ధరాత్రి నుంచి మైక్ సెట్లతో హడావిడి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో శ్రీరామచంద్రుడి పల్లకి ఊరేగింపు లొ పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ 10గం:35ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ బాలరాముడి ప్రాణప్రతిష్టలో పాల్గొననున్న ప్రధాని మోదీ కాసేపట్లో అయోధ్య రామజన్మభూమికి మోదీ మ.1.15ని. విశిష్ట సభలో ప్రధాని మోదీ ప్రసంగం ఇదీ చదవండి: అయోధ్యకు వ్యాపారవేత్తల క్యూ.. జై శ్రీరామ్ నినాదాలతో.. దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం దేశం నలుమూలల నుంచి అయోధ్యకు చేరుకుంటున్న రామ భక్తులు వేలాది మంది సాధువులు దేశం నుంచి అయోధ్యకు వెయ్యి రైళ్లు ఇప్పటికే అయోధ్యలో హోటళ్లు ఫుల్లు పవిత్రోత్సవం తర్వాత దేదీప్యమానంగా అయోధ్య సాయంత్రం 10 లక్షల దీపాలతో శ్రీరామ జ్యోతి 10గం:10ని.. సోమవారం, జనవరి 22 భక్తితో పురిటి నొప్పులు ఓర్చుకుంటూ..?! దేశమంతా రామమయం అయోధ్యలో నేడు రాముడి విగ్రహ ప్రతిష్ట ఆ శుభముహూర్తం కోసం గర్బిణీల ఎదురు చూపులు పుత్రుడు జన్మిస్తే రాముడు.. ఆడపిల్ల జన్మిస్తే సీత పేరు పెడతారట మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో పదుల సంఖ్యలో ఆ శుభ గడియ కోసం గర్భిణీలు ఇక్కడే కాదు.. దేశమంతా శుభముహూర్తం కోసం ఎదురు చూపులు పురిటి నొప్పులు వస్తున్నా.. ఓపిక పడుతున్న గర్బిణీలు 10గం:10ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యలో టైట్ సెక్యూరిటీ ఏడెంచెల భద్రతా వలయం నడుమ అయోధ్య రామ మందిరం వేల మంది యూపీ పోలీసులు వందల సంఖ్యలో కేంద్ర బలగాల సిబ్బంది ప్రధాని రాక నేపథ్యంలో ప్రత్యేక సిబ్బంది మోహరింపు ప్రతీ ఒక్కరిపై కన్నేసేలా ఏఐ టెక్నాలజీ 10వేలకు పైగా సీసీ కెమెరాలు.. డ్రోన్ల నిఘా 10గం:02ని.. సోమవారం, జనవరి 22 బాలరాముడ్ని అద్దంలో చూపిస్తూ.. కాసేపట్లో అయోధ్యకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిన్నంతా రామేశ్వరంలో మోదీ ప్రత్యేక పూజలు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో కఠిన ఉపవాస.. కఠోర నియమాలు పాటిస్తున్న మోదీ గత 74 ఏళ్లుగా అయోధ్యలో తాత్కాలిక విగ్రహానికి పూజలు ఉత్తరాది నాగర స్టయిలో కొత్త రామ మందిర ఆలయ నిర్మాణం 392 పిల్లర్లు.. ఆలయానికి 44 తలుపులు నేడు ప్రాణప్రతిష్ట జరుపుకోనున్న బాలరాముడి విగ్రహం ముందుగా దశ దర్శనాలు తొలుత అద్దంలో బాలరాముడ్ని.. బాలరాముడికే చూపించనున్న ప్రధాని మోదీ 84 సెకన్లపాటు సాగనున్న ప్రాణప్రతిష్ట క్రతువు థాయ్లాండ్లో ఇలా.. Thailand pic.twitter.com/ZqaIxPW8gh — Megh Updates 🚨™ (@MeghUpdates) January 21, 2024 09గం:49ని.. సోమవారం, జనవరి 22 ఏపీలో ఇలా.. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట వేళ.. ఏపీలో ఆధ్యాత్మిక శోభతో ఉట్టి పడుతున్న రామ మందిరాలు, ఆలయాలు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ నేడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు అన్న సమారాధనలు జిల్లా వ్యాప్తంగా శోభాయాత్రలు చేస్తున్న రామభక్తులు.. తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 30 ప్రాంతాల్లో యల్.ఇ.డి స్క్రీన్ లు ఏర్పాటు ఏలూరు ధర్మభేరి ప్రాంగణంలో శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని పురవీధుల్లో శ్రీరాముని చిత్రపటం ఊరేగింపు శ్రీరామ నామస్మరణం చేస్తూ పాల్గొన్న భక్తాదులు 09గం:45ని.. సోమవారం, జనవరి 22 అయోధ్య చేరుకున్న చిరంజీవి, రామ్ చరణ్ రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు అయోధ్య చేరుకున్న చిరంజీవి దంపతులు.. తనయుడు రామ్ చరణ్ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను: చిరంజీవి నా ఆరాధ్య దైవం హనుమంతుడు నన్ను వ్యక్తిగతంగా ఆహ్వానించాడుఅని భావిస్తున్నా: చిరంజీవి అయోధ్యలో రామ మందిరం కోట్లమంది చిరకాల స్వప్నం.. ఎంతో ఉద్వేగభరితంగా ఉంది: రామ్చరణ్ #WATCH | Uttar Pradesh: Telegu superstars Chiranjeevi and Ram Charan arrive in Ayodhya. Ayodhya Ram Temple Pran Pratishtha ceremony is taking place today. pic.twitter.com/wT0gvlLPiS — ANI (@ANI) January 22, 2024 #WATCH | Telangana | Actor Chiranjeevi leaves from Hyderabad for Ayodhya in Uttar Pradesh as Ayodhya Ram Temple pranpratishtha ceremony to take place today. He says, "That is really great. Overwhelming. We feel it's a rare opportunity. I feel Lord Hanuman who is my deity, has… pic.twitter.com/FjKoA7BBkQ — ANI (@ANI) January 22, 2024 08గం:47ని.. సోమవారం, జనవరి 22 అద్వానీ రావట్లేదు బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ అయోధ్య వేడుకకు గైర్హాజరు 96 ఏళ్ల వయసురిత్యా తొలుత దూరంగా ఉండాలని నిర్ణయం ఆ వెంటనే మనుసు మార్చుకుని హాజరవుతానని ప్రకటించిన అద్వానీ తీవ్ర చలి ప్రభావంతోనే హాజరు కావట్లేదని తాజా ప్రకటన అద్వానీకి ఆహ్వానం అందకపోవడంపైనా రాజకీయ విమర్శలు ఆహ్వానం స్వయంగా అందించినట్లు వెల్లడించిన ట్రస్ట్ సభ్యులు 08గం:47ని.. సోమవారం, జనవరి 22 అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. అమృత్సర్లో శోభాయాత్ర #WATCH | Punjab: 'Shobha yatra' being taken out in Amritsar, ahead of Pran Pratishtha ceremony of the Ram Temple in Ayodhya today. pic.twitter.com/6EfSbJhNDQ — ANI (@ANI) January 22, 2024 08గం:35ని.. సోమవారం, జనవరి 22 ప్రముఖ నటుడి ప్రత్యేక పూజలు సీనియర్ నటుడు, బీజేపీ నేత అనుపమ్ ఖేర్ ప్రత్యేక పూజలు హనుమంతుడికి పూజలు చేసిన అనుపమ్ ఖేర్ మరో దీపావళి పండుగలా ఉందంటూ వ్యాఖ్య #WATCH | Ayodhya | Actor Anupam Kher says, "Before going to Lord Ram, it is very important to have the darshan of Lord Hanuman...The atmosphere in Ayodhya is so graceful. There is slogan of Jai Sri Ram in the air everywhere...Diwali has come again, this is the real Diwali." pic.twitter.com/GCskErgi1Z — ANI (@ANI) January 22, 2024 08గం:31ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యలో ఇవాళ.. కాసేపట్లో.. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన 16 ఆచారాలు ప్రారంభం దేవకినందన్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీరామ కథా పారాయణం అయోధ్యలో వంద చోట్ల ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంస్కృతిక ఊరేగింపు యూపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1500 మంది జానపద నృత్య కళాకారుల ప్రదర్శన రామకథా పార్కులో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు రాంలీలా ప్రదర్శన సాయంత్రం 6.30 నుండి 7 గంటల వరకు శ్రీరామునికి సరయూ హారతి. రాత్రి 7 నుంచి 7.30 వరకు రామ్ కి పైడిపై ప్రొజెక్షన్ షో. రామకథా పార్కులో రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాటేకర్ సిస్టర్స్ సారధ్యంలో రామకథా గానం. తులసీ ఉద్యానవనంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శర్మ బంధుచే భజన కార్యక్రమం రాత్రి 7.45 నుండి 7.55 వరకు రామ్ కీ పైడి వద్ద బాణసంచా కాల్చి సందడి కన్హయ్య మిట్టల్ సారధ్యంలో రామకథా పార్క్ వద్ద రాత్రి 8 నుండి 9 గంటల వరకు భక్తి సాంస్కృతిక కార్యక్రమం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు తులసి ఉద్యానవనంలో రఘువీర పద్మశ్రీ మాలినీ అవస్థి సారధ్యంలో ప్రత్యేక కార్యక్రమం 08గం:18ని.. సోమవారం, జనవరి 22 ఎటు చూసినా డ్రోన్లే మరోవైపు అయోధ్యలో ఏడంచెల భద్రతా వలయం ప్రధాని సహా వీవీఐపీలు, వీఐపీల రాక నేపథ్యంలో.. ఎస్పీజీ, ఎన్ఎస్జీ కమాండోల మోహరింపు వేల మంది యూపీ పోలీసుల మోహరింపు కేంద్ర బలగాల పహారా నడుమ అయోధ్యాపురి డ్రోన్ నిఘా నీడలో అయోధ్య 08గం:00ని.. సోమవారం, జనవరి 22 ప్రాణప్రతిష్ట క్రతువు కొన్ని సెకన్లే.. మేషలగ్నం అభిజిత్ ముహూర్తంలో అయోధ్య రాముడికి ప్రాణప్రతిష్ట మధ్యాహ్నాం 12గం.29ని.. నుంచి 12గం.30ని.. మధ్య ప్రాణప్రతిష్ట ముహూర్తం నూతన రామాలయంలో 84 సెకన్ల కాలంలో గర్భగుడిలో బాలరాముడి ప్రాణప్రతిష్ట రామ్లల్లా విగ్రహానికి జరగనున్న ప్రాణ ప్రతిష్ట నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట చేయించనున్న వారణాసి అర్చకులు అయోధ్యలో విశిష్ట సభలో 1గం. నుంచి 2గం. మధ్య ప్రధాని మోదీ సహా ప్రముఖుల ప్రసంగాలు హాజరు కానున్న అన్ని రాష్ట్రాల రామ భక్తులు 7 వేలమందికి ఆహ్వానం.. భారీగా ప్రముఖుల రాక కట్టుదిట్టమైన భద్రతా వలయంలో అయోధ్య అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఓర్చాలో 5100 మట్టి దీపాలను వెలిగించారు 07గం:55ని.. సోమవారం, జనవరి 22 ‘రామ’కు వెలుగులు దేశవ్యాప్తంగా రామ నామంతో ఉన్న రైల్వే స్టేషన్లకు ప్రత్యేక ముస్తాబు రామన్నపేట్ (తెలంగాణ). రామచంద్రపురం (ఆంధ్రప్రదేశ్). రామగిరి (కర్ణాటక). ఇవన్నీ రాముని పేరుతో ఉన్న రైల్వేస్టేషన్లు. దేశవ్యాప్తంగా ఇలా మొత్తం 343 రైల్వేస్టేషన్లకు హంగులు ప్రాణప్రతిష్ఠ సందర్భంగా విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్న స్టేషన్లు రైల్వే శాఖ నిర్ణయంపై సర్వత్రా హర్షం రాముని పేరిట ఉన్న రైల్వేస్టేషన్లలో అత్యధికంగా 55 ఏపీలో ఉండటం విశేషం! 07గం:48ని.. సోమవారం, జనవరి 22 500 ఏళ్ల హిందువుల కల నెరవేరుతున్న వేళ.. మరికొద్ది గంటల్లో అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మ.12 నుంచి ప్రాణ ప్రతిష్ట క్రతువుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ట అనంతరం కుబేర్ తిలక్లో భగవాన్ శివుని పురాతన మందిరాన్ని సందర్శించనున్న మోదీ ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొననున్న దేశంలోని అన్ని ప్రధాన ఆధ్యాత్మిక, ధార్మిక శాఖల ప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు ప్రాణ ప్రతిష్ట అనంతరం విశిష్ట సభను ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణంలో పాల్గొన్న కార్మికులతోనూ ప్రధాని మోదీ ముచ్చట్లు విదేశాల్లోనూ శ్రీరామం అయోధ్య ప్రాణప్రతిష్ట వేళ.. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా వేడుకలు పలు దేశాల ఆలయాల్లో ప్రత్యేక పూజలు 50కి పైగా దేశాల్లో అయోధ్య రామ మందిర బాలరాముడి ప్రాణప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాట్లు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పలు చోట్ల కార్ల ర్యాలీలు టైమ్స్ స్క్వేర్ సహా పలు చోట్ల లైవ్ టెలికాస్టింగ్కు ఏర్పాట్లు ఫ్రాన్స్లో రథయాత్ర.. ఈఫిల్ టవర్ వద్ద ప్రత్యక్ష ప్రసారం US: 'Overseas Friends of Ram Mandir' distributes laddoos at Times Square ahead of Pran Pratishtha Read @ANI Story | https://t.co/tJPnNvaKt2#TimesSquare #PranPratishthaRamMandir #NewYork pic.twitter.com/IWAMSJWAYy — ANI Digital (@ani_digital) January 22, 2024 #WATCH | Indian diaspora in the United States offer prayers at Shree Siddhi Vinayak temple in New Jersey ahead of the Pran Pratishtha ceremony at Ram Temple in Ayodhya. pic.twitter.com/gCt2EZL7qL — ANI (@ANI) January 22, 2024 07గం:35ని.. సోమవారం, జనవరి 22 ఈ ఉదయం రామజన్మభూమి ఇలా.. #WATCH | Ayodhya, Uttar Pradesh: Visuals from Ram Janmabhoomi premises ahead of the Pran Pratishtha ceremony of Ram Temple, today. pic.twitter.com/O1Iuay8Dd7 — ANI (@ANI) January 22, 2024 07గం:28ని.. సోమవారం, జనవరి 22 అయోధ్యకు బిగ్బీ అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం అయోధ్యకు అమితాబ్ బచ్చన్ రామమందిర వేడుక కోసం భారీగా తరలిన వీవీఐపీలు #WATCH | Mumbai: Superstar Amitabh Bachchan leaves for Ayodhya. Pran Pratishtha ceremony of Ayodhya's Ram Temple will take place today. pic.twitter.com/pOecsD92XQ — ANI (@ANI) January 22, 2024 07గం:15ని.. సోమవారం, జనవరి 22 50 వాయిద్యాలతో మంగళ ధ్వని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మంగళ ధ్వని మధ్య నిర్వహించేందుకు సిద్ధమైన రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళ ధ్వని కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన 50 సంగీత వాయిద్యాలకు ఒకే వేదికపై చోటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం, కర్ణాటక నుంచి వీణ, తమిళనాడు నుంచి నాదస్వరం, మృదంగం మొత్తం 2 గంటల పాటు మంగళ ధ్వని కార్యక్రమం 06గం:55ని.. సోమవారం, జనవరి 22 వైద్య సేవలతో సహా.. రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం సర్వాంగ సుందరంగా అయోధ్య అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం బహుళ అంచెల భద్రత కోసం వేల మంది పోలీసుల మోహరింపు ప్రతి వీధిలో బారికేడ్ల ఏర్పాటు రసాయన, బయో, రేడియోధార్మిక, అణు దాడులను ఎదుర్కొనేలా ఎన్డీఆర్ఎఫ్ బృందాల మోహరించింది భూకంప సహాయక బృందాల నియామకం ఎటువంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలు చలికాలం కావడంతో భక్తులకు, ఆహ్వానితులకు ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే చికిత్స అందించేలా బెడ్ల ఏర్పాటు ఎయిమ్స్ నుంచీ ప్రత్యేక వైద్య బృందాలు అయోధ్యలో ప్రధాని అయోధ్య షెడ్యూల్: 10గం:25ని అయోధ్య విమానాశ్రయానికి చేరిక 10గం:45ని అయోధ్య హెలిప్యాడ్కు చేరుకోవడం 10గం:55ని. శ్రీరామ జన్మభూమికి రాక.. ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు: రిజర్వ్ మధ్యాహ్నం 12:05 నుండి 12:55 వరకు: ప్రతిష్ఠాపన కార్యక్రమం.. మధ్యాహ్నం 12:55: పూజా స్థలం నుండి బయటకు మధ్యాహ్నం 1:00: బహిరంగ వేదిక వద్దకు చేరిక మధ్యాహ్నం 1:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు.. అయోధ్యలో పబ్లిక్ ఫంక్షన్కు హాజరు విశిష్ట సభను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ.. పలువురు మధ్యాహ్నం 2:10: కుబేర్ తిల దర్శనం 06గం:49ని.. సోమవారం, జనవరి 22 దేదీప్యమానంగా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో.. సర్వాంగ సుందరంగా అయోధ్య రకరకాల పూలతో.. రంగు రంగుల విద్యుద్దీపాలతో రామమందిర అలంకరణ శ్రీరాముడి చిత్రాలతో పై వంతెనల వీధి దీపాల ఏర్పాటు విల్లంబుల కటౌట్ల ఏర్పాటు సంప్రదాయ రామానంది తిలక్ డిజైన్లతో దీపాలు మంచి ఘడియలు వచ్చాయి (శుభ్ ఘడీ ఆయీ), అయోధ్య ధామం తయారైంది (తయ్యార్ హై అయోధ్య ధామ్), శ్రీరాముడు ఆసీనులవుతారు (విరాజేంగే శ్రీరామ్), రాముడు మళ్లీ తిరిగొస్తారు (రామ్ ఫిర్ లౌటేంగే), అయోధ్యలో రామరాజ్యం వచ్చింది (అయోధ్యమే రామ్ రాజ్య) అనే స్లోగన్లు, నినాదాల పోస్టర్లు రామాయణంలోని పలు ఘట్టాలను పోస్టర్లపై చిత్రీకరణ రామ్ మార్గ్, సరయూ నది తీరం, లతా మంగేష్కర్ చౌక్లలో కటౌట్ల ఏర్పాటు అయోధ్య నగరమంతా రామ్ లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు సరయూ తీరంలో ప్రతి రోజూ హారతి ఇచ్చే ఏర్పాట్లు What a goosebumps view from Mundra (Kutch, Gujarat)... No sanathan will pass without liking this ♥️ Jai shree ram 🛐#JaiShriRam #RamMandirPranPrathistha #ShriRam #AyodhyaRamMandir#RamLallaVirajman#RamMandir #RamLallaVirajman#WorldInAyodhya pic.twitter.com/48WssugiGv pic.twitter.com/DZhGfFXNWf — BRAKING NEWS 🤯 (@Jamesneeesham) January 22, 2024 06గం:45ని.. సోమవారం, జనవరి 22 పలు చోట్ల సెలవు అయోధ్య ఉత్సవం నేపథ్యంలో.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నేడు సెలవు ఒడిశాలోనూ సెలవు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒక పూట సెలవు బ్యాంకులు, ఇన్సూరెన్సు కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకూ ఒక పూట సెలవు స్టాక్ మార్కెట్లు బంద్ పలు బీజేపీ యేతర రాష్ట్రాల్లోనూ స్కూళ్ల స్వచ్ఛంద సెలవు 06గం:42ని.. సోమవారం, జనవరి 22 నలుమూలల నుంచి భారీ కానుకలు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి కన్నౌజ్ నుంచి పరిమళాలు అమరావతి నుంచి 5 క్వింటాళ్ల కుంకుమ, ఢిల్లీ నుంచి నవ ధాన్యాలు, భోపాల్ నుంచి పూలు చింధ్వారా నుంచి 4.31 కోట్ల రామ నామాల ప్రతి అయోధ్యకు చేరిక సీతాదేవి కోసం ప్రత్యేకంగా గాజులు 108 అడుగుల అగర్బత్తి, 2,100 కిలోల గంట, 1,100 కిలోల దీపం, బంగారు పాదరక్షలు, 10 అడుగుల ఎత్తైన తాళం, ఒకేసారి 8 దేశాల సమయాలను సూచించే గడియారం రామ మందిరానికి బహుమతులు నేపాల్లోని సీతాదేవి జన్మ స్థలి నుంచి 3,000 బహుమతులు 06గం:40ని.. సోమవారం, జనవరి 22 భారీగా వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు అయోధ్య ఈవెంట్ కోసం 22,825 వాహనాలకు పార్కింగ్ సౌకర్యం అయోధ్యలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసుల ఏర్పాట్లు 51 ప్రాంతాల్లో వాహనాలు నిలిపేందుకు ఏర్పాట్లు పూర్తి డ్రోన్లతో గస్తీ నిర్వహణ 06గం:34ని.. సోమవారం, జనవరి 22 ఏడు వేల మంది అతిథులు మతాలకతీతకంగా అయోధ్య వేల మంది గడ్డకట్టే చలిలోనూ దేశం నలుమూలల నుంచి పాదయాత్ర, సైకిళ్లపై, వాహనాలపై అయోధ్యకు చేరిక రామ మందిర ప్రారంభోత్సవానికి 7,000 మంది అతిథులకు ఆహ్వానం ఆహ్వానితుల్లో 506 మంది అత్యంత ప్రముఖులు రామ జన్మభూమి కోసం పోరాటం చేసిన వాళ్లకు ప్రత్యేక ఆహ్వానం సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులకూ ఆహ్వానం.. ఇప్పటికే చాలామంది అయోధ్యకు చేరిక ప్రతిపక్ష నేతలనూ ఆహ్వానించినా.. గైర్హాజరుకే మొగ్గు 06గం:28ని.. సోమవారం, జనవరి 22 రామ మందిర విశేషాలు.. రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ శుక్రవారం కళ్లకు వస్త్రంతో ఉన్న విగ్రహం బాహ్య ప్రపంచానికి దర్శనం ఆలయంలోకి తూర్పు ద్వారం నుంచి ప్రవేశించి దక్షిణ ద్వారం గుండా బయటకు రావాల్సి ఉంటుంది మూడు అంతస్థుల్లో ఆలయ నిర్మాణం ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి భక్తులు తూర్పువైపు నుంచి 32 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. ఆలయాన్ని సంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు ఉంటుంది. 161 అడుగుల ఎత్తు ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తు.. మొత్తం 392 స్తంభాలు, 44 గేట్లు 06గం:22ని.. సోమవారం, జనవరి 22 ముహూర్తం ఎప్పుడంటే.. అభిజిల్లగ్నంలో బాలరాముడిని ప్రతిష్టించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1 గంటకు ముగింపు ప్రాణ ప్రతిష్ఠకు వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా పూజాది కార్యక్రమాలు 16వ తేదీన ప్రారంభం.. ఆదివారంతో ముగింపు 06గం:15ని.. సోమవారం, జనవరి 22 అంతా రామమయం రామ నామ స్మరణతో మారుమోగుతున్న భారత్ దేశ, విదేశాల్లోని ఆలయాల్లో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకను వీక్షణ పవిత్రోత్సవం అనంతరం దేదీప్యోమానంగా అయోధ్య వాషింగ్టన్ డీసీ, పారిస్ నుంచి సిడ్నీదాకా అనేక ఆలయాల్లో ఓ పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ. దాదాపు 60 దేశాల్లో అయోధ్య ప్రాణప్రతిష్ట వేడుక కార్యక్రమాలు 06గం:12ని.. సోమవారం, జనవరి 22 అల అయోధ్యాపురములో.. అపురూప మందిరం నేడే ఆవిష్కృతం ఉత్తర ప్రదేశ్ అయోధ్య నగరంలో కొలువుదీరనున్న రామయ్య మధ్యాహ్నం 12.20 నుంచి 1 గంట మధ్య ముహూర్తం సర్వాంగ సుందరంగా నగరం ముస్తాబు ప్రాణ ప్రతిష్ఠ చేయనున్న ప్రధాని ఇప్పటికే చేరుకున్న ప్రముఖులు భారీ భద్రతా ఏర్పాట్లు రామ నామ స్మరణతో మార్మోగుతున్న ఊరూవాడా 06:00.. సోమవారం, జనవరి 22 తెలుగు రాష్ట్రాల నుంచి.. అయోధ్య రాముడికి తెలుగు రాష్ట్రాల నుంచి కానుకలు తిరుమల శ్రీవారి తరఫున లక్ష లడ్డూలు సిరిసిల్ల నుంచి సీతమమ్మకు చీర కానుక హైదరాబాద్ నుంచి 1265 కేజీల లడ్డూ హైదరాబాద్ నుంచి అయోధ్య రామయ్యకు ఎనిమిదడుగుల ముత్యాల గజమాల.. అందించనున్న చినజీయర్స్వామి -
Ayodhya Ram mandir: ‘భరతవర్ష’ పునర్నిర్మాణానికి నాంది
న్యూఢిల్లీ: అయోధ్యలోని జన్మస్థలానికి శ్రీరాముడి ప్రవేశం, ఆలయ ప్రాణప్రతిష్ట ఉత్సవం ‘భరతవర్ష’పునర్నిర్మాణానికి నాంది అని రాష్ట్రీయ స్వయం సేక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. ‘భరతవర్ష’లో సమాజంలోని ప్రతి ఒక్కరి సంక్షేమం, శాంతి, అభివృద్ధి, ఐక్యత, సామరస్య సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఆర్ఎస్ఎస్ వెబ్సైట్లో ఆదివారం ఆయన రాసిన వ్యాసం పోస్ట్ అయ్యింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం హిందూ సమాజం పోరాటం, సంక్షోభాలు ఇక ముగిసి పోవాలని ఆయన ఆకాంక్షించారు. అయోధ్య పునర్నిర్మాణం ఇక మనందరి బాధ్యతని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధికులు పూజించే దైవం శ్రీరాముడేనని ఆయన తెలిపారు. మందిర నిర్మాణం ‘జాతి గౌరవానికి పునరుజ్జీవనం’గా ఆయన అభివర్ణించారు. ‘‘రామజన్మభూమిలో రామ్ లల్లా ప్రవేశం, ప్రాణ ప్రతిష్ట భరతవర్ష పునర్నిర్మాణానికి నాంది. ఇది అందరి శ్రేయస్సు కోసం, భేదభావం లేకుండా అందరినీ అంగీకరించడం, సామరస్యం, ఐక్యత, పురోగతి, శాంతి మార్గాన్ని చూపుతుంది. యావత్ ప్రపంచ పునర్నిర్మాణానికి బాటలు వేస్తుంది’’ అని భాగవత్ అన్నారు. -
Ayodhya Ram Mandir: అయోధ్యలో నేడే రామ్లల్లా ప్రాణప్రతిష్ట
