Ram janmabhoomi temple
-
అయోధ్యలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
శ్రీరాముడు జగదానందకారకుడు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన ఆలయంలో కొలువైన రామ్లల్లా దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. ఆలయ గర్భగుడిలో రామ్లల్లా ప్రతిష్ఠాపన జరిగి వారం రోజులు దాటినా భక్తుల రద్దీ నిరంతరం కొనసాగుతూనే ఉంది. రామ్లల్లాను తనివితీరా దర్శించాలనే కోరిక అయోధ్యకు వచ్చే ప్రతీ ఒక్కరిలోనూ కనిపిస్తోంది. తీవ్రమైన చలి గజగజా వణికిస్తున్నా భక్తులు రామ్లల్లా దర్శనం కోసం బారులు తీరుతున్నారు. పిల్లలు, పెద్దలు, ముఖ్యంగా యువత శ్రీరాముని దర్శించుకునేందుకు అమితమైన ఆసక్తి కనబరుస్తోంది. అయోధ్యకు వచ్చే భక్తుల కోసం పలు సేవా సంస్థలు వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రామ్పథ్ తదితర మార్గాల నుంచి వస్తున్న భక్తుల కోసం ఉచిత భోజనశాలలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రామ్లల్లా సందర్శకుల కోసం నిర్మించిన టెంట్ సిటీని ప్రారంభించారు. దీనిలో 25 వేల మంది భక్తులు బస చేసేందుకు అవకాశం ఉంది. ఈ టెంట్ సిటీలోనూ ఉచిత భోజనశాలలు ఏర్పాటు చేశారు. -
రామ్లల్లా దర్శన సమయాల్లో మార్పులు
అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముడు కొలువైన అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. లక్షలాది మంది భక్తులు బాలరాముని దర్శనం చేసుకునేందుకు అర్థరాత్రి నుండే గజగజ వణికిస్తున్న చలిలో సైతం క్యూలలలో వేచివుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. అధిక సంఖ్యలో భక్తులు రామ్లల్లాను చూసేందుకు, పూజలు చేసేందుకు అవకాశాన్ని కల్పించాలని ట్రస్ట్ దర్శన సమయాల్లో మార్పులు చేసింది. ఈ సమాచారాన్ని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) మీడియాకు అందించింది. ఇది కూడా చదవండి: అయోధ్య రామ భక్తులకు శుభవార్త విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి మాట్లాడుతూ రామ భక్తులకు ఇకపై దర్శనానికి మరో గంట సమయం అదనంగా లభిస్తుందన్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు రామ్లల్లా హారతి, దర్శనం కోసం విడుదల చేసిన షెడ్యూల్ వివరాలు.. మంగళ హారతి: ఉదయం 4.30 గంటలకు ఉత్థాన్ హారతి : ఉదయం 6.30 గంటలకు దర్శనం: ఉదయం 7 గంటల నుంచి భోగ్ హారతి: మధ్యాహ్నం 12 గంటలకు సాయంత్రం హారతి: 7.30 గంటలకు రాత్రి భోగ్ హారతి: 9 గంటలకు శయన హారతి: రాత్రి 10 గంటలకు -
అయోధ్య రామ భక్తులకు శుభవార్త
దేశంలోని రామభక్తుల కల నెరవేరింది. అయోధ్యలో రామాలయం నిర్మితమయ్యింది. లక్షలాది భక్తులు రాములోరిని చూసేందుకు తరలివస్తున్నారు. అయితే వారు అక్కడ సరైన వసతి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇకపై ఇటువంటి సమస్యలకు ఫుల్స్టాప్ పడనుంది. అయోధ్య ధామ్లో భక్తుల కోసం 158 కొత్త హోటళ్లను నిర్మించేందుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ హోటళ్లను వీలైనంత త్వరగా నిర్మించనున్నారని సమాచారం. ఈ ఏడాది ఎనిమిది వేల గదులు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతానికి పర్యాటకులకు 175 హోటళ్లు, అతిథి గృహాలు, డేరా సిటీలలో 30 వేల మంది భక్తులకు బస చేసేందుకు ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే రిజిస్టర్ అయిన 158 కొత్త హోటళ్ల నిర్మాణం పూర్తయ్యాక అయోధ్య ధామ్లోని హోటళ్లు, అతిథి గృహాల సంఖ్య 333కి పెరగనుంది. ఇది కూడా చదవండి: తొలిరోజు విరాళాలు రూ.3.17 కోట్లు! యూపీ పర్యాటక మంత్రిత్వ శాఖ అయోధ్యలో నిర్మిస్తున్న హోటళ్లను కాంస్య (ఒక నక్షత్రం), వెండి (రెండు నక్షత్రాలు), బంగారం (త్రీ స్టార్), డైమండ్ (నాలుగు నక్షత్రాలు), ప్లాటినం (ఫైవ్ స్టార్)గా వర్గీకరించే సదుపాయాన్ని కూడా కల్పించింది. కొత్త టూరిజం పాలసీ ప్రకారం నూతనంగా నిర్మితమవుతున్న ఈ హోటళ్లకు ఇంటి పన్ను, నీటి పన్ను, ఇతర పన్నుల్లో 50 శాతం వరకు రాయితీని ప్రభుత్వం అందిస్తోంది. జనరల్ కేటగిరీకి 25 శాతం, మహిళలు, షెడ్యూల్డ్ కులాలకు 30 శాతం సబ్సిడీ కల్పిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ హోటళ్ల నిర్మాణం పూర్తికానున్నదని యూపీ పర్యాటక శాఖ మంత్రి జైవీర్ తెలిపారు. -
తొలిరోజు విరాళాలు రూ.3.17 కోట్లు!.. మూడో రోజు సజావుగా దర్శనాలు!
అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైన రెండవరోజున(బుధవారం) దాదాపు 2.5 లక్షల మంది భక్తులు దర్శనానికి తరలివచ్చారు. మంగళవారం(తొలిరోజు) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేపట్టిన ఆకస్మిక పర్యటన, సూచనల ప్రభావం బుధవారం కనిపించింది. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తాజాగా యాత్రికుల సౌకర్య కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. బాలక్ రాముని దర్శనాలు ప్రారంభమై నేటికి (గురువారం) మూడో రోజు. మొదటి రెండు రోజులు భక్తుల రద్దీతో అనేక ఇబ్బుందులు తలెత్తాయి. ఈ నేపద్యంలో ట్రస్ట్ పలు చర్యలు చేపట్టడంతో ప్రస్తుతం ఆలయంలో భక్తుల దర్శనాలు క్రమపద్ధతిలో సాగుతున్నాయి. రామభక్తుల దర్శనాలు నిరంతరం కొనసాగుతున్నాయి. బాలరాములోరికి భక్తులు కానుకలు, విరాళాలు విరివిగా సమర్పిస్తున్నారు. ఇది కూడా చదవండి: కొనసాగుతున్న భక్తుల వరద ప్రాణప్రతిష్ఠ జరిగినంతనే ఐదేళ్ల బాలరాముడు కోటీశ్వరునిగా మారిపోయాడు. తొలిరోజు శ్రీరాముని దర్శనానికి వచ్చిన భక్తులు రూ.3.17 కోట్ల విరాళాలను సమర్పించారని ట్రస్ట్ తెలిపింది. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ అనంతరం మంగళవారం ఆలయంలోకి సామాన్య భక్తుల ప్రవేశానికి అనుమతి కల్పించారు. రామాలయానికి వచ్చిన సందర్శకుల సంఖ్యకు సంబంధించి గతంలో ఉన్న రికార్డులన్నీ బద్దలయ్యాయి. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో దర్శనం కోసం వారు నానా అవస్థలు పడ్డారు. రాములోరి దర్శనం కోసం వచ్చిన భక్తులు విరాళాలు సమర్పించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధి డాక్టర్ అనిల్ మిశ్రా మాట్లాడుతూ మంగళవారం ఆలయానికి అత్యధిక విరాళాలు అందాయి. ఆన్లైన్లో విరాళాలు అందించడానికి రామభక్తులు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. విరాళాల కోసం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి, పలువురు భక్తులు విరాళాలు అందించారన్నారు. కాగా అయోధ్యకు తరలివచ్చే భక్తులు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారిక వెబ్సైట్ ద్వారా విరాళాలు అందించవచ్చు. ఆలయంలోని హుండీలలో కూడా విరాళాలు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. -
తొలి రోజు రాములోరి నిద్ర 15 నిముషాలే!
అయోధ్య నగరి త్రేతాయుగాన్ని తలపిస్తోంది. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడు రాజభవనంలో ఆశీనులు కాగా, లక్షలాది మంది రామభక్తులు ఆయన దర్శనం కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అయోధ్యలో ఎక్కడ చూసినా కాషాయ వస్త్రాలు, కాషాయ జెండాలు కనిపిస్తున్నాయి. అంతటా జై శ్రీరామ్ నినాదాలు వినిపిస్తున్నాయి. బాలరాముడు అద్భుతమైన భవనంలో కూర్చుని, భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. తొలిరోజు రామ్లల్లా దినచర్య ఎలా గడిచిందంటే.. నూతన రామాలయంలో శ్రీరాముడు ఐదేళ్ల చిన్నారి రూపంలో కొలువయ్యాడు. రామనంది సంప్రదాయం ప్రకారం బాలరామునికి సేవలు, పూజలు జరుగుతున్నాయి. రోజంతా బాలరామునికి ఐదు హారతులు అందిస్తున్నారు. అలాగే నైవేద్యాలు సమర్పిస్తున్నారు. తొలిరోజు రామ్లల్లా రెండు గంటలపాటు కూడా గంటలు నిద్రపోలేదు. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులకు నిరంతరం దర్శనం ఇస్తూనే ఉన్నాడు. కేవలం 15 నిముషాలు మాత్రమే రామ్లల్లా నిదురించాడు. అనంతరం దర్శన ద్వారాలు తెరుచుకున్నాయి. రామమందిరం ప్రధాన పూజారి ఆచార్ సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ ‘రాముడు తన భవ్యమైన భవనంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు. త్రేతాయుగం మళ్లీ ప్రారంభమైనట్లుంది. ఐదేళ్ల రూపంలోని బాలరాముని విగ్రహం చూడగానే ఉప్పొంగిపోయాను. తొలిరోజు బాలరాముడు రెండు గంటలపాటు నిద్రించాల్సి ఉండగా, భక్తుల రద్దీ దృష్ట్యా కేవలం 15 నిమిషాల తర్వాత ఆలయ తలుపులు తెరవాల్సి వచ్చింది. లక్షలాది మంది రామభక్తులు నిరంతరం బాలరాముని సందర్శించుకుంటున్నారు’ అని అన్నారు. -
అయోధ్యలో మరో 13 నూతన ఆలయాలు
అయోధ్యలోని శ్రీరాముని ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. బాలరాముని దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు క్యూ కడుతున్నారు. అయోధ్యను ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశంగా మార్చేందుకు కేంద్ర, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయోధ్యను ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందుతున్నాయి. దీనిలో భాగంగా 13 నూతన ఆలయాలను నిర్మించనున్నారు. వీటిలోని ఆరు ఆలయాలు ప్రధాన మందిర సముదాయం లోపల, ఏడు ఆలయాలు వెలుపల నిర్మితం కానున్నాయి. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి స్వామి గురుదేవ్ గిరీజీ ఈ ప్రణాళిక గురించి తెలియజేశారు. ప్రధాన ఆలయాన్ని పూర్తి చేసే పనులతో సహా అన్ని ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. ప్రధాన ఆలయంలో మొదటి అంతస్తు వరకూ మాత్రమే నిర్మాణం పూర్తయ్యిందని, రెండో అంతస్తు పనులు జరుగుతున్నాయని, అనంతరం శిఖరం, మధ్య గోపురం పనులు జరగాల్సి ఉందని గిరీజీ వివరించారు. రాముని కుటుంబానికి చెందిన ఐదు ప్రధాన ఆలయాల పనులు కొనసాగుతున్నాయని, రాముడు స్వయంగా విష్ణువు అవతారం అయినందున గణపతి, శివుడు, సూర్య దేవుడు, జగదంబ ఆలయాలు కూడా నిర్మితం కానున్నాయని తెలిపారు. ప్రధాన ఆలయానికి నలు మూలల్లో ఈ ఆలయాలు ఉండనున్నాయి. హనుమంతునికి ప్రత్యేక ఆలయం కూడా నిర్మితం కానుంది. ఇప్పటికే ఈ ఆలయాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సీతా రసోయి సమీపంలో అన్నపూర్ణ దేవి ఆలయం నిర్మితం కానుంది. ఆలయ సముదాయం వెలుపల వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, శబరి, జటాయువు తదితర ఆలయాలు నిర్మించనున్నారు. -
Ayodhya: బాలక్ రామ్ కోసం.. రెండో రోజూ అవే దృశ్యాలు
అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట అనంతరం రెండో రోజు.. నేడు (బుధవారం) బాలక్ రామ్ దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు అంటే (నిన్న) మంగళవారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు ఆలయాన్ని ఉదయం ఏడు గంటలకు తెరవనుండగా, తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులు బారులు తీరారు. ప్రాణ ప్రతిష్ట జరిగిన మర్నాడు అంటే మంగళవారం ఐదు లక్షల మంది భక్తులు బాలరాముని దర్శనం చేసుకున్నారు. రాత్రి 9 గంటల వరకు భక్తులు శ్రీరాముని దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించారు. భద్రతా ఏర్పాట్లు సజావుగా సాగేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా మంగళవారం సాయంత్రం అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్యకు తరలివస్తున్న భక్తులు బాలరాముని దర్శనం కోసం ఓపిక పట్టాలని సీఎం కోరారు. #WATCH | Ayodhya, Uttar Pradesh: On the second day after the Pran Pratishtha, devotees gather in huge numbers at Rampath to have darshan of Shri Ram Lalla pic.twitter.com/JMI3AvYPca — ANI (@ANI) January 24, 2024 ఇకపై రామాలయంలో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిరంతర దర్శనం ఉంటుందని జిల్లా యంత్రాంగం, శ్రీరామజన్మభూమి ట్రస్టు తెలిపింది. అయితే హారతి, భోగం కోసం సమయంలో దర్శనాన్ని కొద్దిసేపు నిలిపివేస్తున్నట్లు ట్రస్టు పేర్కొంది. ప్రాణ ప్రతిష్ట అనంతరం సామాన్య భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించగా, తొలిరోజైన మంగళవారం నాడు ఐడు లక్షల మందికిపైగా భక్తులు తమ బాలరాముని దర్శించుకున్నారు. నేడు (బుధవారం) ఉదయం ఇప్పటికే 20 వేల మందికి పైగా భక్తులు దర్శనం కోసం క్యూలో ఉన్నారు. నేటి ఉదయం ప్రవేశ ద్వారం వెలుపల కిలోమీటరుకు పైగా భక్తుల క్యూలు కనిపించాయి. ఈ నేపధ్యంలో పోలీసులు, ఆలయ నిర్వాహకులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. -
తొలుత ఎంపిక చేసిన విగ్రహం ఇదే..
పుణ్యక్షేత్రమైన అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమయ్యింది. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. రామ మందిరంలో కొలువైన బాలరాముడు భక్తులను మైమరపిస్తున్నాడు. రామ్లల్లా విగ్రహంలోని కళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గర్భాలయంలో ప్రతిష్ఠంచేందుకు విగ్రహాల తయారీని తొలుత ముగ్గురు శిల్పకారులకు అప్పగించారు. తరువాత ఆలయంలో ప్రతిష్ఠాపనకు రెండు విగ్రహాలను ఎంపిక చేశారు. అయితే చివరకు మైసూర్కు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ నివాసి సత్యనారాయణ పాండే శిల్ప కళాకారునిగా ఎంతో పేరొందారు. తరతరాలుగా వారి కుటుంబం విగ్రహాలను తయారు చేస్తోంది. సత్యనారాయణ పాండే రామ్లల్లా విగ్రహాన్ని తెల్లని మక్రానా పాలరాయితో తీర్చిదిద్దారు. తొలుత ఈ విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని ట్రస్ట్ భావించిందట. ఈ విగ్రహం ప్రస్తుతం ట్రస్ట్ ఆధీనంలో ఉంది. దీనిని ఎక్కడ? ఎప్పుడు ప్రతిష్ఠించేదీ ట్రస్ట్ త్వరలో వెల్లడించనుంది. జనవరి 22న అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. అనంతరం రామమందిరం తలుపులు సామాన్య భక్తుల కోసం తెరిచారు. ఈ నేపధ్యంలో శ్రీరాముని దర్శనం కోసం దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. -
ప్రాణ ప్రతిష్ఠ వేళ.. సీతారాముల జననం!
అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ రోజున నెలలు నిండిన పలువురు గర్భిణులు శిశువులకు జన్మనిచ్చేందుకు ప్లాన్ చేసుకుని, వైద్యుల సాయంతో డెలివరీలు చేయించుకున్నారు. ఈ సమయంలో పుట్టిన చిన్నారులకు అబ్బాయి అయితే రాముడు అని, అమ్మాయి అయితే సీత అని పేరు పెట్టారు. ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్లోని జిల్లా మహిళా ఆసుపత్రిలో సోమవారం 13 మంది శిశువులు జన్మించారు. వీరిలో ఎనిమిది మంది నార్మల్ కాన్పులో జన్మించగా, ఐదుగురు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా జన్మించారు. జనవరి 22న తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జిల్లా మహిళా ఆస్పత్రిలో మొదటి శిశువు జన్మించింది. బర్కచ్చా ఖుర్ద్లో నివాసం ఉంటున్న లక్ష్మణ్ భార్య అంజలి బాలికకు జన్మనిచ్చింది. తన కుమార్తెకు సీత లేదా జానకి అని పేరు పెడతానని ఆమె తెలిపింది. 22న తెల్లవారుజామున 3.20 గంటలకు, లాల్గంజ్లోని బర్దిహా నివాసి అమిత్ మిశ్రా భార్య ప్రీతి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి రామ్ లేదా రాఘవ్ అనే పేరు పెట్టాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు శుక్లహా నివాసి బాబుల్ సోంకర్ భార్య పుతుల్ బాలునికి జన్మనిచ్చింది. ఆటోడ్రైవర్ బాబుల్ తనకు అప్పటికే ఓ కొడుకు ఉన్నాడని, ఇప్పుడు జన్మించిన కుమారునికి రామ్ అని పేరు పెట్టనున్నామన్నారు. మిర్జాపూర్కు చెందిన ప్రీతి తెల్లవారుజామున 4.24 గంటలకు, మంజు 11.45 గంటలకు ఆడ శిశువులకు జన్మనిచ్చారు. లాల్గంజ్ మార్కెట్కు చెందిన అన్షు మిశ్రా ఉదయం 11.55 గంటలకు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా మగ శిశువుకు జన్మనిచ్చింది. జిల్లా మహిళా ఆసుపత్రి ప్రసూతి విభాగం వైద్యురాలు జూహీ దేశ్ పాండే మాట్లాడుతూ 22న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఎనిమిది మంది మగ శిశువులు, ఐదుగురు ఆడ శిశువులు జన్మించారని తెలిపారు. ఇది కూడా చదవండి: సామాన్యులకు తెరుచుకున్న రామాలయం.. భక్తుల భారీ క్యూ! -
Ayodhya: అయోధ్యకు తొలిరోజు పోటెత్తిన భక్తులు
అయోధ్య రామాలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. దీంతో నేటి నుంచి సామాన్య భక్తులకు రాములవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం(మంగళవారం) మూడు గంటల నుంచే రామాలయ ప్రధాన ద్వారం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. నేటి నుంచి సామాన్య భక్తులు రాములవారి నూతన విగ్రహాన్ని దర్శించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే భక్తుల్ని నిర్వాహకులు అనుమతిస్తున్నారు. మరోవైపు ఆలయం బయట భారీగా భక్తుల రద్దీ కనిపిస్తోంది. దీంతో అవసరమైతే స్వామివారి దర్శన సమయాన్ని పొడిగించాలని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ యోచిస్తోంది. #WATCH | Ayodhya, Uttar Pradesh: Devotees gather in large numbers at Shri Ram temple on the first day after the Pran Pratishtha ceremony pic.twitter.com/EGo9yr9sXS — ANI (@ANI) January 23, 2024 కాగా రామ్ లల్లా దర్శనం కోసం రెండు స్లాట్లు కేటాయిస్తున్నట్లు నిన్ననే ట్రస్ట్ ప్రకటించింది. ఉదయం 7గం. నుంచి 11.30 వరకు.. అలాగే.. మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 7 గం. వరకు రెండు దఫాలుగా భక్తులను అనుమతిస్తామని ప్రకటించారు. నిత్యపూజలు-సేవలు ఇలా.. ఇక ప్రతీరోజూ మధ్యాహ్నం బాలరామునికి బోగ్ అందించనున్నారు. అలాగే ప్రతి గంటకు పాలు, పండ్లు అందిస్తారు. రామ్లల్లాకు సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం క్రీమ్, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు దుస్తులను ధరింపజేస్తారు. ప్రత్యేక రోజుల్లో రాములోరికి పసుపు రంగు దుస్తులు ధరింపజేస్తారు. రామ్లల్లాకు రోజుకు ఆరుసార్లు హారతి నిర్వహిస్తారు. దీనికి హాజరయ్యేందుకు భక్తులకు పాస్లు జారీ చేస్తారు. ఇప్పటి వరకు రామ్లల్లాకు రోజుకు రెండు హారతులు ఉండేవి. ఇకపై రోజుకు ఆరు హారతులు ఉంటాయని ఆచార్య మిథిలేష్ నందిని శరణ్ తెలిపారు. 👉: అయోధ్య రామ్ లల్లా దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం (ఫొటోలు) -
భావోద్వేగంలో ఉమా భారతి, సాధ్వి రితంభర
నాటి రామమందిర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన ఉమాభారతి, సాధ్వి రితంభర అయోధ్యలో భాద్వేగానికి లోనయ్యారు. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన బీజేపీ నాయకురాలు ఉమాభారతి, సాధ్వి రితంభర భావోద్వేగంతో ఒకరినొకరు కావలించుకున్నారు. నాటి అయోధ్య ఉద్యమ పోరాటాలను గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘ఈ సమయంలో మాటలు లేవు.. భావాలు మాత్రమే కదలాడుతున్నాయి’ అని అన్నారు. పరమ శక్తి పీఠం వ్యవస్థాపకురాలు సాధ్వి రితంభర మాట్లాడుతూ ‘ప్రాణ ప్రతిష్ఠ’ శుభ ఘడియ ఇది.. యావత్ దేశం, యావత్ ప్రపంచం శోభాయమానంగా మారింది. కరసేవకుల త్యాగం అర్థవంతమైంది. రామ్లల్లా మనల్ని అనుగ్రహించేందుకు వచ్చాడు’ అని అన్నారు. ఇది కూడా చదవండి: మారిషస్ నుంచి డెన్మార్క్ ... అంతా రామమయం! #WATCH | Ayodhya, UP: On Ram Temple 'pran pratishtha', Sadhvi Ritambhara, Founder of Param Shakti Peeth and Vatsalyagram, says, " This is the happy hour of 'pran pratishtha', whole Country and the whole world have been decorated...kar sevaks' sacrifices have become… pic.twitter.com/vLp6ORtabZ — ANI (@ANI) January 21, 2024 -
హారతి వేళ.. హెలికాప్టర్ నుంచి పూలవాన!