భవ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం అయోధ్య నగరం అందంగా ముస్తాబైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు, ప్రముఖుల సాక్షిగా గర్భగుడిలో రామ్లల్లా కొలువుదీరబోతున్నాడు. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని తిలకించడానికి దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రధాన వేడుక ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12:29:08 గంటల నుంచి 12:30:32 గంటల వరకు.. మొత్తం 84 సెకన్లలో గర్భగుడిలో ప్రాణప్రతిష్ట పూర్తవుతుంది. అపూర్వమైన ఈ వేడుకలో భిన్న మతాలు, సంప్రదాయాలు, వర్గాలకు భాగస్వామ్యం కల్పిస్తున్నారు. పర్వతాలు, అడవులు, తీర ప్రాంతాలు, ద్వీపాలు తదితర అన్ని ప్రాంతాలకు చెందినవారు ఒకే చోట ఒక కార్యక్రమంలో పాల్గొంటుండడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి అని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తెలియజేసింది. రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా దేశాల్లో సోమవారం ఉత్సవాలు జరగబోతున్నాయి. నేడు గర్భాలయం లోపల.. ఉదయం 10:00 మంగళ ధ్వనితో శ్రీకారం మధ్యాహ్నం 12.20 ప్రధాన వేడుక ప్రారంభం 12:29:08, 12:30:32 84 సెకన్లలో గర్భగుడిలో బాలరాముడి ప్రాణప్రతిష్ట 7,000 హాజరుకానున్న అతిథులు ఏకకాలంలో వెలిగించనున్న ప్రమిదలు 10,00,000 అయోధ్యలో నేడు కొలువుదీరనున్న బాలరాముడు అద్భుత వాయిద్యాలతో మంగళ ధ్వని ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సోమవారం ఉదయం 10 గంటలకు ‘మంగళ ధ్వని’తో శ్రీకారం చుడతారు. ఇందుకు దాదాపు 20 రాష్ట్రాల నుంచి 50కి పైగా అద్భుతమైన వాయిద్యాలను తీసుకొచ్చారు. అయోధ్యకు చెందిన యతీంద్ర మిశ్రా సారథ్యంలో నిర్వహించే ఈ సంగీత ప్రదర్శనకు ఢిల్లీకి చెందిన సంగీత నాటక అకాడమీ సహకారం అందించనుంది. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం రామమందిర ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పా ట్లు పూర్తయ్యాయి. ఉదయం ఏడింటి నుంచే ప్రసారాలు మొదలవు తాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రధాన వేడుక జరుగుతుంది. వీటిని డీడీ న్యూస్, డీడీ జాతీయ చానళ్లతోపాటు ప్రైవేట్ చానళ్లలోనూ తిలకించవచ్చు. 84 సెకన్ల శుభ ముహూర్తం గర్భగుడిలో రామ్లల్లా ప్రాణప్రతిష్టకు శుభ ముహూర్తం నిర్ణయించారు. సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 12.20 గంటలకు వేడుక ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12:29:08 గంటల నుంచి 12:30:32 గంటల వరకు మొత్తం 84 సెకన్లలో ప్రాణప్రతిష్ట పూర్తవుతుంది. గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ నేతృత్వంలో కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన ఆచార్యులుగా 121 మంది రుతి్వక్కులు వేడుక నిర్వహిస్తారు. ప్రాణ ప్రతిష్టలో శైవ, వైష్ణవ, శాక్త, గాణాపత్య, సిక్కు, బౌద్ధ, జైన, దశనామీ శంకర్, రామానంద, రామానుజ, నింబార్క, మధ్వ, విష్ణు నామి, వాల్మీకి, వీర శైవ మొదలైన సంప్రదాయాలు భాగం కానున్నాయి. 150 మందికిపైగా సంప్రదాయాల సాధువులు, మహామండలేశ్వర్, మహంత్, నాగాలతో సహా 50 మందికి పైగా గిరిజన, గిరివాస, ద్వీపవాస సంప్రదాయాల ప్రముఖులు పాల్గొంటారు. ఇలా పర్వతాలు, అడవులు, తీర, ద్వీప వంటి అన్ని ప్రాంతాలకు వారు ఒకే కార్యక్రమంలో పాల్గొంటుండడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తెలియజేసింది. నగర వీధుల్లో తోరణాలు, కాషాయ జెండాలు అయోధ్య వీధులు కాషాయ రంగు పులుముకున్నాయి. నగరంలో అన్ని వీధులను కాషాయ జెండా, తోరణాలతోపాటు విద్యుత్ దీపాలు, పూలమాలలతో అలంకరించారు. నివాస భవనాలు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, దుకాణాలపైనా పెద్ద సంఖ్యలో జెండాలు దర్శనమిస్తున్నాయి. దుకాణాల్లో వీటి అమ్మకాలు విరివిగా సాగుతున్నాయి. శ్రీరాముడు, హనుమంతుడు, నూతన రామాలయ చిత్రాలు, జైశ్రీరామ్ నినాదంతో కూడిన ఈ జెండాలు, తోరణాలు చూపరులకు ఆధ్యాత్మిక భావనలు పంచుతున్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలతోపాటు దాతలు శ్రీరాముడి జెండాలను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. అయోధ్యలోని రామ్పథ్, ధర్మపథ్ను జెండాలతో ప్రత్యేకంగా ఆలంకరించారు. అయోధ్యలో రామచరిత మానస్, రామాయణం పుస్తకాల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వీధుల్లో శ్రీరాముడి పాటలు మార్మోగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రామయ్య పండుగ శ్రీరాముడి ప్రాణప్రతిష్ట వేడుక కేవలం ఆయోధ్యకే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఈ ఉత్సవంలో పాలుపంచుకోబోతున్నారు. సోమవారం ర్యాలీలు, ప్రదర్శనలు, పాదయాత్రలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికాలో దాదాపు 300 ప్రాంతాల్లో ప్రాణప్రతిష్టను ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద కూడా స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. పారిస్లో హిందూ సమాజం ఆధ్వర్యంలో భారీ రథయాత్ర నిర్వహించనున్నారు. అలాగే విశ్వ కల్యాణ యజ్ఞం నిర్వహిస్తారు. ఇంగ్లాండ్, ఆ్రస్టేలియా, కెనడా, మారిషస్ సహా 60కిపైగా దేశాల్లో వేడుకలు జరుగుతాయి. ఆయా దేశాల్లోని హిందూ ఆలయాల్లో సాయంత్రం దీపాలు వెలిగించగబోతున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇప్పటికే విద్యుత్ దీపాలు, పూలతో ఆలయాలను అందంగా అలకరించారు. అలాగే రామాయణ పారాయణం కోసం ఏర్పాట్లు చేశారు. నేటితో ముగియనున్న ప్రత్యేక క్రతువులు ప్రత్యేక క్రతువుల్లో భాగంగా ఆదివారం ఔషధ జలంతోపాటు దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాల తెచి్చన పవిత్ర జలాలతో రామ్లల్లాను శుద్ధి చేశారు. రాత్రి జాగరణ అధివస్ జరిపారు. 16న మొదలైన క్రతువులు సోమవారం ముగుస్తాయి. మూడు నిత్య హారతులు ప్రాణప్రతిష్ట అనంతరం భక్తులకు రామ్లల్లా దర్శనం కల్పించడానికి ఆలయాన్ని ఉదయం 7 గంటల నుండి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంచనున్నారు. నిత్యం మూడుసార్లు ప్రత్యేక హారతి నిర్వహిస్తారు. ఉదయం 6.30 గంటలకు జాగరణ్ హారతి, మధ్యాహ్నం 12.00 గంటలకు భోగ్ హారతి, రాత్రి 7.30 గంటలకు సంధ్యా హారతి ఇవ్వనున్నారు. గర్భాలయంలో ఇలా... ► ఉదయం 10 గంటలు: మంగళ ధ్వని ► మధ్యాహ్నం 12.05 నుంచి 12.55: ప్రాణప్రతిష్ట జరుగుతుంది. రామ్లల్లా నేత్రాలు తెరిచిన తర్వాత ప్రధాని మోదీ కాటుక దిద్దుతారు. బాలరాముడికి అద్దంలో ప్రతిబింబం చూపిస్తారు. ► మధ్యాహ్నం 12.55: ప్రధాన ఆలయంపై హెలికాప్టర్తో పూల వర్షం కురిపిస్తారు. గర్భగుడిలోకి ఆ ఐదుగురు గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో తీర్థ క్షేత్ర ట్రస్టు మహంత్ నృత్యగోపాల్ దాస్ మహరాజ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. వేడుక పూర్తయిన తర్వాత అతిథులకు రామ్లల్లా దర్శనం కల్పిస్తారు. మోదీ పర్యటన ఇలా.. ► ఉదయం 10.25: అయోధ్య విమానాశ్రయం నుంచి ఆలయానికి ► మధ్యాహ్నం 12: గర్భగృహం ఎదుట అతిథులకు పలకరింపు ► మధ్యాహ్నం 1 నుంచి 2 గంటలు: బహిరంగ సభలో మోదీ ప్రసంగం. ఆరెస్సెస్ చీఫ్ భాగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు కూడా ప్రసంగిస్తారు. ► మధ్యాహ్నం 2 గంటలు: శివ మందిరం, కుబేర తిల సందర్శన ► మధ్యాహ్నం 3.30: మోదీ ఢిల్లీకి పయనమవుతారు. 10 లక్షల ప్రమిదల కాంతులు అయోధ్య నగరం సోమవారం సాయంత్రం దేదీప్యమానంగా వెలిగిపోనుంది. రామ్లల్లా ప్రాణప్రతిష్టను పురస్కరించుకొని 10 లక్షలు ప్రమిదలను ఏకకాలంలో వెలిగించబోతున్నారు. నగరంలోని 100 ఆలయాలు, ప్రధాన ప్రాంతాల్లో ఈ దీపాలు వెలుగులు పంచబోతున్నాయి. ఈ దృశ్యాలు కనులకు పండుగే అనడంలో సందేహం లేదు. భవ్య రామమందిరంతోపాటు రామ్ కీ పైడీ, కనక్ భవన్, గుప్తార్ ఘాట్, సరయూ ఘాట్, లతా మంగేష్కర్ చౌక్, మణిరామ్ దాస్ చౌనీ తదితర ప్రాంతాల్లో ప్రమిదలు వెలిగిస్తారు. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అయోధ్య వాసులు తమ ఇళ్లల్లోనూ దీపాలు వెలిగించబోతున్నారు. దాంతో అయోధ్యాపురం కాంతిమయం కాబోతోంది. రామాలయ ఉపగ్రహ చిత్రాలు విడుదల అయోధ్యలో నూతన రామాలయ ఉపగ్రహ చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆదివారం విడుదల చేసింది. ఇండియన్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాటిలైట్ అంతరిక్షం నుంచి గత ఏడాది డిసెంబర్ 16న ఈ దృశ్యాన్ని చిత్రీకరించింది. ప్రధాన ఆలయంతోపాటు దశరథ మహల్, అయోధ్య రైల్వే స్టేషన్, సరయూ నది వంటివి ఈ చిత్రాల్లో చక్కగా కనిపిస్తున్నాయి. వేదమంత్రాల నడుమ రామ్లల్లాకు ప్రాణప్రతిష్ట ► మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో కార్యక్రమం ► ఉత్సవానికి ప్రధాన యజమానిగా ప్రధాని నరేంద్ర మోదీ ► ప్రాణప్రతిష్ట అనంతరం ప్రముఖులకు బాలరాముని దర్శనం శుభ ఘడియలు సమీపించాయి. అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట వైభవోజ్వల చరిత్రాత్మక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఐదు శతాబ్దాల వనవాసం వీడి, భవ్య మందిరానికి చేరుకున్న రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ కమనీయ వేడుకను కనులారా తిలకించడానికి ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దేశ విదేశాల్లో రామనామ స్మరణతో భక్తులు ఆనంద డోలికల్లో ఊగిపోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 7 వేల మందికిపైగా అతిథులు, ప్రముఖులు హాజరుకాబోతున్నారు. 150 మందికిపైగా ప్రముఖులు ఇప్పటికే అయోధ్యలో అడుగుపెట్టారు. సామాన్య భక్తజనం అయోధ్య బాటపట్టారు. కాషాయ పతాకాల రెపరెపలు, రాముడి గీతాలు, భజనలు, స్తోత్రాలు, జైశ్రీరామ్ నినాదాలతో, అందంగా తీర్చిదిద్దిన ప్రధాన భవ్య మందిరంతోపాటు ఇతర ఆలయాలతో అయోధ్య అంతటా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. నగరం ఇప్పటికే జనసంద్రంగా మారింది. భక్తుల పూజలు, వేదమంత్రాల ఘోషతో సరయూ నదీ తీరం కనువిందు చేస్తోంది. నగరంలోని చరిత్రాత్మక కట్టడాలను సైతం సుందరంగా అలంకరించారు. దేశమంతా అయోధ్య నామస్మరణతో సర్వం రామమయంగా మారిపోయింది. – సాక్షి, న్యూఢిల్లీ -
ఇల గోదారి పరవళ్లలోఅల రాములోరి ఆనవాళ్లు
సాక్షి అమలాపురం: ‘రామో విగ్రహవాన్ ధర్మః’ ఈ వాక్యం చాలు ధర్మం రాశీభూతమైతే రాముడిలా ఉంటుందని చెప్పడానికి. రాముడికి వాల్మీకి ఇచ్చిన నిర్వచనం ఇదే.లోకాభిరాముడు.. జగదేక రాముడు.. శ్రీరాముడు.. ఏకపత్నీవ్రతుడు.. పితృవాక్య పరిపాలకుడు.. ఒకే మాట.. ఒకే బాణం.. ఒకే సతి.. వినయశీలుడు ఇవన్నీ రామాయణాన్ని చదివిన, విన్నవారికి రాముని గురించి అనిపించిన గుణశీల సంపన్నములు. శ్రీకృష్ణుడు ‘ఏం చేసైనా ధర్మాన్ని నిలబెట్టాలి’ అని చెబితే.. ‘ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మం వైపు నిలబడి బతకాలని’ రాముడు దిశానిర్దేశం చేశాడు.. ఆచరించి చూపించాడు. ఏటా శ్రీరామ నవమికి ప్రతి రామాలయంలో, ప్రతి ఇంటా జరిగే పట్టాభిషేకాన్ని చూసి అక్షతలు శిరసున వేసుకున్నా.. నేడు అయోధ్యలో జరిగే విగ్రహ ప్రతిష్ఠాపన తదితర కార్యక్రమాలు ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించే ప్రతి భక్తునికీ రామాయణ బాలకాండలోని విశేషాలు సాక్షాత్కరిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. అయోధ్యలో రూపుదిద్దుకున్న భవ్య రామ మందిరంలో బాలరాముని దివ్యరూపం కొలువుదీరుతున్న వేళ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పండగ వాతావరణం నెలకొంది. ఈ క్రతువు జరుగుతున్న శుభ గడియలు ఆసన్నమవుతున్న తరుణంలో వాల్మీకి అరణ్యకాండలో ప్రస్తావించిన గోదావరి జిల్లాలతో శ్రీరాముని అనుబంధనాన్ని భక్తులు గుర్తు చేసుకుని పుకలరించిపోతున్నారు. శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు అనుబంధంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ మురిిసిపోతున్నారు. తండ్రి మాట జవదాటని శ్రీరాముడు సీతా సమేతంగా వనవాసానికి వెళ్లిపోయాడు. ఈ సమయంలోనే రామయ్య సీతా సమేతంగా తమ్ముడు లక్ష్మణుడితో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నడయాడారని భక్తుల విశ్వాసం. స్వయంగా శ్రీరాముడు ప్రతిష్ఠించిన పలు శివాలయాలు.. ఆలయాలు.. గోదావరి నదీతీరంలో పుణ్యస్నానాలు చేసిన ప్రాంతాలు.. వాటిని రామఘాట్ అంటూ పిలుచుకుంటూ భక్తులు రామునిపై తమ విశ్వాసాన్ని చాటుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో శ్రీరాముని వనవాసానికి సంబంధించి పలు పురాణ గాథలున్నాయి. అలాగే పురాణ ప్రసిద్ధి చెందిన ఆలయాలూ ఉన్నాయి. ► అల్లవరం మండలం ఎస్.పల్లిపాలెం శివారు నక్కా రామేశ్వరం తీర ప్రాంతంలోని పార్వతి సమేత శివాలయాన్ని త్రేతాయుగంలో శ్రీరాముడు నిర్మించడం వల్లే రామేశ్వరాలయంగా పిలుస్తారని భక్తుల విశ్వాసం. రావణాసుడిని అంతమొందించిన శ్రీరాముడు బ్రహ్మ హత్యా దోషానికి పరిహారంగా కాశీ నుంచి శివలింగాన్ని తెప్పించి సముద్రతీరంలో ప్రతిిష్ఠించాలని భావిస్తాడు. ఈ క్రమంలో లంక నుంచి అయోధ్యకు వెళుతున్న సమయంలో కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురావలసిందిగా హనుమంతుడికి ప్రతిపాదిస్తాడు. సూర్యాస్తమయం కావస్తుండడం, శివలింగం రావడం ఆలస్యం కావడంతో రామేశ్వర క్షేత్రంలో ఇసుకతో సముద్రతీరంలో శివ లింగాన్ని తయారుచేసి ప్రతిష్ఠించి పూజలు చేసినట్లు ఈ క్షేత్రం పురాణ గాథ. ► ఇదే మండలం మొగళ్లమూరు శివారు లక్ష్మణేశ్వరంలో పార్వతీ సమేత లక్ష్మణేశ్వరస్వామి వారిని లక్ష్మణుడు ప్రతిష్ఠించినట్లు పురాణ గాథ. ఈ ఆలయాన్ని కూడా బ్రహ్మహత్యాదోష నివారణకు రాముని ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు నిర్మించినట్టు చెప్తుంటారు. మకర సంక్రాంతి నుంచి జూన్ వరకు మేఘ వర్ణం, జూన్ నుంచి సంక్రాంతి వరకు ధూమ్ర (బూడిద) వర్ణంతో శివలింగం ప్రకాశిస్తుందని పురోహితులు చెబుతున్నారు. ► రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం వద్ద అఖండ గోదావరిని ఆనుకుని రామపాదాల రేవు ఉంది. ఇక్కడ ఉన్న జనార్దన స్వామి ఆలయానికి పుర్వకాలంలో శ్రీరాముడు సీతా సమేతంగా లక్ష్మణ స్వామిని వెంటబెట్టుకుని వచ్చారని, ఇక్కడ పుణ్యస్నానాలు చేశారని నమ్మకం. ఇక్కడ రాముని పాదముద్రలు కూడా ఉంటాయి. పుష్కరాల సమయంలో ఇక్కడ స్నానాలు చేస్తే పుణ్యమని భక్తుల విశ్వాసం. ► వాల్మీకి రాసిన అరణ్యకాండలో గోదావరి తీరం ప్రస్తావన ఉంది. సీతారాములు వనవాసం చేశారని, సీతాదేవి అహరణకు గురైన తరువాత ఆమెకు గోదావరి తీరం అంటే ఇష్టమని అక్కడ వెదుకుదామని లక్ష్మణుడితో శ్రీరాముడు అన్నట్టు రాశారు. ► గుడిమెళ్ల రామేశ్వరంలో కృతకృత్య రామలింగేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠకు వెళ్లే ముందే శ్రీరాముడు, సీతాదేవి ఇప్పుడున్న సఖినేటిపల్లి వద్ద విశ్రాంతికని ఆగారంటారు. ఆ సమయంలో స్వామివారు ‘సఖీ’ ఇదే నేటిపల్లె (పల్లె నిద్ర చేయడం) అన్నారని, అప్పటి నుంచి ఈ ప్రాంతం సఖినేటిపల్లిగా గుర్తింపు పొందిందని చెబుతారు. ► అంబాజీపేట మండలం మాచవరం (నాటి మాసవరం)లో కౌశికానది తీరంలో పుణ్యస్నానాలు చేస్తే బ్రాహ్మణ హత్య మహాపాతకం పోతుందని చెప్పడంతో శ్రీరాముడు ఇక్కడ స్నానం చేసి శివాలయాన్ని ప్రతిష్ఠించారని పూర్వీకులు చెబుతున్నారు. నాటి నుంచి దీనిని శ్రీరామఘాట్గా పిలుస్తారు. ఇక్కడ పుష్కరాలకు పుణ్యస్నానాలు చేస్తారు. ► రత్నగిరి సత్యదేవుని ఆలయానికి క్షేత్రపాలకుడు శ్రీరాముడు కావడం మరో విశేషం. సత్యదేవునికి జరిగే ప్రతి వైదిక కార్యక్రమానికి, కల్యాణానికి శ్రీరాముడు పెళ్లిపెద్దగా వ్యవహరిస్తారు. ► గొల్లలమామిడాడ కోదండ రామస్వామి ఆలయం రాష్ట్రంలో కడప జిల్లా ఒంటిమిట్ట తరువాత అంతటి ప్రాముఖ్యం ఉన్న ఆలయం. ఈ ఆలయాన్ని విశిష్టమైన వాస్తు శాస్త్రంతో నిర్మించారు. రెండు భారీ గోపురాలు కలిగి ఉంటాయి. ఈ ఆలయాన్ని ‘చిన్న భద్రాది’ లేదా ‘చిన్న భద్రాచలం’ అని కూడా అంటారు. శ్రీరామ నవమి పండగకు ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తారు. ► రావణ వధ తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా పుష్పక విమానంలో తిరిగి అయోధ్య వెళ్తుండగా శ్రమణి అనే రుషి భార్య శాపవశాత్తు కురూపిగా మారిపోతుంది. శాప విమోచనకు ఆమె తపస్సు చేస్తుంటుంది. ఆ ప్రదేశానికి వచ్చేసరికి పైన వెళ్తున్న పుష్పక విమానం ఆగిపోతుంది. అది గుర్తించిన రాముడు ఆమెకు క్షణ కాలంలోనే శాప విమోచనం కలిగించాడు. అనంతరం అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. దీంతో ఆ ప్రదేశానికి క్షణ ముక్తేశ్వరం పేరు వచ్చిందని పురాణ గాధ. అలాగే యుద్ధంలో వినియోగించిన అస్త్రాలను ముక్తిగుండంలో వదిలిపెట్టారని భక్తుల విశ్వాసం. ఈ గుండంలోని నీటినే శివలింగానికి అభిషేకిస్తారు. అంతా రామమయం అయోధ్యలో సోమవారం బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపనను దేశ వ్యాప్తంగా హిందువులు పండగగా భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎటుచూసినా రామనామమే వినిపిస్తోంది. శ్రీరాముని ఆలయాల వద్దనే కాదు.. ప్రతి ఆలయం వద్దా అయోధ్య రామాలయ ప్రతిష్ఠ సందడి నెలకొంది. ఆలయాలు, ఇళ్లు, వ్యాపార, వాణిజ్య కేంద్రాల వద్ద హనుమంతుని జెండాలను తగిలించి భక్తిని చాటుకుంటున్నారు. పలు దుకాణాల వద్ద ఈ జెండాల విక్రయం జోరుగా సాగుతోంది. ఆలయాల వద్దనే కాదు, చివరకు చాలా మంది సెల్ఫోన్ రింగ్ టోన్లు కూడా ‘జై శ్రీరామ్’ నినాదాన్నే పెట్టుకుంటున్నారు. వాట్స్అప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ల డీపీలు రాముని చిత్రాలతో నిండిపోతున్నాయి. ఊరూవాడా ప్రత్యేక యాత్రలు, భజనలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి పలువురు ఆయోధ్య వెళ్లారు. ఊరూవాడా శ్రీరామ మహా శోభాయాత్రలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ‘జై శ్రీరామ్’ నినాదాలు హోరెత్తుతున్నాయి. -
అంతా రామమయం
కడప కల్చరల్: కడప నగరంలో శ్రీరామ శోభాయాత్ర దిగ్విజయంగా సాగింది. అయోధ్య ఐక్యతా వేదిక ఆధ్వర్యంలో 8 గంటలపాటు కొనసాగిన ఈ యాత్ర రాత్రి 10 గంటలకు ముగింపు వేదిక వద్దకు చేరుకుంది.ఆద్యంతం కళారూపాల ప్రదర్శనలతో అట్టహాసంగా సాగింది. ధార్మిక సంస్థలు అడుగడుగునా మంచినీరు, కూల్డ్రింక్స్, అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేశాయి. అయోధ్య ఆలయంలో సోమవారం శ్రీ బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టించనున్న సందర్భంగా ఆదివారం కడప నగరంలో శ్రీరామ శోభాయాత్ర పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ తదితర ధార్మిక సంఘాలతోపాటు పలు దేవాలయాల నిర్వాహక కమిటీ సభ్యులు, భక్తులు, భజన బృందాలు, అర్చక సంస్థలు, హిందూ సంఘాల ప్రతినిధులు దాదాపు 30 వేల మంది ర్యాలీలో పాల్గొన్నారు. ► ఉదయం 7.30 గంటలకు చిన్నచౌకులోని శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి శ్రీరామ శోభాయాత్ర ప్రారంభమైంది. నగర మేయర్ సురేష్బాబు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్లు భక్తులతో నిండిపోయాయి.18 అడుగుల భారీ శ్రీరాముని విగ్రహాన్ని ప్రత్యేక రథంలో ఏర్పాటు చేశారు. ర్యాలీలో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాహుబలి హనుమంతుడు, దేవతామూర్తుల వేషధారణలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. డీజే సౌండ్ సిస్టమ్తో భక్తిగీతాలకు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు నృత్యాలు చేయడం విశేషం. బాలరాముని చిత్రం ఆశారేఖ ఫౌండేషన్ చైర్మన్ నెమలిదిన్నె నాగవేణి బృందం స్థానిక హరిత టూరిజం హోటల్ ప్రాంగణంలో రూపొందించిన బాలరాముని రంగుల చిత్రం యాత్రలో పాల్గొన్న భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వైవీయూలో చిత్రకళను అభ్యసించిన విద్యార్థి కల్యాణ్ ఈ చిత్రాన్ని గంటసేపట్లో తీర్చిదిద్దారు. నేటి కార్యక్రమాలు సోమవారం హౌసింగ్బోర్డు రామాలయం వద్ద ఉదయం 6 గంటలకు శ్రీరామ హోమం, శ్రీరామలక్ష్మణ సీతా ఆంజనేయుల విగ్రహాలకు అభిషేకాలు నిర్వహిస్తారు. అయోధ్యలో జరిగే రామప్రతిష్టను ఆలయంలో స్క్రీన్ ఏర్పాటు చేసి లైవ్లో భక్తులు చూసే అవకాశం కల్పిస్తున్నారు. అదేరోజు సాయంత్రం పాలకొండపై శ్రీరామ అఖండ దివ్యజ్యోతిని వెలిగించనున్నారు. -
అయోధ్యలో నూతనోదయం: యోగి ఆదిత్యానాథ్
జాసు బిరహ సోచహు దిన రాతీ! రటహు నిరంతర గున్ గన్ పాంతి!! రఘుకుల తిలక సుజన్ సుఖదాత! ఆయౌ కుసల్ దేవ ముని త్రాతా!! శతాబ్దాల నిరీక్షణకు, తరాల పోరాటానికి, మన పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞకు ముగింపు పలికే రోజు ఎట్టకేలకు వచ్చింది. సనాతన సంస్కృతికి ఆత్మ అయిన ‘రఘునందన్ రాఘవ్ రామ్లల్లా’ తన జన్మస్థలమైన అవధ్పురిలోని గొప్ప దైవిక ఆలయంలో ప్రతిష్ఠితమవుతున్నారు. 500 సంవత్సరాల విరామం తర్వాత జరుగు తున్న ఈ చరిత్రాత్మకమైన, పవిత్రమైన సందర్భం... భారతదేశాన్ని మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని ‘మోక్షదాయని’ అయోధ్యపై చూపు నిలిపేలా చేసింది. నేడు ప్రతి రహదారీ శ్రీరామ జన్మభూమికి దారి తీస్తుంది. ప్రతి కన్ను ఆనందబాష్పాలతో తడిసిపోతుంది. అందరూ ‘రామ్–రామ్’ అని జపిస్తారు. తరతరాలుగా విశ్వాసులు, లోకాన్ని విడిచిపెట్టిన రామభక్తులు ఈ రోజు కోసం ఎంతగానో ఎదురు చూశారు. 2024 జనవరి 22 ప్రాముఖ్యత బాలరూప రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు మించినది. ఇది ప్రజల విశ్వాస పునఃస్థాపనను సూచిస్తుంది. అయోధ్య ఇప్పుడు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. సత్య న్యాయాల ఉమ్మడి విజయం చేదు జ్ఞాపకాలను చెరిపివేస్తుంది. కొత్త కథలను సృష్టిస్తుంది. సమాజంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది. ‘శ్రీరామ జన్మభూమి ముక్తి మహాయజ్ఞం’ అనేది కేవలం సనాతన విశ్వాసానికి పరీక్ష కాదు; ఇది విజయవంతంగా దేశ సామూహిక చైతన్యాన్ని మేల్కొల్పింది. భారత దేశాన్ని ఐక్యతా సూత్రంతో కలిపింది. రాముడి జన్మస్థలంలో ఆలయ నిర్మాణం కోసం జరిగిన పోరాటంలో ప్రదర్శించిన ప్రత్యేక ఐక్యత అసమానమైనది. సాధువులు, సన్యాసులు, మేధావులు, రాజకీయ నాయకులు మరియు అన్ని వర్గాల ప్రజలు విభేదాలకు అతీతంగా ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ఏకమయ్యారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ వంటి సామాజిక సాంస్కృతిక సంస్థలు రోడ్మ్యాప్ను రూపొందించి ప్రజలను ఏకం చేశాయి. ఆ తీర్మానం ఎట్టకేలకు నెర వేరింది. భారతదేశంలో కొత్త ఉషస్సు వెల్లివిరుస్తోంది. ఒకప్పుడు ‘అవని అమరావతి’ అనీ, ‘భూలోక వైకుంఠం’ అనీ పిలి చిన అయోధ్య శతాబ్దాల పాటు శాప గ్రస్తంగా ఉండిపోయింది. ‘రామ రాజ్యం’ ఒక ఆదర్శ భావనగా ఉన్న దేశంలోనే రాముడు తన ఉనికిని నిరూపించుకోవాల్సిన అగత్యం వచ్చింది. అతని జన్మస్థలానికి ఆధారాలు కావాల్సి వచ్చింది. కానీ శ్రీరాముని జీవితం మర్యాదగా ప్రవర్తించడం, స్వీయ నిగ్రహాన్ని పాటించడం నేర్పుతుంది. రాముని భక్తులు ఓర్పు, పట్టుదలను ప్రదర్శించారు. నేడు అయోధ్య తాను కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందడంతో యావత్ జాతి సంతోషిస్తోంది. ఈ సంకల్పాన్ని నెరవేర్చడానికి మార్గనిర్దేశం చేసినందుకు గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీకి హృదయపూర్వక అభినందనలు! 2024 జనవరి 22 వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషకరమైన సందర్భం. నేను ఈ ప్రయాణం గురించి తలపోస్తున్నప్పుడు, రామ జన్మభూమిని విముక్తం చేయాలన్న అచంచలమైన సంకల్ప క్షణాలు నా మనస్సును ముంచెత్తుతున్నాయి. ఈ సంకల్పమే నన్ను గౌరవనీయులైన గురుదేవ్ మహంత్ వైద్యనాథ్ జీ మహారాజ్ సద్గుణ సాంగత్యంలోకి నడిపించింది. విగ్రహ ప్రతిష్ఠాపన శుభ సందర్భంలో మా తాత బ్రహ్మలీన్ మహంత్ శ్రీ దిగ్విజయ్నాథ్ జీ మహారాజ్, గౌరవనీయులైన గురుదేవ్ బ్రహ్మలీన్ మహంత్ శ్రీ వైద్యనాథ్ జీ మహారాజ్తో పాటు ఇతర గౌరవనీయులైన సాధువులు భౌతికంగా లేరని నాకు తెలుసు. కానీ వారి ఆత్మలు కచ్చితంగా అపారమైన సంతృప్తిని అనుభవిస్తాయి. గౌరవనీయులైన నా గురువులు జీవితాంతం అంకితభావంతో చేసిన తీర్మానం నెరవేరడానికి సాక్షిగా నిలవడం నా అదృష్టం. శ్రీ రామ జన్మభూమి ఆలయంలో శ్రీరామ్లల్లా ప్రతిష్ఠాపన గురించి ప్రకటించినప్పటి నుండి, ప్రతి సనాతన విశ్వాసిలో నిరీక్షణ స్పష్టంగా కనిపించింది. ఇటీవలి శతాబ్దాలలోనే అసమానమైన సామూహిక ఆనంద వాతావరణం దేశమంతటా వ్యాపించింది. శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య, సిక్కు, బౌద్ధ, జైన, దశనామీ శంకర్, రామానంద, రామానుజ, నింబార్క, మధ్వ, విష్ణునామి, రామసనేహి, ఘీసాపంథ్, గరీబ్దాసి, అకాలీ, నిరంకారీ, గౌడీయ, కబీర్పంథ్ వంటి విభిన్న ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చెందిన వారు... అనేక సంఖ్యలో ఉన్న శాఖలు, ఆరాధన పద్ధతుల వారు... 