మరికొద్ది సేపట్లో అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ సందర్భంగా రాములోరికి హారతులు పట్టే సమయాన ఆలయంపై ఆర్మీ హెలికాప్టర్లు పూల వర్షం కురిపించనున్నాయి. బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా 30 మంది కళాకారులు తమ సంగీత ప్రతిభను చాటనున్నారు. హారతి సమయంలో అతిథులంతా గంటలు మోగించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రామాలయంలోనికి ప్రధాని నరేంద్ర మోదీ అడుగిడనున్నారు. ఈ చారిత్రాత్మక ఉత్సవంలో దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థలు, ఆలయ ప్రతినిధులు భాగస్వాములు కానున్నారు. కార్యక్రమం అనంతరం ప్రధాని ప్రసంగించనున్నారు. మొత్తం 121 మంది ఆచార్యుల ఆధ్వర్యంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి సమక్షంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇది కూడా చదవండి: ప్రాణప్రతిష్ఠకు అద్వానీ, జోషి దూరం? -
ప్రాణప్రతిష్ఠకు అద్వానీ, జోషి దూరం?
అయోధ్యలో నేడు జరిగే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి హాజరకావడంలేదంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. తీవ్రమైన చలి వాతావరణం కారణంగా అద్వాని అయోధ్యకు వెళ్లడం లేదని సమాచారం. రామమందిర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన లాల్ కృష్ణ అద్వానీతో పాటు బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి కూడా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకావడం లేదని తెలుస్తోంది. పెరుగుతున్న వయస్సు, ఆరోగ్య సంబంధిత సమస్యల దృష్ట్యా ఈ సీనియర్ నేతలిద్దరూ బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి లాల్ కృష్ణ అద్వానీ 90వ దశకంలో రామమందిర ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన నేతృత్వంలో 1990లో గుజరాత్లోని సోమనాథ్ నుంచి బీజేపీ రథయాత్రను ప్రారంభించింది. ‘మందిర్ వహీ బనాయేంగే’ నినాదంతో లాల్ కృష్ణ అద్వానీ రామమందిర ఉద్యమాన్ని సామాన్య ప్రజలలోకి తీసుకెళ్లారు. విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్తో పాటు ఇతర ప్రముఖులు స్వయంగా ఎల్కె అద్వానీ ఇంటికివెళ్లి, శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇది కూడా చదవండి: మారిషస్ నుంచి డెన్మార్క్ ... అంతా రామమయం! రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ‘96 ఏళ్ల వయస్సులో ఉన్న లాల్కృష్ణ అద్వానీ,90 ఏళ్ల వయస్సు కలిగిన మురళీ మనోహర్ జోషిలను ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించాం. అయితే వారు వయస్సు, అనారోగ్య కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమానికి హాజరుకాలేని స్థితిలో ఉన్నారని’ తెలిపారు. -
ప్రాణప్రతిష్ఠకు ముందు ఇంటిలో సీఎం యోగి పూజలు!
అయోధ్య రామాలయంలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన గురువులను స్మరించుకుని, పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన సోషల్ మీడియా సైట్లో షేర్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇలా రాశారు.. 'అయోధ్యధామ్లోని శ్రీరాముడి జన్మస్థలంలో నేడు జరుగుతున్న రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం శతాబ్ధాల పోరాట ఫలితం. ఈ సందర్భంగా దిగ్విజయ్నాథ్ మహరాజ్, మహంత్ అవేద్యనాథ్ మహారాజ్లకు ఉద్వేగభరితమైన నివాళులు అర్పిస్తున్నాను.. జై జై శ్రీ రామ్!’ అని రాశారు. श्री अयोध्या धाम में श्रीराम जन्मभूमि पर आज हो रही प्रभु श्री रामलला के नूतन विग्रह की प्राण-प्रतिष्ठा से पीढ़ियों का संघर्ष एवं सदियों का संकल्प पूर्ण हुआ है। इस अवसर पर युगपुरुष ब्रह्मलीन महंत दिग्विजयनाथ जी महाराज और राष्ट्रसंत ब्रह्मलीन महंत अवेद्यनाथ जी महाराज के प्रति… pic.twitter.com/slW5UjNUoC — Yogi Adityanath (@myogiadityanath) January 22, 2024 సీఎం యోగి మరో ట్వీట్లో ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు... ‘ఇది అద్భుతమైన, మరపురాని, అతీంద్రియ క్షణం.. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో శ్రీరాముని పవిత్ర జన్మస్థలమైన అయోధ్యధామ్లో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. నేడు ప్రధాని నేతృత్వంలో అసంఖ్యాక రామభక్తుల నిరీక్షణకు తెరపడనుంది. భక్తి సాగరంలో మునిగిన దేశమంతా రామనామం స్మరిస్తోంది’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు లండన్ సాధ్విల బృందం! -
నేడు అయోధ్యలో ఏ సమయానికి ఏం జరగనుంది?
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో మరికొద్ది సేపట్లో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన 16 ఆచారాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు అయోధ్యలో ఏడంచెల భద్రత కల్పించారు. ఎస్పీజీ, ఎన్ఎస్జీ కమాండోలను అయోధ్య అంతటా మోహరించారు. డ్రోన్లతో అయోధ్య అంతటా నిఘా కొనసాగుతోంది. నేడు అయోధ్యకు మొత్తం 7,140 మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ రోజు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠతో పాటు జరిగే కార్యక్రమాల వివరాలివే.. దేవకినందన్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీరామ కథా పారాయణం. అయోధ్యలో ప్రముఖంగా వెలుగొందుతున్న వంద ప్రదేశాలలో ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంస్కృతిక ఊరేగింపు. యూపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1500 మంది జానపద నృత్య కళాకారుల ప్రదర్శనలు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రాంతీయ సాంస్కృతిక కేంద్రాలకు చెందిన 200 మంది కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు. రామకథా పార్కులో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు రాంలీలా ప్రదర్శన. సాయంత్రం 6.30 నుండి 7 గంటల వరకు శ్రీరామునికి సరయూ హారతి. రాత్రి 7 నుంచి 7.30 వరకు రామ్ కి పైడిపై ప్రొజెక్షన్ షో. రామకథా పార్కులో రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాటేకర్ సిస్టర్స్ సారధ్యంలో రామకథా గానం. తులసీ ఉద్యానవనంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శర్మ బంధుచే భజన కార్యక్రమం రాత్రి 7.45 నుండి 7.55 వరకు రామ్ కీ పైడి వద్ద బాణసంచా కాల్చడం. కన్హయ్య మిట్టల్ సారధ్యంలో రామకథా పార్క్ వద్ద రాత్రి 8 నుండి 9 గంటల వరకు భక్తి సాంస్కృతిక కార్యక్రమం. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు తులసి ఉద్యానవనంలో రఘువీర పద్మశ్రీ మాలినీ అవస్థి సారధ్యంలో ప్రత్యేక కార్యక్రమం. #WATCH | Ayodhya, Uttar Pradesh: Morning visuals from Ram Janmabhoomi premises ahead of the Pran Pratishtha ceremony of Ram Temple, today. pic.twitter.com/qIRiYVgnei — ANI (@ANI) January 22, 2024 నూతన రామాలయంలో నేటి మధ్యాహ్నం 12:29:08 గంటల నుంచి 12:30:32 గంటల వరకు.. అంటే 84 సెకన్ల కాలంలో గర్భగుడిలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ నేపధ్యంలో ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఓర్చాలో 5100 మట్టి దీపాలను వెలిగించారు. -
మారిషస్ నుంచి డెన్మార్క్ ... అంతా రామమయం!
అయోధ్యలోని నూతన రామాలయంలో నేడు బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న నేపధ్యంలో దేశం మొత్తం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. అయోధ్యలో మారుమోగుతున్న హర్షధ్వానాల ధ్వని ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రామభక్తులు బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగే అద్భుత క్షణాల కోసం ఎదురుచూస్తున్నారు. హిందువులే కాదు ఇతర మతాల వారు కూడా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసేందుకు అమితమైన ఉత్సాహం చూపిస్తున్నారు. 50కి పైగా దేశాలలో వివిధ మాధ్యమాల సాయంతో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకను చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. లండన్ వీధుల్లో జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటుతుండగా, బ్రిటన్లో నిర్వహించిన కారు ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ దేశంలోని సుమారు 250 దేవాలయాల్లో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నేపాల్లో.. నేపాల్లోని జనక్పూర్లో గల జానకీమాత ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. జనక్పూర్ మేయర్ మనోజ్ కుమార్ సాహా.. బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భారతదేశ ప్రజలకు, ముఖ్యంగా అయోధ్యవాసులకు శుభాకాంక్షలు తెలిపారు నేపాల్కు భారత్తో సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. శ్రీరాముని అత్తమామల స్వస్థలం అయిన జనక్పూర్లో నేడు దీపోత్సవం జరగనుంది. ఇది కూడా చదవండి: అయోధ్యకు ఎలా వెళ్లాలి? దర్శనానికి ఏం చేయాలి? కెనడాలో.. కెనడాలోని అంటారియో పరిధిలోగల ఓక్విల్లే, బ్రాంప్టన్ నగరాల్లో నేటి రోజును ‘అయోధ్య రామ మందిర దినోత్సవం’గా ప్రకటించాయి. బ్రాంప్టన్ మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్, ఓక్విల్లే మేయర్ రాబ్ బర్టన్ మాట్లాడుతూ అయోధ్యలో జరిగే శ్రీరామ మందిర ప్రారంభోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు సాంస్కృతికంగా, చారిత్మాకంగా ఎంతో ముఖ్యమైనదని అన్నారు. శతాబ్దాల నాటి కల సాకరమయ్యిందని మేయర్లిద్దరూ పేర్కొన్నారు. మారిషస్లో.. ద్వీప దేశమైన మారిషస్లోని అన్ని దేవాలయాలు ‘ప్రాణప్రతిష్ఠ’ సందర్బంగా దీపాలతో వెలుగులు పంచనున్నాయి. 48 శాతం హిందూ జనాభా ఉన్న మారిషస్లోని అన్ని దేవాలయాల్లో రామాయణ పారాయణం జరగనున్నది. హైకమిషనర్ హేమండోయిల్ దిలామ్ మాట్లాడుతూ ఈ ఉత్సవం భారతదేశానికే కాకుండా మారిషస్ ప్రజలకు కూడా ఎంతో ముఖ్యమైనదని అన్నారు. మారిషస్ ప్రభుత్వం నేడు హిందూ ఉద్యోగులకు రెండు గంటల సెలవులు ఇచ్చింది. ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు మారిషస్లోని 100 ప్రదేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇది కూడా చదవండి: ప్రాణ ప్రతిష్ఠను ‘ప్రత్యక్షం’గా చూడటమెలా? డెన్మార్క్లో.. డెన్మార్క్లోని హిందూ స్వయంసేవక్ సంఘ్.. అయోధ్యలోని రామ మందిరంలో జరిగే బాలరాముని ప్రాణప్రతిష్ట వేడుక సందర్భంగా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. డానిష్ అంబాసిడర్ పూజా కపూర్ మాట్లాడుతూ ఈ వేడుక సందర్భంగా భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయారన్నారు. దీర్ఘకాలంగా కొనసాగిన రామాలయ వివాదాన్ని పరిష్కరించి, ఆలయాన్ని ఏర్పాటు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్నవారికి అయోధ్య అక్షతలు పంపిణీ చేశారు. న్యూజిలాండ్లో.. అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా న్యూజిలాండ్ రెగ్యులేషన్ మంత్రి డేవిడ్ సేమౌర్ మాట్లాడుతూ ‘జై శ్రీరామ్... ప్రధాని నరేంద్ర మోదీ సహా భారతీయులందరికీ అభినందనలు. 500 ఏళ్ల తర్వాత రామ మందిర నిర్మాణం సాధ్యమైంది. ప్రధాని మోదీ నాయకత్వమే దీనికి కారణం. ఈ ఆలయం చాలా గొప్పది. రాబోయే వెయ్యి సంవత్సరాల పాటు నిలిచివుంటుంది. ప్రధాని మోదీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. భారతదేశంలోని కోట్లాదిమంది ప్రజలు మోదీకి అండగా నిలిచారు’ అని పేర్కొన్నారు. ఫ్రాన్స్లో.. ఫ్రాన్స్ రాజధాని పారిస్లోని ఈఫిల్ టవర్ కూడా ‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుకలకు ముస్తాబయ్యింది. ఫ్రాన్స్లోని ప్యాలెస్ డి లా చాపెల్లో నేటి మధ్యాహ్నం 12 గంటలకు భారీ రథయాత్ర బయలుదేరనుంది. ఈఫిల్ టవర్ సమీపంలోని ప్యాలెస్ డి ట్రోకాడెరో సమీపంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ రథయాత్ర ముగియనుంది. దీనికి ముందు ఉదయం 10.30 గంటలకు లా చాపెల్లే సమీపంలో విశ్వకళ్యాణ యాగం నిర్వహించనున్నారు. థాయ్లాండ్లో.. భారతదేశానికి 3,500 కిలోమీటర్ల దూరంలోని థాయ్లాండ్లోనూ మరో అయోధ్య ఉంది. దీనిని ఆ దేశంలో ‘అయుతయ’ అని పిలుస్తారు. బ్యాంకాక్లోని విశ్వహిందూ పరిషత్ సభ్యులు అయుతయతో సహా థాయ్లాండ్లోని అన్ని హిందూ దేవాలయాలలో రామ మందిర ప్రతిష్టాపన వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేశారు. దేశంలోని పలు నగరాల్లో ‘అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ’ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. -
Ayodhya Ram Mandir: జగదానంద కారకునికి జేజేలు
తండ్రి మాటను జవదాటని తనయుడు, సోదరులను అభిమానించిన అన్న, ఆలిని అనునిత్యం మనుసులో నిలుపుకున్న భర్త, స్నేహధర్మాన్ని పాటించిన మిత్రోత్తముడు. ఈ బంధాలు ఎన్ని ఉన్నా... ధర్మం తప్పకుండా ప్రజల కోసమే నిరంతరం పాటుపడిన ప్రభువు. మొత్తంగా మనిషి అనేవాడు ఇలా జీవించాలని చూపించినవాడు మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే త్రేతాయుగంలో రాముడిగా అవతరించాడని రామాయణ మహాకావ్యం చెబుతోంది. మహావిష్ణువు అవతారమే అయినప్పటికీ ఎక్కడా మహిమలు చూపలేదు. మాయలు చేయలేదు. ముమ్మూర్తులా మానవుడిలాగే వ్యవహరించాడు. మానవులలాగే కష్టాలననుభవించాడు. నిందలు మోశాడు. బాధలు పడ్డాడు. చిన్న చిన్న సంతోషాలనూ, సరదాలనూ కూడా మామూలు మనుషులలాగే అనుభవించాడు. అయితే ఎక్కడా ఎప్పుడూ ధర్మాన్ని తప్పలేదు. ఆపత్సమయంలోనూ ధర్మాన్నే అనుసరించాడు. ధర్మాన్నే ఆచరించాడు. ఒకవిధంగా చెప్పాలంటే ధర్మమంటే ఇదే అన్నట్టుగా ప్రవర్తించాడు. రాముడు అనుసరించిన మార్గం కనుకనే ఆయన చరితామృతానికి రామాయణమనే పేరు వచ్చింది. షోడశ మహాగుణ సంపన్నుడు వాల్మీకి మహర్షి రామాయణంలో రాముడి లక్షణాల గురించి వర్ణిస్తూ షోడశ మహా గుణాలు ఆయనలో ఉన్నట్లు తెలిపాడు. పితృవాక్పాలకుడిగా పేరు పొందాడు. తండ్రి దశరథుడి మాటను ఎన్నడూ జవదాటలేదు. కన్నతల్లి కౌసల్యతో సమానంగా సవతి తల్లులైన సుమిత్రతోనూ, తనను అడవులకు పంపిన కైకతోనూ కూడా ప్రియంగానే మెలిగాడు. సోదర ప్రేమకు పెట్టింది పేరు సోదర ప్రేమ రాముని చూసి నేర్చుకోవలసిందే. తమ్ముడు లక్ష్మణుని ఎంతగానో ప్రేమించాడు. కొద్దిపాటి దుడుకు స్వభావి అయినప్పటికీ అతడిని ఏనాడూ పల్లెత్తు మాటనలేదు. ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణానికి లక్ష్మణుడు మూర్ఛిల్లితే ఒక అతి సాధారణమైన అన్నయ్యలాగే తల్లడిల్లాడు. తమ్ముణ్ణి తిరిగి మామూలుగా చూసేంత వరకు స్థిమిత పడలేకపోయాడు. భరతునితో కూడా ఎంతో వాత్సల్యంతో మెలిగాడు. తాను వనవాసం పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు తాను వస్తున్న వార్తను భరతుడికి చేరవేసి, అతడి ముఖ కవళికలలో ఏమైనా మార్పు వచ్చిందేమో జాగ్రత్తగా గమనించి తనకు చెప్పమంటూ నమ్మిన బంటు హనుమను అందుకు నియోగించాడు. ఒకవేళ భరతుడు గనక రాజుగా ఉండేందుకు ఇష్టపడితే అందుకు తానేమీ అడ్డుపడదలచుకోలేదు. అంతేకాదు, శత్రుఘ్నుని కూడా అమితంగా ప్రేమించాడు. లవణాసురుడనే రాక్షసుని వధకు శత్రుఘ్నునే నియోగించాడు. అతడు జయించిన రాజ్యాన్ని అతడికే అప్పగించాడు. అందుకే ఆదర్శవంతులైన అన్నదమ్ములను రామలక్ష్మణుల్లా ఉన్నారంటారు. మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. తన పంచేంద్రియాలపై పూర్తి నియంత్రణను కలిగి ఉన్నవాడు. ఆలోచనాపరుడు. అహంకారం లేని వాడు. అందువలనే పురుషోత్తముడిగా గుర్తింపు పొందాడు. శ్రీరాముడి పాద స్పర్శతో అయోధ్యా నగరం పావనమైంది. అడవులు ధన్యమైనాయి. ఆత్మశతృవుని అధిగమించాడు కామం, కోపం, అత్యాశ, అసూయ వంటి అవలక్షణాలు కలిగిన రావణుడిని ఆత్మ శత్రువుగా పేర్కొంటారు. రావణుడి వధతో శ్రీరాముడు ఈ లక్షణాలను కూడా వధించాడని రామాయణం రుజువు చేస్తుంది. ఏక పత్నీవ్రతుడు నేటి సమాజంలో ఒక భార్యను కలిగి ఉండటం అనేది ఒక కట్టుబాటుగా మారింది. శ్రీరాముడి కాలంలో రాజులకు ఎందరో భార్యలు కలిగి ఉండేవారు. అటువంటి సమయంలో కూడా శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడిగా పేరొందాడు. మనసావాచా కర్మణా ప్రేమించిన సీతాదేవిని తప్ప మరొక మహిళ వంక కన్నెత్తి చూడలేదు. ఏకపత్నీవ్రతుడిగా పేరొందాడు. స్మిత పూర్వభాషిగా శ్రీరాముడికి పేరు. అంటే అవతలి వారు తనను పలకరించేవరకు వేచి చూడాలని అనుకోడు. ముందుగా తానే వారిని మాట్లాడించేవాడు. అంతటి మర్యాదా పురుషోత్తముడు. అటువంటి ఆదర్శమూర్తి, ధర్మప్రభువు... ఆయన నడయాడిన పుణ్యపుడమిగా పేర్కొంటున్న అయోధ్యలో బాల రాముడిగా నేడు విగ్రహ రూపంలో కొలువుతీరనున్నాడు. ఈ శుభ సందర్భంలో ఆ జగదానంద కారకుడికి జేజేలు చెబుదాం... – డి.వి.ఆర్. -
రాముని మార్గంలో నడుద్దాం!
మన భారతదేశపు శతాబ్దిన్నర చరిత్ర విదేశీ దురాక్రమణదారులతో సాగించిన నిరంతర సంఘర్షణలతో నిండి ఉంది. ప్రారంభంలో కొద్దిమంది అప్పుడప్పుడు ఇక్కడి సంపదను దోచుకోవడం కోసం (సికందర్ దాడి) ఈ దేశంపై దాడి చేసేవారు. కానీ ఆ తరువాత ఇస్లాం పేరున పశ్చిమం నుండి సాగిన దాడులు ఇక్కడి సమాజాన్ని తీవ్రంగా నష్టపరచడమేకాక వేర్పాటువాద ధోరణిని కూడా తీసుకువచ్చాయి. సమాజంలో నిరాశ, నిస్పృహ, పరాజయ భావాలను నింప డానికి విదేశీ దురాక్రమణదారులు ఇక్కడి ధార్మిక స్థలాలు, మందిరాలపై దాడి చేసి, వాటిని ధ్వంసం చేశారు. ఇలా ఒక్కసారి కాదు, అనేకసార్లు జరిగింది. ఈ విధంగా భారతీయ సమాజాన్ని బలహీనపరచి దీర్ఘకాలం ఇక్కడ రాజ్యం చేయా లన్నది వారి ప్రయత్నం. అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని కూడా ఇదే ఉద్దేశ్యంతో, లక్ష్యంతో ధ్వంసం చేశారు. దురా క్రమణకారుల ఈ లక్ష్యం కేవలం ఒక మందిరానికే పరిమితం కాలేదు. మొత్తం ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టు కోవాలన్నది వారి అసలు ఉద్దేశ్యం. ఈ దేశానికి చెందిన రాజులు ఎప్పుడూ, ఏ దేశంపైనా దురాక్రమణ చేయలేదు. కానీ ప్రపంచంలోని మిగిలిన దేశాలకు చెందిన రాజులు మాత్రం అటువంటి దాడులు, దురాక్రమణలకు పాల్పడ్డారు. అయినా ఏ పాలకుడూ భారత్పై పూర్తి ఆధిపత్యాన్ని సాధించలేకపోయాడు. భారతీయ సమాజం ఎప్పుడూ ఈ దురాక్రమణదారుల ముందు తలవంచలేదు. వీరిని ఎదుర్కొనేందుకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది. అయోధ్య జన్మస్థానాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని అక్కడ భవ్యమైన రామమందిరాన్ని పునర్నిర్మించడానికి నిరంతర ప్రయత్నం సాగుతూనే వచ్చింది. అనేక యుద్ధాలు, సంఘర్షణ, బలిదానాలు జరిగాయి. రామజన్మభూమిలో మందిర నిర్మాణ సంకల్పం హిందువుల మనస్సుల నుండి ఎప్పుడూ తొలగిపోలేదు. 1857లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధానికి ప్రణాళిక వేసుకున్నప్పుడు హిందువులు, ముస్లింలు కలిసే ఆ పని చేశారు. అప్పటివరకూ ఇద్దరూ ఆలో చనలు పంచుకునేవారు. అప్పుడు గోవధ నిషేధం, రామజన్మభూమి గురించి రెండు వర్గాల మధ్య ఒక అంగీకారం కుదిరే పరిస్థితి ఏర్పడి ఉంది. తన ప్రమాణపత్రంలో గోవధ నిషేధం అమలు గురించి కూడా బహదూర్ షా జాఫర్ పేర్కొన్నారు. అందు వల్లనే సమాజం మొత్తం ఒకటిగా నిలచి పోరాడింది. భారతీయులందరూ వీరోచితంగా పోరాడినా దుర దృష్టవశాత్తూ ఆ యుద్ధం విఫలమైంది. దానితో బ్రిటిష్ పాలన కొనసాగింది. అయితే రామ జన్మ భూమి ముక్తి పోరాటం మాత్రం ఆగలేదు. బ్రిటిష్ వాళ్ళు మొదటి నుండి అనుసరిస్తూ వచ్చిన ‘విభజించి పాలించు’ అనే విధానాన్ని ఆ తరువాత మరింతగా అమలుచేశారు. సమాజంలోని ఐకమత్యాన్ని నాశనం చేయడం కోసం బ్రిటిష్ వాళ్ళు స్వతంత్ర వీరులను అయోధ్యలో ఉరితీశారు. అయినా అయోధ్య ముక్తి పోరాటం ఆగలేదు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత సోమనాథ మందిర జీర్ణోద్ధరణ జరగడంతో ఇటు వంటి దేవాలయాల గురించి చర్చ మళ్ళీ ప్రారంభమయింది. రామజన్మభూమి ముక్తి గురించి అందరి ఆమోదం, అంగీకారం సాధించే అవకాశం అప్పుడు వచ్చినా రాజకీయాలు మరోదారి పట్టాయి. విచ్ఛిన్న వాదం, ప్రాంతీయవాదం వంటివి రాజకీయాల ముసుగులో పెచ్చరిల్లాయి. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఈ విషయమై హిందువుల మనోభావాలను పట్టించు కోకపోగా వివాదాన్ని పరిష్కరించుకోవడం కోసం ప్రజలు చేసిన ప్రయత్నాలను కూడా ముందుకు సాగనివ్వలేదు. ఈ విషయమై స్వాతంత్య్రానికి ముందు నుండి సాగుతూ వచ్చిన న్యాయపోరాటాన్ని కొనసాగించారు. రామజన్మభూమి విముక్తి కోసం ప్రజా ఉద్యమం 1980 తరువాత ఊపందుకుంది. అప్పటి నుండి మూడు దశాబ్దాల పాటు సాగింది. 1949లో జన్మభూమిలో భగవాన్ శ్రీరామచంద్రుని విగ్రహం వెలిసింది. 1986లో కోర్టు ఆదేశం మేరకు ఆలయ తాళాలు తెరిచారు. ఆ తరువాత అనేక ఉద్యమాలు, రెండుసార్లు కరసేవ వంటి కార్య క్రమాల ద్వారా హిందూ సమాజపు నిరంతర సంఘర్షణ కొనసాగింది. 2010లో అలహాబాద్ హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. ఆ తరువాత ఈ విషయంలో అంతిమ తీర్పు సాధ్యమైనంత త్వరగా వెలువరించాలంటూ కోర్టుకు పదేపదే అభ్యర్థనలు వెళ్ళాయి. చివరికి హిందూ సమాజపు 30 సంవత్సరాల సుదీర్ఘమైన న్యాయ పోరాటం తరువాత 2019 నవంబర్ 9న అన్ని సాక్ష్యాధారాలు క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీంకోర్టు సముచితమైన, సంతులితమైన తీర్పును ప్రకటించింది. రెండు పక్షాల మనోభావాలు, సాక్ష్యాధారాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అలాగే ఈ కేసుకు సంబంధించి అన్ని పక్షాల వాదనలను కూడా పూర్తిగా విన్న తరువాత తీర్పునిచ్చింది. ఈ తీర్పును అనుసరించి మందిర నిర్మాణం కోసం ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. 2020 ఆగస్ట్ 5న మందిర భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు పుష్య మాస శుక్లపక్ష ద్వాదశి, యుగాబ్ది 5125... 2024 జనవరి 22న శ్రీ రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ధార్మిక దృష్టితో చూస్తే శ్రీరాముడు ఈ దేశంలో అధిక సంఖ్యాకులకు ఆరాధ్య దేవుడు. ఆయన జీవితం ఆదర్శప్రాయమనీ, అనుసరణీయమనీ నేటికీ సమాజంలో అందరూ భావిస్తున్నారు. అందువల్ల ఈ కార్యక్రమానికి సంబంధించి వస్తున్న చిన్నపాటి అభ్యంతరాలు, అనుమానాలను పూర్తిగా పక్కన పెట్టాలి. వివాదాలు, వాదనలు పూర్తిగా సమసిపోయేట్లు మేధావులు చూడాలి. అయోధ్య అంటే ‘యుద్ధం లేనిది’, ‘సంఘర్షణ లేని స్థానం’ అని అర్థం. సమాజంలోని ప్రతి ఒక్కరి మనస్సులలో అటువంటి అయోధ్య నిర్మాణం కావాలి. అది మనందరి కర్తవ్యం. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం జాతి గౌరవ పునర్ జాగరణకు గుర్తు. ఇది శ్రీరాముని జీవితం ఇచ్చే సందేశాన్ని ఆధునిక సమాజం కూడా స్వీకరించిందనడానికి గుర్తు. శ్రీరామ మందిరంలో పత్రం, ఫలం, పుష్పంతో పూజతోపాటు రామదర్శనంతో మనస్సులో ఆయనను ఉంచుకుని ఆదర్శవంత మైన ఆచరణను అలవరచుకుని శ్రీరాముని పూజ చేయాలి. ఎందుకంటే ‘శివో భూత్వా శివం భజేత్, రామో భూత్వా రామం భజేత్’ (శివుడే తానై శివుని పూజించు, రాముడే తానై రాముడిని పూజించు) అనేదే నిజమైన పూజ అవుతుంది. భారతీయ సాంస్కృతిక దృష్టి ప్రకారం... మాతృవత్ పర దారేషు పర ద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి సః పణ్డితాః (పర స్త్రీని మాతృభావనతో చూడాలి. పరుల సొమ్మును మట్టిగా ఎంచాలి. సర్వ జీవులలో ఆత్మను చూడాలి అని పండితులు చెబుతారు.) ఈ విధంగా మనం శ్రీరాముని మార్గంలో నడవాలి. సత్యనిష్ఠ, బలపరాక్రమాలతోపాటు క్షమ, వినయం, అందరినీ సమాదరించే ధోరణి, కారుణ్యం, కర్తవ్య పాలనలో పట్టుదల వంటి శ్రీరామచంద్రుని గుణాలను వ్యక్తిగతంగా, కుటుంబపరంగా అలవ రచుకునే ప్రయత్నం చేయాలి. వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ తెచ్చుకోవాలి. ఇటువంటి క్రమశిక్షణ ద్వారానే రామలక్ష్మణులు 14 ఏళ్ల అరణ్యవాసాన్ని పూర్తిచేయడమేకాక శక్తిశాలి రావణునితో పోరాడి విజయం సాధించారు. శ్రీరాముని జీవితంలో కనిపించే న్యాయబుద్ధి, కరుణ, సద్భావం, నిష్పక్షపాత ధోరణి వంటి సామాజిక గుణాలను తిరిగి ఈ సమాజంలో పాదుకొల్పాలి. శోషణ లేని, సమాన న్యాయం లభించే సమాజాన్ని, శక్తితోపాటు కరుణ నిండిన ఒక సమాజాన్ని నిర్మించడమే శ్రీరాముని నిజమైన పూజ అవుతుంది. అహంకారం, స్వార్థం, భేదభావాల మూలంగా ప్రపంచం వినాశం వైపు పరుగులు తీస్తోంది. ఎన్నో ఆపదలను కొనితెచ్చుకుంటోంది. సద్భావన, ఏకత, ప్రగతి, శాంతి వంటి మార్గాన్ని చూపిన జగద భిరాముని ఆదర్శం సర్వకల్యాణకారి, ‘సర్వేషాం అవిరోధి’ (ఎవరితోనూ విరోధం లేని) అయిన సమాజ నిర్మాణపు ప్రారంభానికి దారి చూపాలి. ఆ మహా ప్రయత్నానికి శ్రీ రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ నాంది కావాలి. మనమంతా ఆ ప్రయత్నంలో, ఆ ఉద్యమంలో పాలుపంచుకోవాలి. జనవరి 22న జరిగే ఉత్సవంలో పాల్గొని మందిర పునర్నిర్మాణ కార్యంతో భారత్, తద్వారా ప్రపంచపు పునర్నిర్మాణ సంకల్పం చేపడదాం. ఈ విషయాన్ని మనస్సులో ఉంచుకుని ముందుకు నడుద్దాం! డా‘‘ మోహన్ భాగవత్ వ్యాసకర్త ఆర్.ఎస్.ఎస్. సర్ సంఘచాలక్ -
రాముడి ఆహ్వానం అందింది.. అయోధ్యకు వస్తున్నా: నిత్యానంద
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం సర్వాంగసుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనం ఇవ్వనున్నాడు. రేపు సోమవారం బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది. ప్రపంచం నలు మూలల నుంచి తరలివస్తున్న భక్త జనం సాక్షిగా ఆగమ శాస్త్ర పద్ధతుల్లో ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమానికి తాను వస్తున్నాని తాను దైవంగా చెప్పుకునే నిత్యానంద స్పష్టం చేశాడు. వివరాల ప్రకారం.. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో ఈ నెల 22న జరుగనున్న రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందినట్లు నిత్యానంద తెలిపాడు. ఈ కార్యక్రమానికి తాను హాజరవుతున్నట్లు నిత్యానంద ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు. ఈ క్రమంలో ట్విట్టర్లో ‘ఈ చారిత్రాత్మకమైన, అసాధారణమైన సంఘటనను మిస్ అవ్వకండి. సాంప్రదాయ ప్రాణ ప్రతిష్ట సమయంలో రాముడు లాంఛనంగా ఆలయంలోని ప్రధాన విగ్రహంలోకి ఆవాహనం అవుతాడు. యావత్ ప్రపంచాన్ని కరుణించేందుకు భూమిపైకి వస్తాడు’ అని కామెంట్స్ చేశారు. అలాగే, రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి లాంఛనంగా ఆహ్వానం అందడంతో హిందూ మతం అత్యున్నత పీఠాధిపతి భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం ఈ గొప్ప కార్యక్రమానికి హాజరుకానున్నారు అంటూ చెప్పుకొచ్చారు. 2 More Days Until the Inauguration of Ayodhya Ram Mandir! Don't miss this historic and extraordinary event! Lord Rama will be formally invoked in the temple's main deity during the traditional Prana Pratishtha and will be landing to grace the entire world! Having been formally… pic.twitter.com/m4ZhdcgLcm — KAILASA's SPH NITHYANANDA (@SriNithyananda) January 20, 2024 ఇదిలా ఉండగా.. నిత్యానంద 2020లో భారత్ నుంచి పారిపోయాడు. ఒక దీవిని ‘కైలాస’ దేశంగా ప్రకటించిన ఆయన హిందూ మతానికి సుప్రీం పీఠాధిపతిగా చెప్పుకుంటున్నాడు. అయితే, అంతకుముందు కర్ణాటకలో ఒక మఠానికి అధిపతి అయిన నిత్యానందపై 2010లో అత్యాచారం కేసు నమోదైంది. కారు డ్రైవర్ ఫిర్యాదుతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్పై విడుదలైన నిత్యానంద దేశం నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో పలు మార్లు సోషల్ మీడియా వేదికగా పలు కామెంట్స్ చేస్తున్నారు. -
కాశీ నుంచి అయోధ్యకు 50 క్వింటాళ్ల పూలు
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. ఇందుకోసం వివిధ ప్రాంతాల నుంచి పూలను తెప్పించారు. అయోధ్యను అలంకరించేందుకు కాశీ నుంచి కూడా పూలు తెప్పించారు. పూర్వాంచల్లోని అతిపెద్ద పండ్ల మార్కెట్ నుంచి 50 క్వింటాళ్ల పూలను రెండు రోజుల క్రితం అయోధ్యకు తరలించారు. ఈ పూలలో ఆరెంజ్, పసుపు రంగు బంతిపూలు ఉన్నాయి. ఇదేవిధంగా కాశీ నుంచి అయోధ్యకు పెద్ద మొత్తంలో గులాబీలను పంపించామని, పది వేల బంతిపూల దండలను కూడా పంపినట్లు మాల్దాహియా పూల మార్కెట్ హెడ్ విశాల్ దూబే తెలిపారు. డిమాండ్ అత్యధికంగా ఉన్నప్పటికీ, కొద్దిమొత్తంలోనే పూలను అయోధ్యకు పంపించామన్నారు. కాగా కాన్పూర్, లక్నో, కోల్కతాల నుంచి కూడా అయోధ్యకు పూలను ఆర్డర్ చేశారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి యూపీలో ప్రస్తుతం పూలకు విపరీతమైన గిరాకీ ఉంది. జనవరి 22న వివిధ ఆలయాల్లో పూజలు, వేడుకలు నిర్వహించనున్న దృష్ట్యా వివిధ రకాల పూలకు ఎన్నడూ లేనంత డిమాండ్ ఏర్పడింది. బంతిపూలతో పాటు గులాబీ, మల్లె పూలకు విపరీతమైన ఆర్డర్లు అందుతున్నాయి. ఇది కూడా చదవండి: బాలరామునికి భారీ వేణువు -
అయోధ్యకు ఆఫ్గనిస్థాన్ కానుక
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. ఆలయంలో కొలువయ్యే బాలరామునికి ఆఫ్గనిస్థాన్తో సహా ప్రపంచం నలుమూలల నుండి కానుకలు అందుతున్నాయి. విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ తాజాగా కశ్మీర్, తమిళనాడు, ఆఫ్గనిస్థాన్ నుండి వచ్చిన కానుకలను రామాలయ ట్రస్ట్కు అందజేశారు. అయోధ్య రామాలయ నిర్మాణంపై ముస్లిం సమాజం కూడా సంతోషంగా ఉందని అలోక్ కుమార్ పేర్కొన్నారు. కాశ్మీర్కు చెందిన ముస్లిం సోదరులు, సోదరీమణులు తనను కలవడానికి వచ్చి, రామమందిర నిర్మాణంపై సంతోషం వ్యక్తం చేస్తూ, వారు సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన రెండు కిలోల స్వచ్ఛమైన కుంకుమపువ్వును అందజేశారన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాలతో పాటు ఆఫ్గనిస్థాన్ నుండి కూడా ప్రత్యేక బహుమతి వచ్చిందని అలోక్ కుమార్ చెప్పారు. ఆఫ్గనిస్థాన్లోని కాబూల్లో గల ‘కుబా’నదిలోని నీటిని కానుకగా స్వీకరించామని అన్నారు. తమిళనాడుకు చెందిన పట్టు వస్త్రాల తయారీదారులు శ్రీరాముని ఆలయ చిత్రంతో నేసిన సిల్క్ దుస్తులను పంపారన్నారు. -
అయోధ్య గుడికి ప్రపంచంలోనే అతిపెద్ద తాళం
అయోధ్య రామునికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా యూపీలోని అలీఘర్కు చెందిన జ్వాలాపురి నివాసి సత్యప్రకాష్ శర్మ తయారుచేసిన 400 కిలోల బరువున్న తాళాన్ని అయోధ్యకు తరలించనున్నారు. ఈ తాళం ప్రపంచంలోనే అతిపెద్ద తాళంగా గుర్తింపు పొందింది. ఈ తాళాన్ని సత్యప్రకాశ్ శర్మతో పాటు అతని భార్య రుక్మణి దేవి, కుమారుడు మహేష్ చంద్ సంయుక్తంగా తయారు చేశారు. ఈ తాళాన్ని అయోధ్యలో సమర్పించేందుకు మహామండలేశ్వర్ డాక్టర్ అన్నపూర్ణ భారతీ పూరీ మహారాజ్కు రుక్మిణిదేవి అప్పగించారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించేవారు ఈ తాళాన్ని అలీఘర్ ప్రాంతానికి చిహ్నంగా గుర్తించనున్నారు. హిందూ మహాసభ జాతీయ అధికార ప్రతినిధి అశోక్ కుమార్ పాండే మీడియాతో మాట్లాడుతూ తాళాల తయారీదారుడు సత్య ప్రకాష్ శర్మ దంపతులు తయారు చేసిన ఈ తాళాన్ని బాలరామునికి అర్పించనున్నట్లు తెలిపారు. గత ఏడాది సెప్టెంబరు 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సత్యప్రకాష్ శర్మ, అతని భార్య రుక్మిణి శర్మ ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకుని, తాము స్వయంగా తయారుచేసిన ఆరు కిలోల తాళాన్ని ఆయనకు బహుకరించారు. అలాగే తాము అయోధ్యలోని శ్రీరామ మందిరానికి 400 కిలోల బరువు కలిగిన భారీ తాళం సిద్ధం చేశామని, ఆలయ ప్రారంభోత్సవ సమయానికి అందజేస్తామని ఆ దంపతులు ప్రధానికి తెలిపారు. ఇది కూడా చదవండి: కాశీ నుంచి అయోధ్యకు 50 క్వింటాళ్ల పూలు మూడు అడుగుల నాలుగు అంగుళాల పొడవున్న ఈ తాళానికి గల తాళం చెవి 30 కిలోల బరువుంటుందని రుక్మణి దేవి తెలిపారు. ఈ తాళం తయారీకి ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయ్యిందన్నారు. కాగా సత్యప్రకాష్ శర్మ గత డిసెంబర్ 12న గుండెపోటుతో కన్నుమూశారు. అతని భార్య రుక్మణి దేవి, కుమారుడు మహేష్ శర్మ తండ్రి కోరిక మేరకు ఈ తాళాన్ని మహామండలేశ్వర్ డాక్టర్ అన్నపూర్ణ భారతీ పూరీ మహారాజ్కు అప్పగించారు. -
బాలరామునికి భారీ వేణువు
అయోధ్యలో 22న జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా బాలరామునికి దేశవ్యాప్తంగా పలువురు కానుకలు పంపుతున్నారు. ఈ క్రమంలో 21.6 అడుగుల పొడవైన భారీ వేణువును పిలిభిత్(ఉత్తరప్రదేశ్) నుంచి అయోధ్యకు పంపించనున్నారు. అయోధ్యలోని మ్యూజియంలో ఈ వేణువును ఉంచనున్నారు. అత్యంత పొడవైన ఈ వేణువును పిలిభిత్ నగరానికి చెందిన ప్రముఖ శిల్పకారుడు, దివంగత నవాబ్ అహ్మద్ భార్య హీనా పర్వీన్, కుమారుడు అర్మాన్ నబీ, వారి బంధువు షంషాద్ తదితరులు వారి స్నేహితుల సాయంతో తయారుచేశారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ వెదురును చరిత్రకు గుర్తు చాలా ఏళ్లుగా దాచివుంచామని, ఇప్పుడిది వేణువు రూపంలో శ్రీరాముని చెంతకు చేరుతున్నదని హీనా పర్వీన్ తెలిపారు. కాగా ఈ వేణువును హీనా పర్వీన్ స్థానిక్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు అప్పగించారు. ఆర్ఎస్ఎస్ ప్రచారకర్త హరీష్ రౌతేలా ఈ వేణువుకు పూజలు చేశారు. ఈ వేణువును జనవరి 26న అయోధ్యధామానికి పంపనున్నారు. కాగా వేణువు తయారీదారులలో ఒకరైన అర్మాన్ మాట్లాడుతూ ఈ వేణువు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదైందన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేణువుగా నిలిచిందన్నారు. ఈ వేణువు తయారీకి వినియోగించిన వెదరును అస్సాం నుండి సుమారు 20 సంవత్సరాల క్రితం తీసుకువచ్చామన్నారు. ఇటువంటి వెదురు ప్రస్తుతం ఎక్కడా అందుబాటులో లేదన్నారు. ఇది కూడా చదవండి: ఉత్సవ విగ్రహమే ఇంత సమ్మోహనంగా ఉందంటే.. ఈ వేణువును తయారీకి 10 రోజులు పట్టిందని, ఈ వేణువును రెండు వైపుల నుండి వాయించవచ్చని తెలిపారు. దీని తయారీకి దాదాపు రూ.70-80 వేలు ఖర్చయిందని తెలిపారు. ఈ బారీ వేణువుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వేణువును ఒక ట్రక్కులో అయోధ్యకు తరలించనున్నారు. -
అయోధ్యకు యూపీ ప్రభుత్వ విరాళమెంత?
22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపధ్యంలో దేశమంతటా రామనామం మారుమోగిపోతోంది. ఇదే సమయంలో రామాలయానికి యూపీ ప్రభుత్వం ఇచ్చిన విరాళంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యూపీ ప్రభుత్వ విరాళాలకు సంబంధించి ఒక వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో యోగి ఆదిత్యనాథ్.. ‘కరసేవకులు ఎన్నో త్యాగాలు చేశారు. దీనికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మార్గదర్శకత్వం, విశ్వ హిందూ పరిషత్ నాయకత్వం, సాధువుల నుండి ఆశీర్వాదాలు తోడుగా నిలిచాయి. కరసేవకుల ఉద్యమం కారణంగానే రామజన్మభూమిలో రామాలయ నిర్మాణం జరుగుతోంది. దీనికి యూపీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులు అందించలేదు. నిర్మాణం కోసం వెచ్చిస్తున్న సొమ్ము దేశంతో పాటు ప్రపంచం నలుమూలల ఉన్న రామభక్తులు అందించారు’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు ఎలా వెళ్లాలి? దర్శనానికి ఏం చేయాలి? అయితే యూపీ ప్రభుత్వం ఏయే పనులకు నిధులు వెచ్చిస్తున్నదో సీఎం యోగి తెలిపారు. రామ మందిరం వెలుపల రైల్వే స్టేషన్, విమానాశ్రయ నిర్మాణం, గెస్ట్ హౌస్ నిర్మాణం, క్రూయిజ్ సర్వీస్, రోడ్డు విస్తరణ, పార్కింగ్ సౌకర్యాల కోసం ప్రభుత్వం నిధులు అందిస్తున్నదని పేర్కొన్నారు. ఈ పనులన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు. దేశం నలుమూలల నుండి రామాలయానికి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. ఆలయానికి కానుకలు కూడా భారీగానే వస్తున్నాయి. రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు విరాళంగా భక్తులు అందజేస్తున్నారు. నెల మొత్తం మీద చూసుకుంటే రూ.1.5 నుంచి రూ.2 కోట్ల వరకూ నిధులు అందుతున్నాయి. అయితే ఆన్లైన్ విరాళాల విరాళాల లెక్కింపు ఇంకా జరగలేదని సమాచారం. एक पाई सरकार ने नहीं दी है, न केंद्र की सरकार ने, न राज्य की सरकार ने, मंदिर के किसी काम में नहीं! ये सारा पैसा रामभक्तों ने देश भर से दिया है, दुनिया भर से दिया है... pic.twitter.com/m6DOFSdI4t — Yogi Adityanath (@myogiadityanath) January 17, 2024 -
నేటి అనుష్ఠానాల ప్రత్యేకత ఏమిటి?