150కి పైగా సంప్రదాయాలకు చెందిన సాధువులు... అటవీ – గిరి నివాసులు, గిరిజన సమూహాలు, వివిధ రంగాలకు చెందిన ప్రము ఖులు... రాజకీయాలు, సైన్స్, పరిశ్రమలు, క్రీడలు, కళలు, సంస్కృతి, సాహిత్య రంగాలవారు అందరూ ఒకే గొడుగు కిందకు చేరడం నిజంగా అపూర్వమైనది, అరుదైనది. ఈ మహత్తరమైన సందర్భం ఎంతో గర్వకారణం. ఉత్తరప్రదేశ్లోని 25 కోట్ల మంది ప్రజల తరఫున పవిత్ర అయోధ్యధామంలో ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను. ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం తరువాత, అయోధ్యధామం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు, పర్యా టకులకు, పరిశోధకులకు, జిజ్ఞాసువులకు సాదర స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. ప్రధాన మంత్రి దూరదృష్టితో కూడిన ప్రణాళికలకు అనుగుణంగా అయో«ధ్యాపురి కచ్చితమైన సన్నాహాలు చేస్తోంది. నగరం ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం, విస్తరించిన రైల్వే స్టేషన్, అన్ని దిశల నుండి కలుస్తున్న 4–6 లేన్ రోడ్లతో బాగా అనుసంధానించబడిన నెట్వర్క్ను కలిగి ఉంది. అదనంగా హెలిపోర్ట్ సేవ, సందర్శకుల విభిన్న అవసరాలను తీర్చడానికి అనుకూలమైన హోటళ్లు, అతిథి గృహాల శ్రేణి ఏర్పాటైనాయి. కొత్త అయోధ్యలో, పురాతన సంస్కృతి, నాగరికత పరిరక్షణ జరుగుతూనే అత్యాధునిక నగర సౌక ర్యాలు అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి తగినట్టుగా నిర్మాణం జరుగుతోంది. ఈ చొరవలో భాగంగా అయోధ్యలోని పంచకోసి, 14 కోసి, 84 కోసి పరిక్రమ పరిధిలోని మతపరమైన, పౌరాణిక. చారిత్రక ప్రదేశాలకు వేగవంతమైన పునరుజ్జీవనం కలిగించడం జరిగింది. ఈ సమష్టి ప్రయత్నాలు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు దోహదపడటమే కాకుండా పర్యాటకాన్ని పెంచడానికీ, ఈ ప్రాంతంలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడానికీ ఉపయోగపడతాయి. శ్రీరామ జన్మభూమి ఆలయ స్థాపన ఒక లోతైన ఆధ్యాత్మిక వేడుకగా నిలుస్తుంది. ఇది భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి సూచిక. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఇది జాతీయ దేవాలయం. శ్రీరామ్లలా పవిత్రోత్సవం యావత్ జాతి జనుల హృదయాన్ని గర్వంతో ఉప్పొంగించే ఒక ముఖ్యమైన సందర్భం. రాముడి దయతో, అయోధ్య సంప్రదాయ పరిక్రమ పవిత్రత ఇప్పుడు సురక్షితంగా ఉంటుంది. ఎటువంటి ఆటంకాలూ దాని పవిత్ర మార్గాన్ని నాశనం చేయలేవు. అయోధ్య వీధులలో ఇక బుల్లెట్లు ప్రతి ధ్వనించవు, సరయూ నది రక్తపు మరకను భరించదు, కర్ఫ్యూ విధ్వంసం జరగదు. బదులుగా ఆనందో త్సవ వేడుకలు జరుపుకొంటూ, రామనామ సంకీర్తనలతో ప్రతిధ్వనిస్తుంది. అవధ్పురిలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ భారతదేశంలో రామరాజ్య స్థాపన తాలూకు ప్రకటనను తెలియజేస్తుంది. ఇది ఆదర్శానికి స్వరూపం. ఇక్కడ ‘సబ్ నర్ కరహీ పరస్పర ప్రీతి చలహీ స్వధర్మం నిరత శుతి నీతి’ అవుతుంది. శ్రీ రామ జన్మభూమి ఆలయంలో ప్రతిష్ఠించనున్న బాలరూప రాముని విగ్రహం మార్గదర్శక కాంతిగా పనిచేస్తుంది. ప్రతి సనాతన విశ్వాసి తన మతపరమైన సూత్రాలను అనుసరించడానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ శుభ సందర్భంగా 140 కోట్ల మంది తోటి పౌరులకు అభినందనలు! మన పూర్వీకులు నెలకొల్పుతామని గంభీరంగా ప్రమాణం చేసిన ఆలయాన్ని నిర్మించాలనే నిబద్ధత నెరవేరడం చూసి మనం ఎనలేని సంతృప్తిని పొందుదాం. భగవంతుడు శ్రీరాముని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలి. శ్రీ రామః శరణం మమ జయ–జయ శ్రీసీతారామ్! యోగి ఆదిత్యనాథ్ వ్యాసకర్త ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి -
రాముని మార్గంలో నడుద్దాం!
మన భారతదేశపు శతాబ్దిన్నర చరిత్ర విదేశీ దురాక్రమణదారులతో సాగించిన నిరంతర సంఘర్షణలతో నిండి ఉంది. ప్రారంభంలో కొద్దిమంది అప్పుడప్పుడు ఇక్కడి సంపదను దోచుకోవడం కోసం (సికందర్ దాడి) ఈ దేశంపై దాడి చేసేవారు. కానీ ఆ తరువాత ఇస్లాం పేరున పశ్చిమం నుండి సాగిన దాడులు ఇక్కడి సమాజాన్ని తీవ్రంగా నష్టపరచడమేకాక వేర్పాటువాద ధోరణిని కూడా తీసుకువచ్చాయి. సమాజంలో నిరాశ, నిస్పృహ, పరాజయ భావాలను నింప డానికి విదేశీ దురాక్రమణదారులు ఇక్కడి ధార్మిక స్థలాలు, మందిరాలపై దాడి చేసి, వాటిని ధ్వంసం చేశారు. ఇలా ఒక్కసారి కాదు, అనేకసార్లు జరిగింది. ఈ విధంగా భారతీయ సమాజాన్ని బలహీనపరచి దీర్ఘకాలం ఇక్కడ రాజ్యం చేయా లన్నది వారి ప్రయత్నం. అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని కూడా ఇదే ఉద్దేశ్యంతో, లక్ష్యంతో ధ్వంసం చేశారు. దురా క్రమణకారుల ఈ లక్ష్యం కేవలం ఒక మందిరానికే పరిమితం కాలేదు. మొత్తం ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టు కోవాలన్నది వారి అసలు ఉద్దేశ్యం. ఈ దేశానికి చెందిన రాజులు ఎప్పుడూ, ఏ దేశంపైనా దురాక్రమణ చేయలేదు. కానీ ప్రపంచంలోని మిగిలిన దేశాలకు చెందిన రాజులు మాత్రం అటువంటి దాడులు, దురాక్రమణలకు పాల్పడ్డారు. అయినా ఏ పాలకుడూ భారత్పై పూర్తి ఆధిపత్యాన్ని సాధించలేకపోయాడు. భారతీయ సమాజం ఎప్పుడూ ఈ దురాక్రమణదారుల ముందు తలవంచలేదు. వీరిని ఎదుర్కొనేందుకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది. అయోధ్య జన్మస్థానాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని అక్కడ భవ్యమైన రామమందిరాన్ని పునర్నిర్మించడానికి నిరంతర ప్రయత్నం సాగుతూనే వచ్చింది. అనేక యుద్ధాలు, సంఘర్షణ, బలిదానాలు జరిగాయి. రామజన్మభూమిలో మందిర నిర్మాణ సంకల్పం హిందువుల మనస్సుల నుండి ఎప్పుడూ తొలగిపోలేదు. 1857లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధానికి ప్రణాళిక వేసుకున్నప్పుడు హిందువులు, ముస్లింలు కలిసే ఆ పని చేశారు. అప్పటివరకూ ఇద్దరూ ఆలో చనలు పంచుకునేవారు. అప్పుడు గోవధ నిషేధం, రామజన్మభూమి గురించి రెండు వర్గాల మధ్య ఒక అంగీకారం కుదిరే పరిస్థితి ఏర్పడి ఉంది. తన ప్రమాణపత్రంలో గోవధ నిషేధం అమలు గురించి కూడా బహదూర్ షా జాఫర్ పేర్కొన్నారు. అందు వల్లనే సమాజం మొత్తం ఒకటిగా నిలచి పోరాడింది. భారతీయులందరూ వీరోచితంగా పోరాడినా దుర దృష్టవశాత్తూ ఆ యుద్ధం విఫలమైంది. దానితో బ్రిటిష్ పాలన కొనసాగింది. అయితే రామ జన్మ భూమి ముక్తి పోరాటం మాత్రం ఆగలేదు. బ్రిటిష్ వాళ్ళు మొదటి నుండి అనుసరిస్తూ వచ్చిన ‘విభజించి పాలించు’ అనే విధానాన్ని ఆ తరువాత మరింతగా అమలుచేశారు. సమాజంలోని ఐకమత్యాన్ని నాశనం చేయడం కోసం బ్రిటిష్ వాళ్ళు స్వతంత్ర వీరులను అయోధ్యలో ఉరితీశారు. అయినా అయోధ్య ముక్తి పోరాటం ఆగలేదు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత సోమనాథ మందిర జీర్ణోద్ధరణ జరగడంతో ఇటు వంటి దేవాలయాల గురించి చర్చ మళ్ళీ ప్రారంభమయింది. రామజన్మభూమి ముక్తి గురించి అందరి ఆమోదం, అంగీకారం సాధించే అవకాశం అప్పుడు వచ్చినా రాజకీయాలు మరోదారి పట్టాయి. విచ్ఛిన్న వాదం, ప్రాంతీయవాదం వంటివి రాజకీయాల ముసుగులో పెచ్చరిల్లాయి. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఈ విషయమై హిందువుల మనోభావాలను పట్టించు కోకపోగా వివాదాన్ని పరిష్కరించుకోవడం కోసం ప్రజలు చేసిన ప్రయత్నాలను కూడా ముందుకు సాగనివ్వలేదు. ఈ విషయమై స్వాతంత్య్రానికి ముందు నుండి సాగుతూ వచ్చిన న్యాయపోరాటాన్ని కొనసాగించారు. రామజన్మభూమి విముక్తి కోసం ప్రజా ఉద్యమం 1980 తరువాత ఊపందుకుంది. అప్పటి నుండి మూడు దశాబ్దాల పాటు సాగింది. 1949లో జన్మభూమిలో భగవాన్ శ్రీరామచంద్రుని విగ్రహం వెలిసింది. 1986లో కోర్టు ఆదేశం మేరకు ఆలయ తాళాలు తెరిచారు. ఆ తరువాత అనేక ఉద్యమాలు, రెండుసార్లు కరసేవ వంటి కార్య క్రమాల ద్వారా హిందూ సమాజపు నిరంతర సంఘర్షణ కొనసాగింది. 2010లో అలహాబాద్ హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. ఆ తరువాత ఈ విషయంలో అంతిమ తీర్పు సాధ్యమైనంత త్వరగా వెలువరించాలంటూ కోర్టుకు పదేపదే అభ్యర్థనలు వెళ్ళాయి. చివరికి హిందూ సమాజపు 30 సంవత్సరాల సుదీర్ఘమైన న్యాయ పోరాటం తరువాత 2019 నవంబర్ 9న అన్ని సాక్ష్యాధారాలు క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీంకోర్టు సముచితమైన, సంతులితమైన తీర్పును ప్రకటించింది. రెండు పక్షాల మనోభావాలు, సాక్ష్యాధారాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అలాగే ఈ కేసుకు సంబంధించి అన్ని పక్షాల వాదనలను కూడా పూర్తిగా విన్న తరువాత తీర్పునిచ్చింది. ఈ తీర్పును అనుసరించి మందిర నిర్మాణం కోసం ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. 2020 ఆగస్ట్ 5న మందిర భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు పుష్య మాస శుక్లపక్ష ద్వాదశి, యుగాబ్ది 5125... 2024 జనవరి 22న శ్రీ రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ధార్మిక దృష్టితో చూస్తే శ్రీరాముడు ఈ దేశంలో అధిక సంఖ్యాకులకు ఆరాధ్య దేవుడు. ఆయన జీవితం ఆదర్శప్రాయమనీ, అనుసరణీయమనీ నేటికీ సమాజంలో అందరూ భావిస్తున్నారు. అందువల్ల ఈ కార్యక్రమానికి సంబంధించి వస్తున్న చిన్నపాటి అభ్యంతరాలు, అనుమానాలను పూర్తిగా పక్కన పెట్టాలి. వివాదాలు, వాదనలు పూర్తిగా సమసిపోయేట్లు మేధావులు చూడాలి. అయోధ్య అంటే ‘యుద్ధం లేనిది’, ‘సంఘర్షణ లేని స్థానం’ అని అర్థం. సమాజంలోని ప్రతి ఒక్కరి మనస్సులలో అటువంటి అయోధ్య నిర్మాణం కావాలి. అది మనందరి కర్తవ్యం. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం జాతి గౌరవ పునర్ జాగరణకు గుర్తు. ఇది శ్రీరాముని జీవితం ఇచ్చే సందేశాన్ని ఆధునిక సమాజం కూడా స్వీకరించిందనడానికి గుర్తు. శ్రీరామ మందిరంలో పత్రం, ఫలం, పుష్పంతో పూజతోపాటు రామదర్శనంతో మనస్సులో ఆయనను ఉంచుకుని ఆదర్శవంత మైన ఆచరణను అలవరచుకుని శ్రీరాముని పూజ చేయాలి. ఎందుకంటే ‘శివో భూత్వా శివం భజేత్, రామో భూత్వా రామం భజేత్’ (శివుడే తానై శివుని పూజించు, రాముడే తానై రాముడిని పూజించు) అనేదే నిజమైన పూజ అవుతుంది. భారతీయ సాంస్కృతిక దృష్టి ప్రకారం... మాతృవత్ పర దారేషు పర ద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి సః పణ్డితాః (పర స్త్రీని మాతృభావనతో చూడాలి. పరుల సొమ్మును మట్టిగా ఎంచాలి. సర్వ జీవులలో ఆత్మను చూడాలి అని పండితులు చెబుతారు.) ఈ విధంగా మనం శ్రీరాముని మార్గంలో నడవాలి. సత్యనిష్ఠ, బలపరాక్రమాలతోపాటు క్షమ, వినయం, అందరినీ సమాదరించే ధోరణి, కారుణ్యం, కర్తవ్య పాలనలో పట్టుదల వంటి శ్రీరామచంద్రుని గుణాలను వ్యక్తిగతంగా, కుటుంబపరంగా అలవ రచుకునే ప్రయత్నం చేయాలి. వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ తెచ్చుకోవాలి. ఇటువంటి క్రమశిక్షణ ద్వారానే రామలక్ష్మణులు 14 ఏళ్ల అరణ్యవాసాన్ని పూర్తిచేయడమేకాక శక్తిశాలి రావణునితో పోరాడి విజయం సాధించారు. శ్రీరాముని జీవితంలో కనిపించే న్యాయబుద్ధి, కరుణ, సద్భావం, నిష్పక్షపాత ధోరణి వంటి సామాజిక గుణాలను తిరిగి ఈ సమాజంలో పాదుకొల్పాలి. శోషణ లేని, సమాన న్యాయం లభించే సమాజాన్ని, శక్తితోపాటు కరుణ నిండిన ఒక సమాజాన్ని నిర్మించడమే శ్రీరాముని నిజమైన పూజ అవుతుంది. అహంకారం, స్వార్థం, భేదభావాల మూలంగా ప్రపంచం వినాశం వైపు పరుగులు తీస్తోంది. ఎన్నో ఆపదలను కొనితెచ్చుకుంటోంది. సద్భావన, ఏకత, ప్రగతి, శాంతి వంటి మార్గాన్ని చూపిన జగద భిరాముని ఆదర్శం సర్వకల్యాణకారి, ‘సర్వేషాం అవిరోధి’ (ఎవరితోనూ విరోధం లేని) అయిన సమాజ నిర్మాణపు ప్రారంభానికి దారి చూపాలి. ఆ మహా ప్రయత్నానికి శ్రీ రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ నాంది కావాలి. మనమంతా ఆ ప్రయత్నంలో, ఆ ఉద్యమంలో పాలుపంచుకోవాలి. జనవరి 22న జరిగే ఉత్సవంలో పాల్గొని మందిర పునర్నిర్మాణ కార్యంతో భారత్, తద్వారా ప్రపంచపు పునర్నిర్మాణ సంకల్పం చేపడదాం. ఈ విషయాన్ని మనస్సులో ఉంచుకుని ముందుకు నడుద్దాం! డా‘‘ మోహన్ భాగవత్ వ్యాసకర్త ఆర్.ఎస్.ఎస్. సర్ సంఘచాలక్ -
ఎన్నో జన్మల పుణ్యఫలమే ఈ అవకాశం: మెగాస్టార్ ట్వీట్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి చూపులు అయోధ్య వైపే ఉన్నాయి. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ మహా ఘట్టానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సైతం అయోధ్యకు చేరుకున్నారు. జనవరి 22న జరగనున్న మహా ఘట్టం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు సైతం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య ఆహ్వానం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ట్వీట్ చేశారు. అయోధ్యలో రామ్లల్లాకు పట్టాభిషేకానికి ఆహ్వనం రావడం దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'చరిత్ర సృష్టిస్తోంది. చరిత్రను ఉర్రూతలూగిస్తోంది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇది నిజంగా అద్భుతమైన అనుభూతి. అయోధ్యలో రామ్లల్లా పట్టాభిషేకం చూసే ఆహ్వానం రావడం నిజంగా దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా. ఐదు వందల సంవత్సరాలకుపైగా తరతరాలుగా వేచి చూస్తోన్న భారతీయుల నిరీక్షణ ఫలించబోతున్న మహత్తర అధ్యాయం. ఆ దివ్యమైన 'చిరంజీవి' అయిన హనుమంతుడు, అంజనా దేవి కుమారుడే.. స్వయంగా ఈ భూలోక అంజనాదేవి కుమారుడు చిరంజీవికి ఈ అమూల్యమైన క్షణాలను చూసే బహుమతిని ఇచ్చినట్లు అనిపిస్తోంది.' అంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు. అంతే కాకుండా..' ఇది నిజంగా వర్ణించలేని అనుభూతి. నాకు, నా కుటుంబ సభ్యులకు ఎన్నో జన్మల పుణ్యఫలం. ఈ అవకాశం కల్పించిన గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, శ్రీ యోగి జీ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ మహత్తర సందర్భంలో ప్రతి భారతీయునికి హృదయపూర్వక అభినందనలు. రేపటి బంగారు క్షణాల కోసం ఎదురుచూస్తున్నా. జై శ్రీరామ్ ' అని తెలిపారు. Creating history Evoking history Everlasting in History This is truly an overwhelming feeling.. I consider this invitation a godsend opportunity to witness the consecration of Ram Lalla at Ayodhya. That glorious chapter, when the excruciating wait of generations of Indians… — Chiranjeevi Konidela (@KChiruTweets) January 21, 2024 -
Tamil Nadu: రాముడి పేరుతో పూజలు వద్దు.. సీతారామన్ సీరియస్
ఢిల్లీ: అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం సర్వాంగసుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనం ఇవ్వనున్నాడు. మరోవైపు.. రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా తమిళనాడు ఆలయాల్లో రాముడి పూజలను రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడం రాజకీయం హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యం స్టాలిన్ సర్కార్పై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సీరియస్ అయ్యారు. వివరాల ప్రకారం.. రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా తమిళనాడు ఆలయాల్లో రాముడి పూజలను రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని నిర్మలా సీతారామన్ తప్పుబట్టారు. ఈ క్రమంలోనే తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం హిందూ వ్యతిరేక చర్యగా ఆమె అభివర్ణించారు. జనవరి 22న రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం లైవ్ టెలికాస్ట్నూ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిందని నిర్మల తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. TN govt has banned watching live telecast of #AyodhaRamMandir programmes of 22 Jan 24. In TN there are over 200 temples for Shri Ram. In HR&CE managed temples no puja/bhajan/prasadam/annadanam in the name of Shri Ram is allowed. Police are stopping privately held temples also… pic.twitter.com/G3tNuO97xS — Nirmala Sitharaman (@nsitharaman) January 21, 2024 ఇదిలా ఉండగా.. నిర్మలా సీతారామన్ ప్రకటనను దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు తోసిపుచ్చారు. తమిళనాడు ఆలయాల్లో రాముడి పూజలు, అన్నదాన కార్యక్రమాలపై ఎలాంటి నిషేధం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఇక తమిళనాడులో 200కుపైగా రామాలయాలు ఉన్నాయి. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో శ్రీరాముడి పేరుతో ఎలాంటి పూజలు, భజన, ప్రసాదం, అన్నదానం నిర్వహించరాదని ప్రభుత్వం పేర్కొంది. ప్రైవేట్ నిర్వహకుల చేతిలో ఉన్న ఆలయాల్లోనూ ఎలాంటి ఈవెంట్స్ చేపట్టరాదని అధికారులు కట్టడి చేశారు. ప్రైవేట్ వ్యక్తులకు చెందిన ఆలయాల్లోనూ ఎలాంటి ఈవెంట్లు నిర్వహించరాదని పోలీసులు ఆంక్షలు విధించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో, ఈ విషయం పొలిటికల్గా చర్చనీయాంశంగా మారింది. -
కౌంట్డౌన్: సర్వాంగ సుందరంగా అయోధ్య
మరికొద్ది గంటల్లో ఓ మహాఘట్టానికి తెరలేవనుంది. అయోధ్య మహానగరం నడిబొడ్డున శ్రీరామచంద్రుల వారు కొలువుతీరనున్నారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం రేపు(సోమవారం)మధ్యాహ్నం 12 :15 నిమిషాల నుంచి 12: 45 నిమిషాల మధ్య జరుగనుంది. మేషలగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. అయోధ్య రామమందిర ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. కాగా, ప్రాణప్రతిష్టకు ముందు చేసే ప్రత్యేక పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రాణ్ అంటే ప్రాణశక్తి, ప్రతిష్ట అనగా స్థాపన. శ్రీరాముని విగ్రహానికి జీవం పోసే కార్యక్రమంగా చెప్పవచ్చు. దీంతో అయోధ్య నగరమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో అయోధ్య నగరమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎటు చూసినా, ఎక్కడా చూసినా రాముడు, సీత, హనుమంతుడు, రామయాణ దృశ్యాలే కనిపిస్తున్నాయి. వీధులన్నీ కాషాయమయం అయ్యాయి. రామ భజనలు, కీర్తనలతో అయోధ్య మారుమోగుతోంది. ఇవి కూడా చదవండి: అంతరిక్షం నుంచి అయోధ్య చిత్రాలు.. ప్రాణ ప్రతిష్టను ప్రత్యక్షంగా చూడటం ఎలా? అయోధ్యకు ఎలా వెళ్లాలి?.. దర్శనానికి ఏం చేయాలి అంతా రామమయం.. ఈ సంగతులు మీకు తెలుసా? -
Ayodhya: బంపరాఫర్.. అయోధ్యకు ఉచితంగా బస్సు టికెట్
అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట వేడుక జనవరి 22న జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు అయోధ్యను సందర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఎయిర్ లైన్ సంస్థలు కూడా విమాన సర్వీసులను పెంచాయి. అయోధ్యకు వెళ్లే వారి కోసం ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం (Paytm) ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. రామ జన్మభూమిని దర్శించేవారికి పేటీఎం యాజమాన్య సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL) ఒక పథకాన్ని ప్రారంభించింది. దీని కింద 1000 మందికి అయోధ్యకు ఉచితంగా బస్సు టిక్కెట్ లభిస్తుంది. ఈ ఆఫర్ జనవరి 19న ప్రారంభమైంది. ఇదీ చదవండి: Ayodhya Ram Mandir: పుణ్యంతోపాటు పన్ను ఆదా! ఎలాగంటే.. రామ మందిర ప్రతిష్ఠాపన వేడుక కోసం అయోధ్యకు వెళ్లే ప్రయాణికుల కోసం పేటీఎం ఈ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. పేటీఎం మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్ను బుక్ చేసుకునే మొదటి 1,000 మంది వినియోగదారులకు మాత్రమే ఉచిత బస్సు టిక్కెట్లు లభిస్తాయి. ఆఫర్ను పొందడానికి 'BUSAYODHYA' అనే ప్రోమో కోడ్ని ఉపయోగించాల్సి ఉంటుంది. -
రాముడి ఆహ్వానం అందింది.. అయోధ్యకు వస్తున్నా: నిత్యానంద
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం సర్వాంగసుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనం ఇవ్వనున్నాడు. రేపు సోమవారం బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది. ప్రపంచం నలు మూలల నుంచి తరలివస్తున్న భక్త జనం సాక్షిగా ఆగమ శాస్త్ర పద్ధతుల్లో ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమానికి తాను వస్తున్నాని తాను దైవంగా చెప్పుకునే నిత్యానంద స్పష్టం చేశాడు. వివరాల ప్రకారం.. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో ఈ నెల 22న జరుగనున్న రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందినట్లు నిత్యానంద తెలిపాడు. ఈ కార్యక్రమానికి తాను హాజరవుతున్నట్లు నిత్యానంద ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు. ఈ క్రమంలో ట్విట్టర్లో ‘ఈ చారిత్రాత్మకమైన, అసాధారణమైన సంఘటనను మిస్ అవ్వకండి. సాంప్రదాయ ప్రాణ ప్రతిష్ట సమయంలో రాముడు లాంఛనంగా ఆలయంలోని ప్రధాన విగ్రహంలోకి ఆవాహనం అవుతాడు. యావత్ ప్రపంచాన్ని కరుణించేందుకు భూమిపైకి వస్తాడు’ అని కామెంట్స్ చేశారు. అలాగే, రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి లాంఛనంగా ఆహ్వానం అందడంతో హిందూ మతం అత్యున్నత పీఠాధిపతి భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం ఈ గొప్ప కార్యక్రమానికి హాజరుకానున్నారు అంటూ చెప్పుకొచ్చారు. 2 More Days Until the Inauguration of Ayodhya Ram Mandir! Don't miss this historic and extraordinary event! Lord Rama will be formally invoked in the temple's main deity during the traditional Prana Pratishtha and will be landing to grace the entire world! Having been formally… pic.twitter.com/m4ZhdcgLcm — KAILASA's SPH NITHYANANDA (@SriNithyananda) January 20, 2024 ఇదిలా ఉండగా.. నిత్యానంద 2020లో భారత్ నుంచి పారిపోయాడు. ఒక దీవిని ‘కైలాస’ దేశంగా ప్రకటించిన ఆయన హిందూ మతానికి సుప్రీం పీఠాధిపతిగా చెప్పుకుంటున్నాడు. అయితే, అంతకుముందు కర్ణాటకలో ఒక మఠానికి అధిపతి అయిన నిత్యానందపై 2010లో అత్యాచారం కేసు నమోదైంది. కారు డ్రైవర్ ఫిర్యాదుతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్పై విడుదలైన నిత్యానంద దేశం నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో పలు మార్లు సోషల్ మీడియా వేదికగా పలు కామెంట్స్ చేస్తున్నారు. -
గుడిని శుభ్రం చేసిన బాలీవుడ్ బ్యూటీ.. రామ్ వచ్చేయ్ అంటూ..