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏడు రోజులుగా జరుగుతున్న రామ్లల్లా పట్టాభిషేక మహోత్సవంలో నేడు ఐదో రోజు. జనవరి 16న ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి 22న రామ్లల్లా ప్రాణప్రతిష్ఠతో ముగుస్తుంది. 2020, ఆగస్టు 5న ప్రధాని మోదీ రామాలయానికి భూమి పూజ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాల్లో భాగంగా రాములోరు ఇప్పటికే గర్భగుడిలోనికి చేరుకున్నారు. అయోధ్యలో ఈరోజు(శనివారం) జరగనున్న అనుష్ఠాన కార్యక్రమం ఎంతో ప్రత్యేకత కలిగినది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈరోజు రామాలయంలోని గర్భగుడిని సరయూ పవిత్ర జలంతో శుద్ధి చేసి, వాస్తు శాంతి, ‘అన్నాధివాసం’ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే పలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శకరాధివాసం, ఫలాధివాసం, పుష్పాధివాసం మొదలైన అనుష్ఠనాలు జరగనున్నాయి. పంచదారలో, పండ్లలో, పుష్పాలలో బాలరాముని విగ్రహాన్ని కొంతసేపు ఉంచుతారు. ఇది కూడా చదవండి: 400 కేజీల తాళానికి 30 కిలోల చెవి! ఆరో రోజున అంటే ఆదివారంనాడు రామ్లల్లా విగ్రహానికి 125 కలశాల నీటితో స్నానం చేయించి, పవళింపజేస్తారు. ఆ మరుసటి రోజు అంటే జనవరి 22న శ్రీ రాముని ప్రాణప్రతిష్ఠ వేడుక జరగనుంది. ఈ ఉత్సవం మధ్యాహ్నం 12:30 గంటలకు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంప్రోక్షణ కార్యక్రమానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. -
ప్రాణ ప్రతిష్ఠను ‘ప్రత్యక్షం’గా చూడటమెలా?
ఈనెల 22న యూపీలోని అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. దీనిని తిలకించేందుకు దేశంలోని రామభక్తులు తహతహలాడుతున్నారు. అయితే 22న అతిథులకు మాత్రమే రామాలయంలో ప్రవేశానికి ఆహ్వానం ఉంది. మిగిలినవారుకూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించగలిగే అవకాశం ఉంది. మీడియా సెంటర్ ఏర్పాటు ఇప్పటికే అయోధ్య ధామ్లో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రామ్ కథా సంగ్రహాలయ్ వద్ద మీడియా సెంటర్ను ఏర్పాటు చేశారు.కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగం తెలిపిన వివరాల ప్రకారం జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు దూరదర్శన్ (డీడీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం దూరదర్శన్ అయోధ్యలోని రామ మందిరం చుట్టుపక్కల 40 కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమం డీడీ నేషనల్, డీడీ న్యూస్లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి వివిధ రైల్వేస్టేషన్లలో.. రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను దేశవ్యాప్తంగా వివిధ రైల్వేస్టేషన్లలో భారతీయ రైల్వే ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. ఆయా రైల్వే స్టేషన్లలో తొమ్మది వేల స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయని, ఆ స్క్రీన్లపై ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. న్యూయార్క్ నగరంలో.. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల ప్రసిద్ధ టైమ్ స్క్వేర్లోనూ ప్రాణప్రతిష్ఠ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. వివిధ భారతీయ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో కూడా ఈ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ కానున్నది. 2020 ఆగస్ట్ 5న అయోధ్యలోని శ్రీరామ మందిరానికి భూమి పూజ చేసినప్పుడు ఈ కార్యక్రమం టైమ్స్ స్క్వేర్లోని డిజిటల్ బిల్బోర్డ్పై డిస్ప్లేపై చేశారు. 23న కూడా ప్రత్యక్ష ప్రసారం జనవరి 23న కూడా దూరదర్శన్లో రామ్లల్లా ప్రత్యేక హారతితో పాటు సాధారణ పౌరుల కోసం ఆలయం తెరవడాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ప్రధాన ఆలయ సముదాయం మాత్రమే కాకుండా, సరయూ ఘాట్ సమీపంలోని రామ్కి పైడి, కుబేర్ తిల దగ్గరున్న జఠాయువు విగ్రహం, ఇతర ప్రదేశాల నుంచి కూడా దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారాలు చేయనుంది. ఇది కూడా చదవండి: నేటి అనుష్ఠానాల ప్రత్యేకత ఏమిటి? ప్రత్యేక యూట్యూబ్ లింక్ మరోవైపు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేసేందుకు ప్రత్యేక యూట్యూబ్ లింక్ను సిద్ధం చేస్తున్నారు. దీనిద్వారా పలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికాలేదు. 4కె టెక్నాలజీతో.. దూరదర్శన్తో పాటు పలు ప్రైవేట్ ఛానెళ్లు కూడా దూరదర్శన్ నుంచి ఫీడ్ను అందుకుంటాయని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. దూరదర్శన్ ఈ కార్యక్రమాలను 4కె టెక్నాలజీ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయనుందని, ఫలితంగా ప్రేక్షకులు హైక్వాలిటీ పిక్చర్ను చూడగలుగుతారని అపూర్వ చంద్ర తెలిపారు. -
అయోధ్యకు ఎలా వెళ్లాలి? దర్శనానికి ఏం చేయాలి?
జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. దీని తరువాత అంటే జనవరి 23 నుంచి అయోధ్యను సందర్శించాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. మరి అయోధ్యకు ఎలా వెళ్లాలి? అక్కడ రోజూ జరిగే పూజలేమిటి? రామాలయం సందర్శనలో ఎటువంటి విధివిధానాలు ఆచరించాలి? ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. రైలు మార్గం రైలు మార్గం ద్వారా అయోధ్యకు వెళ్లాలనుకునేవారు దేశంలోని ఏ ప్రాంతం నుంచి అయినా అయోధ్యకు చేరుకోవచ్చు. న్యూ ఢిల్లీ నుంచి అయోధ్యకు వెళ్లాలనుకుంటే దాదాపు 10 గంటలపైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునేవారు సికింద్రాబాద్ నుంచి రైలులో గోరఖ్ పూర్ వెళ్లాలి. అక్కడి నుంచి అయోధ్యకు రైలు లేదా బస్సు ద్వారా అయోధ్యకు చేరుకోవచ్చు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల 50 నిమిషాలకు సికింద్రా బాద్ నుంచి గోరఖ్ పూర్కు వెళ్లే రైలు అందుబాటులో ఉంది. ఈ రైలులో 30 గంటల పాటు ప్రయాణం చేయాలి. ఇదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బీదర్ అయోధ్య వీక్లీ ఎక్స్ ప్రెస్ ప్రతి సోమ, ఆదివారాలలో అందుబాటులో ఉంది. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునే వారు ప్రతి శుక్ర, ఆది, సోమ వారాల్లో రైలు ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. రోడ్డు మార్గం అయోధ్యకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో 40 గంటల ప్రయాణం అనంతరం ఢిల్లీకి చేరుకుంటారు. ఏసీ బస్సులో ఒకరికి టికెట్ ధర రూ. 6 వేలు ఉంటుంది. హైదరాబాద్ నుంచి ప్రైవేటు వాహనాల్లో వెళ్లాలనుకునే వారు నాగపూర్, జబల్ పూర్, ప్రయాగ్రాజ్ మీదుగా అయోధ్యకు చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే మొత్తం 1305 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయాలి. కాగా అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం సికింద్రా బాద్ నుంచి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. విమానయాన సంస్థలు కూడా స్పెషల్ ఫ్లైట్స్ ను నడిపేందుకు సిద్ధమయ్యాయి. విమానయానం విమానాల ద్వారా అయోధ్యకు వెళ్లాలనుకునే రామ భక్తులు హైదరాబాద్ శంశాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అయోధ్యకు నేరుగా వెళ్లేందుకు విమానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. దీంతో శంశాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ, లేదా గోరఖ్ పూర్, లక్నో విమానాశ్రయాలకు చేరుకుని, అక్కడి నుంచి 140 కిలోమీటర్ల దూరంలోని అయోధ్యకు బస్సు లేదా రైలులో ప్రయాణించే చేరుకోవచ్చు. దర్శనం ఎలా? అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం ముందుగా రిజిస్టేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం (https://online.srjbtkshetra.org) అధికారిక వెబ్సైట్లో మొబైల్ నంబర్ను నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి. ఓటీపీ నమోదు చేశాక పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో ‘దర్శన్’ ఎంపికపై క్లిక్ చేశాక, ఓపెన్ అయిన పేజీలో మీరు శ్రీరాముని దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీ, సమయం, మీతోపాటు వచ్చేవారి సంఖ్య, దేశం, రాష్ట్రం, మొబైల్ నంబర్తో పాటు మీ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియతో దర్శనానికి సంబంధించిన బుకింగ్ పూర్తవుతుంది. ఆఫ్లైన్లో.. ఆఫ్లైన్లో టిక్కెట్లు పొందాలనుకున్నప్పుడు ఆలయం సమీపంలోని కౌంటర్ వద్దకు వెళ్లి, ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు కార్డును చూపించి, టికెట్ పొందవచ్చు. పదేళ్లకన్నా తక్కువ వయసుగల పిల్లలకు దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. దర్శనం కోసం టిక్కెట్తో పాటు ఐడీప్రూప్ ప్రూఫ్ను వెంట తీసుకువెళ్లాలి. సంప్రదాయ దుస్తులలో.. దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక, దర్శనానికి 24 గంటల ముందు సంబంధిత భక్తునికి మెసేజ్ లేదా మెయిల్ వస్తుంది. దర్శనానికి 24 గంటల ముందు భక్తుడు తన టిక్కెట్ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాగా స్త్రీలు, పురుషులు సంప్రదాయ దుస్తులలో మాత్రమే దర్శనానికి రావాలి. పురుషులు ధోతీ-కుర్తా లేదా కుర్తా, పైజామా.. మహిళలు చీర, దుపట్టాతో కూడిన పంజాబీ దుస్తులు లేదా దుపట్టాతో చుడీదార్ సూట్ ధరించి శ్రీరాముని దర్శనానికి రావచ్చు. అయోధ్యలో నిత్యపూజలు అయోధ్య రామాలయంలో బాలరామునికి రోజుకు ఐదుసార్లు హారతులు ఇవ్వనున్నారు. అయితే భక్తులు మూడు హారతులను మాత్రమే దర్శించుకోగలుగుతారు. ఈ హారతులు ఉదయం 6:30 గంటలకు, మధ్యాహ్నం 12:00 గంటలకు, సాయంత్రం 7:30 గంటలకు నిర్వహిస్తారు. ఇక శ్రీరాముని దర్శనం విషయానికి వస్తే ఉదయం 6 నుండి 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. ఇది కూడా చదవండి: ప్రాణ ప్రతిష్ఠను ‘ప్రత్యక్షం’గా చూడటమెలా? -
రామాలయం పోస్టల్ స్టాంపు విడుదల
రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు ముందుగా నేడు (గురువారం) శ్రీరామ జన్మభూమి ఆలయంపై స్మారక పోస్టల్ స్టాంప్ను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. దీనితో పాటు రాముని చిత్రంతో కూడిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రధాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ 48 పేజీల పుస్తకంలో 20 దేశాల స్టాంపులు ఉన్నాయి. రామాలయ పోస్టల్ స్టాంపు విడుదల అనంతరం ప్రధాని మోదీ ఓ వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు. ప్రధాని మోదీ మొత్తం 6 తపాలా స్టాంపులను విడుదల చేశారు. వీటిలో రామాలయం, గణేశుడు, హనుమంతుడు, జటాయువు, శబరి మొదలైనవి ఉన్నాయి. ఈ 48 పేజీల పుస్తకంలో అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కంబోడియా, ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు సహా 20కి మించిన దేశాలు విడుదల చేసిన పోస్టల్ స్టాంపులు ఉన్నాయి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇది కూడా చదవండి: పేరులో రాముడుంటే బంపర్ ఆఫర్! #WATCH | Prime Minister Narendra Modi releases Commemorative Postage Stamps on Shri Ram Janmbhoomi Mandir and a book of stamps issued on Lord Ram around the world. Components of the design include the Ram Mandir, Choupai 'Mangal Bhavan Amangal Hari', Sun, Sarayu River and… pic.twitter.com/X2eZXJzTKz — ANI (@ANI) January 18, 2024 -
రామ్లల్లా దర్శనానికి ఎలా వెళ్లాలి?
జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తయ్యాక అయోధ్యను సందర్శించాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇందుకు ఎటువంటి విధివిధానాలు అనుసరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. రామాలయంలో బాలరామునికి రోజుకు ఐదుసార్లు హారతులు ఇవ్వనున్నారు. అయితే భక్తులు మూడు హారతులను మాత్రమే దర్శించుకోగలుగుతారు. ఈ హారతులు ఉదయం 6:30 గంటలకు, మధ్యాహ్నం 12:00 గంటలకు, సాయంత్రం 7:30 గంటలకు నిర్వహిస్తారు. ఇక శ్రీరాముని దర్శనం విషయానికి వస్తే ఉదయం 6 నుండి 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం ముందుగా రిజిస్టేషన్ చేసుకోవాలి. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం (https://online.srjbtkshetra.org) అధికారిక వెబ్సైట్కి వెళ్లి, మొబైల్ నంబర్ను నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి. ఓటీపీ నమోదు చేశాక పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో ‘దర్శన్’ ఎంపికపై క్లిక్ చేశాక, ఓపెన్ అయిన పేజీలో మీరు శ్రీరాముని దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీ, సమయం, మీతోపాటు వచ్చేవారి సంఖ్య, దేశం, రాష్ట్రం, మొబైల్ నంబర్తో పాటు మీ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక దర్శనానికి సంబంధించిన బుకింగ్ పూర్తవుతుంది. శ్రీరాముని హారతులను చూడాలనుకుంటే ఇందుకోసం ప్రత్యేకంగా బుక్ చేసుకోవాలి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆఫ్లైన్లో టిక్కెట్లు పొందాలనుకుంటే ఆలయం సమీపంలోని కౌంటర్ వద్దకు వెళ్లి, ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు కార్డును చూపించి, టికెట్ పొందవచ్చు. కాగా పదేళ్లకన్నా తక్కువ వయసుగల పిల్లలకు దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. దర్శనం కోసం టిక్కెట్తో పాటు ఐడీప్రూప్ ప్రూఫ్ను ఖచ్చితంగా వెంట తీసుకువెళ్లాలి. ఎవరైనా భక్తుడు తన టిక్కెట్ను రద్దు చేసుకుంటే, ఆ స్లాట్ మరో భక్తుడికి అందుబాటులోకి వస్తుంది. దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక, దర్శనానికి 24 గంటల ముందు సంబంధిత భక్తునికి మెసేజ్ లేదా మెయిల్ వస్తుంది. దర్శనానికి 24 గంటల ముందు భక్తుడు తన టిక్కెట్ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాగా స్త్రీలు, పురుషులు సంప్రదాయ దుస్తులలో మాత్రమే దర్శనానికి రావాలి. పురుషులు ధోతీ-కుర్తా లేదా కుర్తా, పైజామా.. మహిళలు చీర, దుపట్టాతో కూడిన పంజాబీ దుస్తులు లేదా దుపట్టాతో చుడీదార్ సూట్ ధరించి శ్రీరాముని దర్శనానికి రావచ్చు. ఇది కూడా చదవండి: అయోధ్యలో త్రేతాయగం... అంతా రామమయం! -
ఉత్సవ విగ్రహమే ఇంత సమ్మోహనంగా ఉందంటే..
అయోధ్యలో నూతన రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆలయ ట్రస్టు ఎంతగానో కృషి చేస్తోంది. సంప్రోక్షణ తేదీ దగ్గర పడుతుండటంతో రామాలయానికి సంబంధించిన ప్రత్యేక సమాచారం ప్రతిరోజూ వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలోనే అత్యంత ఆకర్షణీయమైన రామ్లల్లా విగ్రహానికి సంబంధించిన తొలి ఫొటో వెలుగులోకి వచ్చింది. పల్లకీలో కూర్చున్న రామ్లల్లా ఆలయ ప్రాంగణంలో ఊరేగారు. అయితే ఇది గర్భగుడిలో ప్రతిష్టించే విగ్రహం కాదు. ఇది ప్రతీకాత్మక విగ్రహం. గర్భగుడిలో ప్రతిష్టించే బాలరాముని విగ్రహాన్ని ఈనెల 18న(ఈరోజు) రామాలయ ప్రాంగణానికి తీసుకురానున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి కర్నాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ నూతన రామాలయంలో ప్రతిష్ఠించే బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దారు. జనవరి 22న జరిగే పవిత్రోత్సవానికి ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆలయ ట్రస్టు తొలుత బాలరాముని విగ్రహాన్నే ఆలయ ప్రాంగణంలో ఊరేగించాలని భావించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసి, శ్రీరాముని ఉత్సవ విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో ఊరేగించి, భక్తులకు శ్రీరాముని దర్శనభాగ్యం కలిగించారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గర్భగుడిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. సరయూ నది నుండి తీసుకువచ్చిన నీటితో పాటు దేశంలోని వివిద పవిత్ర నదీ జలాలలను తీసుకువచ్చి గర్భగుడిని శుద్ధి చేయనున్నారు. అనంతరం గర్భగుడిలో పూజలను నిర్వహించి, బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇది కూడా చదవండి: 22న స్కూళ్లకు సెలవు.. ఈ రాష్ట్రాల్లోనే.. -
ప్రధాని మోదీ ‘రామ ప్రతిజ్ఞ’ నెరవేరింది!
మూడు దశాబ్దాల కిత్రం అయోధ్యను సందర్శించిన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ నాడు.. అక్కడి పరిస్థితులను చూసి, తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తూ, రామాలయ నిర్మాణం జరిగే వరకూ అయోధ్యకు రానంటూ ప్రతిజ్ఞ చేశారు. అది.. 1991, డిసెంబర్ 11.. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు సాగిన ఐక్యతా యాత్రలో పాల్గొన్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ.. 1992, జనవరి 14న అయోధ్యను సందర్శించారు. రామ్లల్లాను దర్శించుకున్నాక, రామాలయ నిర్మాణం జరిగిన తర్వాతనే తాను అయోధ్యకు వస్తారని ప్రతిజ్ఞ చేశారు. నాడు అయోధ్యకు వచ్చినప్పుడు మోదీ ఒక సాధారణ కార్యకర్త. నాటి మోదీ కల నేడు సాకరమయ్యింది. ప్రధాని మోదీ తన మొదటి అయోధ్య పర్యటనలో జానకీ మహల్ ట్రస్ట్లో బసచేశారు. ఇది రామజన్మభూమికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది. ట్రస్ట్ నిర్వాహకులు రామ్కుమార్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, నరేంద్ర మోదీ తొలిసారి ఇక్కడికి వచ్చినప్పుడు రూమ్ నంబర్ 107లో బస చేశారని తెలిపారు. ఆ సమయంలో బీజీపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి 108 నంబర్ రూమ్లో బస చేశారని పేర్కొన్నారు. జానకీ మహల్లోనేవారు భోజనం చేశారని, అప్పుడు తన వయసు 35 ఏళ్లు అని, మోదీకి కూడా అదే వయసు ఉండవచ్చన్నారు. నేడు ఆ గది శిథిలావస్థకు చేరుకుందని, దీంతో ఆ గదికి తాళం వేశామన్నారు. నాడు కఠిన ప్రతిజ్ఞ చేసిన మోదీ 28 సంవత్సరాల వరకూ అయోధ్య ముఖం చూడనే లేదు. 1992, జనవరి 14 వరకూ, అంటే 28 ఏళ్ల పాటు మోదీ అయోధ్యకు రాలేదు. 2019, నవంబర్ 9న రామమందిరానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. 2022లో ప్రధాని మోదీ అయోధ్యకు వచ్చి, దీపోత్సవంలో పాల్గొన్నారు. 2023 డిసెంబర్ 30న అయోధ్యలో రోడ్ షో నిర్వహించారు. ఇప్పుడు 22న రామమందిరాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య వస్తున్నారు. ఈ నేపధ్యంలో నాటి మోదీ ప్రతిజ్ఞ చర్చల్లో నిలిచింది. ఇది కూడా చదవండి: ఆ రెండు విగ్రహాలను ఏం చేయనున్నారు? -
లతా మంగేష్కర్ ఆఖరి రామ శ్లోకాన్ని షేర్ చేసిన ప్రధాని మోదీ!
అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జనవరి 22న అభిజీత్ లగ్నంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమం పలువురు ప్రముఖుల సమక్షంలో జరగనుంది. ప్రముఖ బాలీవుడ్ నటులు, గాయకులు, దర్శకులు, కళాకారులను ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ ఆహ్వానించారు. ప్రధాని మోదీ తన ట్విట్టర్ హ్యాండిల్లో అయోధ్యకు సంబంధించిన అప్డేట్లను తరచూ షేర్ చేస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ గాయని లతామంగేష్కర్కు సంబంధించిన ఒక వీడియోను ‘ఎక్స్’ సోషల్ మీడియా ప్లాట్ఫారంలో షేర్ చేశారు. అయోధ్యలో జరగబోయే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో గాయని లతా మంగేష్కర్ను మిస్ కావడం విచారకరమని అన్నారు. As the nation awaits 22nd January with great enthusiasm, one of the people who will be missed is our beloved Lata Didi. Here is a Shlok she sung. Her family told me that it was the last Shlok she recorded. #ShriRamBhajanhttps://t.co/MHlliiABVX — Narendra Modi (@narendramodi) January 17, 2024 లతా మంగేష్కర్ కీర్తనలలో ఒకదానిని ‘ఎక్స్’లో షేర్ చేసిన ప్రధాని.. ఇది లతా మంగేష్కర్ పాడగా, రికార్డ్ చేసిన చివరి శ్రీరాముని శ్లోకమని తెలిపారు. ఈ శ్లోకం పేరు ‘శ్రీ రామ్ అర్పణ్’. దీనిలో లతా మంగేష్కర్ మధురమైన గాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇది కూడా చదవండి: నాలుగేళ్లలో పదింతల అభివృద్ధి! -
అయోధ్య: ఆ రెండు విగ్రహాలను ఏం చేయనున్నారు?
అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రామ్లల్లా నేడు(బుధవారం) ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించనున్నారు. ముందుగా రామ్లల్లా విగ్రహాన్ని రామజన్మభూమి కాంప్లెక్స్కు తీసుకువెళతారు. అనంతరం గర్భగుడిని శుద్ధి చేసి, గురువారం శ్రీరాముని విగ్రహాన్ని గర్భగుడిలోనికి తీసుకువస్తారు. రామాలయంలో ప్రతిష్ఠించేందుకు తొలుత మూడు బాలరాముని విగ్రహాలను రూపొందించగా, అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠాపనకు ఎంపిక చేశారు. దీంతో మిగిలిన రెండు విగ్రహాలను ఏమిచేయనున్నారనే ప్రశ్న అందరి మదిలో మెదలాడింది. దీనికి సమాధానాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాకు వెల్లడించారు. అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించేందుకు మూడు విగ్రహాలు తయారు చేయించామని, దానిలో ఒక విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు ఎంపిక చేశామని, మిగిలిన రెండు విగ్రహాలను ఆలయంలోని మొదటి, రెండో అంతస్తుల్లో ఏర్పాటు చేస్తామని చంపత్ రాయ్ తెలిపారు. రామ మందిరం మొదటి అంతస్తు సిద్ధమైన వెంటనే రెండు రామ్లల్లా విగ్రహాలలో ఒకదానిని వైదిక ఆచారాలతో అక్కడ ప్రతిష్ఠించనున్నట్లు ఆయన తెలిపారు. డిసెంబర్ 2025 నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత, మిగిలిన రెండవ విగ్రహాన్ని రెండవ లేదా చివరి అంతస్తులో ప్రతిష్ఠించనున్నామన్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి రామాలయం గర్భగుడిలో ఏర్పాటు చేసేందుకు కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన నల్లరాతి విగ్రహాన్ని ఆలయ ట్రస్ట్ ఎంపిక చేసింది. మిగిలిన రెండు విగ్రహాలలో ఒకటి కర్నాటకకు చెందిన గణేష్ భట్ నల్లరాతితో తీర్చిదిద్దారు. ఇంకొక విగ్రహాన్ని రాజస్థాన్కు చెందిన సత్య నారాయణ పాండే తెల్లని మక్రానా పాలరాతితో రూపొందించారు. ఈ మూడు విగ్రహాలూ 51 అంగుళాల ఎత్తులో ఉన్నాయి. ఇది కూడా చదవండి: 2,100 కిలోల గంట.. 108 అడుగుల అగరుబత్తి -
అయోధ్య: నాలుగేళ్లలో పదింతల అభివృద్ధి!
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గడచిన నాలుగేళ్లలో అయోధ్య అభివృద్ధికి అత్యధిక నిధులు ఖర్చుచేసింది. పలు అభివృద్ధి పనులకు సుమారు రూ.31 వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. యూపీలోని ఏ జిల్లాలోనూ ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టిన దాఖలాలు లేవు. అయోధ్యకు వచ్చే పర్యాటకుల సంఖ్య గత నాలుగేళ్లలో 2.25 లక్షల నుంచి 2.25 కోట్లకు పెరిగింది. భూముల ధరలు పదిరెట్ల మేరకు పెరిగాయి. ఈ నగరం సీతామాత శాపానికి గురైందని స్థానికులు అంటుంటారు. గతంలో ఇక్కడి యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు పయనమయ్యింది. అయితే రామ మందిరం నిర్మాణం ప్రారంభంతో అయోధ్య ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. పర్యాటకులు, రామభక్తులతో సందడిగా మారింది. ప్రాపర్టీ డీలర్ బ్రిజేంద్ర దూబే పదేళ్లుగా అయోధ్యలో భూముల క్రయ విక్రయాలు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్ల కిందట చదరపు అడుగు భూమి రూ.1000కి లభించేదని, ఇప్పుడు రూ. రూ.4,000 వెచ్చించినా దొరకడంలేదని తెలిపారు. నగరంలోని రామ్పథంలో భూముల ధరలు భారీగా పెరిగాయని చదరపు అడుగు భూమి ధర రూ.1000 నుంచి రూ.6 వేలకు పెరిగిందన్నారు. అయోధ్యలోని రామమందిర్ ట్రస్ట్ వైకుంఠథామం సమీపంలో 14 వేల 730 చదరపు మీటర్ల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ భూముల కొనుగోలు ద్వారా ప్రభుత్వానికి రూ.55 కోట్ల 47 లక్షల 800 ఆదాయం వచ్చింది. ఇదేవిధంగా హౌసింగ్ డెవలప్మెంట్ అథారిటీ 1,194 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. లోధా గ్రూప్ నగరంలోకి ప్రవేశించాక ఇక్కడి భూముల ధరలు ఆకాశాన్ని అంటాయని ప్రాపర్టీ డీలర్ బ్రిజేంద్ర దూబే చెప్పారు. ఈ గ్రూపు అయోధ్య వెలుపల రాంపూర్ హల్వారా, రాజేపూర్ ప్రాంతం మధ్యలో సొసైటీని నిర్మించడానికి భారీగా భూములను కొనుగోలు చేసింది. గడచిన కాలంలో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన స్థానిక యువత అయోధ్య శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఇక్కడికి తిరిగివస్తోంది. మలవన్కు చెందిన అనుప్ పాండే గుజరాత్లో పనిచేసేవాడు. అయోధ్యలో ఉపాధి అవకాశాలు పెరగడాన్ని చూసి, అతను తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ఇక్కడికి తిరిగివచ్చాడు. ఒక కారును కొనుగోలు చేసి, దానిని పర్యాటక ప్రాంతాలకు తిప్పుతూ ఉపాధి పొందుతున్నాడు. ఇదేవిధంగా ఇంజనీర్ బ్రిజేష్ పాఠక్ ప్రయాగ్రాజ్లో తన ఉద్యోగాన్ని వదిలి, అయోధ్యకు చేరుకుని ఆయుర్వేద ఔషధాల తయారీని ప్రారంభించాడు. అవినాష్ దూబే తన ఉద్యోగం వదిలిపెట్టి, అయోధ్యలో బెల్లం తయారీ పరిశ్రమను ప్రారంభించాడు. అరవింద్ చౌరాసియా చండీగఢ్ నుండి ఇక్కడకు తిరిగి వచ్చి, హోటల్ ప్రారంభించాడు. ఇది కూడా చదవండి: నేడు ఆలయ ప్రాంగణంలోకి బాలరాముని విగ్రహం! -
నేడు ఆలయ ప్రాంగణంలోకి బాలరాముని విగ్రహం!
ఈ నెల 22న జరగబోయే బాలరాముని ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు మొదలయ్యాయి. మంగళవారం ప్రాయశ్చిత్త పూజలతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా ప్రాయశ్చిత్త పూజలను నిర్వహించారు. సుమారు మూడు గంటల పాటు ఈ ప్రాయశ్చిత్త పూజలు జరిగాయి. అనంతరం డాక్టర్ అనిల్ మిశ్రా సరయూ నదిలో పుణ్యస్నానం చేశారు. తరువాత విగ్రహ నిర్మాణ స్థలంలోనూ పూజలు చేశారు. బాలరాముని విగ్రహాన్ని శుద్ధి చేస్తూ, కళ్లకు గంతలు కట్టారు. వీటిని జనవరి 22న తెరవనున్నారు. వివేక్ సృష్టి ప్రాంగణంలో ఆచార్య అరుణ్ దీక్షిత్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రాయశ్చిత్త పూజలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాన అతిథి డాక్టర్ అనిల్ మిశ్రా దంపతులు పూజలు ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమంలో శిల్పి అరుణ్ యోగిరాజ్ కూడా పాల్గొన్నారు. ప్రాయశ్చిత్త పూజలో భగవంతుడిని క్షమాపణలు కోరారు. విగ్రహ తయారీలో ఉలి, సుత్తి లేదా మరేదైనా పరికరాన్ని ఉపయోగించినందున భగవంతునికి గాయం తగిలిందన్న భావనతో ఈ విధమైన క్షమాపణలు కోరారు.. అనంతరం ప్రధాన అతిథి డాక్టర్ అనిల్ మిశ్రా దంపతులు సరయూ తీరానికి చేరుకుని దశవిధ స్నానం చేశారు. ఈ సమయంలో ప్రాయశ్చిత్త పూజలకు సంబంధించిన మంత్రోచ్ఛారణలు ప్రతిధ్వనించాయి. ఈరోజు (బుధవారం) బాలరాముని విగ్రహాన్ని అయోధ్య ఆలయ ప్రాంగణంలోకి తీసుకురానున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్మించిన యాగ మండపంలో పూజలు ప్రారంభమవుతాయి. ఇది కూడా చదవండి: అయోధ్యలో సంప్రదాయ క్రతువులు ఆరంభం -
అయోధ్య రూట్లో రైళ్లు రద్దు.. కారణమిదే!
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ప్రస్తుతం రైల్వే ట్రాక్ డబ్లింగ్ (సింగిల్ ట్రాక్ డబ్లింగ్), విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతో జనవరి 16 నుండి 22 వరకు అయోధ్యలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ రూటులో నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుతో సహా మొత్తం ఎక్స్ప్రెస్ రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. అలాగే డూన్ ఎక్స్ప్రెస్ సహా 35 రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించనున్నాయి. నార్తర్న్ రైల్వే లక్నో డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రేఖా శర్మ మీడియాతో మాట్లాడుతూ అయోధ్య కాంట్ నుండి ఆనంద్ విహార్ (ఢిల్లీ)కి వెళ్లే వందే భారత్ రైలును ట్రాక్ నిర్వహణ కారణంగా జనవరి 15 వరకు రద్దు చేసినట్లు చెప్పారు. అయితే ఈ రైలు రద్దును జనవరి 22 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రామ్లల్లా పవిత్రోత్సవానికి జరుగున్న సన్నాహాలను దృష్టిలో ఉంచుకుని, అయోధ్య రైల్వే సెక్షన్లో ట్రాక్ డబ్లింగ్కు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఇదిలావుండగా అయోధ్యలో పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రారంభోత్సవానికి ముందే హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు. జనవరి 22కు ముందుగానే భక్తుల కోసం హెలికాప్టర్ సర్వీస్ ప్రారంభమవుతుందని యూపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. అయితే దీనికి సంబంధించి నిర్దిష్ట తేదీని ప్రకటించలేదు. అయోధ్యలో రామ మందిరాన్ని ఈనెల 22న ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో రామ్లల్లాకు పట్టాభిషేకం జరగనుంది. రాజకీయ నేతలు మొదలుకొని, సినిమా, క్రీడా ప్రపంచానికి చెందిన పులువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు వెళ్లలేరా? ప్రాణప్రతిష్ఠను ఇలా ప్రత్యక్షంగా చూడండి! -
అయోధ్యలో నేటి నుంచే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఏడు రోజుల పాటు జరిగే రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు నేటి (మంగళవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న రామాలయానికి భూమి పూజ చేశారు. ఈ నెల 22న బాలరాముడు ఆలయంలో ప్రతిష్ఠితుడు కానున్నాడు. ఆలయ ట్రస్ట్ ఏడువేల మందికి పైగా అతిథులను రామ మందిర వేడుకకు ఆహ్వానించింది. వీరిలో క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తదితరులున్నారు. రామాలయ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నేటి నుండి రామాలయ ప్రారంభోత్సవం, ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఆ వివరాలు.. మొదటి రోజు (జనవరి 16) నేటి నుంచి రామాలయ ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం కానున్నాయి. సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణుపూజ మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. రెండవ రోజు (జనవరి 17) రామ్లల్లా విగ్రహాన్ని ఊరేగింపుగా అయోధ్యకు తీసుకువస్తారు. మంగళ కలశాలలో సరయూ జలాన్ని నింపి, వాటితో పాటు భక్తులు రామాలయానికి చేరుకుంటారు. మూడవ రోజు(జనవరి 18) గణేశ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, బ్రాహ్మణ వరం, వాస్తు పూజలతో వైదిక ఆచారాలు ప్రారంభమవుతాయి. నాల్గవ రోజు(జనవరి 19) పవిత్రమైన అగ్నిని వెలిగిస్తారు. తర్వాత ‘నవగ్రహ’ స్థాపన చేయనున్నారు. ఐదవ రోజు(జనవరి 20) రామజన్మభూమి ఆలయ గర్భగుడిని జనవరి 20న సరయూ నీటితో సంప్రోక్షణ చేసి, ఆ తర్వాత వాస్తు శాంతి చేస్తారు. ఆరవ రోజు(21 జనవరి 21) రామ్లల్లా విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయించి, పవళింపజేస్తారు. ఏడవ రోజు(జనవరి 22) ప్రధాన ‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుక జనవరి 22న మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభంకానుంది. రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. సంప్రోక్షణ కార్యక్రమానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. జనవరి 21, 22 తేదీలలో సాధారణ భక్తులను రామాలయంలోనికి అనుమతించరు. జనవరి 23 నుంచి నూతన రామాలయంలోనికి అందరినీ అనుమతించనున్నారు. ఇది కూడా చదవండి: శిల్పి అరుణ్ యోగిరాజ్ గురించి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఏమన్నది? -
శిల్పి అరుణ్ యోగిరాజ్ గురించి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఏమన్నది?
అయోధ్యలో ఈనెల 22న నూతన రామాలయ ప్రారంభోత్సవం జరగనుంది. అదేరోజు ఆలయంలో బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. సుప్రసిద్ధ మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ అయోధ్యలో కొలువుదీరే బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఈ నేపధ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ శిల్పి అరుణ్ యోగిరాజ్ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆరు నెలల మౌనదీక్ష అరుణ్ యోగిరాజ్ బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దే సమయంలో నెలల తరబడి తన కుటుంబంలోని ఎవరితోనూ మాట్లాడకుండా, ఎంతో దీక్షతో ఈ కార్యాన్ని నెరవేర్చారని ట్రస్ట్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. విగ్రహ తయారీలో అరుణ్ యోగిరాజ్ పూర్తి అంకితభావాన్ని ప్రదర్శించారని తెలిపింది. కుటుంబానికి దూరంగా.. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో విగ్రహ నిర్మాణ సమయంలో అరుణ్ యోగిరాజ్ చూపిన ఏకాగ్రత, కనబరిచిన త్యాగం అమోఘమని అన్నారు. విగ్రహం తయారు చేసే సమయంలో ఈ పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులకు కూడా ఆయన దూరంగా ఉన్నారని చంపత్ రాయ్ తెలిపారు. చివరికి తన పిల్లల ముఖాలు కూడా చూడలేదని, మొబైల్ ఫోన్ కూడా ఉపయోగించలేదని పేర్కొన్నారు. శంకరాచార్యుల విగ్రహం కూడా.. అరుణ్ యోగిరాజ్కు విగ్రహాల తయారీతో అమితమైన అనుబంధం ఉందన్నారు. వారి పూర్వీకులు కూడా శిల్పకళా నైపుణ్యం కలిగినవారేనన్నారు. కాగా కేదార్నాథ్లోని శంకరాచార్యుల విగ్రహం, ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గరున్న సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. ఇంటిలో సంక్రాంతి సంబరాలు అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన బాలరాముని విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్న నేపధ్యంలో అతని కుటుంబ సభ్యులంతా ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ నేపధ్యంలోనే వారంతా మకర సంక్రాంతిని అత్యంత వేడుకగా చేసుకున్నారు. ఈ సందర్భంగా శిల్పి అరుణ్ యోగిరాజ్ తల్లి సరస్వతి, భార్య విజేత యోగిరాజ్ మీడియాతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ట్రస్ట్ ప్రకటన ఆనందదాయకం అరుణ్ యోగిరాజ్ తల్లి సరస్వతి మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ రోజున శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తమ కుమారుని గురించి చేసిన ప్రకటన తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. రామ్లల్లా విగ్రహాన్ని చెక్కడానికి మైసూర్లోని హెగ్గదేవన్కోట్లోని కృష్ణ శిలను తమ కుమారుడు ఎంచుకున్నాడన్నారు. ఆ రాయిని శిల్పంగా మలిచేముందు తాను ఆ కృష్ణ శిలను పూజించానని తెలిపారు. ‘జీవితం సార్థకమైంది’ అరుణ్ యోగిరాజ్ భార్య విజేత మాట్లాడుతూ తన భర్త చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమ జీవితం సార్థకమైందన్నారు. తన భర్త అరుణ్ ఆరు నెలలపాటు అయోధ్యలో ఉన్న సమయంలో పిల్లలను చూసుకోవడం కొంచెం కష్టంగా మారిందన్నారు. అయితే ఇప్పుడు తన భర్త రూపొందించిన విగ్రహం ఎంపిక కావడం, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తన భర్తను అభినందించడం ఆనందంగా ఉందన్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు వెళితే ఎంత ఖర్చవుతుంది? ఎక్కడ బస చేయాలి? -
అయోధ్యకు వెళితే ఎంత ఖర్చవుతుంది? ఎక్కడ బస చేయాలి?
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం, శ్రీరాముని ప్రాణప్రతిష్ట వేడుక జనవరి 22న ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తూ వారికి లేఖలు పంపారు. అయితే జనవరి 22 నాటికి అయోధ్యకు చేరుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? విమాన టిక్కెట్లు, హోటల్ గదుల ఛార్జీలు ఎలా ఉంటాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈజ్ మై ట్రిప్, థామస్ కుక్, ఎస్ఓటీసీ తదితర ట్రావెల్ సంస్థలు.. అయోధ్యలో జరిగే వేడుకకు హాజరయ్యేందుకు చాలామంది ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నాయి. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏడు వేల మందికి ఆహ్వానాలు పంపించారు. వీరిలో పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా ఉన్నారు. ‘థామస్ కుక్’, ‘ఎస్ఓటీసీ’ సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల నుండి అయోధ్యకు విమాన టిక్కెట్ల ధరలు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకూ చేరుకున్నాయి. ఇతర సమయాల కంటే ప్రస్తుతం విమాన ఛార్జీలు చాలా అధికంగా ఉన్నాయి. సోమవారం మేక్ మై ట్రిప్లో జనవరి 20న ముంబై నుంచి అయోధ్యకు వెళ్లేందుకు వన్వే ఫ్లైట్ టికెట్ రూ.17,900 నుంచి రూ.24,600 వరకూ ఉంది. అదే సమయంలో జనవరి 21 నాన్స్టాప్ విమానానికి రూ.20,699గా ఉంది. జనవరి 20న కోల్కతా నుంచి అయోధ్యకు విమాన టిక్కెట్ల ధర రూ.19,456 నుంచి రూ.25,761గా ఉంది. బెంగళూరు నుండి అయోధ్యకు వెళ్లాలనుకుంటే జనవరి 20కి రూ. 23,152 నుండి రూ. 32,855 వరకు విమాన టిక్కెట్ల ధర ఉంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈజ్ మై ట్రిప్ పేర్కొన్న వివరాల ప్రకారం అయోధ్య రామాలయ ప్రారంబోత్సవానికి దాదాపు ఏడువేల మంది అతిథులు హాజరుకానున్నారు. ఈనెల 22 తరువాత ప్రతిరోజూ మూడు నుండి ఐదు లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకునే అవకాశం ఉంది. నూతన రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలోని హోటళ్లన్నీ ఇప్పటికే పూర్తిగా బుక్ అయిపోయాయి. హోటళ్లలో గదుల ఆక్యుపెన్సీ రేటు 80 నుండి 100 శాతానికి చేరుకుంది. ఫలితంగా కొన్ని హోటళ్లలో రాత్రిపూట గది అద్దె ధర రూ.70 వేలు వరకూ చెబుతున్నారు. అందుకే అయోధ్యకు వచ్చే చాలామంది భక్తులు పగటిపూట అయోధ్యలో ఉంటూ, రాత్రి పూట లక్నో లేదా ప్రయాగ్రాజ్లో బస చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో భూములు కొన్న అమితాబ్.. రేట్లు ఎలా ఉన్నాయి? -
నేటి నుంచి ‘ప్రాణప్రతిష్ఠ’ ముందస్తు ఆచారాలు ప్రారంభం!
అయోధ్యలో ఈనెల 22న జరగబోయే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠాపనకు సంబంధించిన ఆచారాలు, నియమాలు మకర సంక్రాంతి పండుగ నుంచి అంటే నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనే 11 మంది దంపతులు నేటినుంచి 45 నియమాలను పాటించనున్నారు. ప్రాయశ్చిత్తం, గోదానం, దశవిధ స్నానం, ప్రాయశ్చిత్త క్షౌర్యం, పంచగవ్యప్రాశన మొదలైన నియమాలను ఈ 11 మంది దంపతులు పాటించనున్నారు. ఈ నియమాలను పాటించడం ద్వారా వీరు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని సక్రమరీతిలో నిర్వహించగలుగుతారని పండితులు చెబుతున్నారు. సోమవారం సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడంతో ఈ దంపతులంతా మొదటి స్నానం చేసి, ఎనిమిది రోజులపాటు ఈ నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనే 11 మంది దంపతులకు వారు పాటించాల్సిన నియమనిబంధనలను తెలియజేసింది. ట్రస్ట్ వీరిచేత ఈ నిబంధనల పాలనకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించనుంది. ఈ దంపతులు ఉదయం సాయంత్రం ప్రార్థన,పూజాదికాలలో పాల్గొంటూ నిరంతరం రామనామం జపించాలి. అలాగే సాత్విక ఆహారం తీసుకుంటూ, జీవనశైలి సాత్వికంగా ఉండేలా చూసుకోవాలి. జనవరి 22న అభిజిత్ ముహూర్తపు 84 సెకన్ల కాలంలో వైదిక సంప్రదాయాలను అనుసరించి బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో నటి హేమమాలిని నృత్య ప్రదర్శన! -
700 శవపరీక్షలు చేసిన మహిళకు శ్రీరామ ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానం
అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాల రామ విగ్రయ ప్రాణ ప్రతిష్టకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఆహ్వానితులు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తున్నారు. పౌర పురస్కార గ్రహీతలు, సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తులు, రామ మందిర ఉద్యమంలో మరణించిన కరసేవకుల కుటుంబ సభ్యులు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట వేడుకకు ఆహ్వానితుల్లో ఉన్నారు. తాజాగా 700 శవపరీక్షలు నిర్వహించిన ఛత్తీస్గఢ్ మహిళ సంతోషి దుర్గకు రామమందిరానికి ఆహ్వానం రావడం విశేషంగా నిలిచింది. జనవరి 22న అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రామమందిర్ ట్రస్ట్ నుండి ఆహ్వానం అందుకున్నారు. దీంతో సంతోషి దుర్గ సంతోషంగా ఉబ్బితబ్బిబ్బవుతోంది. తన జీవితంలో ఇలాంటి అదృష్టం దక్కుతుందని ఊహించలేదు. సాక్షాత్తూ ఆ రాముడే తన ఆహ్వానం పంపాడంటూ పరవశంలో మునిగి తేలుతూ భావోద్వేగానికి లోనైంది. ఆహ్వానం అందినందుకు గాను ప్రధాని మోదీకి, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు కృతజ్ఞతలు తెలియజేశారు.నర్హర్పూర్ (ఛత్తీస్గఢ్)కు చెందిన సంతోషి దుర్గ(35) ప్రత్యేకత ఏంటంటే 700 శవపరీక్షలు నిర్వహించారు. నర్హర్పూర్ ప్రాథమిక ఆరోగ్యంలో జీవన్ దీప్ కమిటీకి దాదాపు 18 సంవత్సరాలు పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు.. ఈ సమయంలో, ఆమె 700 పోస్ట్మార్టమ్లను నిర్వహించడం విశేషం ఆమె చేసిన కృషికి వివిధ సంఘాల నుండి గుర్తింపు పొందారు. ఆహ్వాన లేఖ అందగానే ఆశ్చర్యపోయానని, ఆనందంతో కన్నీళ్లు వచ్చాయని ఆమె వెల్లడించారు.మార్చురీలో చిన్న ఉద్యోగం చేస్తున్న వ్యక్తి పనికి ఇంత పెద్ద గౌరవం లభించడంపై ఎంతగానో పొంగిపోయింది. జనవరి 18న నర్హర్పూర్ నుండి బయలుదేరి, అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరై, నర్హర్పూర్ ప్రజల సంతోషం, శాంతి , పురోగతి కోసం ప్రార్థించాలనుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. మరోవైపు నర్హర్పూర్ BMO ప్రశాంత్ కుమార్ సింగ్ కూడా సంతోషిని అభినందించారు.ఇ ది తమకు కూడా గర్వకారణమన్నారు. కాగా అయోధ్యలోశ్రీ రామమందిర ప్రారంభోత్సవం జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు శుభ ముహూర్తంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి రామాలయ ఉద్యమంలో పాల్గొన్న నాయకుల బంధువులు, న్యాయవాదుల బృందం, హిందూ సాధువులు, నేపాల్లోని సెయింట్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు, జైన, బౌద్ధులకు చెందిన వ్యక్తులు ఉంటారు. ఇంకా సిక్కు కమ్యూనిటీలు, గిరిజన సంఘాల ప్రతినిధులు, వార్తాపత్రికలు ,టెలివిజన్ ఛానెల్ల రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు, నోబెల్ బహుమతి, భారతరత్న, పరమవీర చక్ర , పద్మ అవార్డుల వంటి ప్రతిష్టాత్మక అవార్డుల గ్రహీతలు, ముగ్గురు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వరకు , త్రివిధ దళాల విశ్రాంత అధిపతులు, మాజీ రాయబారులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులుతోపాటు, మేధావులు, క్రీడాకారులు, ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు , పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు. -
14 లక్షల దీపాలతో పరాక్రమ శ్రీరాముడు
కోట్లాది మంది రామభక్తుల ఆకాంక్ష త్వరలో కనులముందు నిలవబోతోంది. జనవరి 22న అయోధ్యలో రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 22న దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొననుంది. అయోధ్యలో ఇప్పటికే ఉత్సవ వాతావరణం కనిపిస్తోంది. బీహార్కు చెందిన కళాకారులు అయోధ్యలో అద్భుత కళాకృతిని తీర్చిదిద్దారు. 14 లక్షల దీపాలతో రాముని ఆకృతిని రూపొందించారు. ఈ కళాఖండాన్ని బీహార్ మొజాయిక్ కళాకారుడు అనిల్ కుమార్ తన సహోద్యోగులతో కలిసి తీర్చిదిద్దారు. కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే శనివారం అయోధ్యకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యలో బీహార్ కళాకారుల బృందం ఏడు రోజుల పాటు శ్రమించి 14 లక్షల దీపాలతో పరాక్రమ రూపంలోని శ్రీరాముని ఆకృతిని తీర్చిదిద్దిందని తెలిపారు. 14 ఏళ్ల అజ్ఞాతవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. నవ భారత యువకులలో ‘శౌర్యం’ ఉండాలనే సందేశాన్ని ఈ రూపం అందిస్తున్నదని పేర్కొన్నారు. ఈ ఆర్ట్వర్క్లో ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ల ఛాయాచిత్రాలు కూడా ఉన్నాయి. దీపాలతో ‘జై శ్రీరామ్’ ఆకృతిని కూడా రూపొందించారు. ఇది కూడా చదవండి: అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట.. అతిథులకు అపూర్వ కానుక अयोध्या धाम के साकेत महाविद्यालय में श्रीराम कर्मभूमि न्यास सिद्धाश्रम बक्सर द्वारा 14 लाख दीयों से भगवान श्रीराम का पराक्रमी स्वरूप, श्रीरामलला मंदिर, आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, मा. मुख्यमंत्री योगी आदित्यनाथ जी छवि उकेरी गई। इस कार्य में लगे सभी कलाकारों को बधाई। pic.twitter.com/7YrPs9LoVQ — Ashwini Kr. Choubey (@AshwiniKChoubey) January 13, 2024 -
అయోధ్యలో రోజుకు 30 వేల మందికి వసతి!