శతాబ్దాల కల సాకారం కానుంది. సోమవారం(జనవరి 22) అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ వేడుక కోసం యావత్ దేశం కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి రమ్మని ఆహ్వానాలు అందాయి. అందులో కంగనా రనౌత్ కూడా పేరు కూడా ఉంది. ఇంకేముంది, వెంటనే అక్కడ వాలిపోయిందీ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్. సిల్క్ చీర కట్టుకుని బంగారు నగలు ధరించి అయోధ్యలో హనుమంతుడి ఆలయాన్ని దర్శించుకుంది. ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన నటి గుడి ప్రాంగణంలో చీపురుపట్టి శుభ్రం చేసింది. అనంతరం అక్కడ ఉండే ఆధ్యాత్మిక గురువు శ్రీ రామభద్రాచార్యను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకుంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'రామా.. ఇకనైనా వచ్చేయ్.. ఈ రోజు నేను ఒక గొప్ప వ్యక్తి శ్రీ రామభద్రాచార్యులవారిని కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నాను. ఆయన ఆధ్వర్యంలో హనుమంతుడి యాగం చేశాను. అయోధ్యధామంలో రామునికి స్వాగతం పలుకుతున్నందుకు జనమంతా సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ప్రస్తుతం ఆ సినిమాలో.. చాలా కాలం తర్వాత అయోధ్య రాజు తన స్వస్థలానికి రేపు తిరిగివస్తున్నాడు. వచ్చేయ్ రామా.. వచ్చేయ్' అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్కు క్యాప్షన్ జోడించింది. కాగా కంగనా రనౌత్ చివరగా తేజస్ సినిమాలో నటించింది. ఈ చిత్రం ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆమె ప్రస్తుతం ఎమర్జన్సీ సినిమా చేస్తోంది. ఇందులో ఆమె దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) చదవండి: 40-50 ఏళ్ల వయసులో కచ్చితంగా తోడు కావాలి.. అప్పుడు సంతోషంగా లేను, అందుకే.. -
రామసేతు ఒడిలో మోదీ ప్రాణాయామం
చెన్నై: రామసేతు వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ప్రణాయామం చేశారు. సముద్ర నీటితో ప్రార్థనలు చేశారు. తీరంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామాయణంతో సంబంధం ఉన్న తమిళనాడులోని అరిచల్మునై జిల్లాలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. శనివారం రాత్రి రామేశ్వరంలో బస చేసిన మోదీ.. రామసేతు నిర్మించిన ప్రదేశంగా పేరొందిన అరిచల్మునైకి వెళ్లారు. రామాయణంతో సంబంధం ఉన్న ప్రదేశాల మూడు రోజుల పర్యటనను ప్రధాని మోదీ తమిళనాడులో ముగించనున్నారు. శుక్రవారం చెన్నైలో ఖేలో ఇండియా గేమ్స్ 2023ను ప్రారంభించారు. శనివారం శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి, రామేశ్వరంలోని అరుల్మిగు రామనాథస్వామి ఆలయాలను సందర్శించారు. సోమవారం అయోధ్యలో శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన జరగనున్న నేపథ్యంలో రామాయణంతో సంబంధం ఉన్న తమిళనాడు ఆలయాలను మోదీ సందర్శించారు. #WATCH | Tamil Nadu: Prime Minister Narendra Modi visits Arichal Munai point in Dhanushkodi, which is said to be the place from where the Ram Setu was built. pic.twitter.com/GGFRwdhwSH— ANI (@ANI) January 21, 2024 అయోధ్య రామమందిరంలో జనవరి 22న బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకకు దేశంలో దాదాపు 7000 మంది ప్రముఖులు హాజరవుతారు. ఇదీ చదవండి: అయోధ్య రామయ్య దర్శనం, ప్రసాదం ఉచితమే..! -
అంతరిక్షం నుంచి అయోధ్య చిత్రాలు..!
లక్నో: రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జనవరి 22(సోమవారం)న జరగనుంది. ఈ సందర్భంగా అంతరిక్షం నుంచి తీసిన రామ మందిర దృశ్యాలను ఇస్రో పంచుకుంది. ఇస్రో ఆధ్వర్యంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)ఈ దృశ్యాలను తీసింది. డిసెంబర్ 16, 2023న నిర్మాణంలో ఉన్న ఆలయం ఫొటోలు తీసింది. ఉపగ్రహ చిత్రాలలో నూతనంగా అభివృద్ధి చేసిన దశరథ్ మహల్, సరయు నది కూడా రామమందిరం సమీపంలో చూడవచ్చు. కొత్తగా పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్ను NRSC షేర్ చేసిన చిత్రాలలో కూడా చూడవచ్చు. ఆలయ మొదటి దశ పూర్తి కావొస్తోంది. జనవరి 22న బాలరాముని విగ్రహాన్ని ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. దేశంలో ప్రముఖులతో కలిపి మొత్తం 7000 మందికి ఆహ్వానాలు అందాయి. సాంప్రదాయ నగారా శైలిలో నిర్మించిన ఆలయ సముదాయం 380 అడుగుల పొడవు (తూర్పు-పడమర దిశ), 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయంలోని ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉన్నాయి. ఇదీ చదవండి: అయోధ్య రామయ్య దర్శనం, ప్రసాదం ఉచితమే..! -
Ayodhya Event: సెలవుపై వెనక్కి తగ్గిన ఢిల్లీ ఎయిమ్స్
ఢిల్లీ: అయోధ్య రామ మందిర వేడుకకు ఆఫ్ డే సెలవు ప్రకటనపై ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వెనక్కి తగ్గింది. మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని రేపు మధ్యాహ్నం 2.30 గంటల వరకు నాన్ క్రిటికల్ సర్వీస్లను మూసివేయాలన్న నిర్ణయాన్ని ఈరోజు వెనక్కి తీసుకుంది. నాన్-క్రిటికల్ సర్వీస్లలోని సిబ్బందికి రేపు సగం రోజు విరామం ప్రకటించడంపై నిరసన వ్యక్తమైన విషయం తెలిసిందే. ఎయిమ్స్-ఢిల్లీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజేష్ కుమార్ రేపు ఆఫ్ డే సలవు అని పేర్కొంటూ మెమోరాండం జారీ చేశారు. రేపు ప్రభుత్వ సిబ్బందికి హాఫ్ డేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. "22.01.2024న 14.30 గంటల వరకు ఎయిమ్స్ హాఫ్ డే సెలవు ఉంటుందని ఉద్యోగులందరి సమాచారం" అని మెమోరాండం పేర్కొంది. అయినప్పటికీ, "అన్ని క్రిటికల్ క్లినికల్ సేవలు" నడుస్తాయని పేర్కొన్నారు. ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (OPD) సేవలు అందుబాటులో ఉంటాయో లేదో అధికారిక నోట్లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కానీ ఇలాంటి రోజుల్లో అవుట్డోర్ పేషెంట్లు వైద్యులను సంప్రదించలేమని భయపడ్డారు. దీంతో ఢిల్లీ ఎయిమ్స్ నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. రోగులు నెలల తరబడి వేచి ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓపీడీ సేవలు నిలిపివేస్తే రోగులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని మండిపడ్డారు. దీంతో ఢిల్లీ ఎయిమ్స్ యాజమాన్యం తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఇదీ చదవండి: అయోధ్య రామయ్య దర్శనం, ప్రసాదం ఉచితమే..! -
అయోధ్య రామ మందిరానికి 'హనుమాన్' టీమ్ భారీ విరాళం
శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సం, బాలరాముని ప్రాణప్రతిష్టకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. నేడు ఆ మధుర క్షణాలు ఆస్వాధించేందుకు భారత్ మొత్తం ఎదురుచూస్తుంది. ఇదే సమయంలో టాలీవుడ్లో విడుదలైన హనుమాన్ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. చిన్న సినిమాగా విడుదల అయిన ఈ చిత్రం నేడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుంది. రామమందిర ప్రారంభోత్సవ వేళ 'హను-మాన్' టీమ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. ఈ సినిమా ప్రతి టికెట్పై రూ.5 అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇవ్వనుందని ప్రీరిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా టైటిల్ రోల్లో ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్స్పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మేకర్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పేర్కొన్నట్లుగా, వారు అయోధ్య రామమందిరానికి ఒక్కో టికెట్ నుంచి రూ. 5 రామమందిరానికి కేటాయించారు. సినిమా ప్రీమియర్ షోల నుంచి విక్రయించిన 2,97,162 టిక్కెట్లకు గాను రూ.14,85,810 చెక్కును ఇప్పటికే అందించారు. ఆ తర్వాత నేటి వరకు విక్రయించిన 53,28,211 టిక్కెట్ల నుంచి రూ.2,66,41,055 అందిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ రూ. 150 కోట్ల మార్కును క్రాస్ చేసి రూ. 200 కోట్ల వైపు దూసుకుపోతుంది. గూస్బంప్స్ వచ్చాయి: నాగా చైతన్య హనుమాన్ చిత్రం విడుదలకు ముందే మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్నారు. ఆపై బాలకృష్ణ కూడా అభినందించారు. సమంత కూడా సినిమా బాగుందంటూ ఆ చిత్ర మేకర్స్ను మెచ్చుకున్నారు. తాజాగా హీరో నాగచైతన్య మనుమాన్ చిత్రాన్ని చూశారు. చిత్ర యూనిట్ను అభినందిస్తూ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ పెట్టారు. హనుమాన్ కథతో పాటు తెరపైకి తీసుకువచ్చిన తీరు చాలా అద్భుతం అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మను అభినందించారు. హనుమంతుగా తేజ సజ్జా అదరగొట్టేశారు. సినిమా చూస్తున్నంతసేపు గూస్బంప్స్ వచ్చాయని నాగ చైతన్య తెలుపుతూ టీమ్ మొత్తానికి అభినందనలు తెలిపారు. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
అయోధ్య రామయ్య దర్శనం ఉచితమే..!
లక్నో: రామ మందిరం దేశంలోనే ప్రముఖ దేవాలయాల జాబితాలో చేరబోతోంది. ఇలాంటి చోట దర్శనం, ప్రసాదాలకు రుసుము ఉండటం సహజం. కానీ, భక్తులు సమర్పించిన రూ.వేల కోట్ల విరాళాలతో రూపుదిద్దుకుంటున్న ఈ భవ్య మందిరంలో భక్తులపై దర్శన వేళ అదనంగా రుసుము భారం మోపొద్దని ట్రస్టు నిర్ణయించింది. ఎంతమంది భక్తులు వచ్చినా ఎలాంటి రుసుమూ లేకుండా దర్శనానికి అవకాశం కల్పించబోతున్నారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరికీ ఒకే తరహాలో దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి దర్శన అనంతరం ఎంతో భక్తిశ్రద్ధలతో స్వీకరించే ప్రసాదం కూడా ఉచితంగా అందించాలని నిర్ణయించారు. అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి కాకముందే భక్తుల తాకిడి పెరిగింది. ఇక్కడ ఆలయ నిర్మాణం ప్రారంభం కాకమునుపు రోజుకు సగటున 1500 నుంచి 2000 మంది వరకు వచ్చేవారు. ఆలయ పనులు మొదలయ్యాక ఆ సంఖ్య ఒక్కసారిగా పది వేలకు పెరిగింది. ఇప్పుడు నిత్యం 40 వేల నుంచి 50 వేల మంది భక్తులు అయోధ్యకు వస్తున్నారు. జనవరి 22 ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఆ సంఖ్య లక్షకు చేరువవుతుందని అంచనా వేస్తున్నారు. వీరందరికీ ఉచితంగానే దర్శనం కల్పించాలని భావిస్తున్నారు. ఆలయ నిర్మాణానికి అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రపభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవటం లేదని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇప్పటికే ప్రకటించింది. పూర్తిగా భక్తులు సమర్పించిన విరాళాలతోనే పనులు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటి వరకు ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా రామభక్తుల నుంచి రూ.3500 కోట్లకు పైగానే విరాళాలు అందినట్టు సమాచారం. వాటి ద్వారా వస్తున్న వడ్డీ మొత్తంతోనే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. భక్తులు ఇప్పటికీ విరాళాలు సమర్పిస్తూనే ఉన్నారు. అయోధ్య ఆలయ సమీపంలో ఉన్న కౌంటర్లు, తాత్కాలిక మందిరం వద్ద ఉన్న కౌంటర్లతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా భక్తులు విరాళాలు సమర్పిస్తూనే ఉన్నారు. ప్రతినెలా రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు అవి సమకూరుతున్నట్టు సమాచారం. ఇదీ చదవండి: అయోధ్య రామాలయం: భారీగా పెరిగిన స్టాక్లు ఇవే..! -
అయోధ్య రామాలయం: భారీగా పెరిగిన స్టాక్లు ఇవే..!
లక్నో: అయోధ్య రామ మందిర నిర్మాణం చిన్న స్టాక్లకు వరంగా మారింది. ఆలయ నిర్మాణంతో సంబంధం ఉన్న కంపెనీల షేర్లు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. అయోధ్య సమీపంలో లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేసిన ప్రవేగ్ లిమిటెడ్, సీసీటీవీ నిఘా నెట్వర్క్ కోసం కాంట్రాక్ట్ పొందిన అలైడ్ డిజిటల్ సర్వీసెస్ లిమిటెడ్ రెండు స్టాక్స్ గత నెలలో 55% కంటే ఎక్కువ పెరిగాయి. కామత్ హోటల్స్ ఇండియా లిమిటెడ్ కూడా దాదాపు 35% లాభపడింది. అయోధ్య ప్రారంభోత్సవానికి ముందే అక్కడ భక్తుల రద్దీ భారీగా పెరిగిందని ప్రవేగ్ లిమిటెడ్ తెలిపింది. స్థలం కోసం ఇప్పటికే అక్కడ ట్రావెల్ ఏజెంట్లు పోటీ పడుతున్నారని పేర్కొంది. అయోధ్యలో సీసీటీవీ ఒప్పందంతోనే అలైడ్ డిజిటల్ వెలుగులోకి వచ్చిందని బ్రోకరేజ్ బొనాంజా పోర్ట్ఫోలియో లిమిటెడ్ విశ్లేషకుడు వైభవ్ విద్వానీ తెలిపారు. అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. ఈ పుణ్యక్షేత్రంతో పర్యాటకం అభివృద్ధి కావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కొత్త విమానాశ్రయం, రైలు స్టేషన్ గత నెలలో ప్రారంభమైంది. హోటళ్ళు, రిటైలర్లు, బ్యాంకింగ్ సెక్టార్ కూడా విస్తరించడానికి పలు సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఆలయం చుట్టూ మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడంతో వేల సంఖ్యలో భక్తులు రానున్నారు. మౌలిక సదుపాయాల కల్పన ఎంతో ప్రాముఖ్యతగా మారనుంది. అయెధ్యలో స్థిరమైన వృద్ధి జరుగుతుందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీలో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ డైరెక్టర్ సుకుమార్ రాజా తెలిపారు. రాబోయే రోజుల్లో ఉత్తరప్రదేశ్ ప్రధాన ప్రయాణ, వ్యాపార కార్యకలాపాల కేంద్రంగా అయోధ్య ఉద్భవించగలదని ఆయన భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: Ayodhya Ram mandir: అయోధ్య భక్తజన సంద్రం -
రాముని విగ్రహం ఫొటోలు లీకు..! ప్రధాన పూజారి ఆగ్రహం
లక్నో: ప్రాణప్రతిష్టకు ముందే బాలరాముని విగ్రహం ఫొటోలు లీకవడంపై అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. దీనిపై దర్యాప్తుకు డిమాండ్ చేశారు. ‘‘ప్రాణప్రతిష్ట జరగకుండా మూలవిరాట్టు ఫొటోలు విడుదల చేయడం సరికాదు. ముఖ్యంగా నేత్రాలను బహిర్గతపరచడం పూర్తిగా నిషిద్ధం. కళ్లు కనిపిస్తున్నది అసలు విగ్రహం కాదు." అని తెలిపారు. ఒకవేళ అది అసలు విగ్రహమే అయితే ఫొటోను లీక్ చేసిందెవరో కనిపెట్టి శిక్షించాలని ఆచార్య సత్యేంద్ర దాస్ కోరారు. ప్రాణప్రతిష్ట జరగనున్న బాలరామునికి సంబంధించి శుక్రవారం రెండు ఫొటోలు వెలుగు చూడటం తెలిసిందే. ఒకదాంట్లో కళ్లకు పసుపు వస్త్రం కట్టి ఉండగా మరొక దాంట్లో కళ్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాణప్రతిష్టకు సంబంధించి ఎలాంటి తప్పుడు కంటెంట్నూ వ్యాప్తి చేయొద్దని ప్రింట్, టీవీ మీడియాతో పాటు సోషల్ మీడియా వేదికలకు కేంద్రం సూచించింది. #WATCH | Ayodhya: On the idol of Lord Ram, Shri Ram Janmabhoomi Teerth Kshetra Chief Priest Acharya Satyendra Das says, "...The eyes of Lord Ram's idol cannot be revealed before Pran Pratishtha is completed. The idol where the eyes of Lord Ram can be seen is not the real idol. If… pic.twitter.com/I0FjRfCQRp — ANI (@ANI) January 20, 2024 రేపు (జనవరి 22)న అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. ఇందుకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దేశంలో ప్రముఖ నేతలు హాజరుకావడానికి ఆహ్వానాలు అందాయి. దాదాపు 7,000 మంది హాజరుకానున్నారు. ఈ వేడుకకు విదేశీ ప్రముఖులు కూడా హాజరవుతారు. ఇదీ చదవండి: Ayodhya Ram mandir: అయోధ్య భక్తజన సంద్రం -
కన్నయ్య..రామయ్య ఒక్కడేగా: రామ్ లల్లాకు ముస్లిం మహిళ అద్భుత కానుక
అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో అనేక విశేషాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఒక ముస్లిం మహిళ శ్రీరాముడి పట్ల తన భక్తిని చాటుకోవడం విశేషంగా నిలిచింది.అయోధ్య బాలరామునికి 21.6 అడుగుల భారీ వేణువును రూపొందించింది.ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేణువును తయారు చేసింది . కన్నయ్య అయినా రామయ్య అయినా ఒకటేగా అంటోంది భక్తి పారవశ్యంతో. అద్వితీయమైన భక్తితో దీన్ని తానే తయారు చేశానని పిలిభిత్ నగరానికి చెందిన ప్రముఖ శిల్పకారుడు, దివంగత నవాబ్ అహ్మద్ భార్య హీనా పర్వీన్ పేర్కొంది. ఇంతకు ముందు పిలిభిత్లో 16 అడుగుల వేణువు రికార్డు ఉండేది. తాజాగా రామయ్యకోసం ఈ రికార్డును బ్రేక్ చేసింది. కుమారుడు అర్మాన్ నబీ,సమీప బంధువు షంషాద్ సాయంతో అతి పెద్ద వేణువును తయారు చేసింది. జనవరి 22న రామ జన్మభూమి కాంప్లెక్స్లో పిలిభిత్ వేణు నాదం ప్రతిధ్వనించనుంది. అంతేకాదు పర్వీన్ కుటుంబం మూడు తరాలుగా కన్నయ్య వేణువును తయారు చేస్తోంది. Muslim artisan Hina Parveen has made a 21 feet long Bansuri for Bhagawan Ram in Pilibhit This world's largest playable flute has been sent to Ayodhya Dham#RamMandir #RamMandirPranPratishtha pic.twitter.com/xLlOugj4Y5 — Organiser Weekly (@eOrganiser) January 20, 2024 ఈ వేణువును స్థానిక్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు అప్పగించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేణువుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుందట. ఈ వేణువు తయారీకి వినియోగించిన వెదరును అస్సాం నుండి సుమారు 20 సంవత్సరాల క్రితం తీసుకువచ్చామని పర్వీన్ కుటుంబం తెలిపింది. రెండు వైపుల నుంచి వాయించ గలిగే ఈ వేణువు తయారీకి 10 రోజులు పట్టిందని అలాగే తయారీకి దాదాపు రూ.70-80 వేలు ఖర్చయిందని వెల్లడించింది. -
అయ్యో.. నా రాముడికి ఎలాంటి పరిస్థితి? మనసు బరువెక్కింది
ఆధ్యాత్మిక పాత్రలను వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా రక్తి కట్టించినవాళ్లున్నారు. వెండితెర కంటే అద్భుతంగా సీరియల్స్ ద్వారా జనాలకు చేరువైన కథలున్నాయి. అలా ఎన్నో భక్తి ప్రధాన సీరియల్స్ ప్రేక్షకులను మైమరపింపజేశాయి. అందులో రామాయణ్ సీరియల్ ఒకటి. ఈ సీరియల్లో రాముడు, లక్ష్మణుడు, సీతగా నటించిన ముగ్గురికీ అయోధ్య రామాలయ ప్రారంభం కోసం ఆహ్వానం అందింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితమే అయోధ్యను వీరు సందర్శించారు. రాములవారికి ఎలాంటి పరిస్థితి? శ్రీరాముని ఆలయాన్ని చూసి తన్మయత్వానికి లోనయ్యారు. రామాయణ్ సీరియల్లో లక్ష్మణుడిగా నటించిన సునీల్ లహ్రి అయితే తనను తాను మైమరిచిపోయాడు. తాజాగా అతడు తన మనసులోని మాటలను మీడియాతో పంచుకున్నాడు. సునీల్ లహ్రి మాట్లాడుతూ.. 'అయోధ్యకు వెళ్లినప్పుడు నేను భావోద్వేగానికి లోనయ్యాను. ఇక్కడే కదా రాములవారు పుట్టిపెరిగింది. కానీ ఆయనకు ఎలాంటి పరిస్థితి వచ్చింది. టెంట్ కింద విగ్రహాన్ని ఉంచారు. వారి త్యాగం ఊరికే పోలేదు అది చూసి నాకు ఎంతో బాధేసింది. మూడు దశాబ్దాల తర్వాత తిరిగి అదే ప్రదేశంలో ఆయనకు గుడి కట్టినందుకు మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. 500 ఏళ్లుగా దీని కోసం పోరాడాం. ఎంతోమంది తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయలేదు. వారి త్యాగం ఊరికే పోలేదు. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరిగే రోజు (జనవరి 22) భారతదేశ చరిత్రలో నిలిచిపోతుంది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: ప్రియుడితో ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్.. ఫిబ్రవరిలోనే పెళ్లి! -
సోమవారం అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట
-
అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. తెలుగు వారు గర్వపడే విషయం!