ఈ నెల 22న బాలరాముడు తన దివ్యమైన దేవాలయంలో ఆసీనులు కానున్నాడు. ఆరోజు ప్రత్యేక అతిథుల సమక్షంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇది పూర్తయ్యాక అంటే 22వ తేదీ తరువాత సామాన్య భక్తులను అయోధ్యకు ఆహ్వానించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. జనవరి 22 తర్వాత వచ్చే భక్తుల వసతి, ఆహారం తదితర అంశాలకు సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు సీఎం యోగి స్వయంగా బ్లూప్రింట్ను సిద్ధం చేసి అధికారులకు అందించారు. ఈ మేరకు ప్రతిరోజూ 30 వేల మంది బస చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని వసతి సౌకర్యాలను మరింతగా పెంచనున్నారు. ఇటీవల అయోధ్యకు వచ్చిన యోగి ఆదిత్యనాథ్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి, భక్తులకు వసతి సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించారు జనవరి 22 తరువాత వచ్చే భక్తులకు హోటళ్లు, ధర్మశాలలు, హోమ్ స్టే, టెంట్ సిటీ, డార్మిటరీలో వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా రామనగరికి వచ్చే భక్తుల విషయంలో అధికారులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇది కూడా చదవండి: ‘రామచరిత మాసన’ విక్రయాల జోరు! -
‘రామచరిత మాసన’ విక్రయాల జోరు!
ఈనెల 22న అయోధ్యలో నూతన రామాలయాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపధ్యంలో దేశమంతా రామభక్తిలో మునిగిపోయింది. ఈ ప్రభావంతో దేశంలో ‘రామచరితమానస’ పుస్తకాలకు, ఆడియో, వీడియోలకు మునుపెన్నడూ లేనంత డిమాండ్ పెరిగింది. 50 ఏళ్లలో తొలిసారిగా ‘రామచరిత్మానస’కు అమితమైన ఆదరణ లభించిందని ‘రామచరిత్మానస’విక్రేతలు చెబుతున్నారు. VIDEO | For the first time in 50 years, Gita Press in UP's Gorakhpur is facing shortage of Ramcharitmanas in its stock amid rise in demand ahead of the Ram Mandir Pran Pratishtha ceremony in Ayodhya on January 22. pic.twitter.com/twZYGgU05c — Press Trust of India (@PTI_News) January 12, 2024 ‘రామచరితమానస’ పుస్తకం విషయానికొస్తే దీనిని ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో గల గీతా ప్రెస్ విరివిగా ముద్రిస్తోంది. గడచిన 50 ఏళ్లలో తొలిసారిగా గీతా ప్రెస్లో ‘రామచరితమానస’ స్టాక్ తగినంతగా లేని పరిస్థితి ఏర్పడింది. రామచరితమానసకు పెరుగుతున్న డిమాండ్ను చూసి, గీతా ప్రెస్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. VIDEO | "Ever since the date of Ram Lalla's Pran Pratishtha has been announced, the demand for Ramcharitmanas, along with Sundar Kand and Hanuman Chalisa, has increased. In the previous years, we were publishing around 75,000 copies of Ramcharitmanas every month. This year, we… pic.twitter.com/w0jniGjoWl — Press Trust of India (@PTI_News) January 12, 2024 పెరిగిన డిమాండ్కు తగ్గట్టు గీతాప్రెస్లో ‘రామచరితమానస’ పుస్తకం ప్రింటింగ్ను వేగవంతం చేస్తున్నారు. గీతా ప్రెస్ మేనేజర్ లాలమణి త్రిపాఠి మాట్లాడుతూ అయోధ్యలో నూతన రామమందిరం ప్రారంభానికి సంబంధించిన ప్రకటన వచ్చినప్పటి నుంచి ‘సుందరాకాండ’, ‘హనుమాన్ చాలీసా’ ‘రామచరితమానస’కు డిమాండ్ మరింతగా పెరిగిందని అన్నారు. గతంలో ‘రామచరితమానస’ పుస్తకాలకు సంబంధించి ప్రతి నెల దాదాపు 75 వేల కాపీలు ముద్రితమయ్యేవని, ఇప్పుడు దానిని లక్షకు పెంచినప్పటికీ, స్టాక్ ఉండటం లేదన్నారు. ఇది కూడా చదవండి: ‘చావు తాకుతూ వెళ్లింది’.. కరసేవకుని నాటి అనుభవం! -
అయోధ్యకు వస్తే ఎవరూ ఆకలితో వెళ్లరు..
జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని పవిత్రోత్సవం జరగనుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే అతిథుల కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీరాముని ఆస్థానానికి వచ్చే ఏ అతిథి కూడా ఆకలితో తిరిగి వెళ్లలేని రీతిలో ఉత్సవ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న సందర్భంగా 45 ప్రాంతాల్లో భోజనశాలలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ భోజన శాలలలో స్వచ్ఛమైన సాత్విక ఆహారాన్ని అందించనున్నారు. భక్తులకు వివిధ రాష్ట్రాల వంటకాలను కూడా అందుబాటులో ఉంచనున్నారు. లిట్టి-చోఖా, రాజస్థానీ దాల్ బాటి చుర్మా, పంజాబీ తడ్కా, సౌత్ ఇండియన్ మసాలా దోశ, ఇడ్లీ, బెంగాలీ రస్గుల్లా, జలేబీ తదితర వంటకాలు, స్వీట్లను తయారు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: ‘చావు తాకుతూ వెళ్లింది’.. కరసేవకుని నాటి అనుభవం! -
‘చావు తాకుతూ వెళ్లింది’.. కరసేవకుని నాటి అనుభవం!
అది.. 1992, డిసెంబర్.. దేశం నలుమూలల నుండి రామభక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. రాజస్థాన్లోని జోధ్పూర్ కరసేవకుల బృందం కూడా అయోధ్యకు తరలివచ్చింది. వారిలో జోధ్పూర్ నివాసి కన్రాజ్ మొహ్నోత్ కూడా ఉన్నారు. నాటి ఆ ఉద్యమం గురించి కన్రాజ్ మొహ్నోత్ మాట్లాడుతూ ‘ఆ సమయంలో కరసేవకులు ఉత్సాహంతో అయోధ్యవైపు పయనవుతున్నారు. ఇదే సందర్భంలో రైళ్లలో ముమ్మర తనిఖీలు జరిగాయి. పలువురిని పోలీసులు విచారించారు. కొన్ని చోట్ల కరసేవకులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. మేము అయోధ్య కన్నా ముందుగా వచ్చే ఒక స్టేషన్లో దిగాం. అనంతరం బృందాలుగా ఏర్పడి, కాలినడకన రహస్యంగా హనుమాన్నగర్ చేరుకున్నాం. ఉద్యమ సమయంలో మృత్యువుకు దగ్గరగా వెళ్లిన రోజు నాకింకా గుర్తుంది. తుపాకీ బుల్లెట్ నా చెవిని దాటి వెళ్లింది. శ్రీరాముని దయతో అపాయం నుంచి తృటిలో తప్పించుకున్నాను. అయితే ఆ బుల్లెట్ నా వెనుకనున్న కరసేవకుడు సీతారామ్ పరిహార్కి తగిలింది. ఆ ప్రదేశంలో ఆసుపత్రి ఎక్కడుందో మాకు తెలియలేదు. అక్కడున్న స్థానికులు కూడా మాకు సహాయం చేయలేదు. చివరకు గంటన్నర పాటు మృత్యువుతోపోరాడిన సీతారాం చనిపోయాడు. ప్రొఫెసర్ మహేంద్రనాథ్ అరోరా కూడా ఇదేవిధంగా ప్రాణత్యాగం చేశారు. వారిద్దరి మృతదేహాలను అయోధ్య నుంచి వ్యాన్లో వారి స్వస్థలమైన జోధ్పూర్కు తీసుకువచ్చి అంత్యక్రియలు చేశాం. ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత అయోధ్య రామాలయం కల నెరవేరింది’ అని అన్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో ‘ప్రాణ ప్రతిష్ఠ’.. అమెరికాలో సందడి! -
అయోధ్యలో ‘ప్రాణ ప్రతిష్ఠ’.. అమెరికాలో సందడి!
అయోధ్యలో ఈనెల 22న జరిగే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠాపనపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ కార్యక్రమానికి ముందుగానే అమెరికాలో రామభక్తులు ఇప్పటికే కార్లు, బైక్ ర్యాలీలు చేపట్టారు. ఇంతేకాకుండా జనవరి 22 న అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ప్రముఖ టైమ్స్ స్క్వేర్లో ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానున్నది. అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతనిస్తూ విశ్వహిందూ పరిషత్కు చెందిన అమెరికన్ యూనిట్ అక్కడి పది రాష్ట్రాల్లో హోర్డింగ్లను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకూ మొత్తం 40 హోర్డింగ్లను ఏర్పాటు చేసినట్లు వీహెచ్పీ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా టెక్సాస్, ఇల్లినాయిస్, న్యూయార్క్, న్యూజెర్సీ , జార్జియా రాష్ట్రాల్లో ఈ బోర్టులు ఏర్పాటు చేశారు. అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 15 నుండి అరిజోనా, మిస్సోరీలలోని ఆలయాలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నారు. న్యూజెర్సీలో పలువురు హిందువులు కారు ర్యాలీలు, మేళాల నిర్వహణలో నిమగ్నమై ఉన్నారని అమెరికా వీహెచ్పీ జాయింట్ సెక్రటరీ తేజా షా తెలిపారు. ఇదిలావుండగా ఆస్ట్రేలియా, యూకే, కెనడా, చికాగోలకు చెందిన రామభక్తులు భారతదేశానికి వచ్చేందుకు ఇప్పటికే తమ విమాన టిక్కెట్లను బుక్ చేసుకున్నారని సమాచారం. -
రాములోరికి 44 క్వింటాళ్ల లడ్డూల భోగం!
2019 నవంబర్లో సుప్రీం కోర్టు ఇచ్చిన ‘రామ జన్మభూమి’ తీర్పు రామభక్తులకు ఎనలేని సంతోషాన్నిచ్చింది. 2020 ఆగస్ట్ 5న ప్రధాని నరేంద్ర మోదీ నూతన రామాలయ భూమి పూజను నిర్వహించడంతో రామ భక్తులు సంబరాలు చేసుకున్నారు. ఇక ఇప్పుడు రాబోయే 22న నూతన రామాలయం ప్రారంభం కానుండటంతో రామభక్తులు పెద్దఎత్తున పండుగ చేసుకోబోతున్నారు. 2024, జనవరి 22.. ఈ తేదీ చరిత్ర పుటల్లో నమోదుకానుంది. శ్రీ రాముడు ఆ రోజున దివ్యమైన రామాలయంలో కొలువుదీరనున్నాడు. ఈ నేపధ్యంలో పలువురు భక్తులు రాములోరికి విలువైన కానుకలు సమర్పిస్తున్నారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడికి తరలివచ్చే భక్తులకు ‘దేవ్రహా బాబా’ లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఈ ప్రసాదాన్ని స్వచ్ఛమైన దేశీ నెయ్యితో తయారు చేస్తున్నారు. ‘దేవ్రహా బాబా’ రామ మందిర నిర్మాణాన్ని ముందే ఊహించిన సాధువు. శ్రీరాముడు జన్మించిన ప్రదేశం ఇదేనని ఆయనే తెలియజేశారు. శ్రీరామునికి భోగంగా సమర్పించేందుకు 44 క్వింటాళ్ల లడ్డూలను దేశీ నెయ్యితో తయారు చేస్తున్నామని, ఒక్క చుక్క నీరు కూడా వాడలేదని దేవ్రహ బాబా శిష్యులు తెలిపారు. ఈ లడ్డూలు ఆరు నెలల వరకూ చెడిపోవని పేర్కొన్నారు. ఈ లడ్డూలను వెండి పళ్లెంలో రామ్లల్లాకు నైవేద్యంగా సమర్పిస్తామన్నారు. అనంతరం వీటిని భక్తులకు ప్రసాదంలా పంపిణీ చేయనున్నామన్నారు. 44 క్వింటాళ్ల బరువు కలిగిన ఒక వేయి 111 లడ్డూలను తయారు చేస్తున్నామన్నారు. శ్రీరామునికి ఈ విధమైన సేవ చేయడం తమకు ఎంతో ఆనందదాయకంగా ఉందని దేవ్రహ బాబా శిష్యులు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో హోటల్ గది అద్దెలు ఆకాశానికి! -
అయోధ్యలో హోటల్ గది అద్దెలు ఆకాశానికి!
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జనవరి 22న రామ్లల్లా పవిత్రోత్సవం జరగనుంది. ఈ నేపధ్యంలో ఇక్కడి హోటళ్ల బుకింగ్స్ ఇప్పటికే 80 శాతం మేరకు పూర్తయ్యాయి. హోటల్ రూమ్ బుకింగ్ ధర గతంలో కంటే ఐదు రెట్లు పెరిగింది. అయోధ్యలో 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో భక్తులు కూడా ఇక్కడికి వచ్చేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో అయోధ్యలోని పలు లగ్జరీ హోటళ్లలో ఒక రోజు రూమ్ బుకింగ్ లక్ష రూపాయల వరకూ చేరింది. రామ్లల్లా పవిత్రోత్సవం రోజున మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి కూడా ఐదు లక్షల మంది వరకూ భక్తులు అయోధ్యకు వస్తారనే అంచనాలున్నాయి. ఈ పరిస్థితులను గమనించిన స్థానిక హోటళ్ల యజమానులు రూమ్ల ధరలను అమాంతం పెంచేశారు. హోటల్ అయోధ్య ప్యాలెస్లో ప్రస్తుతం రోజువారీ గది అద్దె సుమారు రూ. 18,500 పలుకుతోంది. సాధారణంగా ఇక్కడ గది అద్దె రూ. 3,700. ది రామాయణ హోటల్లో ప్రస్తుతం రోజువారీ గది అద్దె రూ. 40 వేలు. 2023లో దీని అద్దె రూ. 14,900గా ఉండేది. సిగ్నెట్ కలెక్షన్ హోటల్లో ప్రస్తుతం ఒకరోజు అద్దె దాదాపు రూ.70, 500. గత ఏడాది జనవరిలో ఇక్కడ గది అద్దె రూ. 16,800గా ఉండేది. మీడియాకు అందిన వివరాల ప్రకారం అయోధ్యలోని రామాయణ్ హోటల్లోని గదుల బుకింగ్ ఇప్పటికే 80 శాతం మేరకు పూర్తయింది. ఈ హోటల్లోని గదులు జనవరి 20 నుండి 23 వరకు ఇప్పటికే బుక్ అయ్యాయి. ఈ హోటల్లో గది అద్దె రోజుకు రూ.10,000 నుంచి రూ.25,000 వరకూ పెరిగింది. రానున్న రోజుల్లో ఛార్జీలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల అయోధ్యలోని పార్క్ ఇన్ రాడిసన్లోని విలాసవంతమైన గది ఒకరోజు అద్దె లక్ష రూపాయలకు బుక్ అయ్యింది. ఈ హోటల్లోని గదులన్నీ బుక్ అయ్యాయని హోటల్ యాజమాన్యం తెలిపింది. గతంలో ఈ హోటల్లో గది అద్దె కనీసంగా రూ.7,500 ఉండేది. ఇది కూడా చదవండి: 2,100 కిలోల గంట.. 108 అడుగుల అగరుబత్తి -
ఆ జిల్లాతో శ్రీరామునికి విడదీయరాని అనుబంధం!
ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో శ్రీరాముని జీవిత చరిత్రకు సంబంధించిన అనే కథలు ముడిపడివున్నాయి. బస్తీ జిల్లాను వశిష్ఠ మహర్షి తపోప్రదేశంగా గుర్తిస్తారు. శ్రీరాముని తండ్రి దశరథుడు బస్తీ జిల్లాలోని మస్ఖధామ్లో పుత్రకామేష్ఠి యాగాన్ని నిర్వహించాడని చెబుతారు. వేదాలు, పురాణాలలో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రస్తావనలు కనిపిస్తాయి. శ్రీరాముని నగరమైన అయోధ్యకు కొద్ది దూరంలోనే బస్తీ జిల్లా ఉంది. ఈ జిల్లాకు రాముని నగరమైన అయోధ్యతో సన్నిహిత సంబంధం ఉంది. శ్రీరాముడు.. రావణుని సంహరించి, తన భార్య సీతామాతతో కలిసి లంక నుండి తిరిగి వచ్చినప్పుడు, ఇక్కడి మనోరమ- కువానో సంగమం ఒడ్డున లిట్టిచోఖాను తిన్నారని స్థానికులు చెబుతుంటారు. నాటి నుండి ఈ ప్రాంతంలో జాతర నిర్వహిస్తున్నారు. పవిత్రమైన మనోరమ నదిలో స్నానం చేయడం ద్వారా పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు. ప్రతీయేటా చైత్ర పూర్ణిమ రోజున రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి వేలాది మంది జనం ఇక్కడికి వచ్చి మనోరమ కువానో సంగమం ఒడ్డున స్నానాలు చేస్తారు. ఆ తరువాత వారు లిట్టి చోఖాను తయారు చేసి పరస్పరం పంచుకుంటారు. ఈ జాతర ఐదు రోజుల పాటు జరుగుతుంది. ఇది కూడా చదవండి: 2,100 కిలోల గంట.. 108 అడుగుల అగరుబత్తి -
టీచర్: రామూ.. ‘జై శ్రీరామ్’.. జానకీ.. ‘జై శ్రీ రామ్’..!
సాధారణంగా ఏదైనా పాఠశాలలో ఉపాధ్యాయులు హాజరు వేసేటప్పుడు విద్యార్థులు ‘ఎస్ మేడమ్’ అనో లేదా ‘ఎస్ సార్’ అనో అంటుంటారు. అయితే ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు హాజరువేసేటప్పుడు విద్యార్థులు ‘జై శ్రీరామ్’ అని అంటారు. అంటే ఉపాధ్యాయురాలు రామూ అనే పేరును పిలవగానే ఒక కుర్రాడు లేచి నిలుచుని ‘జై శ్రీరామ్’ అంటాడు. అలాగే జానకీ అని టీచర్ పిలవగానే ఒక విద్యార్థిని లేచి ‘జై శ్రీరామ్’ అని అంటుంది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఈ వీడియోలో హాజరు వేస్తున్న టీచర్ విద్యార్థుల పేర్లను పలికినప్పుడు వారు ‘జైశ్రీరాం’ అని అంటుంటారు. దీనికి టీచర్ ఏమీ అభ్యంతరం చెప్పకుండా విద్యార్థులకు హాజరు వేస్తుంటారు. దీనిని అదే క్లాసులోని ఎవరో విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. విద్యార్థులు ‘జై శ్రీరామ్’ అంటుండగా ఉపాధ్యాయురాలు హాజరు వేయడాన్ని మనం వీడియోలో చూడవచ్చు. ఉపాధ్యాయురాలు క్లాస్లోని బ్లాక్బోర్డ్ దగ్గర నిలుచుని విద్యార్థుల పేర్లను ఒక్కొక్కటిగా పిలుస్తుండగా, చాలా మంది పిల్లలు జై శ్రీరామ్ అంటూ కూర్చోగా, మరికొందరు చేతులు జోడించి జై శ్రీరామ్ అని చెబుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో @aaravxelvish ఖతాలో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ ఎనిమిది వేలకు పైగా వీక్షణలు దక్కాయి. కొన్ని వందల మంది ఈ వీడియోకు లైక్ చెప్పారు. ఈ నెల 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపధ్యలో దేశంలో రాముని పేరిట పలు భక్తిపూర్వక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఆ స్కూలులో హాజరు సమయంలో ‘జై శ్రీరామ్’ నినాదాన్ని పలుకున్నట్లు సమాచారం. ఇది కూడా చదవండి: రామాలయం బంగారు తలుపు ఇదే.. ఫొటో వైరల్! JAI SHREE RAM ONLY 🔱 School attendance Yes sir , mam ❌ #JaiShreeRam #Hindu #ElvishArmy #RamMandirAyodhya pic.twitter.com/DMocOspPIB — 𝐀𝐀𝐑𝐀𝐕𝕏𝐄𝐋𝐕𝐈𝐒𝐇 (@aaravxelvish) January 8, 2024 -
రామాలయం బంగారు తలుపు ఇదే.. ఫొటో వైరల్!
అయోధ్యలో నూతన రామాలయ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 22న ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపధ్యంలో ఆలయానికి సంబంధించిన ఫొటోలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో రామాలయంలో ఏర్పాటు చేసిన బంగారు తలుపునకు సంబంధించిన తొలి ఫొటో బయటకు వచ్చింది. దానిపై ముచ్చట గొలిపే కళాకృతులు ఉన్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ తలుపు 12 అడుగుల ఎత్తు, ఎనిమిది అడుగుల వెడల్పు కలిగివుంది. ఈ తలుపును మొదటి అంతస్తులో అమర్చారు. రామ మందిరంలో మొత్తం 46 తలుపులను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 42 తలుపులకు 100 కిలోల బంగారు పూత వేయనున్నారు. గుడి మెట్ల దగ్గర ఉండే నాలుగు తలుపులకు బంగారు పూత ఉండదు. మీడియా నివేదికల ప్రకారం రాబోయే రోజుల్లో మరో 13 బంగారు తలుపులను అమర్చనున్నారు. రామాలయం తలుపునకు సంబంధించిన ఫొటోలో రెండు ఏనుగులు స్వాగతం పలుకుతూ కనిపిస్తున్నాయి. ద్వారం పైభాగంలో రాజభవనం తరహా ఆకృతి కనిపిస్తుంది. ఇక్కడ ఇద్దరు సేవకులు ముకుళిత హస్తాలతో కనిపిస్తారు. తలుపునకు దిగువన చదరపు ఆకారంలో అందమైన కళాకృతులు కనిపిస్తాయి. ఈ తలుపులను తయారు చేసేపనిని హైదరాబాద్కు చెందిన ఒక కంపెనీ చేపడుతోంది. ఈ కంపెనీ మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల నుంచి తలుపులకు అవసరమయ్యే కలపను ఎంపిక చేసింది. తలుపులను కన్యాకుమారికి చెందిన కళాకారులు తయారుచేస్తున్నారు. నూతన రామాలయానికి సంబంధించి బయటకు వస్తున్న ఫొటోలను అనురించి చూస్తే రామాలయం ఎంతో వైభవంగా ఉండనున్నదని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: అయోధ్యలో ప్రతీయేటా ప్రాణప్రతిష్ఠ మహోత్సవం -
అయోధ్యలో ప్రతీయేటా ప్రాణప్రతిష్ఠ మహోత్సవం
అయోధ్యలో ఈనెల 22న నూతన రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ నేపధ్యంలో మున్ముందు అయోధ్యలో అనేక అభివృద్ధి పనులు జరగనున్నాయి. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విలేకరుల సమక్షంలో అయోధ్యలో అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అయోధ్యలో సెవెన్ స్టార్ హోటల్ నిర్మిస్తామని, దానిలో శాకాహారం అందిస్తామని యూపీ సీఎం యోగి తెలిపారు. అలాగే ప్రతీయేటా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ ఉత్సవం నిర్వహిస్తామని అన్నారు. ఎప్పుడో పదేళ్ల క్రితమే జరగాల్సిన ఉత్సవం ఇప్పుడు జరుగుతోందని అన్నారు. ఈ నెల 22న అయోధ్యలో జరిగే ఉత్సవం వెలుగుల పండుగ దీపావళిలా ఉంటుందని అన్నారు. అయోధ్యలో హోటళ్ల ఏర్పాటుకు సంబంధించి 25కు పైగా ప్రతిపాదనలు వచ్చాయన్నారు. వాటిలో ఒకటి కేవలం శాకాహారం అందించే సెవెన్ స్టార్ హోటల్ అని తెలిపారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై స్థానిక అధికారులతో చర్చించామని అన్నారు. అయోధ్యకు దేశంలోని నలుమూలల నుంచి రోడ్డు, విమాన, రైలు కనెక్టివిటీ ఏర్పడిందన్నారు. వీధి వ్యాపారుల వ్యాపార నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. అయోధ్యలో గ్రీన్ కారిడార్ నిర్మిస్తామని, రామభక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గత రామ నవమికి ఐదు లక్షల మంది భక్తులు అయోధ్యకు వస్తారని అంచనా వేయగా, ఆ సంఖ్య 35 లక్షలు దాటిందని ముఖ్యమంత్రి తెలిపారు. అయోధ్యకు వచ్చే రామభక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇది కూడా చదవండి: బాలరామునికి ప్రధాని నరేంద్ర మోదీ నామకరణం! -
బాలరామునికి ప్రధాని నరేంద్ర మోదీ నామకరణం!
ఈ నెల 22న అయోధ్యలో జరిగే బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన అతిథిగా హాజరుకానున్నారు. ఆయన ఆరోజు గర్భగుడిలో రామ్లల్లాకు పట్టాభిషేకం చేయనున్నారు. బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన తరువాత ప్రధాని మోదీ ఆ విగ్రహానికి పేరు పెట్టనున్నారు. ఆయన ఏ పేరు పెడతారనేది 22న తెలియనుంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్న కాశీకి చెందిన పండితులు బాలరామునికి ఏ పేరు పెట్టాలనేది శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయిస్తుందని చెప్పారు. విగ్రహానికి నామకరణం చేసే విషయమై ట్రస్టు సభ్యులు శాస్త్ర నిపుణులతో చర్చిస్తున్నారు. అయోధ్యకు తరలివచ్చిన పండితులు ముందుగా రామనగరిలో స్థానిక దేవతలుగా పూజిలందుకుంటున్న దేవతలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానాన్ని అందించారు. ఏదైనా శుభ కార్యం, పూజలు లేదా ఆచారాల నిర్వహణకు స్థానికులు ఇక్కడి దేవతలను పూజిస్తుంటారు. ఈ నేపధ్యంలోనే పండితులు ముందుగా హనుమాన్గర్హిలో కొలువైన హనుమంతులవారికి, శివుని పౌరాణిక పీఠమైన నాగేశ్వరనాథ్, సరయూమాత, కనక్ బిహారీ సర్కార్ దేవతలకు ఆహ్వానం అందించారు. పండితులు ఈ ఆలయాలకు వెళ్లి పూజలు చేసి..‘మీ నగరంలో భారీ కార్యక్రమం జరగబోతోందని, మీరు వచ్చి ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజలలో పాల్గొనాలని’ వేడుకున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్య ఎయిర్పోర్టుకు భారీ భద్రత -
అయోధ్య ఎయిర్పోర్టుకు భారీ భద్రత
జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయ ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ సందర్భంగా అయోధ్య విమానాశ్రయంలో 150 మంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కమాండోలను మోహరించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అయోధ్య విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు. ఈ విమానాశ్రయానికి సీఐఎస్ఎఫ్ రక్షణ కల్పించడంపై గతంలో చర్చలు జరిగాయి. కేంద్ర భద్రత , ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సమీక్షలో ఈ విమానాశ్రయానికి సీఐఎస్ఎఫ్ ప్రొఫెషనల్ సెక్యూరిటీని సిఫార్సు చేశారు. అయోధ్య విమానాశ్రయ సామర్థ్యాన్ని క్రమంగా పెంచుతామని పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల చెప్పారు. మొదటి దశలో 65,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విమానాశ్రయాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి గంటకు రెండు నుంచి మూడు విమానాలను నిర్వహించగల సామర్థ్యం దీనికి ఉంటుంది. 2,200 మీటర్ల పొడవున రన్వే నిర్మించేందుకు పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ విమానాశ్రయంలో బోయింగ్ 737, ఎయిర్ బస్ 319, 320 విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అవకాశం ఉంది. విమానాశ్రయం రెండో దశ అభివృద్ధికి త్వరలో కేబినెట్ నుంచి ఆమోదం తీసుకుంటామని సింధియా తెలిపారు. రెండో దశలో రన్వే పొడవును 2,200 మీటర్ల నుంచి 3,700 మీటర్లకు పెంచనున్నారు. దీని వల్ల రన్వే పొడవు దాదాపు నాలుగు కిలోమీటర్లకు పెరగనుంది. -
Ayodhya Ram Mandir: రామాలయం కోసం 30 ఏళ్లుగా మౌనవత్రం!
నాడు శబరిలోని విశ్వాసం.. శ్రీరాముడు స్వయంగా ఆమె గుడిసె వద్దకు వచ్చేలా చేసింది. నేడు జార్ఖండ్కు చెందిన సరస్వతీదేవిలోని అపార నమ్మకం.. రామాలయం కల సాకారమయ్యేందుకు దోహదపడింది. శ్రీరాముడు తన భక్తురాలైన సరస్వతి కోరిక నెరవేర్చాడు. అందుకే ఆమె జనవరి 22న అయోధ్యకు చేరుకుని, తన 30 ఏళ్ల మౌన వ్రతాన్ని విరమించనుంది. జార్ఖండ్లోని ధన్బాద్ పరిధిలోని కరమ్తాండ్లో ఉంటున్న 85 ఏళ్ల సరస్వతి అగర్వాల్ 30 సంవత్సరాల క్రితం మౌనవ్రతం చేపట్టింది. అయోధ్యలో రామమందిరం నిర్మించే వరకు తాను ఎవరితోనూ మాట్లాడబోనని ఆమె శపథం చేసింది. జనవరి 22న అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన రోజున ఆమె 'రామ్, సీతారాం' అంటూ మౌన దీక్ష విరమించనుంది. శ్రీరాముని స్మరణకే తన జీవితాన్ని అంకితం చేసిన సరస్వతి అగర్వాల్ ఇకపై అయోధ్యలోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్నారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో ఆమె సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ‘నా జీవితం ధన్యమైంది. ప్రాణ ప్రతిష్టలో పాల్గొనేందుకు బాలరాముడు నన్ను ఆహ్వానించాడు. నా ఇన్నాళ్ల తపస్సు సఫలమయ్యింది. 30 ఏళ్ల తర్వాత నా మౌనం వీడనుంది. మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆశ్రమానికి వెళ్లి అక్కడే ఉండాలనుకుంటున్నాను’ అని ఆమె మీడియాకు తెలిపింది. సరస్వతి అగర్వాల్కు అయోధ్యలో జరిగే శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. దీంతో సరస్వతీ దేవి సోదరులు ఆమెను ఇప్పటికే అయోధ్యకు తీసుకువచ్చారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధిపతి మహంత్ నృత్య గోపాల్ దాస్ శిష్యులు మనీష్ దాస్, శశి దాస్ సరస్వతి తదితరులు ఆమెను అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్లో స్వాగతించారు. ఆమె 4 నెలల పాటు స్వామీజీ ఆశ్రమంలో ఉండనున్నారు. సరస్వతి అగర్వాల్ 1992 మేలో అయోధ్యకు వెళ్లారు. అక్కడ ఆమె రామజన్మభూమి ట్రస్ట్ అధినేత మహంత్ నృత్య గోపాల్ దాస్ను కలిశారు. ఆయన ఆశీర్వాదంతో ఆమె కమ్తానాథ్ పర్వత ప్రదక్షిణ చేశాక చిత్రకూట్లో ఏడున్నర నెలల పాటు కల్పవాసంలో ఉండిపోయారు. రోజూ 14 కిలోమీటర్ల కమ్తానాథ్ పర్వత ప్రదక్షిణ చేశారు. 1992, డిసెంబర్ 6న ఆమె తిరిగి నృత్య గోపాల్ దాస్ను కలిశారు. ఆయన స్ఫూర్తితో మౌన వ్రతం మొదలుపెట్టారు. రామాలయ నిర్మాణం పూర్తయ్యాక మౌన వ్రతం వీడాలని ఆమె నిశ్చయించుకున్నారు. సరస్వతీదేవి ఎప్పుడూ పాఠశాలకు వెళ్లలేదు. ఆమె భర్త ఆమెకు అక్షర జ్ఞానం అందించారు. ఆమె రామ చరిత మానసతో పాటు ఇతర గ్రంథాలను రోజూ చదువుతారు. రోజుకు ఒకసారి సాత్విక ఆహారం తీసుకుంటారు. ఆమె భర్త 35 ఏళ్ల క్రితం మృతి చెందారు. వారికి ఎనిమిదిమంది సంతానం. ఆమె మౌన దీక్ష చేపట్టినప్పుడు వారంతా ఆమెకు సహకరించారు. -
‘రామాలయం’ చీరలకు భలే డిమాండ్!
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఈ నెలలో జరగనున్న శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇటువంటి తరుణంలో రామాలయం థీమ్తో రూపొందుతున్న బనారసీ చీరలకు భలే డిమాండ్ ఏర్పడింది. హిందూ మహిళలు, ముఖ్యంగా రామభక్తులైన మహిళలు రామాలయం థీమ్తో కూడిన చీరలను కట్టుకోవాలని ముచ్చట పడుతున్నారు. దీంతో యూపీలోని నేత కార్మికులు చీరల పల్లూలపై రామాలయం రామ మందిర నమూనా, రాముడి జీవితానికి సంబంధించిన పలు ఘట్టాలతో కూడిన డిజైన్లను తీర్చిదిద్దుతున్నారు. వారణాసిలోని ముబారక్పూర్ ప్రాంతానికి చెందిన చేనేత కార్మికుడు అనిసూర్ రెహమాన్ మాట్లాడుతూ, అయోధ్యలో నూతన రామాలయ ప్రారంభోత్సవంపై వారణాసిలోని చేనేత సంఘంలో ఎనలేని ఉత్సాహం నెలకొన్నదని అన్నారు. చారిత్రక విశేషాలతో రూపొందించిన చీరలకు ఎప్పటి నుంచో విపరీతమైన డిమాండ్ ఉందని, ఇప్పుడు రామ మందిరం థీమ్తో కూడిన చీరలకు మంచి డిమాండ్ ఏర్పడిందన్నారు. రామాలయం థీమ్తో రూపొందించిన చీరలు కట్టుకుని, తమ ప్రాంతాల్లో ఈ నెల 22న జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటామని పలువురు మహిళలు చెబుతున్నారు. -
‘అయోధ్య’ విరాళాల మొత్తం ఇప్పటివరకూ ఎంత? అధిక మొత్తం ఇచ్చిందెవరు?
అయోధ్యలో నూతన రామాలయ నిర్మాణానికి విరాళాల రూపంలో ఇంతవరకూ ఎంత మొత్తం వచ్చిందనే ప్రశ్న చాలామంది మదిలో మెదిలే ఉంటుంది. అలాగే ఎవరు అత్యధిక మొత్తంలో విరాళం సమర్పించారనే దానిపై కూడా చాలామంది ఆలోచించే ఉంటారు. ఇప్పుడు ఆ ప్రశ్నలకు మీడియా దగ్గరున్న సమాధానం తెలుసుకుందాం. అయోధ్యలో నూతన రామాలయ నిర్మాణానికి దేశంలోని 11 కోట్ల మంది ప్రజల నుంచి రూ.900 కోట్లు సేకరించాలని రామమందిర్ ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 2023 డిసెంబర్ ఆఖరువరకూ రామాలయ నిర్మాణానికి ఐదువేల కోట్ల రూపాయలకు పైగా మొత్తం విరాళాల రూపంలో అందింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం రామ మందిర నిర్మాణం కోసం ఇప్పటివరకు 18 కోట్ల మంది రామభక్తులు నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాలలో సుమారు 3,200 కోట్ల రూపాయల మొత్తాన్ని జమ చేశారు. ఈ బ్యాంకు ఖాతాలలో విరాళంగా వచ్చిన మొత్తాన్ని ట్రస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. దానిపై వచ్చిన వడ్డీతో ఇప్పటి వరకూ ఆలయ నిర్మాణం జరిగింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెబ్సైట్లోని సమాచారం ప్రకారం ఆధ్యాత్మిక గురువు, కథకులు మొరారీ బాపు అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయానికి అత్యధిక విరాళం అందించారు. మొరారీ బాపు నూతన రామాలయ నిర్మాణానికి 11.3 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. దీనికితోడు యూఎస్ఏ, కెనడా,యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న అతని అనుచరులు సమిష్టిగా, విడివిడిగా ఎనిమిది కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. గుజరాత్కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద్భాయ్ ధోలాకియా రామ మందిర నిర్మాణానికి 11 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. అయోధ్యలోని రామాలయానికి తొలి విదేశీ విరాళం అమెరికా నుంచి వచ్చింది. అమెరికాలో ఉన్న రామభక్తుడు (పేరు వెల్లడించలేదు) ఆలయ ట్రస్టుకు విరాళంగా రూ.11,000 పంపారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరించే ప్రచారాన్నిఅప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2021, జనవరి 14న ప్రారంభించారు. రామ మందిరానికి విరాళం ఇచ్చిన మొదటి వ్యక్తి రామ్నాథ్ కోవింద్. ఆయన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు చెక్కు రూపంలో రూ. 5 లక్షలు విరాళంగా అందించారు. ఇది కూడా చదవండి: నేటి నుంచి రామోత్సవాలు.. 35 వేల కళాకారుల ప్రదర్శనలు! -
నేటి నుంచి రామోత్సవాలు.. 35 వేలకుపైగా కళాకారుల ప్రదర్శనలు!
జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపధ్యంలో దేశమంతటా పండుగ వాతావరణం నెలకొంది. నేటి (సోమవారం)నుంచి అయోధ్యలో రామోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మార్చి 24 వరకు జరిగే ఈ రామోత్సవాలలో మనదేశానికి చెందిన కళాకారులతో పాటు ప్రపంచం నలుమూల నుంచి వచ్చే 35 వేలకుపైగా కళాకారులు పాల్గొననున్నారు. రామకథా పార్కులో నేటి నుంచి రామకథ ప్రారంభం కానుంది. నేటి నుంచి అయోధ్యలోని సరయూ నది ఒడ్డున హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సమయంలో కళాకారులు తమ కళాప్రతిభను ప్రదర్శించనున్నారు. రామోత్సవ్లో 35 వేల మంది కళాకారులు తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అయోధ్యలో త్వరలో బాలరాముని విగ్రహప్రతిష్ఠ జరగనున్న సందర్భంగా దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ప్రజలు రామభక్తిలో మునిగిపోయారు. త్వరలో అహ్మదాబాద్లో జరిగే కైట్ ఫెస్టివల్లో కూడా రామనామం వినిపించనుంది. రాముని చిత్రాలతో కూడిన గాలిపటాలు తయారు చేసి, ఆకాశంలో ఎగురవేస్తున్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర రజనీకాంత్ పటేల్ స్వయంగా రాముని చిత్రపఠంతో కూడిన గాలిపటాన్ని ఎగురవేయనున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో శ్రీరాముణ్ణి కీర్తించనున్న దివ్యాంగ కవి -
రామ మందిరం: బిహార్ మంత్రి వ్యాఖ్యలు దుమారం
పట్నా: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంపై బిహార్ విద్యాశాఖమంత్రి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రామ మందిరం విషయంలో బీజేపీ తీరుపై ఆయన విమర్శలు చేశారు. ప్రజలకు జబ్బు పడితే లేదా గాయపడితే గుడికి వెళ్లుతారా? లేదా ఆస్పత్రికి వెళ్లుతారా? అని సూటిగా ప్రశ్నించారు. సమాజంలో ఉన్నతమైన ఉద్యోగాలు, పదవులకు సాధించడానికి ఉపయోగపడే చదువు కావాలంటే గుడికి వెళ్లుతా? లేదా స్కూల్కు వెళ్లుతారా?’ అని విమర్శించారు. ప్రజలు కపట హిందుత్వ, అబద్ధపూరితమైన జాతీయవాదంపై అవగాహనతో ఉండాలని ఉన్నారు. "Temple or hospital?": Bihar Education Minister Chandra Shekhar sparks another controversy on Ram Temple Read @ANI Story | https://t.co/vJH2fFzYGT#Bihar #ChandraShekhar #RamTemple pic.twitter.com/Y81yIqFlXW — ANI Digital (@ani_digital) January 8, 2024 అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జనవరి 22ను జరగనుంది. ఓవైపు ప్రారంభోత్సవం కోసం ఏర్పాట్లు మరోవైపు ప్రతిపక్షాలు, పలు రాష్ట్రాల నేతలు బీజేపీ రామ మందిరాన్ని రాజకీయ పావుగా వాడుకొంటుందని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కొంత మంది రాజకీయ ప్రముఖలకు ఆహ్వానం అందించకపోవటంతో బీజేపీపై మండిపడుతున్నారు. చదవండి: అయోధ్యకు ప్రత్యేక చీర.. రామమందిర చిత్రాలతో తయారీ -
అయోధ్యకు ప్రత్యేక చీర.. రామమందిర చిత్రాలతో తయారీ
సూరత్: సర్వాంగసుందరంగా నిర్మితమైన అయోధ్యలోని రామమందిర ప్రారంభోవత్సవ కార్యక్రామనికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో వస్త్ర పరిశ్రమలకు ప్రసిద్ధిగాంచిన సురత్ నగరంలోని టెక్స్టైల్ అసోషియేషన్ ప్రత్యేకంగా ఓ చీరను తయారు చేసింది. ఈ చీరపై అయోధ్యలోని రామ మందిర్, భగవాన్ శ్రీరాముడి చిత్రాలను ప్రింట్ చేసింది. అయితే ఈ ప్రత్యేకమైన చీర అయోధ్యలోని సీతా మాతా విగ్రహానికి తయారు చేసినట్లు ఆదివారం సూరత్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రతినిధి లలిత్ శర్మా తెలిపారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో ప్రపంచం అంతా ఆనందం ఉంది. ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ సాకారం కాబోంది. జానకీ మాత, భగవన్ హనుమాన్ కూడా మందిర నిర్మాణంపై ఆనందపడతారు’ అని శర్మా తెలిపారు. ఇప్పటికే ఒక చీరను స్థానిక శ్రీరాముని ఆలయంలో అందజేసినట్లు తెలిపారు. తాము తయారు చేసిన ప్రత్యేకమైన చీరను ఆయోధ్యకు పంపిస్తామని అన్నారు. చీర తయారు చేయాలని తమకు ఆర్డర్ వచ్చిందని, అయితే తాము ఉచితంగా తయారు చేసి పంపుతున్నామని పేర్కొన్నారు. మరిన్ని శ్రీరాముని ఆలయాల్లో కూడా సీతా మాతా విగ్రహాలకు ఉచితంగా ప్రత్యేక చీరను తయారు చేసి పంపిస్తామని తెలిపారు. ఇటీవల నేపాల్లోని జనాకీ మాతా జన్మస్థలం నుంచి పలు కానుకలు అయోధ్యకు చేరుకున్న విషయం తెలిసిందే. ఇక.. జనవరి 22 తేదీన అయోధ్య రామమందిరంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖలకు ఆహ్వానాలు అందించిన విషయం తెలిసిందే. చదవండి: Delhi: 22న దీపకాంతులలో ఢిల్లీ ఆలయాలు -
అయోధ్యలో శ్రీరాముణ్ణి కీర్తించనున్న దివ్యాంగ కవి
ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ముందుగానే అయోధ్యలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈనెల 14న అయోధ్యలో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి దివ్యాంగ కవి అక్బర్ తాజ్ను జగద్గురు సంత్ రామభద్రాచార్య ఆహ్వానించారు. అక్బర్ తాజ్ మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలోని హప్లా-దీప్లా గ్రామానికి చెందిన దివ్యాంగ కవి. ఆయన కవితలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా అక్బర్ తాజ్ శ్రీరాముని గుణగణాలను కీర్తిస్తూ పలు రచనలు చేశారు. శ్రీరాముడు అందరికీ చెందినవాడని అక్బర్ తాజ్ చెబుతుంటారు. 44 ఏళ్ల అక్బర్ తాజ్ దృష్టిలోపంతో బాధపడుతున్నారు. బ్రెయిలీ లిపిని కూడా అక్బర్ తాజ్ నేర్చుకోలేదు. అయినప్పటికీ అక్బర్ తాజ్ తన మనసులోని భావాలను ఇతరుల చేత రాయిస్తుంటారు. ఆయన దేశవ్యాప్తంగా పలు వేదికలపై తన హిందీ, ఉర్దూ రచనలను వినిపించారు. రామునిపై ఆయన చేసిన రచనలు ఆయనకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. జనవరి 22న రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు తనను ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని అక్బర్ తెలిపారు. -
22న దీపకాంతులలో ఢిల్లీ ఆలయాలు
జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా దేశరాజధాని ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అన్ని దేవాలయాలను రంగురంగుల దీపాలతో, పూలతో అలంకరించనున్నారు. అంతే కాకుండా ఆలయాల్లో రామచరిత మానసను పారాయణం చేయడంతోపాటు రామచరిత మానస ప్రతులను పంపిణీ చేయనున్నారు. శ్రీ రాంలీలా మహాసంఘ్ నేతృత్వంలో ఢిల్లీలో 22న ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మహాసంఘ్ అధ్యక్షుడు అర్జున్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 550 ఏళ్ల తర్వాత అయోధ్యలో శ్రీరాముని ఆరాధించే అవకాశం మనకు లభించబోతోందని అన్నారు. అందుకే ఆ రోజును చారిత్రాత్మకంగా మార్చేందుకు రామ్లీలా కమిటీలన్నీ తమ ప్రాంతాల్లోని ఆలయాలను రంగురంగుల దీపాలతో, పూలతో అలంకరించాలని నిర్ణయించాయన్నారు. ఆలయాల వెలుపల పెద్ద ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా అయోధ్యలోని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్షంగా ప్రదర్శించనున్నామన్నారు. అలాగే రామ్చరిత మానస కాపీలను రామ్లీలా కమిటీలు పంపిణీ చేస్తాయని తెలిపారు. ఆలయాల్లో 501 నెయ్యి దీపాలు వెలిగించనున్నారని తెలిపారు. ఈ నెల 22వ తేదీని దీపావళిలా జరుపుకోవాలని రాజధానివాసులకు శ్రీ రాంలీలా మహాసంఘ్ పిలుపునిచ్చింది. అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభం కానున్న సందర్భంగా సంపూర్ణ అనే సంస్థ ఆదివారం లోధీ గార్డెన్లో రాముని పెయింటింగ్ పోటీని నిర్వహించింది. దీనిలో పెద్ద సంఖ్యలో పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు. సుమారు వంద మంది చిన్నారులు శ్రీరాముడు, ఇతర దేవతల వేషధారణలతో కార్యక్రమానికి హాజరయ్యారు. -
Ram Mandir Pran Pratishtha: టైమ్స్ స్క్వేర్లో ‘ప్రాణప్రతిష్ఠ’ ప్రత్యక్ష ప్రసారం
జనవరి 22న అయోధ్యలో జరిగే బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మన దేశంలోని పలు ప్రాంతాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ప్రత్యక్ష ప్రసారం కానుంది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్లో కూడా ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం అయోధ్య పవిత్రోత్సవం వివిధ దేశాలలోని భారత రాయబార కార్యాలయాలలో కూడా ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆరోజు రామభక్తులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ వేడుకకు సంబంధించిన సన్నాహాలను ప్రధాని మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారని సమాచారం. బాలరాముని ప్రాణప్రతిష్ఠ ఉత్సవానికి 84 సెకన్ల శుభ సమయం నిర్ణయించారు. 2024, జనవరి 22న ఉదయం 12:29 నుండి 12:30 మధ్య కాలంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. కాగా నూతన రామాలయం మూడు అంతస్తులలో నిర్మితమయ్యింది. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఆలయంలో మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి. అయోధ్యలో ప్రతిష్ఠించబోయే రామ్లల్లా విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దారు. ఈ విగ్రహం ఐదేళ్ల బాలుని రూపంలో ఉంటుంది. కాగా ఆలయంలో ఇంతవరకూ ఉన్న బాలరాముని విగ్రహాన్ని నూతన విగ్రహంతో పాటు గర్భగుడిలో ప్రతిష్ఠించనున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్య ‘ప్రాణప్రతిష్ఠ’కు ముఖ్య అతిథులెవరు? -
అయోధ్య ‘ప్రాణప్రతిష్ఠ’కు ముఖ్య అతిథులెవరు?