అది 1973 సంవత్సరం.. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12.05 ని. కావస్తోంది. కాసేపట్లో ఉషశ్రీ ధర్మసందేహాలు కార్యక్రమం.. శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు, ఆ తరువాయి శ్రీమద్భారతం ప్రవచనం.. అంటూ ప్రకటన వినపడగానే తెలుగు లోగిళ్లు నై మిశతపోవనాలుగా మారిపోయాయి. ‘ఉషశ్రీ ఉపన్యాసాలు స్నిగ్ధ గవాక్షాలు’ అని పలువురు పెద్దలు ప్రశంసించారు. అలా ప్రారంభమైన ఆ కార్యక్రమం – 1990 సెప్టెంబరు 7 వ తేదీ ‘ఉషశ్రీ’ కన్నుమూసే వరకు కొనసాగింది. ఆకాశవాణి ద్వారా ఉషశ్రీ.. వాల్మీకి రామాయణం, కవిత్రయ భారతం, పోతన భాగవతాలను తెలుగు శ్రోతలకు వినిపించారు. శ్రోతల సందేహాలకు చమత్కారంగా సమాధానాలిచ్చేవారు. ఉషశ్రీ నేపథ్యం.. పశ్చిమగోదావరి జిల్లా కాకరపర్రు గ్రామంలో 1928, మార్చి 16న పురాణపండ రామమూర్తి, కాశీ అన్నపూర్ణ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ‘ఉషశ్రీ’ కలం పేరుతో తెలుగువారికి సుపరిచితులయ్యారు. జ్వలితజ్వాల, అమృత కలశం, మల్లెపందిరి, సంతప్తులు, ప్రేయసి – ప్రియంవద, తరాలు-అంతరాలు వంటి నవలలు, కథలు, వెంకటేశ్వర కల్యాణం వంటి యక్షగానాలు, పెళ్లాడేబొమ్మా(నవలా లేఖావళి), వ్యాసాలు, విమర్శలు, నాటికలు రాసిన ఉషశ్రీ... రామాయణభారత ఉపన్యాసాలు ప్రారంభించాక ఇక కథలు, పద్యాలు, నవలలు విడిచిపెట్టేశారు. ఉచ్ఛ్వాసనిశ్వాసలుగా.. తుది శ్వాస విడిచేవరకు రామాయణభారతాలే ఉచ్ఛ్వాసనిశ్వాసలుగా జీవించారాయన. శృంగేరి శారదా పీఠం ఆస్థానకవిగా సత్కారం అందుకున్నారు. ఉషశ్రీ రచించిన రామాయణ భారత భాగవతాలను తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని లక్షల కాపీలు ముద్రించింది. ఇప్పుడు తెలుగువారు గర్వించే సన్నివేశం చోటు చేసుకుంది. అదే అయోధ్యలో ఉషశ్రీ గళం. అయోధ్య అంతటా.. ఉషశ్రీ గళంలో జాలువారిన రామాయణం ఇప్పుడు అయోధ్యలో వినిపిస్తోంది. అయోధ్యను సందర్శించి, విన్నవారు ఈ సంగతిని చెప్పారు. అంతే కాకుండా దేశంలోని అనేక ఎఫ్.ఎం. స్టేషన్లు కూడా దీనిని ప్రసారం చేస్తున్నాయి. కేంద్రంలో అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్న ఒకరి చొరవతో ఇది సాధ్యమైందని తెలిసింది. విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలు తమ ఎఫ్.ఎం. స్టేషన్లలో వీటిని తాజాగా ప్రసారం చేశాయి. వీటిని విన్నవారు, ఇదే స్వరాన్ని అయోధ్య ఆలయంలో కూడా విన్నామని చెబుతున్నారు. ఆటుపోట్ల నడుమ ఆ గళం.. సరిగ్గా ఐదు దశాబ్దాల క్రితం ఉషశ్రీ గళ ప్రస్థానం ఆకాశవాణి విజయవాడలో వినబడడం ప్రారంభమైంది. ధర్మసందేహాలు శీర్షికన మహాభారతంతో మొదలై, శ్రీ భాగవతం వరకూ కొనసాగింది. ఆ సమయంలో ఆయన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఉషశ్రీ గారు భౌతికంగా అదృశ్యమై 33 సంవత్సరాలు అయినా ఆ గళం ఇంకా సజీవంగా ఉండడానికి ప్రధాన కారణం ఆయన అభిమానులు. ఆ తరువాత కరోనా సమయంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఉషశ్రీ కుటుంబ సభ్యులను సంప్రదించి.. రామాయణ, భారత, భాగవతాలను ప్రసారం చేసింది. ఇప్పుడు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని ఉషశ్రీ రామాయణం దేశవ్యాప్తంగా అన్ని ఎఫ్.ఎం.లలోనూ ప్రసారమవుతోంది. అయోధ్య రామాలయ పరిసరాల్లోనూ మార్మోగుతోంది. ఉత్తర భారతంలో ఉషశ్రీ రామాయణాన్ని వినిపించడం అది కూడా రాముని విగ్రహ ప్రతిష్ఠ సమయంలో ప్రసారం చెయ్యడం తెలుగు వారందరికీ ఎంతో గర్వకారణం. -
కాశీ నుంచి అయోధ్యకు 50 క్వింటాళ్ల పూలు
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. ఇందుకోసం వివిధ ప్రాంతాల నుంచి పూలను తెప్పించారు. అయోధ్యను అలంకరించేందుకు కాశీ నుంచి కూడా పూలు తెప్పించారు. పూర్వాంచల్లోని అతిపెద్ద పండ్ల మార్కెట్ నుంచి 50 క్వింటాళ్ల పూలను రెండు రోజుల క్రితం అయోధ్యకు తరలించారు. ఈ పూలలో ఆరెంజ్, పసుపు రంగు బంతిపూలు ఉన్నాయి. ఇదేవిధంగా కాశీ నుంచి అయోధ్యకు పెద్ద మొత్తంలో గులాబీలను పంపించామని, పది వేల బంతిపూల దండలను కూడా పంపినట్లు మాల్దాహియా పూల మార్కెట్ హెడ్ విశాల్ దూబే తెలిపారు. డిమాండ్ అత్యధికంగా ఉన్నప్పటికీ, కొద్దిమొత్తంలోనే పూలను అయోధ్యకు పంపించామన్నారు. కాగా కాన్పూర్, లక్నో, కోల్కతాల నుంచి కూడా అయోధ్యకు పూలను ఆర్డర్ చేశారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి యూపీలో ప్రస్తుతం పూలకు విపరీతమైన గిరాకీ ఉంది. జనవరి 22న వివిధ ఆలయాల్లో పూజలు, వేడుకలు నిర్వహించనున్న దృష్ట్యా వివిధ రకాల పూలకు ఎన్నడూ లేనంత డిమాండ్ ఏర్పడింది. బంతిపూలతో పాటు గులాబీ, మల్లె పూలకు విపరీతమైన ఆర్డర్లు అందుతున్నాయి. ఇది కూడా చదవండి: బాలరామునికి భారీ వేణువు -
దేశవ్యాప్తంగా వేతనంతో కూడిన సెలవు.. అంబానీ కీలక ప్రకటన
అయోధ్యలో జనవరి 22వ తేదీన బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సగం రోజు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. మోదీ నిర్ణయానికి మద్ధతుగా ప్రతిష్టాత్మక రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అదే బాటలో నిర్ణయం తీసుకున్నారు. జనవరి 22వ తేదీన రిలయన్స్ ఇండస్ట్రీ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. రిలయన్స్ ఆధ్వర్యంలోని అన్ని కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవుదినం ప్రకటించారు. జనవరి 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో అయోధ్యలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిలయన్స్ ఇండస్ట్రీ ఆఫీసులు, కంపెనీలు, ఫ్యాక్టరీలకు సెలవు ప్రకటించినట్లు అంబానీ వెల్లడించారు. ఇదీ చదవండి: రిలయన్స్ లాభం 17,265 కోట్లు దీంతో జనవరి 22వ తేదీన తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఉన్న ట్రెండ్స్ షోరూంలు, ఇతర రిలయన్స్ ఇండస్ట్రీ ఆఫీసులకు వేతనంతో కూడిన సెలవుదినంగా ప్రకటించారు. ముఖేష్ అంబానీ సోమవారం అయోధ్యలో జరిగే కార్యక్రమంలో ఫ్యామిలీతోపాటు హాజరుకానున్నట్లు తెలిసింది. -
అయోధ్యకు ఆఫ్గనిస్థాన్ కానుక
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. ఆలయంలో కొలువయ్యే బాలరామునికి ఆఫ్గనిస్థాన్తో సహా ప్రపంచం నలుమూలల నుండి కానుకలు అందుతున్నాయి. విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ తాజాగా కశ్మీర్, తమిళనాడు, ఆఫ్గనిస్థాన్ నుండి వచ్చిన కానుకలను రామాలయ ట్రస్ట్కు అందజేశారు. అయోధ్య రామాలయ నిర్మాణంపై ముస్లిం సమాజం కూడా సంతోషంగా ఉందని అలోక్ కుమార్ పేర్కొన్నారు. కాశ్మీర్కు చెందిన ముస్లిం సోదరులు, సోదరీమణులు తనను కలవడానికి వచ్చి, రామమందిర నిర్మాణంపై సంతోషం వ్యక్తం చేస్తూ, వారు సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన రెండు కిలోల స్వచ్ఛమైన కుంకుమపువ్వును అందజేశారన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాలతో పాటు ఆఫ్గనిస్థాన్ నుండి కూడా ప్రత్యేక బహుమతి వచ్చిందని అలోక్ కుమార్ చెప్పారు. ఆఫ్గనిస్థాన్లోని కాబూల్లో గల ‘కుబా’నదిలోని నీటిని కానుకగా స్వీకరించామని అన్నారు. తమిళనాడుకు చెందిన పట్టు వస్త్రాల తయారీదారులు శ్రీరాముని ఆలయ చిత్రంతో నేసిన సిల్క్ దుస్తులను పంపారన్నారు. -
అయోధ్య వేడుక.. ఆహ్వానం అందింది: మోహన్బాబు
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. కనీవినీ ఎరుగని రీతిలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. జనవరి 22న శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరగనుండగా ఇందుకోసం రాజకీయ, సినీ, క్రీడా రంగంలోని తదితర సెలబ్రిటీలకు ఆహ్వానాలు పంపారు. తాజాగా తనకూ ఆహ్వానం అందిందని చెప్తున్నాడు డైలాగ్ కింగ్ మోహన్బాబు. శనివారం నాడు ఫిలిం నగర్లో అయోధ్యలో జరగబోయే ప్రాణప్రతిష్టపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్బాబు మాట్లాడుతూ.. 'ఫిలిం ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేసింది. ఫిలిం నగర్లోని దైవ సన్నిధానం, చిత్రపురి కాలనీ వంటివి ఇచ్చింది. ఫిలిం నగర్ దైవ సన్నిధానం అద్భుతమైన దేవాలయం. ఇక్కడ అన్ని దేవతా మూర్తులున్నాయి. విశిష్టమైన పూజలు జరుగుతాయి. ఇకపోతే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభాన్ని ఎంతో వేడుకగా జరుపుతున్నారు. ఈ వేడుక కోసం నాకు ఆహ్వానం అందింది. సెక్యూరిటీ ఇస్తాము అన్నారు. అయినా భయపడి వెళ్లట్లేదు. కానీ ఇక్కడి దైవ సన్నిధానంలో ఈ నెల 14 నుంచి 22 వరకు(రాములవారి ప్రాణప్రతిష్ట పూర్తయ్యేవరకు) అనేక పూజా కార్యక్రమాలు చేస్తున్నాము' అని చెప్పుకొచ్చాడు. చదవండి: ఆయన మంచి పర్ఫార్మర్.. తనతో నటించేందుకు ఎదురు చూస్తున్నా.. -
అయోధ్య గుడికి ప్రపంచంలోనే అతిపెద్ద తాళం
అయోధ్య రామునికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా యూపీలోని అలీఘర్కు చెందిన జ్వాలాపురి నివాసి సత్యప్రకాష్ శర్మ తయారుచేసిన 400 కిలోల బరువున్న తాళాన్ని అయోధ్యకు తరలించనున్నారు. ఈ తాళం ప్రపంచంలోనే అతిపెద్ద తాళంగా గుర్తింపు పొందింది. ఈ తాళాన్ని సత్యప్రకాశ్ శర్మతో పాటు అతని భార్య రుక్మణి దేవి, కుమారుడు మహేష్ చంద్ సంయుక్తంగా తయారు చేశారు. ఈ తాళాన్ని అయోధ్యలో సమర్పించేందుకు మహామండలేశ్వర్ డాక్టర్ అన్నపూర్ణ భారతీ పూరీ మహారాజ్కు రుక్మిణిదేవి అప్పగించారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించేవారు ఈ తాళాన్ని అలీఘర్ ప్రాంతానికి చిహ్నంగా గుర్తించనున్నారు. హిందూ మహాసభ జాతీయ అధికార ప్రతినిధి అశోక్ కుమార్ పాండే మీడియాతో మాట్లాడుతూ తాళాల తయారీదారుడు సత్య ప్రకాష్ శర్మ దంపతులు తయారు చేసిన ఈ తాళాన్ని బాలరామునికి అర్పించనున్నట్లు తెలిపారు. గత ఏడాది సెప్టెంబరు 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సత్యప్రకాష్ శర్మ, అతని భార్య రుక్మిణి శర్మ ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకుని, తాము స్వయంగా తయారుచేసిన ఆరు కిలోల తాళాన్ని ఆయనకు బహుకరించారు. అలాగే తాము అయోధ్యలోని శ్రీరామ మందిరానికి 400 కిలోల బరువు కలిగిన భారీ తాళం సిద్ధం చేశామని, ఆలయ ప్రారంభోత్సవ సమయానికి అందజేస్తామని ఆ దంపతులు ప్రధానికి తెలిపారు. ఇది కూడా చదవండి: కాశీ నుంచి అయోధ్యకు 50 క్వింటాళ్ల పూలు మూడు అడుగుల నాలుగు అంగుళాల పొడవున్న ఈ తాళానికి గల తాళం చెవి 30 కిలోల బరువుంటుందని రుక్మణి దేవి తెలిపారు. ఈ తాళం తయారీకి ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయ్యిందన్నారు. కాగా సత్యప్రకాష్ శర్మ గత డిసెంబర్ 12న గుండెపోటుతో కన్నుమూశారు. అతని భార్య రుక్మణి దేవి, కుమారుడు మహేష్ శర్మ తండ్రి కోరిక మేరకు ఈ తాళాన్ని మహామండలేశ్వర్ డాక్టర్ అన్నపూర్ణ భారతీ పూరీ మహారాజ్కు అప్పగించారు. -
బాలరామునికి భారీ వేణువు
అయోధ్యలో 22న జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా బాలరామునికి దేశవ్యాప్తంగా పలువురు కానుకలు పంపుతున్నారు. ఈ క్రమంలో 21.6 అడుగుల పొడవైన భారీ వేణువును పిలిభిత్(ఉత్తరప్రదేశ్) నుంచి అయోధ్యకు పంపించనున్నారు. అయోధ్యలోని మ్యూజియంలో ఈ వేణువును ఉంచనున్నారు. అత్యంత పొడవైన ఈ వేణువును పిలిభిత్ నగరానికి చెందిన ప్రముఖ శిల్పకారుడు, దివంగత నవాబ్ అహ్మద్ భార్య హీనా పర్వీన్, కుమారుడు అర్మాన్ నబీ, వారి బంధువు షంషాద్ తదితరులు వారి స్నేహితుల సాయంతో తయారుచేశారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ వెదురును చరిత్రకు గుర్తు చాలా ఏళ్లుగా దాచివుంచామని, ఇప్పుడిది వేణువు రూపంలో శ్రీరాముని చెంతకు చేరుతున్నదని హీనా పర్వీన్ తెలిపారు. కాగా ఈ వేణువును హీనా పర్వీన్ స్థానిక్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు అప్పగించారు. ఆర్ఎస్ఎస్ ప్రచారకర్త హరీష్ రౌతేలా ఈ వేణువుకు పూజలు చేశారు. ఈ వేణువును జనవరి 26న అయోధ్యధామానికి పంపనున్నారు. కాగా వేణువు తయారీదారులలో ఒకరైన అర్మాన్ మాట్లాడుతూ ఈ వేణువు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదైందన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేణువుగా నిలిచిందన్నారు. ఈ వేణువు తయారీకి వినియోగించిన వెదరును అస్సాం నుండి సుమారు 20 సంవత్సరాల క్రితం తీసుకువచ్చామన్నారు. ఇటువంటి వెదురు ప్రస్తుతం ఎక్కడా అందుబాటులో లేదన్నారు. ఇది కూడా చదవండి: ఉత్సవ విగ్రహమే ఇంత సమ్మోహనంగా ఉందంటే.. ఈ వేణువును తయారీకి 10 రోజులు పట్టిందని, ఈ వేణువును రెండు వైపుల నుండి వాయించవచ్చని తెలిపారు. దీని తయారీకి దాదాపు రూ.70-80 వేలు ఖర్చయిందని తెలిపారు. ఈ బారీ వేణువుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వేణువును ఒక ట్రక్కులో అయోధ్యకు తరలించనున్నారు. -
అయోధ్యకు వెళ్లి తీరతా.. ఏం చేస్తారో చేసుకోండి: హర్భజన్ సింగ్
Ayodhya Ram Mandir Ceremony: తాను అయోధ్య రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమానికి వెళ్లితీరతానని టీమిండియా మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ కుండబద్దలు కొట్టాడు. ఎవరు అవునన్నా.. కాదన్నా తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశాడు. ఇలాంటి పుణ్యకార్యాలను రాజకీయాలకు అతీతంగాచూడాలని పార్టీలకు హితవు పలికాడు. వ్యక్తిగతంగా తాను దేవుడిని విశ్వసిస్తానని.. ఈ విషయంలో ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తాను పట్టించుకోనని భజ్జీ పేర్కొన్నాడు. కాగా జనవరి 22న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రతిష్టాపన జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, బీజేపీ ఈ కార్యక్రమాన్ని రాజకీయం చేస్తోందంటూ విమర్శిస్తున్న ప్రతిపక్షాలు.. తాము ఈవెంట్ను బాయ్కాట్ చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నాయి. జనవరి 22 తర్వాత వెళ్తా: కేజ్రీవాల్ ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆమ్) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘‘వాళ్లు(రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు) నాకొక లేఖ పంపించారు. ఆతర్వాత మేము వాళ్లకు ఫోన్ చేసి విషయం ఏమిటని కనుక్కున్నాం. ఈ కార్యక్రమానికి మర్యాదపూర్వకంగా నన్ను ఆహ్వానించేందుకు వస్తామని చెప్పారు. కానీ ఎవరూ రాలేదు. అయినా, మరేం పర్లేదు. అయితే, అక్కడికి చాలా మంది వీఐపీలు, వీవీఐపీలు వస్తారని ఆ లేఖలో వాళ్లు స్పష్టంగా పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆహ్వానం అందుకున్న ఒక్క వ్యక్తిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్పారు. ఇది భక్తిభావానికి సంబంధించిన విషయం. ఎవరి మతాచారాలకు అనుగుణంగా వారు నడుచుకుంటారు. దీనిని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నారు. అయితే, తాను తన భార్యాపిల్లలు, తల్లిదండ్రులతో అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నాను గనుక జనవరి 22 తర్వాత అక్కడికి వెళ్తానని కేజ్రీవాల్ చెప్పడం కొసమెరుపు. వాళ్లే వెళ్లడం లేదు కదా మరోవైపు.. ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాత్రం శంకరాచార్యల వ్యాఖ్యలను సమర్థిస్తూ.. ‘‘అంతటి వ్యక్తులే అక్కడికి వెళ్లడం లేదు’’ అని పేర్కొన్నారు. అదే విధంగా.. రామ మందిరం దేశ ప్రజలందరిదని... ఇందులో బీజేపీ పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. అయోధ్యకు వెళ్లి తీరతా.. ఏం చేస్తారో చేసుకోండి ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్లడం లేదన్న అంశాలతో నాకు సంబంధం లేదు. ఒకవేళ కాంగ్రెస్ లేదంటే ఇతర పార్టీలు వెళ్లవద్దని నిర్ణయించుకుంటే అది వాళ్లిష్టం. నేను మాత్రం కచ్చితంగా అక్కడికి వెళ్తా. వ్యక్తిగా ఆ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. నేను అయోధ్యకు వెళ్లడంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే నేనేమీ చేయలేను. నా విషయంలో వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను పట్టించుకోను’’ అని పరోక్షంగా సొంత పార్టీకే సవాల్ విసిరాడు. కాగా భజ్జీ పంజాబ్ నుంచి ఆప్ ఎంపీగా రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. #WATCH | On opposition parties declining invitation to Ayodhya Ram Temple ‘Pran Pratishtha’ ceremony, former Cricketer and Rajya Sabha MP Harbhajan Singh says, " It is our good fortune that this temple is being built at this time, so we all should go and get the blessings.… pic.twitter.com/YUAplDGMNk — ANI (@ANI) January 19, 2024 వాళ్లకు ఆహ్వానాలు కాగా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి క్రికెటర్లు వెంకటేశ్ ప్రసాద్, సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్ తదితరులకు ఆహ్వానాలు అందాయి. చదవండి: IND A Vs Eng Lions: భారత జట్టులో తిలక్, రింకూలకు చోటు: బీసీసీఐ ప్రకటన -
అయోధ్యకు యూపీ ప్రభుత్వ విరాళమెంత?
22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపధ్యంలో దేశమంతటా రామనామం మారుమోగిపోతోంది. ఇదే సమయంలో రామాలయానికి యూపీ ప్రభుత్వం ఇచ్చిన విరాళంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యూపీ ప్రభుత్వ విరాళాలకు సంబంధించి ఒక వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో యోగి ఆదిత్యనాథ్.. ‘కరసేవకులు ఎన్నో త్యాగాలు చేశారు. దీనికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మార్గదర్శకత్వం, విశ్వ హిందూ పరిషత్ నాయకత్వం, సాధువుల నుండి ఆశీర్వాదాలు తోడుగా నిలిచాయి. కరసేవకుల ఉద్యమం కారణంగానే రామజన్మభూమిలో రామాలయ నిర్మాణం జరుగుతోంది. దీనికి యూపీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులు అందించలేదు. నిర్మాణం కోసం వెచ్చిస్తున్న సొమ్ము దేశంతో పాటు ప్రపంచం నలుమూలల ఉన్న రామభక్తులు అందించారు’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు ఎలా వెళ్లాలి? దర్శనానికి ఏం చేయాలి? అయితే యూపీ ప్రభుత్వం ఏయే పనులకు నిధులు వెచ్చిస్తున్నదో సీఎం యోగి తెలిపారు. రామ మందిరం వెలుపల రైల్వే స్టేషన్, విమానాశ్రయ నిర్మాణం, గెస్ట్ హౌస్ నిర్మాణం, క్రూయిజ్ సర్వీస్, రోడ్డు విస్తరణ, పార్కింగ్ సౌకర్యాల కోసం ప్రభుత్వం నిధులు అందిస్తున్నదని పేర్కొన్నారు. ఈ పనులన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు. దేశం నలుమూలల నుండి రామాలయానికి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. ఆలయానికి కానుకలు కూడా భారీగానే వస్తున్నాయి. రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు విరాళంగా భక్తులు అందజేస్తున్నారు. నెల మొత్తం మీద చూసుకుంటే రూ.1.5 నుంచి రూ.2 కోట్ల వరకూ నిధులు అందుతున్నాయి. అయితే ఆన్లైన్ విరాళాల విరాళాల లెక్కింపు ఇంకా జరగలేదని సమాచారం. एक पाई सरकार ने नहीं दी है, न केंद्र की सरकार ने, न राज्य की सरकार ने, मंदिर के किसी काम में नहीं! ये सारा पैसा रामभक्तों ने देश भर से दिया है, दुनिया भर से दिया है... pic.twitter.com/m6DOFSdI4t — Yogi Adityanath (@myogiadityanath) January 17, 2024 -
నేటి అనుష్ఠానాల ప్రత్యేకత ఏమిటి?
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏడు రోజులుగా జరుగుతున్న రామ్లల్లా పట్టాభిషేక మహోత్సవంలో నేడు ఐదో రోజు. జనవరి 16న ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి 22న రామ్లల్లా ప్రాణప్రతిష్ఠతో ముగుస్తుంది. 2020, ఆగస్టు 5న ప్రధాని మోదీ రామాలయానికి భూమి పూజ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాల్లో భాగంగా రాములోరు ఇప్పటికే గర్భగుడిలోనికి చేరుకున్నారు. అయోధ్యలో ఈరోజు(శనివారం) జరగనున్న అనుష్ఠాన కార్యక్రమం ఎంతో ప్రత్యేకత కలిగినది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈరోజు రామాలయంలోని గర్భగుడిని సరయూ పవిత్ర జలంతో శుద్ధి చేసి, వాస్తు శాంతి, ‘అన్నాధివాసం’ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే పలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శకరాధివాసం, ఫలాధివాసం, పుష్పాధివాసం మొదలైన అనుష్ఠనాలు జరగనున్నాయి. పంచదారలో, పండ్లలో, పుష్పాలలో బాలరాముని విగ్రహాన్ని కొంతసేపు ఉంచుతారు. ఇది కూడా చదవండి: 400 కేజీల తాళానికి 30 కిలోల చెవి! ఆరో రోజున అంటే ఆదివారంనాడు రామ్లల్లా విగ్రహానికి 125 కలశాల నీటితో స్నానం చేయించి, పవళింపజేస్తారు. ఆ మరుసటి రోజు అంటే జనవరి 22న శ్రీ రాముని ప్రాణప్రతిష్ఠ వేడుక జరగనుంది. ఈ ఉత్సవం మధ్యాహ్నం 12:30 గంటలకు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంప్రోక్షణ కార్యక్రమానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. -
ప్రాణ ప్రతిష్ఠను ‘ప్రత్యక్షం’గా చూడటమెలా?
ఈనెల 22న యూపీలోని అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. దీనిని తిలకించేందుకు దేశంలోని రామభక్తులు తహతహలాడుతున్నారు. అయితే 22న అతిథులకు మాత్రమే రామాలయంలో ప్రవేశానికి ఆహ్వానం ఉంది. మిగిలినవారుకూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించగలిగే అవకాశం ఉంది. మీడియా సెంటర్ ఏర్పాటు ఇప్పటికే అయోధ్య ధామ్లో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రామ్ కథా సంగ్రహాలయ్ వద్ద మీడియా సెంటర్ను ఏర్పాటు చేశారు.కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగం తెలిపిన వివరాల ప్రకారం జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు దూరదర్శన్ (డీడీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం దూరదర్శన్ అయోధ్యలోని రామ మందిరం చుట్టుపక్కల 40 కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమం డీడీ నేషనల్, డీడీ న్యూస్లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి వివిధ రైల్వేస్టేషన్లలో.. రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను దేశవ్యాప్తంగా వివిధ రైల్వేస్టేషన్లలో భారతీయ రైల్వే ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. ఆయా రైల్వే స్టేషన్లలో తొమ్మది వేల స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయని, ఆ స్క్రీన్లపై ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. న్యూయార్క్ నగరంలో.. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల ప్రసిద్ధ టైమ్ స్క్వేర్లోనూ ప్రాణప్రతిష్ఠ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. వివిధ భారతీయ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో కూడా ఈ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ కానున్నది. 2020 ఆగస్ట్ 5న అయోధ్యలోని శ్రీరామ మందిరానికి భూమి పూజ చేసినప్పుడు ఈ కార్యక్రమం టైమ్స్ స్క్వేర్లోని డిజిటల్ బిల్బోర్డ్పై డిస్ప్లేపై చేశారు. 23న కూడా ప్రత్యక్ష ప్రసారం జనవరి 23న కూడా దూరదర్శన్లో రామ్లల్లా ప్రత్యేక హారతితో పాటు సాధారణ పౌరుల కోసం ఆలయం తెరవడాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ప్రధాన ఆలయ సముదాయం మాత్రమే కాకుండా, సరయూ ఘాట్ సమీపంలోని రామ్కి పైడి, కుబేర్ తిల దగ్గరున్న జఠాయువు విగ్రహం, ఇతర ప్రదేశాల నుంచి కూడా దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారాలు చేయనుంది. ఇది కూడా చదవండి: నేటి అనుష్ఠానాల ప్రత్యేకత ఏమిటి? ప్రత్యేక యూట్యూబ్ లింక్ మరోవైపు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేసేందుకు ప్రత్యేక యూట్యూబ్ లింక్ను సిద్ధం చేస్తున్నారు. దీనిద్వారా పలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికాలేదు. 4కె టెక్నాలజీతో.. దూరదర్శన్తో పాటు పలు ప్రైవేట్ ఛానెళ్లు కూడా దూరదర్శన్ నుంచి ఫీడ్ను అందుకుంటాయని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. దూరదర్శన్ ఈ కార్యక్రమాలను 4కె టెక్నాలజీ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయనుందని, ఫలితంగా ప్రేక్షకులు హైక్వాలిటీ పిక్చర్ను చూడగలుగుతారని అపూర్వ చంద్ర తెలిపారు. -
Ayodhya: ఆన్లైన్లో ప్రసాదం.. అమెజాన్కు నోటీసులు
ఢిల్లీ: అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేళ.. ఆధ్యాత్మికం పేరిట ఆన్లైన్లో నకిలీ ఉత్పత్తుల హవా కనిపిస్తోంది. తాజాగా అయోధ్య పేరిట నకిలీ ప్రసాదం అమ్మకాలు చేపట్టిందన్న ఆరోపణల మేరకు ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ సంస్థకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT)ఫిర్యాదు నేపథ్యంలో.. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA)అమెజాన్ సంస్థకు నోటీసులు పంపింది. శ్రీ రామ మందిర్ అయోధ్య ప్రసాద్.. రఘుపతి నెయ్యి లడ్డూ, అయోధ్య రామ మందిర్ అయోధ్య ప్రసాద్, ఖోయా ఖోబీ లడ్డూ, రామ మందిర్ అయోధ్య ప్రసాదం-దేశీ దూద్ పేడ.. ఇతరాల్ని అమెజాన్లో అమ్ముతున్నట్లు తెలుస్తోంది. అయితే సాధారణ మిఠాయిలనే.. అయోధ్య రామ మందిర ప్రసాదంగా ఆన్లైన్లో అమ్ముతున్నారని.. మోసపూరిత వాణిజ్య పద్ధతుల్లో అమెజాన్ నిమగ్నమై ఉందని.. తప్పుడు ప్రకటనలతో వినియోగదారుల్ని మోసం చేస్తున్నారని అమెజాన్పై ఫిర్యాదులో పేర్కొంది సీఏఐటీ. నోటీసుల నేపథ్యంలో అమెజాన్ సంస్థ వారంలోపు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సరైన వివరణ ఇవ్వలేని నేపథ్యంలో వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది సీసీపీఏ. మరోవైపు నోటీసులపై అమెజాన్ స్పందించింది. ఈ విషయంలో సెల్లర్ల జాబితాను పరిశీలించాలి చర్యలు తీసుకుంటామని.. నోటీసులపై తమ పాలసీ ప్రకారం ముందుకు వెళ్తామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. -
అయోధ్యకు ఎలా వెళ్లాలి? దర్శనానికి ఏం చేయాలి?
జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. దీని తరువాత అంటే జనవరి 23 నుంచి అయోధ్యను సందర్శించాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. మరి అయోధ్యకు ఎలా వెళ్లాలి? అక్కడ రోజూ జరిగే పూజలేమిటి? రామాలయం సందర్శనలో ఎటువంటి విధివిధానాలు ఆచరించాలి? ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. రైలు మార్గం రైలు మార్గం ద్వారా అయోధ్యకు వెళ్లాలనుకునేవారు దేశంలోని ఏ ప్రాంతం నుంచి అయినా అయోధ్యకు చేరుకోవచ్చు. న్యూ ఢిల్లీ నుంచి అయోధ్యకు వెళ్లాలనుకుంటే దాదాపు 10 గంటలపైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునేవారు సికింద్రాబాద్ నుంచి రైలులో గోరఖ్ పూర్ వెళ్లాలి. అక్కడి నుంచి అయోధ్యకు రైలు లేదా బస్సు ద్వారా అయోధ్యకు చేరుకోవచ్చు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల 50 నిమిషాలకు సికింద్రా బాద్ నుంచి గోరఖ్ పూర్కు వెళ్లే రైలు అందుబాటులో ఉంది. ఈ రైలులో 30 గంటల పాటు ప్రయాణం చేయాలి. ఇదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బీదర్ అయోధ్య వీక్లీ ఎక్స్ ప్రెస్ ప్రతి సోమ, ఆదివారాలలో అందుబాటులో ఉంది. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునే వారు ప్రతి శుక్ర, ఆది, సోమ వారాల్లో రైలు ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. రోడ్డు మార్గం అయోధ్యకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో 40 గంటల ప్రయాణం అనంతరం ఢిల్లీకి చేరుకుంటారు. ఏసీ బస్సులో ఒకరికి టికెట్ ధర రూ. 6 వేలు ఉంటుంది. హైదరాబాద్ నుంచి ప్రైవేటు వాహనాల్లో వెళ్లాలనుకునే వారు నాగపూర్, జబల్ పూర్, ప్రయాగ్రాజ్ మీదుగా అయోధ్యకు చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే మొత్తం 1305 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయాలి. కాగా అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం సికింద్రా బాద్ నుంచి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. విమానయాన సంస్థలు కూడా స్పెషల్ ఫ్లైట్స్ ను నడిపేందుకు సిద్ధమయ్యాయి. విమానయానం విమానాల ద్వారా అయోధ్యకు వెళ్లాలనుకునే రామ భక్తులు హైదరాబాద్ శంశాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అయోధ్యకు నేరుగా వెళ్లేందుకు విమానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. దీంతో శంశాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ, లేదా గోరఖ్ పూర్, లక్నో విమానాశ్రయాలకు చేరుకుని, అక్కడి నుంచి 140 కిలోమీటర్ల దూరంలోని అయోధ్యకు బస్సు లేదా రైలులో ప్రయాణించే చేరుకోవచ్చు. దర్శనం ఎలా? అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం ముందుగా రిజిస్టేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం (https://online.srjbtkshetra.org) అధికారిక వెబ్సైట్లో మొబైల్ నంబర్ను నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి. ఓటీపీ నమోదు చేశాక పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో ‘దర్శన్’ ఎంపికపై క్లిక్ చేశాక, ఓపెన్ అయిన పేజీలో మీరు శ్రీరాముని దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీ, సమయం, మీతోపాటు వచ్చేవారి సంఖ్య, దేశం, రాష్ట్రం, మొబైల్ నంబర్తో పాటు మీ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియతో దర్శనానికి సంబంధించిన బుకింగ్ పూర్తవుతుంది. ఆఫ్లైన్లో.. ఆఫ్లైన్లో టిక్కెట్లు పొందాలనుకున్నప్పుడు ఆలయం సమీపంలోని కౌంటర్ వద్దకు వెళ్లి, ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు కార్డును చూపించి, టికెట్ పొందవచ్చు. పదేళ్లకన్నా తక్కువ వయసుగల పిల్లలకు దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. దర్శనం కోసం టిక్కెట్తో పాటు ఐడీప్రూప్ ప్రూఫ్ను వెంట తీసుకువెళ్లాలి. సంప్రదాయ దుస్తులలో.. దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక, దర్శనానికి 24 గంటల ముందు సంబంధిత భక్తునికి మెసేజ్ లేదా మెయిల్ వస్తుంది. దర్శనానికి 24 గంటల ముందు భక్తుడు తన టిక్కెట్ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాగా స్త్రీలు, పురుషులు సంప్రదాయ దుస్తులలో మాత్రమే దర్శనానికి రావాలి. పురుషులు ధోతీ-కుర్తా లేదా కుర్తా, పైజామా.. మహిళలు చీర, దుపట్టాతో కూడిన పంజాబీ దుస్తులు లేదా దుపట్టాతో చుడీదార్ సూట్ ధరించి శ్రీరాముని దర్శనానికి రావచ్చు. అయోధ్యలో నిత్యపూజలు అయోధ్య రామాలయంలో బాలరామునికి రోజుకు ఐదుసార్లు హారతులు ఇవ్వనున్నారు. అయితే భక్తులు మూడు హారతులను మాత్రమే దర్శించుకోగలుగుతారు. ఈ హారతులు ఉదయం 6:30 గంటలకు, మధ్యాహ్నం 12:00 గంటలకు, సాయంత్రం 7:30 గంటలకు నిర్వహిస్తారు. ఇక శ్రీరాముని దర్శనం విషయానికి వస్తే ఉదయం 6 నుండి 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. ఇది కూడా చదవండి: ప్రాణ ప్రతిష్ఠను ‘ప్రత్యక్షం’గా చూడటమెలా? -
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట.. అతిథుల జాబితా ఇదే!
ఎక్కడ, ఎవరి నోట విన్న పవిత్రమైన అయోధ్య, రామ మందిరం, రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట, ఈ మాటలే వినిపిస్తున్నాయి. అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా జనవరి 22వ తేదీన అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే దేశంలోని వేలాది మంది అతిథులకు ఆహ్వానం అందింది. రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిన వారిలో రాజకీయ, పారిశ్రామిక, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు, బ్యూరోక్రాట్లు, దౌత్యవేత్తలు ఉన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు ప్రముఖుల నివాసాలకు వెళ్లి అయోధ్యలో జరిగే రాముడి మహా వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారు. వచ్చే సోమవారం జరిగే బృహత్తర కార్యక్రమానికి దాదాపు 8 వేల మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబం, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. అమితాబ్ బచ్చన్ ప్రత్యేక ప్రయివేటు చార్టెడ్ ప్లేన్లో కుటుంబ సభ్యులతో అయోధ్యకు వెళ్లనున్నారు. సినీ ఇండస్ట్రీ నుంచి అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, అల్లు అర్జున్, మోహన్ లాల్, అనుపమ్ ఖేర్, చిరంజీవి, సరోద్ మాస్ట్రో అంజద్ అలీ ఖాన్, గీత రచయిత మనోజ్ ముంతాషీర్, అతని భార్య ప్రసూన్ జోషి, డైరెక్టర్లు సంజయ్ భన్సాల్, చంద్రప్రకాశ్ ద్వివేదితో పాటు పలువురు ఉన్నారు. పారిశ్రామికవేత్త, బిలియనీర్ ముకేశ్ అంబానీ, ఆయన తల్లి కోకిలా బెన్, భార్య నీతా అంబానీ, కుమారులు ఆకాశ్, అనంత్, కోడలు శ్లోకా, కాబోయే మరో కోడలు రాధిక మర్చంట్, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్పర్సన్ కుమార్ మంగళం బిర్లా, ఆయన భార్య నీరజ, పిరమల్ గ్రూప్ చైర్పర్సన్ అజయ్ పిరమల్, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా, డీసీఎం శియారాం అధినేత అజయ్ శియారాం, టీసీఎస్ సీఈవో కే కృతివసన్ హాజరు కానున్నారు. డాక్టర్ రెడ్డీస్ ఫార్మాస్యూటికల్స్ నుంచి కే సతీశ్ రెడ్డి, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ సీఈవో పునీత్ గోయెంకా, ఎల్ అండ్ టీ సీఈవో ఎస్ఎన్ సుబ్రమణ్యన్, ఆయన భార్య దురాలి దివి, ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి, జిందాల్ స్టీల్ అండ్ పవర్ హెడ్ నవీన్ జిందాల్, మేదాంత గ్రూప్ చైర్మన్ నరేశ్ త్రెహాన్ ఉన్నారు. అలాగే లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, ప్లానింగ్ కమిషన్ మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా, సీఈఓ షెర్పా అమితాబ్ కాంత్, మాజీ అటార్నీ జనరల్స్ కేకే వేణుగోపాల్, ముకుల్ రోహత్గీ, ఇండియన్ ఉమెన్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు ఎలా వెళ్లాలి? దర్శనానికి ఏం చేయాలి? వీరిలో కొందరు జనవరి 22న ప్రైవేట్ జెట్లలో అయోధ్యకు వెళ్లనుండగా.. మరికొందరు సాధారణ విమానాల్లో ఒక రోజు ముందుగానే అక్కడికి చేరుకొని రాత్రి అయోధ్య, లక్నో వంటి సమీప నగరాల్లో బసచేయనున్నారు. -
అయోధ్య కోసం ప్రభాస్ రూ.50 కోట్ల విరాళం.. క్లారిటీ ఇచ్చిన టీమ్
డార్లింగ్ ప్రభాస్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది ఫుడ్. ఎందుకంటే ప్రభాస్తో సినిమా చేస్తున్నారంటే తోటి నటీనటులకు వెరైటీ ఫుడ్ పెట్టి షాకయ్యేలా చేస్తారు. అయితే గత కొన్నిరోజుల నుంచి ప్రభాస్ గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అయోధ్య ప్రారంభోత్సవానికి వచ్చే భక్తులకు ఇచ్చే ఫుడ్ కోసం కోట్ల రూపాయాలు విరాళమిచ్చారని అంటున్నారు. ఇప్పుడు ఈ విషయమై క్లారిటీ వచ్చేసింది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ప్రతిష్టాత్మక రామ మందిర ప్రారంభోత్సవం.. ఈ నెల 22న అంగరంగ వైభవంగా జరనుంది. ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలకు కూడా ఆహ్వానాలు అందాయి. ఈ క్రమంలోనే ప్రభాస్కి కూడా ఇన్విటేషన్ వచ్చిందని తెలుస్తోంది. అయితే డార్లింగ్ మాత్రం ప్రారంభోత్సవం రోజు.. అయోధ్యకు వచ్చే భక్తులకు ఇచ్చే ఫుడ్ ఖర్చంతా భరిస్తున్నాడని.. దీనికి మొత్తంగా రూ.50 కోట్లు అయ్యిందని మాట్లాడుకున్నారు. ఈ వార్తలపై ఇంగ్లీష్ మీడియా, ప్రభాస్ టీమ్ని సంప్రదించగా.. ఇందులో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చేసింది. అవన్నీ రూమర్స్ మాత్రమేనని చెప్పుకొచ్చింది. దీంతో అందరూ స్పష్టత వచ్చేసినట్లు అయింది. ఇకపోతే తెలుగు సినీ ప్రముఖుల్లో చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితరులకు ఆహ్వానాలు అయితే వచ్చాయి. వీళ్లలో ఎవరెవరు అయోధ్యకు వెళ్తారనేది చూడాలి. (ఇదీ చదవండి: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట.. అతిథుల జాబితా ఇదే! -
Ayodhya: ప్రాణప్రతిష్టకు ముందే బాలరాముడి దివ్యరూప దర్శనం
అయోధ్య: అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే రామమందిరం ప్రారంభోత్సవం కంటే ముందే శ్రీ రాముడి దివ్య రూపం భక్తులకు దర్శనమిచ్చింది. భవ్యమందిరంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహాం ఫోటోలు బయటకు వచ్చాయి. కృష్ణ శిలతో 51 అంగుళాలతో తీర్చిదిద్దిన ఈ విగ్రహం అందరిని ఆకట్టుకుంటోంది. కాగా గురువారమే గర్భాలయానికి బలరాముడి విగ్రహం చేరుకుంది. మందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు జరుపుతున్న ఆచారాల్లో భాగంగా బాలరామున్ని గర్భగుడికి తీసుకువచ్చారు. ప్రస్తుతం బాలరాముని విగ్రహం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిని చూసిన భక్తులు.. జైశ్రీరామ్ అంటూ పులకించిపోతున్నారు. రామ్లల్లా విశిష్టతలివే.. ►అయోధ్య రామాలయంలో ప్రతిష్టించబోయే బాలరాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ► కృష్ణ శిల(నల్ల రాయి) నుంచి ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. ► రామ్లల్లాను చెక్కిన శిల బరువు దాదాపు 200 కిలోలు. ► ఐదేళ్ల బాలుడి రూపంలో రామ్లల్లా విగ్రహాన్ని రూపొందించారు. ►కాశీకి చెందిన జ్ఞానేశ్వర్ శాస్త్రీ ఆధ్వర్యంలో ప్రాణ ప్రతిష్ట పూజలు ► గర్భాలయంలో నిల్చున్న రూపంలోనే రామ్లల్లా దర్శనమిస్తాడు. ► విగ్రహ ప్రాణప్రతిష్ట ఈ నెల 22వ తేదీన.. సోమవారం మధ్యాహ్నం 12.20 గంట నుంచి ఒంటి గంట మధ్య అభిజిత్ ముహూర్తంలో జరుగుతుంది. ►శ్రీరామ నవమి రోజున గర్భగుడిలో సూర్య కిరణాలు పడేలా ఏర్పాట్లు ►శ్రీరాముడికి సూర్య తిలకంలో కిరణాలు పడేలా ఏర్పాట్లు ► ప్రాణప్రతిష్ట సందర్భంగా గర్భగుడిలోకి కొందరికే ప్రవేశం ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, అయోధ్య రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మహంత్ నృత్యగోపాల్ మహారాజ్ మాత్రమే గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయ ట్రస్టీలు ‘గర్భగృహం’ అని పిలిచే పవిత్ర ప్రాంతంలో ఆసీనులవుతారు. ► ఆలయ ప్రాణప్రతిష్టకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాన యజమాని(కర్త)గావ్యవహరిస్తారు. ► ఈ నెల 23వ తేదీ నుంచి గర్భాలయంలో బాలరాముడిని సామాన్య భక్తులు దర్శించుకోవచ్చు. -
అంతా రామమయం..ఇంట్రస్టింగ్ సంగతులు తెలుసా మీకు?
అయోధ్యలో శ్రీరాముడి (Ayodhya Ram Mandir) విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సమయం (2024, జనవరి 22) ఆసన్నమవుతోంది. ఈ పుణ్యకార్యానికి సంబంధించిన అన్ని క్రతువులు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. దీంతో రామభక్తుల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే బాలరాముడి (రామ్ లల్లా) విగ్రహం గర్భగుడిలోకి ప్రవేశించింది. సోమవారం శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట అనంతరం శ్రీరాముని విగ్రహాలను ప్రతిష్టించనున్నారు ఇది ఇలా ఉంటే ఇప్పటికే రాముడి ఆశీర్వాదంగా అక్షింతలను అందుకున్న భక్తులు జై శ్రీరామ్ అంటూ ఆనంద పరవశంలో మునిగి తేలుతున్నారు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని తిలకించేందుకు ,తమ ఇష్టదైవం శ్రీరాముడిని దర్శించుకోవడానికి అయోధ్యకు తరలి వెళ్తున్నారు. మరోవైపు అయోధ్య వరకూ వెళ్లలేని భక్తులకు టీవీలలో చూసేలా ప్రత్యేక్ష ప్రసారాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఎటు చూసిన రామనామ జపం మారుమోగుతోంది. అసలు ఏంటీ అయోధ్య రాముని జన్మభూమి దేవాలయ చరిత్ర ఏంటి? ఎందుకంత విశిష్టత? మరి అక్కడికి ఎలా వెళ్లాలి, చూడాల్సినవి ఏంటో ఒకసారి చూద్దాం! ఇదీ చరిత్ర ⇒ 1885లో అయోధ్య రామజన్మభూమి వ్యవహారం తొలిసారిగా కోర్టుకు చేరింది. రామ మందిరాన్ని నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలని మహంత్ రఘువర్దాస్ ఫైజాబాద్ కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. 1949లో వివాదాస్పద నిర్మాణంలోని మధ్య గోపురం కింద రామ్ లల్లా విగ్రహం కనిపించింది. ఆ తర్వాత స్థానికులు ఆ ప్రదేశంలో పూజలు చేయడం ప్రారంభించారు. ⇒ 1950లో గోపాల్ సింగ్ విశారద్ అనే పండితుడు ఇక్కడ పూజలు చేసే హక్కును డిమాండ్ చేస్తూ ఫైజాబాద్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసు నేపధ్యంలో హిందువులు ఆలయంలో పూజించే హక్కును పొందారు. ⇒ 1950లో పరమహంస రామచంద్ర దాస్ ఆ ప్రాంతంలో విగ్రహాలను ఉంచి, పూజించేందుకు అనుమతించాంటూ ఫైజాబాద్ కోర్టులో కేసు వేశారు. ఇదే రామ మందిర ఉద్యమానికి నాంది పలికింది. ⇒ 1959లో వివాదాస్పద స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు నిర్మోహి అఖారా కోర్టు మెట్లు ఎక్కింది. ⇒ 1981లో యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు ఆ ప్రాంతం స్వాధీనంపై కేసు వేసింది. 1986లో ఫిబ్రవరి ఒకటిన హిందువులు పూజించేందుకు ఈ స్థలాన్ని తెరవాలని స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ⇒ 1989లో హైకోర్టు నుంచి కూడా హిందువులకు ఉపశమనం లభించింది. ఆగస్టు 14న ఈ కేసులో యథాతథ స్థితిని కొనసాగించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. ⇒ 1992లో డిసెంబర్ 6 తర్వాత రామ మందిరం కోసం ఉద్యమం మరింత ఊపందుకుంది. ఈ వివాదాస్పద కట్టడం కూల్చివేతకు గురయ్యింది. దీంతో రామమందిరం కోసం ఉద్యమం మరింత ఊపందుకుంది. ⇒ 2002లో ఈ వ్యవహారం అలహాబాద్ హైకోర్టుకు చేరింది. వివాదాస్పద స్థలం యాజమాన్య హక్కులపై అలహాబాద్ హైకోర్టు విచారణ ప్రారంభించింది. ⇒ 2010లో అలహాబాద్ హైకోర్టు సెప్టెంబరు 30న తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లాకు మూడు సమాన భాగాలుగా విభజించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. ⇒ 2011లో మే 9న అలహాబాద్ హైకోర్టు ఈ ప్రాంతాన్ని మూడు సమాన భాగాలుగా విభజించాలన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. 2018లో ఫిబ్రవరి 8న సివిల్ అప్పీళ్లపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ⇒ 2019లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటయ్యింది. ⇒ 2019లో ఆగస్టు 6న అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో రోజువారీ విచారణ ప్రారంభమైంది. 2019, ఆగస్టు 16న విచారణ పూర్తయిన తర్వాత ధర్మాసనం నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. కీలక సుప్రీంకోర్టు తీర్పు 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం శ్రీరామ జన్మభూమికి అనుకూలంగా తీర్పునిచ్చింది. హిందూ పక్షం 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని దక్కించుకుంది. మసీదు కోసం ప్రత్యేకంగా ఐదు ఎకరాల స్థలాన్ని ముస్లిం వర్గానికి అందించాలని నాడు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు తదనంతరం అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభమయ్యింది. ఎలా వెళ్లాలి? అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం ముందుగా రిజిస్టేషన్ చేసుకోవాలి. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం (https://online.srjbtkshetra.org) అధికారిక వెబ్సైట్కి వెళ్లి, మొబైల్ నంబర్ను నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి. ఓటీపీ నమోదు చేశాక పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో ‘దర్శన్’ ఎంపికపై క్లిక్ చేశాక, ఓపెన్ అయిన పేజీలో మీరు శ్రీరాముని దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీ, సమయం, మీతోపాటు వచ్చేవారి సంఖ్య, దేశం, రాష్ట్రం, మొబైల్ నంబర్తో పాటు మీ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక దర్శనానికి సంబంధించిన బుకింగ్ పూర్తవుతుంది. శ్రీరాముని హారతులను చూడాలనుకుంటే ఇందుకోసం ప్రత్యేకంగా బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్లో టిక్కెట్లు పొందాలనుకుంటే ఆలయం సమీపంలోని కౌంటర్ వద్దకు వెళ్లి, ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు కార్డును చూపించి, టికెట్ పొందవచ్చు. కాగా పదేళ్లకన్నా తక్కువ వయసుగల పిల్లలకు దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. దర్శనం కోసం టిక్కెట్తో పాటు ఐడీ ప్రూఫ్నుకచ్చితంగా వెంట తీసుకువెళ్లాలి. ఎవరైనా భక్తుడు తన టిక్కెట్ను రద్దు చేసుకుంటే, ఆ స్లాట్ మరో భక్తుడికి అందుబాటులోకి వస్తుంది. దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక, దర్శనానికి 24 గంటల ముందు సంబంధిత భక్తునికి మెసేజ్ లేదా మెయిల్ వస్తుంది. దర్శనానికి 24 గంటల ముందు భక్తుడు తన టిక్కెట్ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రత్యేకదుస్తులు స్త్రీలు, పురుషులు సంప్రదాయ దుస్తులలో మాత్రమే దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది.పురుషులు ధోతీ-కుర్తా లేదా కుర్తా, పైజామా, మహిళలు చీర, దుపట్టాతో కూడిన పంజాబీ దుస్తులు లేదా దుపట్టాతో చుడీదార్ సూట్ ధరించాలి. దర్శించాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు ఈ సందర్భంగా అయోధ్య ప్రయాణంలో తప్పకుండా దర్శించాల్సిన ఆలయాల గురించి మాట్లాడుకుంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది రామభక్తుడైన ఆంజనేయ స్వామి దేవాలయం హనుమాన్ గర్హి. అయోధ్య రైల్వేస్టేషన్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంది. 300 సంవత్సరాల క్రితం స్వామి అభయ రామదాసు సన్నిధిలో సిరాజ్-ఉద్-దౌలా ఈ ఆలయాన్ని స్థాపించారట. అలాగే అయోధ్యను కాపాడేందుకు వచ్చిన హనుమంతుడు ఇక్కడే ఉండేవారని భక్తువల విశ్వాసం. సుమారు 76 మెట్లు ఎక్కి మరీ వాయుపుత్రుడిని దర్శనం చేసుకుంటారు భక్తులు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయంలో శుక్రవారం ప్రార్థనలు చేశారు. #WATCH | Uttar Pradesh Yogi Adityanath offers prayers at Hanuman Garhi temple in Ayodhya pic.twitter.com/VdRBr93kic — ANI (@ANI) January 19, 2024 రెండోది దేవకాళీ ఆలయం. సాక్షాత్తూ సీతమ్మవారు తనతో పాటు ఈ విగ్రహాన్ని తీసుకొచ్చారట నమ్ముతారు. అలాగే గుప్తర్ ఘాట్ అత్యంత అందమైన ప్రకృతి అందాలతో ఉండే ఆరో ఘాట్. ఈ ప్రదేశంలో శ్రీరాముడు, సీతా దేవి, లక్ష్మణులు కలిసి రహస్యంగా జల రవాణా చేశారని నమ్ముతారు. అందుకే దీనిని గుప్తర్ ఘాట్ అని పిలుస్తారు. ఈ నది ఒడ్డున అద్భుతమైన రామ మందిరం ఉంది. రామ్ కీ పైడి సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్యలోని అత్యంత ప్రసిద్ధ ఘాట్. ప్రతి సంవత్సరం ఇక్కడ ఛోటి దీపావళి నాడు దీపాల పండుగ నిర్వహిస్తారు. అయోధ్యలో శ్రీరాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్టించాడని విశ్వసించే ప్రసిద్ధి చెందిన ఆలయం నాగేశ్వరనాథ్ దేవాలయం. ఆ తర్వాత శ్రీరాముని జంట కుమారుల్లో ఒకరైన కుశుడు అయోధ్యలో ఈ ఆలయాన్ని నిర్మించాడట. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత విగ్రహాలు దర్శనమిచ్చే కనక భవన్ మరో అద్భుతమైన దేవాలయం. రామాయణం ప్రకారం రాముని తల్లి కైకేయి తన అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు సీతా దేవికి ఈ భవనాన్ని కానుకగా ఇచ్చారు. ముఖ్యంగా ఆలయ శిల్పం, శిల్పకళా వైభవానికి సంకేతమని చూసి తీరాలని భక్తులు నమ్ముతారు. -
Ayodhya Ram Mandir Idol Photos: అరుణుడు చెక్కిన అయోధ్య బాలరాముడితడే (ఫొటోలు)
-
దశాబ్దాల కల నెరవేరుతోంది: మోదీ
లక్నో: అయోధ్య రామ మందిర నిర్మాణంతో దశాబ్దాల కల నెలరవేరిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇన్నాళ్లుగా భక్తులు రామున్ని చిన్న గుడారంలోనే దర్శించుకున్నారని చెప్పారు రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న జనవరి 22న దేశ వ్యాప్తంగా దీపాలు వెలిగించాలని ప్రజలను కోరారు. ప్రజలు తమ జీవితాల నుంచి పేదరికాన్ని తొలగించుకోవడానికి రామ జ్యోతి స్ఫూర్తినిస్తుందని మోదీ అన్నారు. మూడోసారి బీజేపీ పాలనలో భారత్ను ప్రపంచంలోనే మూడో ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశ ప్రజలకు కచ్చితంగా హామీ ఇస్తున్నానని అన్నారు. మహారాష్ట్రలోని షోలాపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. #WATCH | PM Modi in Maharashtra's Solapur says, "In the 3rd term of our Central government, in my next term, India will be in the top three economies of the world. I have given this guarantee to the people of India that in my next term, I will bring India into the top three… pic.twitter.com/A4DEGrrVOR — ANI (@ANI) January 19, 2024 రామ భజనలో నిమగ్నమైన దృశ్యాలను ప్రధాని మోదీ షేర్ చేశారు. "అయోధ్య రామమందిర ప్రతిష్టాపన వేడుకకు ముందు దేశం మొత్తం శ్రీరాముని పట్ల భక్తితో తడిసిముద్దయింది. నేపథ్య గాయకులు సురేష్ వాడ్కర్, ఆర్య అంబేకర్ తమ మధురమైన పాట ద్వారా భక్తుల భావాలను చిత్రీకరించారు" అని ప్రధాని మోదీ ట్వీట్టర్ వేదికగా తెలిపారు. #WATCH | Prime Minister Narendra Modi sings 'Shri Ram Jai Ram' bhajan at the Veerbhadra Temple in Lepakshi, Andhra Pradesh pic.twitter.com/6F0lyyQSXN — ANI (@ANI) January 16, 2024 రామ మందిర కార్యక్రమానికి ముందు మోదీ కఠిన నియమాలు పాటిస్తున్నారు. నిత్యం కేవలం నేలపైనే నిద్రిస్తుస్తున్నారు. కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారు. 11 రోజుల ప్రత్యేక అనుష్టానంలో భాగంగా ఆయన కఠిన నియమాలు పాటిస్తున్నారు. సాత్వికాహారం స్వీకరిస్తున్నారు. సమయం చిక్కినప్పుడల్లా రామనామం జపిస్తున్నారు. తన నివాసంలో రాముడికి పూజలు చేస్తున్నారు. జనవరి 22న రామ్లల్లా ప్రాణప్రతిష్టతో మోదీ అనుష్టానం ముగుస్తుంది. ఇదీ చదవండి: రాముడి కోసం.. నిద్రాహారాలలో కఠిన నియమాలు పాటిస్తున్న మోదీ -
PM Modi: రాముడి కోసం కఠిన నియమాలు
లక్నో: అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కేంద్రం చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. మందిర నిర్మాణం నుంచి ప్రతి విషయంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. బీజేపీ పెద్దల ఆశయాల్లో ఒకటిగా ఉన్న రామమందిరం నిర్మాణం తన చేతులమీదుగా జరగడం అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అప్పటికే పలుమార్లు చెప్పారు. అయోధ్య ఆలయ గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముందే జనవరి 12 అనుష్టాన కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. నాటి నుంచి మోదీ కఠిన నియమాలు పాటిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నిత్యం కేవలం నేలపైనే నిద్రిస్తుస్తున్నారు. కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారు. 11 రోజుల ప్రత్యేక అనుష్టానంలో భాగంగా ఆయన కఠిన నియమాలు పాటిస్తున్నారు. సాత్వికాహారం స్వీకరిస్తున్నారు. సమయం చిక్కినప్పుడల్లా రామనామం జపిస్తున్నారు. తన నివాసంలో రాముడికి పూజలు చేస్తున్నారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధాన యజమానిగా మోదీ వ్యవహరించనున్నారు. జనవరి 22న రామ్లల్లా ప్రాణప్రతిష్టతో మోదీ అనుష్టానం ముగుస్తుంది. జనవరి 22న జరగనున్న అయోధ్య రాముని ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా ఈ వేడుకకు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. మొత్తంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి 7,000 మంది హాజరుకానున్నారు. 100 మంది విదేశీ ప్రముఖులు కూడా ఈ వేడుకకు రానున్నారు. ఇదీ చదవండి: Ayodhya: గర్భగుడిలో బాలరాముని మొదటి చిత్రం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_6941921367.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Ayodhya: గర్భగుడిలో బాలరాముని మొదటి చిత్రం
లక్నో: అయోధ్య రామాలయంలో జనవరి 22న ప్రతిష్ఠ చేయనున్న బాలరాముని విగ్రహం ఫొటోలు బయటకు వచ్చాయి. విగ్రహం కళ్లపై గుడ్డతో కప్పబడి ఉంది. గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహాన్ని కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విషయం తెలిసిందే. మందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు జరుపుతున్న ఆచారాల్లో భాగంగా బాలరామున్ని గర్భగుడికి తీసుకువచ్చారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గర్భగుడిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. సరయూ నది నుండి తీసుకువచ్చిన నీటితో పాటు దేశంలోని వివిద పవిత్ర నదీ జలాలలను తీసుకువచ్చి గర్భగుడిని శుద్ధి చేయనున్నారు. అనంతరం గర్భగుడిలో పూజలను నిర్వహించి, బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గర్భగుడిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. సరయూ నది నుండి తీసుకువచ్చిన నీటితో పాటు దేశంలోని వివిద పవిత్ర నదీ జలాలలను తీసుకువచ్చి గర్భగుడిని శుద్ధి చేయనున్నారు. రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠకు ముందు జరిగే శుద్ధి కార్యక్రమాల కోసం రాముని పాదుకలను ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం గర్భగుడిలో పూజలను నిర్వహించి, బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి నిర్విఘ్నంగా క్రతువులు ప్రత్యేక క్రతువులు నిరి్వఘ్నంగా కొనసాగుతున్నాయి. అయోధ్యలో మూడో రోజు గురువారం ఆచార్యులు ఆలయ ప్రాంగణంలో గణేశ్ పూజ, వరుణ పూజ, వాస్తు పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. జలదివస్లో భాగంగా రామ్లల్లా విగ్రహాన్ని నీటితో శుభ్రం చేశారు. రాముడి విగ్రహాన్ని చెక్కిన మైసూరులో ప్రసిద్ధ శిల్పి అరుణ్ యోగిరాజ్ కుటుంబం స్వీట్లతో చేసిన రామమందిర ప్రతిరూపాన్ని తీసుకువచ్చింది. ఇదీ చదవండి: గర్భగుడిలోకి రామ్లల్లా -
అయోధ్యలో అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్!
ఢిల్లీ: అయోధ్యలో రామ మందరి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వేళ.. ఉగ్ర కలకలం రేగింది. ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు ఉత్తర ప్రదేశ్ పోలీస్ శాఖ గురువారం రాత్రి ప్రకటించింది. భద్రత కోసం చేపట్టిన తనిఖీల్లో భాగంగా ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల్ని యాంటీ టెర్రరిస్ట్ స్వ్వాడ్ అదుపులోకి తీసుకుంది. ఉగ్రవాదులతో సంబంధాలపై ఈ ముగ్గురిని ప్రశ్నిస్తున్నట్లు యూపీ స్పెషల్ డీజీపీ ప్రశాంత్ కుమార్ ప్రకటించారు. అయితే ఆ ముగ్గురి వివరాల్ని గానీ.. విచారణకు సంబంధించిన విషయాలపైగానీ ఇంకా ప్రకటన వెలువడలేదు. ఇదీ చదవండి: గర్భగుడిలోకి రామ్లల్లా పటిష్ట భద్రత జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో రామ్లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. వారణాసికి చెందిన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి 11 వేల మంది అతిథులుగా హాజరు కానున్నారు. ఆహ్వానం వెళ్లిన వాళ్లలో రాజకీయ, సినీ, క్రీడా రంగానికి ప్రముఖులు కూడా ఉన్నారు. దీంతో యూపీ పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. పది వేల మంది పోలీసులతో పాటు కేంద్ర బలగాలు పహారాలో.. సీసీ కెమెరాల నిఘా నీడలో అయోధ్య ఉందిప్పుడు. -
అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట.. కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 22న హాఫ్ హాలీడే ప్రకటిస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కార్యాలయాలన్నింటికి ఈ హాఫ్ హాలీడే వర్తించనున్నట్లు తెలిపారు. అయోధ్యలోని రామాలయంలో జరిగే రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూర్తయ్యేంత వరకు ఒకపూట సెలవు వర్దిస్తుందని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్య నగరమంతా రామమయంగా మారిపోయింది. ప్రతిచోటా ‘జై శ్రీరామ్’ నినాదాలు వినిపిస్తున్నాయి. శ్రీరామ్లల్లాకు జరిగే పట్టాభిషేకం కోసం అయోధ్యవాసులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: అయోధ్య వాతావరణం.. ప్రత్యేక వెబ్పేజీ ప్రారంభించిన ఐఎండీ -
అయోధ్య వాతావరణం.. ప్రత్యేక వెబ్పేజీ ప్రారంభించిన ఐఎండీ
అయోధ్య: శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరిగే ఈ నెల 22న అయోధ్యలో వాతావరణ వివరాలు తెలియజేసేందుకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఏకంగా ఒక ప్రత్యేక వెబ్పేజీని ప్రారంభించింది. ప్రాణప్రతిష్ట వేడుక జరిగే 22న అయోధ్యలో అత్యల్ప ఉష్ణోగ్రత 10.7 డిగ్రీల సెల్సియస్, అత్యధిక ఉష్ణోగ్రత 22.2 డిగ్రీల సెల్సియస్గా ఉంటుందని ఐఎండీ తెలిపింది. అయోధ్యలో 22వ తేదీన ఉండే ఉష్ణోగ్రతలతో పాటు తేమ, గాలి వేగం తదితర వాతావరణ సంబంధిత అంశాలను కూడా ఐఎండీ ఏర్పాటు చేసిన వెబ్పేజీ తెలియజేస్తోంది. 17వ తేదీ నుంచి వారం రోజుల పాటు అయోధ్యలో ఉష్ణోగ్రతల ఫోర్క్యాస్ట్తో పాటు ఇక్కడ ఈ వారం రోజుల్లో ప్రతి రోజు ఏ సమయంలో సూర్యోదయ, సూర్యాస్తమయాలవుతాయనే వివరాలను కూడా ఐఎండీ పొందుపరిచింది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి IMD launched a dedicated page for Ayodhya weather forecast.#IMD #Ayodhya pic.twitter.com/wSEpUJr90K — Suresh Kumar (@journsuresh) January 18, 2024 ఈ వివరాలన్నింటని హిందీ, ఆంగ్లం, ఉర్దూ, చైనీస్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో ఐఎండీ అందుబాటులో ఉంచింది. కేవలం అయోధ్యనే కాకుండా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, వారణాసి, లక్నోలతో పాటు రాజధాని న్యూ ఢిల్లీ నగరాల వాతావరణ వివరాలను కూడా ఐఎండీ వెబ్పేజీలో ఎప్పటికప్పుడు తెలియజేస్తోంది. పర్యాటకుల సౌకర్యార్థమే ఐఎండీ ప్రత్యేక వెబ్పేజీని రూపొందించినట్లు సమాచారం. ఇదీచదవండి.. రామాలయం పోస్టల్స్టాంపు విడుదల -
22న మరో రామాలయంలోనూ ప్రాణప్రతిష్ఠ
ఈ నెల 22న అయోధ్యలోని రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అయితే అదేసమయంలో మధ్యప్రదేశ్లోని సౌసర్ నగర్లో గల 200 ఏళ్ల పురాతన రామాలయంలోనూ శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ నేపధ్యంలోనే ఆలయ కమిటీ జనవరి 16 నుంచి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో భారీ ఆలయాన్ని నిర్మించి, అందులో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారని, అదే సమయంలో తాము కూడా ఈ ఆలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠాపనకు నిర్ణయం తీసుకున్నప్పుడు, తాము కూడా అదే రోజున ఈ ఆలయంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించామన్నారు. కమిటీ మేనేజర్ నరేష్ బగానీ మాట్లాడుతూ దాదాపు 200 ఏళ్ల క్రితం రాజస్థాన్ నుంచి తమ కుటుంబసభ్యులు శ్రీరామ మందిరాన్ని నిర్మించినప్పుడు ఇక్కడికి వచ్చారని చెప్పారు. ఆలయాన్ని పునరుద్ధరించాలని తమ కుటుంబీకులు నిర్ణయించారని, గత రెండేళ్లుగా ఆలయ నిర్మాణ పనులు కొనసాగాయన్నారు. ఎట్టకేలకు నిర్మాణ పనులు పూర్తయ్యాయని, 22 నుంచి ఆలయం భక్తులకు అందుబాటులోకి రానున్నదని అన్నారు. -
రామాలయం పోస్టల్ స్టాంపు విడుదల
రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు ముందుగా నేడు (గురువారం) శ్రీరామ జన్మభూమి ఆలయంపై స్మారక పోస్టల్ స్టాంప్ను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. దీనితో పాటు రాముని చిత్రంతో కూడిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రధాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ 48 పేజీల పుస్తకంలో 20 దేశాల స్టాంపులు ఉన్నాయి. రామాలయ పోస్టల్ స్టాంపు విడుదల అనంతరం ప్రధాని మోదీ ఓ వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు. ప్రధాని మోదీ మొత్తం 6 తపాలా స్టాంపులను విడుదల చేశారు. వీటిలో రామాలయం, గణేశుడు, హనుమంతుడు, జటాయువు, శబరి మొదలైనవి ఉన్నాయి. ఈ 48 పేజీల పుస్తకంలో అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కంబోడియా, ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు సహా 20కి మించిన దేశాలు విడుదల చేసిన పోస్టల్ స్టాంపులు ఉన్నాయి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇది కూడా చదవండి: పేరులో రాముడుంటే బంపర్ ఆఫర్! #WATCH | Prime Minister Narendra Modi releases Commemorative Postage Stamps on Shri Ram Janmbhoomi Mandir and a book of stamps issued on Lord Ram around the world. Components of the design include the Ram Mandir, Choupai 'Mangal Bhavan Amangal Hari', Sun, Sarayu River and… pic.twitter.com/X2eZXJzTKz — ANI (@ANI) January 18, 2024 -
అయోధ్యకు చేరుకున్న ‘హనుమంతుడు’..
అయోధ్య రామాలయంలో బాలరాముని విగ్రహప్రతిష్ఠాపన ఈ నెల 22న జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలావుండగా హనుమంతుని జన్మస్థలమైన కిష్కింధ నుండి ప్రత్యేక రథం అయోధ్యకు చేరుకుంది అలాగే ప్రపంచం నలుమూలల నుండి అయోధ్యకు విలువైన కానుకలు చేరుతున్నాయి. ఈ రథం మూడేళ్లుగా దేశమంతటా తిరుగుతోంది. ఈ ప్రత్యేక రథం సీతామాత జన్మస్థలమైన బీహార్లోని సీతామర్హి గుండా అయోధ్యకు చేరుకుంది. ఈ రథంతోపాటు పర్యటనలు సాగిస్తున్న స్వామి గోవిందానంద సరస్వతి మాట్లాడుతూ అయోధ్యలో రామాలయం నిర్మిస్తున్న తరహాలోనే కిష్కింధలో కూడా హనుమంతుని ఆలయాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. శ్రీరాముని భక్తుడైన హనుమంతుని రాకకు చిహ్నంగా ఈ రథాన్ని అయోధ్యకు తీసుకువచ్చారు. ఈ రథం ద్వారా రామభక్తిని ఊరూవాడా ప్రచారం చేస్తున్నారు. ఈ రథాన్ని చూసేందుకు జనం తరలివస్తున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి కిష్కింధ ప్రాంతం కర్ణాటకలోని కొప్పల్ విజయనగర జిల్లాలో ఉంది. ఇది తుంగభద్ర నది ఉత్తర ఒడ్డున ఉన్న హంపి కంటే పురాతనమైన ప్రాంతం. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని ఆనెగుండి అని పిలుస్తున్నారు. కిష్కింధ రాజ్యాన్ని సుగ్రీవుడు తన సలహాదారు హనుమంతుని సహాయంతో పరిపాలించాడు. ఆనెగుండి గ్రామంలో రామాయణానికి సంబంధించిన పలు ఆనవాళ్లు లభించాయి. ఈ ప్రాంతమంతా రాళ్లు, పర్వతాలతో కూడి ఉంటుంది. రామాయణంలో ఈ ప్రదేశానికి సంబంధించిన ప్రస్తావన వినిపిస్తుంది. అనెగుండి గ్రామంలో పలు పురాతన గుహలు కూడా కనిపించాయి. ఇక్కడి రాళ్లపై కోతుల చిత్రాలను కనుగొన్నారు. ఇది కూడా చదవండి: రామ్లల్లా దర్శనానికి ఎలా వెళ్లాలి? -
అదిగో అయోధ్య... అల్లదిగో అయోధ్య
రాముడు శ్రీరాముడు సకల గుణాభిరాముడు రాఘవుడు... ఇన్ని నామాంతరాలు ఉన్న ఆ దశరథ రాముడు... ఆ రోజున తెల్లవారుజామునే మేల్కొన్నాడు... సరయూ జలాలలో అభ్యంగన స్నానం ఆచరించాడు... అల్లలాడుతున్న అలకలను సరిచేసుకున్నాడు...సూర్య వంశ చిహ్నంగా నుదుటన రవి తిలకం ధరించాడు రవికులుడు... చల్లని వెన్నెలలు చిలకరించే రాజీవాక్షాలకు నల్లని కాటుక అలదాడు..సీతమ్మకు ఆనవాలుగా పంపిన అంగుళీయకాన్ని వేలికి ధరించాడు... తన పట్టాభిషేక సమయానికి సిద్ధం చేయించిన వస్త్రాలు ధరించాడు.. నాడు భరతుడు సింహాసనం మీద ఉంచి పరిపాలన కొనసాగించిన పాదుకలలో పాదాలుంచాడు... బాల్యంలో చందమామ కావాలి అని మారాము చేసినప్పుడు అద్దంలో చందమామను చూపిన ఆ అద్దంలో ఇప్పుడు ఈ రామచంద్రుడు తన ముఖ బింబాన్ని చూసుకుని... చిరునవ్వులు చిందిస్తూ... గడప దాటి బయటకు అడుగు పెట్టబోతున్నాడు... సరిగ్గా అదే సమయానికి... గుమ్మం ముందర కవి సమూహం లోపలకు వస్తూ కనిపించారు. వారికి వినమ్రపూర్వకంగా నమస్కరించి, లోపలకు ఆహ్వానించి, సముచిత స్థానాలు చూపి, ఆసీనులను చేసి, తాను కూడా గౌరవముద్రలో సింహాసనం అధిరోహించాడు.. అందరూ విశ్రాంతులైన పిదప... ‘వాల్మీకి మహర్షీ! మహానుభావులంతా ఒక్కసారే విచ్చేశారు. కారణం తెలుసుకోవచ్చా’ అని వినమ్రంగా ప్రశ్నించాడు. వాల్మీకి తన గుబురు శ్మశ్రువుల మాటు నుంచి చిన్నగా నవ్వుతూ, ‘ఏమయ్యా! నువ్వు ఇంత తొందరగా ఏదో పని మీద బయలుదేరినట్టున్నావు. విషయం తెలుసుకోవచ్చా’ అన్నాడు ఏమీ ఎరగనట్లు. ‘మహర్షీ! ఏమీ ఎరగనట్లు ప్రశ్నిస్తున్నారు. మీరే కదా నా కథను లవకుశల ద్వారా గానం చేయించి ప్రపంచానికి పరిచయం చేసింది. నాకు ఎంతటి మంచి లక్షణాలు ఉండాలో కూడా మీరే నిర్దేశించారు కదా. అటువంటి మీకు నేను ఎప్పుడు, ఎక్కడకు వెళ్తానో తెలియదా. నా నోటితో చెప్పించాలనే ఆలోచన కాకపోతేను’ అన్నాడు వాల్మీకి మహర్షితో చనువుగా. ‘నాకు తెలుసు రామా! నీ వినయం, విధేయత, గౌరవం... అన్నీ. ఈ రోజు ఇక్కడకు వచ్చినవారిని గమనించావా. వీరంతా నీ కథను ఇన్ని వేల సంవత్సరలుగా సజీవంగా ఉంచిన మహానుభావులు. నేను రాసిన కథను యథాతథంగా ఉంచకుండా, వారికి తోచిన కల్పనలు కూడా చేశారు. వీరందరికీ నువ్వంటే ప్రీతి. అందుకే వారి మనసుకి నచ్చిన విధంగా నిన్ను కీర్తించారు. నిన్ను నెత్తిన పెట్టుకుని నేటికీ ‘రామాయణం’ అనే కావ్యాన్ని ‘రామ’ అనే తారక మంత్రాన్ని ఇంకా పచ్చిగా, లేతగా, తడి ఆరకుండా ఉంచారు... అని వాల్మీకి పారవశ్యంతో పలుకుతుంటే, రాముని శరీరం పులకించిపోయింది. రామా! నీకు ఒక్కొక్కరినీ మరోసారి పరిచయం చేస్తాను. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్లే సంతోషంలో ఉన్నావు. అందువల్ల నేను పరిచయం చేస్తేనే కాని వారిని నువ్వు జ్ఞప్తికి తెచ్చుకోలేవు.... అంటూ పండిత పరిషత్తు వైపునకు తల పరికించాడు. ఇదిగో మొట్టమొదటగా చెప్పవలసిన వ్యక్తి కాళిదాసు. ఈయన కవికుల గురువు. నీ గొప్పదనాన్ని ‘రఘువంశం’ అనే కావ్యంగా వెలయించాడు. మీ కుటుంబాన్ని ఎంత గొప్పగా ప్రస్తుతించాడో తెలుసా. ఆ కవిత్వమంతా ఇప్పుడు చెప్పనులే. రేఖామాత్రంగానే పరిచయం చేస్తాను. ఇక ఆ పక్కన కూర్చున్న కవి భవభూతి. ఉత్తర రామ చరిత రచించి అందరి కంట నీరు పెట్టించాడు. ఆ పక్కనే ఉన్న భాసుడు ‘ప్రతిమ’ అనే నాటకాన్ని రచించాడు. ఆయనకు నా రామాయణంలోని కొన్ని విషయాలు నచ్చలేదు. అందుకని ఆయన కొన్ని కల్పనలు చేశాడు.కైకేయి దుర్బుద్ధికాని, లక్ష్మణుడు అవాచ్యకాలు పలకలడం కాని ఇందులో కనపడదు. దశరథ ప్రతిమా కల్పనం, దశరథ శ్రాద్ధ కలనం వంటి కొన్ని అంశాలు ఇందులోని కొత్త విషయాలు. అర్థమైందా ఈ కవి విలక్షణత. ఆయనకు కైకమ్మను నిందించాలనిపించలేదు. సరే – ఇంక ఆ పక్కన చూడు... మురారి. ఆయనకు నా పేరు కూడా చేరింది. బాల వాల్మీకి అని పిలుస్తారు. ఎన్నో గురుకుల క్లేశాలు అనుభవించి, చివరకు కవికులంలో స్థానం సంపాదించాడు. ఆ మహానుభావుడు.. నీ తండ్రి దశరథుడిని ఎంత గొప్పగా ప్రశంసించాడో తెలుసా. ఆయనట ఏకంగా దిక్పాలకులను తన ఇంటి ముంగిట్లో బంధించేశాడు. అంటే వారికి పని లేకుండా నీ తండ్రి గారే ముల్లోకాలను సుభిక్షంగా పరిపాలించాడట. అబ్బో ఈ కవి గురించి ఎంత చెప్పినా చాలదు. ఆయన మార్గమే వేరు. నీకు ముందు ముందు ఇటువంటి మార్గంలో వెళ్లిన మరో ఇద్దరిని గురించి చెబుతానులే. ఇక తెలుగు కవులలోకి వస్తే... అబ్బో... బోలెడు మంది.. తెలుగులో ఆది కావ్యం రచించిన నన్నయ మొదలుగా నిన్నమొన్నటి ఉషశ్రీ వరకు ఎంత మంది ఎంత అందంగా నీ కావ్యాన్న రచించారో. కవిత్రయంలో మొదటివాడైన నన్నయభట్టు మహానుభావుడు భారత ఆంధ్రీకరణేకాకుండా నీ కథను ‘రాఘవాభ్యుదయం’ పేరిట తెలుగువారికి అందించాడు. ఆ కవిత్రయంలో రెండవ వాడైన తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’ పేరున తొట్టతొలి ప్రబంధ కావ్యాన్ని, ఒక్క వచనం కూడా లేకుండా పూర్తి పద్యంలో రచించాడు. కవిత్రయంలో మూడవ వాడైన ఎరన్ర కూడా రామాయణం కావ్యాన్ని రచించాడు. ఇక మంత్రి భాస్కరుడు ‘భాస్కర రామాయణం’, కుమ్మరి మొల్ల ‘మొల్ల రామాయణం’, గోన బుద్ధారెడ్డి ‘రంగనాథ రామాయణం’ రచించారు. వారంతా నీ పట్ల ప్రేమానురాగాలను కురిపిస్తున్న కన్నులతో ఎంత భక్తిగా కూర్చున్నారో చూడు. ఇక వీరందరిదీ ఒక ఎత్తయితే... ఆ మురారిలాగే నిరంకుశుడైన కవి ‘కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ’. ఆ మహానుభావుడు నీ క్రీగంటి చూపు కోసం చూస్తున్నాడు. అటు వైపుగా ఒక్కసారి నీ తల త్రిప్పు. ఈయన నీ కథను ‘రామాయణ కల్పవక్షం’ పేరున రచించి, తెలుగులో మొట్టమొదటి జ్ఞానపీఠ సత్కారాన్ని అందుకున్నాడు. ఇంకా ఎన్నో సత్కారాలు ఉన్నాయిలే. నిన్ను తనకు కావలసిన విధంగా ప్రస్తుతించుకున్నాడు. ఇక ఈ సభకు హాజరైన చివరివాడు ‘ఉషశ్రీ’. మురారి పంథాలో విశ్వనాథ కావ్యరచన చేస్తే, ఆ విశ్వనాథ చేత ‘ఇది ఉషశ్రీ మార్గము’ అనిపించుకుని, నిన్ను నెత్తిన పెట్టుకుని ఊరేగాడు. వాడు త్యాగ్య వాగ్గేయకారుడైతే, వీడు వాక్కావ్యకారుడు. తన నోటితో నీ కథను అందంగా చెబుతూ, తన కలంతో కూడా అంతే అందంగా నిన్ను ప్రస్తుతించాడు. ఇంతమంది కవులు నీ కోసం నిరీక్షిస్తుంటే... నువ్వు నీ బాల రామ ప్రతిష్ఠ కోసం పరుగులు తీయడం న్యాయమేనా. అందుకే నిన్ను లోపలకు పిలిచాను. వీరందరికీ నీ తియ్యని ఆశీర్వచనాలు కావాలి.. అంటూ వాల్మీకి పలుకుతుంటే... మరో నలుగురు పరుగుపరుగున లోపలకు ప్రవేశించారు. వారిలో ప్రథముడు కంచర్ల గోపన్న... అయ్యా! వాల్మీకి మహర్షీ! నన్ను మరచిపోతే ఎలాగయ్యా.. అంటూ పాదాల మీద వాలాడు. వాల్మీకి ఆ గోపన్నను దగ్గరగా తీసుకుని, ‘రామభద్రా! వీడు నీ కోసం భద్రాద్రిలో ఆలయం నిర్మించాడు. నీ పేరున కీర్తనలు రచించి, గోపన్న నామాన్ని రామదాసుగా మార్చుకున్నాడు. నీ కోసం కారాగారం పాలయ్యాడు. ఎన్నో దెబ్బలు తిన్నాడు. అయితేనేం, నీ గురించి ఎన్నో మంచి మంచి కీర్తనలు రచించాడు... అంటుంటే, రామదాసు శ్రీరాముని పాదాల ముందు సాష్టాంగపడ్డాడు. ఇదిగో ఈ మహానుభావుడిని చూడు. ఈయన త్యాగయ్య. నీ మీద ఎన్ని కీర్తనలు రచించాడు. ‘మా జానకి చెట్టపట్టగా మహరాజువైతివి’ అని ఆ తల్లి సీతమ్మను తన గుండెల్లో పొదివిపట్టుకున్నాడు.. అని త్యాగయ్య గురించి పలుకుతుంటే, ఆ మహానుభావుడు తన చేతిలోని తంబురను శ్రీరాముని చేతికిచ్చాడు. ఆ రాముడు తన విల్లును పక్కన పెట్టి, తంబురనే విల్లుగా ధరించాడు. అంతే ఆ దశ్యం చూసిన కొంటె బొమ్మల బాపు... గబగబ అయిదు నిమిషాలలో కవుల కొలువును, తంబుర రాముడిని తన రేఖలలో నింపేశాడు. ఆ పక్కన ముసిముసి నవ్వులతో బాపుని అంటిపెట్టుకున్న ముళ్లపూడి రమణ.. శ్రీరామా! ఓ ఫైవ్ లెటర్స్ అప్పు ఇస్తావా నిన్ను పొగడటానికి... అంటూ ఆయన పాదాల ముందు మోకరిల్లాడు. ఈసారి రాముడు కాదు, వాల్మీకి పరవశించిపోయాడు. నేను 24 వేల శ్లోకాలతో రామకథను కొన్ని వేల సంవత్సరాల క్రితం రచిస్తే, నేటికీ నా రాముడిని అందరూ అక్షరాలలో బంధిస్తూనే ఉన్నారు. ‘రామా! ఇది నా గొప్పతనం కాదు. ఇది నీ గొప్పదనం. నీ వ్యక్తిత్వ ఔన్నత్యం. నీ తండ్రి దశరథుడు నేర్పిన సంస్కారం గొప్పదనం.మా జన్మలు ధన్యమయ్యాయయ్యా. ఇక నువ్వు నీ బాల విగ్రహ ప్రతిష్ఠ చూడటానికి బయలుదేరు. మేమంతా నీ వెంట వస్తాం. అక్కడ అయోధ్యలో ‘రామాయ రామభద్రాయ రాచంద్రాయ వేధసే’ అంటూ రామాయణ గాథ ఉషశ్రీ గళం వినిపిస్తున్నారట. ‘మన ఉషశ్రీ ధన్యుడయ్యాడు. నీ ఎదుట గళం వినిపించే అదృష్టం అతడిని మాత్రమే వరించింది. అతడి మాటలలోనే నా ఉపన్యాసం ముగిస్తాను. స్వస్తి’ అంటూ వాల్మీకి ముగింపు పలికాడు. అందరూ నెమ్మదిగా అయోధ్య వైపుగా బయలుదేరబోతున్నారు. చకచక అడుగులు వేస్తూ ఉషశ్రీ వేగంగా వెళ్లడం గమనించిన రాముడు, ‘మహర్షీ! మనం కూడా బయలుదేరాలయ్యా. వాడు కాలాంతకుడు. సమయ పాలన వాడి ఆత్మ. నా బాలరామ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు కదా. ఆ వ్యాఖ్యానం వీడి గళం నుంచే వెలువడబోతోంది. వాడితో పాటు వాడికి ‘ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇలా ఉండాలి’ అని మార్గదర్శనం చేసిన జమ్మలమడక మాధవరామ శర్మ కూడా ఈ పాటికి అక్కడికి చేరి ఉంటాడు. వేగంగా పదండి’ అని పలికాడు. అదిగో అయోధ్య. అదిగో రాముడు. అదిగో మన కవిపండితులు. అదిగో మన తెలుగువారు. జై శ్రీరామ్... (జనవరి 22, 2024 సోమవారం నాడు బాలరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా సృజన రచన. - డా. పురాణపండ వైజయంతి) -
రామ్లల్లా దర్శనానికి ఎలా వెళ్లాలి?
జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తయ్యాక అయోధ్యను సందర్శించాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇందుకు ఎటువంటి విధివిధానాలు అనుసరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. రామాలయంలో బాలరామునికి రోజుకు ఐదుసార్లు హారతులు ఇవ్వనున్నారు. అయితే భక్తులు మూడు హారతులను మాత్రమే దర్శించుకోగలుగుతారు. ఈ హారతులు ఉదయం 6:30 గంటలకు, మధ్యాహ్నం 12:00 గంటలకు, సాయంత్రం 7:30 గంటలకు నిర్వహిస్తారు. ఇక శ్రీరాముని దర్శనం విషయానికి వస్తే ఉదయం 6 నుండి 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం ముందుగా రిజిస్టేషన్ చేసుకోవాలి. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం (https://online.srjbtkshetra.org) అధికారిక వెబ్సైట్కి వెళ్లి, మొబైల్ నంబర్ను నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి. ఓటీపీ నమోదు చేశాక పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో ‘దర్శన్’ ఎంపికపై క్లిక్ చేశాక, ఓపెన్ అయిన పేజీలో మీరు శ్రీరాముని దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీ, సమయం, మీతోపాటు వచ్చేవారి సంఖ్య, దేశం, రాష్ట్రం, మొబైల్ నంబర్తో పాటు మీ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక దర్శనానికి సంబంధించిన బుకింగ్ పూర్తవుతుంది. శ్రీరాముని హారతులను చూడాలనుకుంటే ఇందుకోసం ప్రత్యేకంగా బుక్ చేసుకోవాలి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆఫ్లైన్లో టిక్కెట్లు పొందాలనుకుంటే ఆలయం సమీపంలోని కౌంటర్ వద్దకు వెళ్లి, ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు కార్డును చూపించి, టికెట్ పొందవచ్చు. కాగా పదేళ్లకన్నా తక్కువ వయసుగల పిల్లలకు దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. దర్శనం కోసం టిక్కెట్తో పాటు ఐడీప్రూప్ ప్రూఫ్ను ఖచ్చితంగా వెంట తీసుకువెళ్లాలి. ఎవరైనా భక్తుడు తన టిక్కెట్ను రద్దు చేసుకుంటే, ఆ స్లాట్ మరో భక్తుడికి అందుబాటులోకి వస్తుంది. దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక, దర్శనానికి 24 గంటల ముందు సంబంధిత భక్తునికి మెసేజ్ లేదా మెయిల్ వస్తుంది. దర్శనానికి 24 గంటల ముందు భక్తుడు తన టిక్కెట్ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాగా స్త్రీలు, పురుషులు సంప్రదాయ దుస్తులలో మాత్రమే దర్శనానికి రావాలి. పురుషులు ధోతీ-కుర్తా లేదా కుర్తా, పైజామా.. మహిళలు చీర, దుపట్టాతో కూడిన పంజాబీ దుస్తులు లేదా దుపట్టాతో చుడీదార్ సూట్ ధరించి శ్రీరాముని దర్శనానికి రావచ్చు. ఇది కూడా చదవండి: అయోధ్యలో త్రేతాయగం... అంతా రామమయం! -
ఉత్సవ విగ్రహమే ఇంత సమ్మోహనంగా ఉందంటే..
అయోధ్యలో నూతన రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆలయ ట్రస్టు ఎంతగానో కృషి చేస్తోంది. సంప్రోక్షణ తేదీ దగ్గర పడుతుండటంతో రామాలయానికి సంబంధించిన ప్రత్యేక సమాచారం ప్రతిరోజూ వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలోనే అత్యంత ఆకర్షణీయమైన రామ్లల్లా విగ్రహానికి సంబంధించిన తొలి ఫొటో వెలుగులోకి వచ్చింది. పల్లకీలో కూర్చున్న రామ్లల్లా ఆలయ ప్రాంగణంలో ఊరేగారు. అయితే ఇది గర్భగుడిలో ప్రతిష్టించే విగ్రహం కాదు. ఇది ప్రతీకాత్మక విగ్రహం. గర్భగుడిలో ప్రతిష్టించే బాలరాముని విగ్రహాన్ని ఈనెల 18న(ఈరోజు) రామాలయ ప్రాంగణానికి తీసుకురానున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి కర్నాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ నూతన రామాలయంలో ప్రతిష్ఠించే బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దారు. జనవరి 22న జరిగే పవిత్రోత్సవానికి ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆలయ ట్రస్టు తొలుత బాలరాముని విగ్రహాన్నే ఆలయ ప్రాంగణంలో ఊరేగించాలని భావించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసి, శ్రీరాముని ఉత్సవ విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో ఊరేగించి, భక్తులకు శ్రీరాముని దర్శనభాగ్యం కలిగించారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గర్భగుడిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. సరయూ నది నుండి తీసుకువచ్చిన నీటితో పాటు దేశంలోని వివిద పవిత్ర నదీ జలాలలను తీసుకువచ్చి గర్భగుడిని శుద్ధి చేయనున్నారు. అనంతరం గర్భగుడిలో పూజలను నిర్వహించి, బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇది కూడా చదవండి: 22న స్కూళ్లకు సెలవు.. ఈ రాష్ట్రాల్లోనే.. -
22న స్కూళ్లకు సెలవు.. ఈ రాష్ట్రాల్లోనే..
ఈ నెల 22న అయోధ్యలోని రామాలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ వేడుకకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంపై దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్సాహం నెలకొంది. ఈ నేపధ్యంలోనే ఆ రోజు పలు రాష్ట్రాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో ఆ రోజు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. ఏ రాష్ట్రాల్లో ఈ నెల 22న పాఠశాలలకు సెలవులు ప్రకటించారంటే.. ఉత్తర ప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 22న పాఠశాలలకు సెలవుపై ఆదేశాలు జారీ చేశారు. జనవరి 22న రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలతో పాటు మద్యం దుకాణాలను కూడా మూసివేస్తున్నట్లు యోగి తెలిపారు. ఆ రోజున ఏ విద్యా సంస్థలనూ తెరవరు. మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లోనూ పాఠశాలలు, కళాశాలలకు 22న సెలవు ప్రకటించారు. ఈమేరకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పెద్ద పండుగలాంటిదని సీఎం పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో ఆ రోజు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి గోవా 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా గోవా ప్రభుత్వం.. ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలకు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో కూడా జనవరి 22న పాఠశాలలు, కళాశాలలు మూసివేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసింది. హర్యానా హర్యానాలో కూడా రామ్లల్లా పవిత్రోత్సవంనాడు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు మూసివేయనున్నారు. ఆ రోజున మద్యం దుకాణాలను కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది కూడా చదవండి: ఢిల్లీ, ముంబైలకు పోటీనివ్వనున్న అయోధ్య స్టార్ హోటళ్లు! -
అయోధ్యలో త్రేతాయగం... అంతా రామమయం!
అయోధ్యలోని రామమందిరంలోకి శ్రీరామ్లల్లా అడుగుపెట్టారు. శ్రీరామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న జరగనుంది. జనవరి 16 నుంచి ప్రాణప్రతిష్ఠ పూజలు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో అయోధ్య నగరమంతా రామమయంగా మారిపోయింది. ప్రతిచోటా ‘జై శ్రీరామ్’ నినాదాలు వినిపిస్తున్నాయి. దీనిని చూస్తుంటే అయోధ్యకు నాటి త్రేతాయుగం వచ్చినట్టున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం అయోధ్యలోని ప్రతి ఇంట్లో, ప్రతి దుకాణంలో ప్రతి చౌరస్తాలో రామనామం తాండవమాడుతోంది. జనవరి 16న నిర్మోహి అఖారాకు చెందిన మహంత్ దినేంద్ర దాస్, పండితులు సునీల్ దాస్ అయోధ్య రామమందిరంలోని గర్భాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు కలశ యాత్ర చేపట్టారు. జనవరి 17న శ్రీరామ్లల్లా నూతన విగ్రహాన్ని మొదటిసారిగా ఆలయంలోనికి తీసుకువచ్చారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మార్గదర్శకత్వంలో అయోధ్యలో ‘త్రేతా యుగం’నాటి రోజులు కనిపిస్తున్నాయి. అయోధ్యలోని అన్ని దుకాణాలపై రాములవారి జెండాలు రెపరెపలాడుతున్నాయి. రామ్ఘాట్ నుండి అయోధ్యలోకి ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ ఏర్పాటు చేసిన ఒక హోర్డింగ్ దీపావళి వేడుకలను గుర్తు చేసేలా ఉంది. రామభజన, రామాయణానికి సంబంధించిన పాటలు వాడవాడలా ప్రతిధ్వనిస్తుండంతో అవి రామభక్తులకు మరింత ఉత్సాహాన్ని అందిస్తున్నాయి. శ్రీరామ్లల్లాకు జరిగే పట్టాభిషేకం కోసం అయోధ్యవాసులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుధవారం నుంచి అయోధ్యకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన రెండు విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ విమానం అయోధ్యతో కోల్కతా, బెంగళూరులను కలుపుతుంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ విమానాలను ప్రారంభించారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి రామ జన్మభూమి మార్గంలోని ఎంట్రీ పాయింట్ దగ్గర రెండు పెద్ద స్తంభాలు నిర్మితమయ్యాయి. అవి త్రేతాయుగాన్ని తలపిస్తున్నాయి. ఇక్కడి గోడలపై రామ్లల్లా జీవితానికి సంబంధించిన పలు దృశ్యాలు కనిపిస్తాయి. నూతన రామాలయం రాకతో ప్రముఖ స్టార్ హోటళ్లు అయోధ్యలో అడుగిడేందుకు సిద్ధమవుతున్నాయి. దీనికితోడు ప్రధాన రహదారిపై గృహాలు కలిగినవారు తమ ఇళ్లను హోటళ్లుగా మారుస్తున్నారు. ప్రస్తుతం అయోధ్యలో రూ.30,923 కోట్ల విలువైన 200కు పైగా అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. 37 శాఖలు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాయి. యూపీ హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్ 1200 ఎకరాల్లో న్యూ అయోధ్య టౌన్షిప్ను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించింది. ఇది కూడా చదవండి: ఇనుమూ లేదు.. సిమెంటూ లేదు.. రామాలయం ఎలా నిర్మించారు? -
Ramayan: అయోధ్యకు చేరుకున్న సీతారామలక్ష్మణులు
అయోధ్య: రామ మందిరంలో 22న రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. అతి త్వరలో జరగనున్న ఈ మహత్తర ఘట్టాన్ని వీక్షించడానికి సీతారాములు, లక్ష్మణుడు బుధవారమే అయోధ్యకు చేరుకున్నారు. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా.. నిజమే వచ్చింది సీతారామలక్ష్మణులే. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పాపులర్ సీరియల్ అయిన రామాయణ్లో నటించిన అరుణ్ గోవిల్(రాముడు), దీపిక చిక్లియా(సీత), సునీల్ లహ్రీ(లక్ష్మణుడు) రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం వీక్షించేందుకు విచ్చేశారు. ఇంతేకాక సోను నిగమ్ పాడిన ‘హమారే రామ్ ఆయేంగే’ పాట చిత్రీకరణలో వీరు పాల్గొననున్నారు. అయోధ్యలోని గుప్తార్ఘాట్, హానుమాన్గర్హి, లతాచౌక్లో ఈ పాట చిత్రీకరణ జరగనుంది. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానాలందిన వారిలో రామాయణ్ సీరియల్ నటులు కూడా ఉన్నారు. ఇదీచదవండి.. రామ్ మందిర ప్రారంభంపై హైకోర్టులో పిటిషన్ -
అయోద్యలో రామమందిర ప్రారంభానికి ముందు.. హైకోర్టులో పిటిషన్
చారిత్రక నగరం అయోధ్యలోని భవ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సమయం సమీపిస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనవరి 22న జరిగే రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ అలహాబాద్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన భోలా దాస్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి శంకరాచార్యులు లేవనెత్తిన అభ్యంతరాలను తన పిటిషన్లో ప్రస్తావించారు. ప్రస్తుతం పుష్క మాసం నడుస్తుందని.. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ మాసంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించరాదని తెలిపారు. శ్రీరాముని ఆలయం ఇంకా నిర్మాణ దశలోనే ఉందని.. నిర్మాణంలో ఉన్న ఆలయంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టించడం సనాతన సంప్రదాయానికి విరుద్ధమని పేర్కొన్నారు. అంతేగాక రాబోయే లోక్సభ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసం అధికార బీజేపీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఆరోపించారు. చదవండి: ఆయోధ్యలో మోదీ.. ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి? ఈ పిటిషన్పై వెంటనే విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 22న అయోధ్యలో శ్రీ రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహ ప్రతిష్ఠాపన చేయనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం పాల్గొంటున్నారు. ప్రాణ ప్రతిష్ఠపై శంకరాచార్యులు అభ్యంతరం తెలిపారు. ఆలయం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది.. అసంపూర్తిగా ఉన్న ఆలయంలో ఎలాంటి దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు’ అని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై వెంటనే విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు అయోధ్య రామమందిరంలో రామ్లల్లా ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 22న జరిగే ఈ మహా వేడుకకు దేశ విదేశాల నుంచి వేలాది మంది విశిష్ట అతిథులు హాజరు కాబోతున్నారు. బాలరాముడి ప్రతిష్టాపనకు సంబంధించిన సంప్రదాయ క్రతువులు మంగళవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ప్రాణప్రతిష్ట దాకా నిరంతరాయంగా కొనసాగుతాయని అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. -
అయోధ్యలో మోదీ.. ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి?
సార్వత్రిక లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం, రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరనుంది. సోమవారం బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కాంగ్రెస్తోపాటు పలు కీలక పార్టీల అధినేతలకు కూడా శ్రీ రామమందిర తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు పంపిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ఇప్పటికే రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకాబోమని వెల్లడించిన విషయం విదితమే. అయితే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రధానితో సహా బీజేపీ నేతృత్వంలోని కీలక నేతలు జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్టలో పాల్గొంటే.. ఆ రోజు కాంగ్రెస్తో పాటు విపక్ష ఇండియా కూటమి నేతలు, ఇతర పార్టీ నేతలు ఏం చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది. మమతా బెనర్జీ కాళీఘాట్ సందర్శన.. మతం అనేది వ్యక్తి గతమైన విశ్వాసమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఆమె జనవరి 22న కోల్కతా సమీపంలోని కాళీఘాటకు వెళ్లి కాళీమాతను దర్శింకుంటానని తెలిపారు. అదేవిధంగా మత సామరస్యం పెంపొందాలని ర్యాలి చేపట్టనున్నట్లు తెలియజేశారు. రాహుల్గాంధీ అస్సాంలో టెంపుల్ దర్శనం? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయం యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఇక యాత్రలో భాగంగా అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగే రోజు జనవరి 22న అస్సాంలోని ఓ గుడిని సందర్శిస్తారని తెలుస్తోంది. ఆ రోజు కాకుండా మరో రోజు.. రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం అందిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మొదటి ఆనందం వ్యక్తం చేశారు. అయితే తాను రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకాలేనని వెల్లడించారు. రాముడి ప్రాణ ప్రతిష్ట అనంతరం తాను అయోధ్య రాముడిని చాలా సులువుగా దర్శించుకుంటానని తెలిపారు. అప్పటి వరకు రాముడి మందిరం పూర్తిగా నిర్మాణం అవుతుందన్నారు. ఇంకా ఆహ్వానం అందలేదు.. ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ప్రస్తుతానికి రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానం అందకపోవటం గమనార్హం. కానీ, ఆయన ఇప్పటికే రామ భక్తిలో నిండిపోయారు. జనవరి 22 రోజును ఢిల్లీ వ్యాప్తంగా సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠించాలని ఆదేశించారు. సుందరకాండ పఠన కార్యక్రమాలను ఏర్పాటు చేయటంలో ఆప్ ప్రభుత్వం నిమగ్నమైంది. దేశ ప్రజలు కోరుకున్నవి జరగాలని అయోధ్య బాలరాముడికి ప్రార్థన చేస్తామని కేజ్రీవాల్ అంటున్నారు. ఉద్ధవ్ ఠాక్రే.. ‘మహా హారతి’ మాజీ ముఖ్యమంత్రి శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, తన పార్టీ నేతలు, కార్యకర్తలతో జనవరి 22న నాసిక్లోని కాలారామ్ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. భగవాన్ కాలారామ్కు ‘మహా హారతి’ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఆలయంలో నల్లరాతితో ఉన్న విగ్రహంలో రాముడు దర్శనం ఇస్తారు. రాముడు వనవాస సమయంలో నాసిక్ ప్రాంతంలోని పంచవటిలో సీతా, లక్ష్మణులతో ఉండేవారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. రామ మందిర ప్రారంభోత్సవానికి ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ జనవరి 22న జరిగే బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక.. తమిళనాడులో డీఎంకే పార్టీ.. ఆధ్యాత్మికత పేరుతో బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శలు గుప్పిస్తోంది. సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్.. గత నెలలోనే తాము అయోధ్యలో జనవరి 22న జరిగే రాముడి ప్రాణ ప్రతిష్టకు హాజరుకామని తెలిపారు. తాము మతాలకు సంబంధించిన విశ్వాసాలు గౌరవిస్తామని అన్నారు. అయితే రాజకీయ ముగుసులో నిర్వహించే మతపరమైన కార్యక్రమాలపై నమ్మకం లేదన్నారు. జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ కౌంటర్ బీజేడీ చీఫ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగే రోజే పూరి జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ను ప్రారంభించాడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మిక విశ్వాసాలను బలోపేతం చేయటమే కాకుండా ఒడిశాలో బీజేపీకి కౌంటర్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్తో సహా ఇండియా కుటమి నేతలు.. బీజేపీ రామ మందిరాన్ని రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఒక పావుగా వాడుకుంటోందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమం అని మండిపడుతున్నారు. ఇక.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హజరుకాకపోతే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని కొందరు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. చదవండి: Ayodhya Ram Mandir: 31 ఏళ్ల క్రితం అయోధ్య ముఖం చూడనన్న ప్రధాని మోదీ! -
ప్రధాని మోదీ ‘రామ ప్రతిజ్ఞ’ నెరవేరింది!
మూడు దశాబ్దాల కిత్రం అయోధ్యను సందర్శించిన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ నాడు.. అక్కడి పరిస్థితులను చూసి, తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తూ, రామాలయ నిర్మాణం జరిగే వరకూ అయోధ్యకు రానంటూ ప్రతిజ్ఞ చేశారు. అది.. 1991, డిసెంబర్ 11.. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు సాగిన ఐక్యతా యాత్రలో పాల్గొన్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ.. 1992, జనవరి 14న అయోధ్యను సందర్శించారు. రామ్లల్లాను దర్శించుకున్నాక, రామాలయ నిర్మాణం జరిగిన తర్వాతనే తాను అయోధ్యకు వస్తారని ప్రతిజ్ఞ చేశారు. నాడు అయోధ్యకు వచ్చినప్పుడు మోదీ ఒక సాధారణ కార్యకర్త. నాటి మోదీ కల నేడు సాకరమయ్యింది. ప్రధాని మోదీ తన మొదటి అయోధ్య పర్యటనలో జానకీ మహల్ ట్రస్ట్లో బసచేశారు. ఇది రామజన్మభూమికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది. ట్రస్ట్ నిర్వాహకులు రామ్కుమార్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, నరేంద్ర మోదీ తొలిసారి ఇక్కడికి వచ్చినప్పుడు రూమ్ నంబర్ 107లో బస చేశారని తెలిపారు. ఆ సమయంలో బీజీపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి 108 నంబర్ రూమ్లో బస చేశారని పేర్కొన్నారు. జానకీ మహల్లోనేవారు భోజనం చేశారని, అప్పుడు తన వయసు 35 ఏళ్లు అని, మోదీకి కూడా అదే వయసు ఉండవచ్చన్నారు. నేడు ఆ గది శిథిలావస్థకు చేరుకుందని, దీంతో ఆ గదికి తాళం వేశామన్నారు. నాడు కఠిన ప్రతిజ్ఞ చేసిన మోదీ 28 సంవత్సరాల వరకూ అయోధ్య ముఖం చూడనే లేదు. 1992, జనవరి 14 వరకూ, అంటే 28 ఏళ్ల పాటు మోదీ అయోధ్యకు రాలేదు. 2019, నవంబర్ 9న రామమందిరానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. 2022లో ప్రధాని మోదీ అయోధ్యకు వచ్చి, దీపోత్సవంలో పాల్గొన్నారు. 2023 డిసెంబర్ 30న అయోధ్యలో రోడ్ షో నిర్వహించారు. ఇప్పుడు 22న రామమందిరాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య వస్తున్నారు. ఈ నేపధ్యంలో నాటి మోదీ ప్రతిజ్ఞ చర్చల్లో నిలిచింది. ఇది కూడా చదవండి: ఆ రెండు విగ్రహాలను ఏం చేయనున్నారు? -
అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠకు శరద్ పవార్ దూరం
ముంబయి: అయోధ్య రామ మందిరంలో జనవరి 22న జరిగే ప్రతిష్ఠాపన కార్యక్రమానికి తాను హాజరు కావడం లేదని ప్రముఖ రాజకీయ నాయకుడు శరద్ పవార్ తెలిపారు. ఆహ్వానం పంపించినందుకు రామమందిరం ట్రస్టుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణప్రతిష్ఠకు పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు వస్తున్నందున దర్శనం పొందడం సులభం కాదని అన్నారు. జనవరి 22 తర్వాత దర్శనం పొందడం సులభం అవుతుందని ఆయన చెప్పారు. త్వరలో అయోధ్యను దర్శిస్తానని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి, భక్తికి రాముడు ప్రతీక అని శరద్ పవార్ అన్నారు. "అయోధ్యలో జరిగే కార్యక్రమం కోసం రామభక్తులలో విపరీతమైన ఉత్సాహం ఉంది. వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. ఈ చారిత్రాత్మక సందర్భం నాకు ఆనందాన్నిస్తోంది. జనవరి 22 ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత దర్శనం పొందడం సులభం అవుతుంది" అని శరద్ పవార్ ఓ ప్రకటనలో తెలిపారు. అయోధ్య రామున్ని త్వరలో ప్రార్థిస్తానని శరద్ పవార్ పేర్కొన్నారు. అప్పటికి రామమందిర నిర్మాణం కూడా పూర్తవుతుందని చెప్పారు. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. జనవరి 16 నుంచే ప్రాణప్రతిష్ఠకు జరగాల్సిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రజాప్రతినిధులతో సహా సెలబ్రిటీలకు కూడా ఆహ్వానాలు అందాయి. జనవరి 23 నుంచి రామాలయాన్ని సాధారణ భక్తుల దర్శనం కోసం తెరవనున్నారు. ఇదీ చదవండి: Lata Mangeshkar: లతా మంగేష్కర్ ఆఖరి రామ శ్లోకాన్ని షేర్ చేసిన ప్రధాని మోదీ! -
లతా మంగేష్కర్ ఆఖరి రామ శ్లోకాన్ని షేర్ చేసిన ప్రధాని మోదీ!
అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జనవరి 22న అభిజీత్ లగ్నంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమం పలువురు ప్రముఖుల సమక్షంలో జరగనుంది. ప్రముఖ బాలీవుడ్ నటులు, గాయకులు, దర్శకులు, కళాకారులను ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ ఆహ్వానించారు. ప్రధాని మోదీ తన ట్విట్టర్ హ్యాండిల్లో అయోధ్యకు సంబంధించిన అప్డేట్లను తరచూ షేర్ చేస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ గాయని లతామంగేష్కర్కు సంబంధించిన ఒక వీడియోను ‘ఎక్స్’ సోషల్ మీడియా ప్లాట్ఫారంలో షేర్ చేశారు. అయోధ్యలో జరగబోయే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో గాయని లతా మంగేష్కర్ను మిస్ కావడం విచారకరమని అన్నారు. As the nation awaits 22nd January with great enthusiasm, one of the people who will be missed is our beloved Lata Didi. Here is a Shlok she sung. Her family told me that it was the last Shlok she recorded. #ShriRamBhajanhttps://t.co/MHlliiABVX — Narendra Modi (@narendramodi) January 17, 2024 లతా మంగేష్కర్ కీర్తనలలో ఒకదానిని ‘ఎక్స్’లో షేర్ చేసిన ప్రధాని.. ఇది లతా మంగేష్కర్ పాడగా, రికార్డ్ చేసిన చివరి శ్రీరాముని శ్లోకమని తెలిపారు. ఈ శ్లోకం పేరు ‘శ్రీ రామ్ అర్పణ్’. దీనిలో లతా మంగేష్కర్ మధురమైన గాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇది కూడా చదవండి: నాలుగేళ్లలో పదింతల అభివృద్ధి! -
రూ.500నోట్లపై శ్రీరాముడి చిత్రం.. వైరల్
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం మొదలు సోషల్ మీడియాలో ప్రతీ వార్త సంచలనంగా మారుతోంది. ఈ క్రమంలో కొన్ని తప్పుడు వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శ్రీరాముడి చిత్రాలతో కూడిన రూ.500 నోటును విడుదల చేయనుందనే వార్త వైరల్గా మారింది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం, శ్రీరాముడి చిత్రాలతో పాటు రూ.500 నోటు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం రూ.500 నోటుపై జాతిపిత మహాత్మాగాంధీ చిత్రం ఉండే ప్లేస్లో శ్రీరాముడు ఫోటో ఉన్న నోట్లు ట్రెండింగ్లోకి వచ్చాయి. దీంతో పలువురు రామభక్తులు జై శ్రీరామ్ అంటూ తెగ ఆనంద పడిపోతున్నారు. జనవరి 22, 2024న శ్రీరాముడి చిత్రాలతో కూడిన రూ.500 నోట్ల కొత్త సిరీస్ను విడుదల చేయబోతోందని, నోటుకు వెనుకవైపు ఎర్రకోట స్థానంలో అయోధ్య ఆలయ ఫోటోను ఆర్బీఐ పొందు పరుస్తోందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇది ఫేక్ న్యూస్ అంటూ బ్యాంకింగ్ రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. కొత్త నోటుకు సంబంధించి ఆర్బీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదని, ఇలాంటి వాటిని నమ్మవద్దని సూచిస్తున్నారు. Just heard that new 500 Rupees note would be issued on 22nd Jan .. if that’s true it will be a dream come true .. Jai Shree Ram 🙏🌺❤️ pic.twitter.com/Sye3oGpaR3 — 🇮🇳Surya Prakash ☀️🌞🔆🇮🇳 🇺🇸 (@i_desi_surya) January 16, 2024 కాగా జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తారు. ప్రముఖ క్రికెటర్లు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు హాజరుకాన్నారు. ప్రధాని మోదీ సమక్షంలో 'అభిజిత్ ముహూర్తం'లో విగ్రహ ప్రతిష్ఠాపనకు మరికొంతమంది కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ఇప్పటికే ఆహ్వానాలు కూడా అందుకున్న సంగతి తెలిసిందే.