అయోధ్యలో జనవరి 22న నూతన రామాలయ ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఘనమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్య నగరంలోని ప్రధాన రహదారులను సూర్య స్తంభాలతో అలంకరించారు. నయా ఘాట్ సమీపంలోని లతా మంగేష్కర్ చౌక్ను అయోధ్య బైపాస్తో కలిపే ‘ధర్మ మార్గం’ రహదారికి ఇరువైపులా 40 సూర్య స్తంభాలను ఏర్పాటు చేశారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి నాలుగు వేల మంది సాధువులను, 2,200 మంది ఇతర అతిథులను ఆహ్వానించారు. కాశీ విశ్వనాథుని ఆలయం, మాతా వైష్ణో దేవి ఆలయ ప్రతినిధులు, ఇస్రో శాస్త్రవేత్తల పేర్లు ఆహ్వానితుల జాబితాలో ఉన్నాయి. సినీ పరిశ్రమ, వ్యాపార, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా ఆహ్వానాలు పంపారు. ఆ వివరాలు.. నటీనటులు 1. అమితాబ్ బచ్చన్ 2. మాధురీ దీక్షిత్ 3. అనుపమ్ ఖేర్ 4. అక్షయ్ కుమార్ 5. రజనీకాంత్ 6. సంజయ్ లీలా బన్సాలీ 7. అలియా భట్ 8. రణబీర్ కపూర్ 9. సన్నీ డియోల్ 10. అజయ్ దేవగన్ 11. చిరంజీవి 12. మోహన్ లాల్ 13. ధనుష్ 14. రిషబ్ శెట్టి 15. ప్రభాస్ 16. టైగర్ ష్రాఫ్ 17. ఆయుష్మాన్ ఖురానా 18. అరుణ్ గోవిల్ 19. దీపికా చిఖలియా వ్యాపారవేత్తలు 1. ముఖేష్ అంబానీ 2. అనిల్ అంబానీ 3. గౌతమ్ అదానీ 4. రతన్ టాటా క్రీడాకారులు 1. సచిన్ టెండూల్కర్ 2. విరాట్ కోహ్లీ రాజకీయనేతలు 1. మల్లికార్జున్ ఖర్గే 2. సోనియా గాంధీ 3. అధిర్ రంజన్ చౌదరి 4. డాక్టర్ మన్మోహన్ సింగ్ 5. హెచ్డి దేవెగౌడ 6. లాల్ కృష్ణ అద్వానీ 7. మురళీ మనోహర్ జోషి -
‘అయోధ్య’ ఉద్యమంలో మురళీ మనోహర్ జోషి పాత్ర ఏమిటి?
అయోధ్యలోని నూతన రామాలయాన్ని జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రామమందిరం గురించి ప్రస్తావించినప్పుడల్లా డాక్టర్ మురళీ మనోహర్ జోషి పేరు గుర్తుకు వస్తుంటుంది. నిజానికి రామాలయ నిర్మాణం వెనుక పెద్ద పోరాటమే జరిగింది. రామాలయ కలను సాకారం చేసుకునే దిశలో కొందరు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు. ఈ పోరాటంలో జైలుకు కూడా వెళ్లారు. అలాంటి వారిలో ఒకరే డాక్టర్ మురళీ మనోహర్ జోషి. మురళీ మనోహర్ జోషి 1934 జనవరి 5న నైనిటాల్లో జన్మించారు. ఆయన తండ్రి పేరు మన్మోహన్ జోషి. తల్లి పేరు చంద్రావతి జోషి. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మురళీ మనోహర్ జోషి 1956లో తర్ల జోషిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నివేదిత, ప్రియంవద అనే ఇద్దరు కుమార్తెలున్నారు. మురళీ మనోహర్ జోషి అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్సీ పూర్తి చేశారు. అక్కడే డాక్టరేట్ పట్టా కూడా అందుకున్నారు. అతని పరిశోధనా పత్రం స్పెక్ట్రోస్కోపీకి సంబంధించినది. హిందీ భాషలో పరిశోధనా పత్రాన్ని సమర్పించిన మొదటి పరిశోధకుడు మురళి. పీహెచ్డీ పూర్తి చేసిన తర్వాత, జోషి అలహాబాద్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ప్రొఫెసర్గా ఉద్యోగం ప్రారంభించారు. అదే సమయంలో మురళీ మనోహన్ జోషి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లో చేరారు. ఆయన చిన్న వయసులోనే గోసంరక్షణ ఉద్యమం(1953-54), 1955లో యూపీలో జరిగిన కుంభ్ కిసాన్ ఉద్యమంలో పాల్గొన్నారు. 1980లో మురళీ మనోహర్ జోషి భారతీయ జనతా పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. పార్టీకి అధ్యక్షునిగా పనిచేశారు. 1996లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడి 13 రోజులపాటు కొనసాగినప్పుడు ఆయనకు హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణాన్ని కూల్చివేసినప్పుడు, మురళీ మనోహర్ జోషిని కూడా అరెస్టు చేశారు. దీనికిముందు కరసేవ కోసం చేపట్టిన రథయాత్రలో మురళీ మనోహర్ జోషి ప్రసంగించిన తీరు అయోధ్య చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘రామాలయం నిర్మితమవుతుంది. దీనిని ఏ శక్తి ఆపలేదు’ అని అన్నారు. ఆయన పలికిన ఈ మాటలు లక్షలాది కరసేవకులలో ఉత్సాహాన్ని నింపాయి. ఇప్పుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తియ్యింది. ఆలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మురళీ మనోహర్ జోషి హాజరుకానున్నారు. అయోధ్య రామాలయ ఉద్యమంలో మురళీ మనోహర్ జోషితో పాటు లాల్ కృష్ణ అద్వానీ, ఉమాభారతి, విశ్వహిందూ పరిషత్ దివంగత నేత అశోక్ సింఘాల్ తదితరులు కీలకపాత్ర పోషించారు. కాగా మురళీ మనోహర్ జోషి 2014లో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నుంచి లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. అలహాబాద్ లోక్సభ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. -
ప్రతీ శ్రీరామనవమికి అయోధ్యలో అద్భుతం
అయోధ్య.. శ్రీరాముడు కొలువైన నగరం. ఇక్కడ దైవత్వం, వైభవం, నూతనత్వం నిండుగా కనిపిస్తాయి. దీనికితోడు శ్రీరాముని మహా మందిరంలో, ఆయన విగ్రహంలోనూ అతీంద్రియ శక్తులు సంతరించుకున్నాయని ఆలయ ట్రస్టు తెలిపింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ ప్రతియేటా శ్రీరామనవమి నాడు సూర్య భగవానుడు స్వయంగా శ్రీరామునికి అభిషేకం చేయనున్నాడన్నారు. ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్తల సలహా మేరకు ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్ల పక్షంలో తొమ్మిదో రోజన సూర్యకిరణాలు శ్రీరాముని విగ్రహం నుదుటిపై పడేలా విగ్రహం పొడవు, ఎత్తును తీర్చిద్దిదారు. శ్రీరామనవమి నాడు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరామునికి సూర్యుడు తన కిరణాలతో అభిషేకం చేయనున్నాడు. ముగ్గురు హస్తకళాకారులు వేర్వేరుగా శ్రీరాముని విగ్రహాన్ని తయారు చేశారని, వాటిలో ఒక విగ్రహాన్ని భగవంతుని ప్రేరణతో ఎంపిక చేశారని చంపత్రాయ్ తెలిపారు. ఎంచుకున్న విగ్రహం పొడవు పాదాల నుండి నుదిటి వరకు 51 అంగుళాలు ఉందని, విగ్రహం బరువు ఒకటిన్నర టన్నులు ఉందన్నారు. ఈ విగ్రహంలోని సౌమ్యతను వివరిస్తూ.. ముదురు రంగు రాతితో చేసిన విగ్రహంలో విష్ణుమూర్తి దివ్యత్వం, రాజకుమారుడి తేజస్సు మాత్రమే కాకుండా ఐదేళ్ల బాలుని అమాయకత్వం కూడా కపిస్తున్నదని తెలిపారు. జనవరి 16 నుంచి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. జనవరి 18న గర్భగుడిలోని సింహాసనంపై శ్రీరాముని ప్రతిష్ఠించనున్నారు.ఈ శ్రీరాముని విగ్రహానికున్న ప్రత్యేకత ఏమిటంటే.. దానిని నీటితో, పాలతో స్నానం చేయించినా విగ్రహంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడదు. జనవరి 22న దేశవ్యాప్తంగా ఐదు లక్షల దేవాలయాల్లో అంగరంగ వైభవంగా పూజలు జరుగుతాయని, సాయంత్రం ప్రతి ఇంటి బయట కనీసం ఐదు దీపాలైనా వెలిగించాలని ట్రస్ట్ కోరింది. జనవరి 26 తర్వాతే దర్శనం కోసం సామాన్యులు ఆలయానికి రావాలని, రాత్రి 12 గంటలైనా అందరూ దర్శనం చేసుకునేంత వరకు ఆలయ తలుపులు తెరిచి ఉంచుతామని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఇది కూడా చదవండి: 22న పుట్టేవారంతా సీతారాములే..! -
22న పుట్టేవారంతా సీతారాములే..!
జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభం కానుంది. అలాగే బాలరాముని ప్రతిష్ఠాపన మహోత్సవం కూడా జరగనుంది. దేశంలోని చాలామంది ఆరోజును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తున్నారు. దీంతో తమకు ఆరోజు పుట్టబోయే చిన్నారులకు రాముడు లేదా సీత అనే పేరుపెట్టాలని చాలామంది తహతహలాడుతున్నారు. దేశంలోని పులువురు గర్భిణులు తాము జనవరి 22న బిడ్డకు జన్మనివ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే ఆరోజు తమకు పుట్టబోయే పిల్లలకు రాముడు లేదా సీత అనే పేరు పెట్టాలని నిర్ణయించుకుంటున్నారు. యూపీలోని మీరట్కు చెందిన ఒక సీనియర్ డాక్టర్ మాట్లాడుతూ పలువురు గర్భిణులు జనవరి 22న డెలివరీ చేయాలని తమ ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. అబ్బాయి పుడితే రాముడు అని అమ్మాయి పుడితే సీత అని పేరు పెడతామని వారు చెబుతున్నారన్నారు. ఇది కూడా చదవండి: వారికి శ్రీరాముడు ‘మామ’? బంధుత్వం ఎలా కలిసింది? -
వారికి శ్రీరాముడు ‘మామ’? బంధుత్వం ఎలా కలిసింది?
ఆ గ్రామంలోనివారికి శ్రీరాముడు మామ అవుతాడు. దీని వెనుక ఒక పురాణ కథనం కూడా ఉంది. ఆగ్రాలోని రుంకటా పరిధిలోని సింగనా గ్రామంలో శృంగి మహర్షి ఆశ్రమం ఉంది. అయోధ్యలో 22న శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న సందర్భంగా శృంగి మహర్షి ఆశ్రమంలోనూ వేడుకలు నిర్వహిస్తున్నారు. శృంగి మహర్షి అలనాడు దశరథ మహారాజు ఆహ్వానం మేరకు అయోధ్యకు వెళ్లి పుత్రకామేష్టి యాగం చేశాడు. సింగనా గ్రామ ప్రజలు శ్రీరాముడిని ముద్దుగా మామ అని పిలుచుకుంటారు. శ్రీరాముడిని వారు మామగా పిలవడానికి కారణం ఉంది. దశరథ మహారాజు కుమార్తె శాంతకుమారికి శృంగిమహర్షితో వివాహం జరిగింది. శ్రీరాముని సోదరి శాంతకుమారి వివాహానంతరం ఈ ప్రాంతానికి వచ్చినందున వారు శ్రీరామునితో బంధుత్వం ఏర్పరుచుకుని, మామా అని సంబోధిస్తుంటారు. సింగన గ్రామంలో యమునా నది ఒడ్డున శృంగి మహర్షి ఆశ్రమం ఉంది. కుమారుడు పుట్టాలనే కోరికతో శృంగి ఋషి ఆశ్రమానికి ఎవరైనా వస్తే వారి కోరిక నెరవేరుతుందని స్థానికులు చెబుతుంటారు. శృంగి మహర్షి అయోధ్యకు వెళ్లి, పుత్రకామేష్టి కోసం యాగం చేసిన దరిమిలా రామలక్షణ భరత శత్రుఘ్నలు జన్మించారు. శృంగి మహర్షి ఆశ్రమానికి చెందిన మహంత్ నిరంజన్ దాస్ మాట్లాడుతూ, ఈ ఆశ్రమంలో శృంగి మహర్షి తపస్సు చేశారని, ఈ శృంగి మహర్షి తపోభూమి ఎంతో శక్తివంతమైనదని అన్నారు. అయోధ్యలో జనవరి 22న శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు జరగనున్న సందర్భంగా శృంగి మహర్షి ఆశ్రమంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామంలోనివారంతా తమ ఇళ్లలో దీపాలు వెలిగించనున్నారు. -
22న అయోధ్యలో హైసెక్యూరిటీ.. భద్రతా బలగాలివే..
మరికొద్ది రోజుల్లో అయోధ్యలో జరగనున్న రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 16 నుంచి ప్రారంభమయ్యే విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జనవరి 22 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో భద్రతా సిబ్బందిని అయోధ్యలోని వివిధ ప్రాంతాల్లో మోహరించనున్నారు. పోలీసు అధికారి డీజీపీ ప్రశాంత్ కుమార్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం జనవరి 22న ఆలయ విధుల్లో పాల్గొనే పోలీసులెవరూ స్మార్ట్ ఫోన్లను ఉపయోగించకూడదు. అలాగే ఈ వేడుక ముగిసిన నాలుగు రోజుల తర్వాత జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్లో భద్రతా సిబ్బంది స్మార్ట్ మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడని డీజీపీ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. రామమందిర సముదాయానికి సంబంధించిన సమగ్ర భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఈ ప్రాంతాన్నంతటినీ రెడ్, ఎల్లో జోన్లుగా విభజించారు. రామజన్మభూమి కాంప్లెక్స్ను రెడ్ జోన్లో ఉంచారు. 6 కంపెనీల సీఆర్పీఎఫ్, 3 కంపెనీల పీఏసీ, 9 కంపెనీల ఎస్ఎస్ఎఫ్, 300 మంది పోలీసు సిబ్బంది, 47 మంది అగ్నిమాపక సిబ్బంది, 38 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, 40 మంది రేడియో పోలీసు సిబ్బందికి రామాలయం, దాని ప్రాంగణం భద్రత బాధ్యతలు అప్పగించారు. అయోధ్య భద్రతకు రూ.90 కోట్ల బడ్జెట్ కేటాయించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద అయోధ్యలో ఏఐ ఆధారిత వ్యవస్థను కూడా అమలు చేయనున్నారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్కు చెందిన రెండు బృందాలు, రెండు విధ్వంసక నిరోధక దళాలు, పీఎసీకి చెందిన ఒక కమాండో యూనిట్, ఎటీఎస్, ఎస్టీఎఫ్లకు చెందిన ఒక్కో యూనిట్, ఎన్ఎస్జీతో సహా సెంట్రల్ ఏజెన్సీలను కూడా ఆలయ భద్రత విధుల్లో మోహరించనున్నారు. ఎల్లో జోన్లోని కనక్భవన్, హనుమాన్గఢి ప్రాంతాల్లో కూడా పటిష్ట భద్రత ఉంటుంది. ఎల్లో జోన్లో 34 మంది సబ్ఇన్స్పెక్టర్లు, 71 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 312 మంది కానిస్టేబుళ్లు భద్రతను పర్యవేక్షించనున్నారు. -
Ayodhya: ఆరోపణలపై ట్రస్ట్ స్పందన
లక్నో: అయోధ్య రామ మందిర నిర్మాణ పనుల్లో శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు మొదలయ్యాయి. ఈ మేరకు భూముల కొనుగోలులో ట్రస్టుపై అవినీతి ఆరోపణలు చేశాయి యూపీలోని విపక్ష పార్టీలు. కేవలం 11 నిమిషాల్లో వ్యవధిలో రెండు స్టాంప్ పేపర్లను తెర మీదకు ట్రస్ట్ తెచ్చిందని.. ఈ గ్యాప్లో 16 కోట్ల రూపాయల మేర కుంభకోణానికి పాల్పడిందనేది ఆప్, ఎస్పీ పార్టీల ప్రధాన ఆరోపణ. ఈమేరకు భూముల కుంభకోణం ఆరోపణలపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో విచారణ జరిపిచాలని విపక్షాలు డిమాండ్ చేశాయి కూడా. ఈ నేపథ్యంలో ట్రస్ట్ స్పందించింది. అయోధ్య మందిరంపై రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ఆదివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. రామాలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేరు మీద ఆ ప్రకటనలో.. అమ్మకం కొనుగోలు పక్కాగా జరిగిందిని, కోర్టు ఫీజులు, స్టాంప్పేపర్ కొనుగోలు అంతా ఆన్లైన్లోనే జరిగాయని పేర్కొంది. ఇక ప్రాపర్టీ డీలర్లలో ఒకరైన అన్సారీ అందుబాటులో లేకపోగా, మరో డీలర్ తివారీ తాను ఒకప్పుడు ఆ భూమి 2 కోట్లకు కొనుగోలు చేశానని, సుప్రీం కోర్టు తీర్పు తర్వాత అది పెరిగిందని, ప్రస్తుతం 20 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఆ భూమిని.. రామమందిరం కోసమే 18.5 కోట్లకు ఇచ్చేశానని తెలిపాడు. ఈ ఏడాది చివరికల్లా.. ఇక ఆరోపణలపై ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ఘాటుగానే స్పందించాడు. ఈ దశలో వాళ్లకు బదులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆరోపణలు మమ్మల్ని ఇబ్బంది పెట్టవు. మా పని మేం చేసుకుంటూ పోతాం అని తెలిపాడు. మార్చి 31 వరకు ట్రస్ట్ తరపున మూడు వేల 200 కోట్ల రూపాయల్ని బ్యాంక్లో డిపాజిట్ చేశామని, నాలుగు కోట్ల మంది 10 రూ. చొప్పున, మరో 4 కోట్ల మంది వంద రూపాయల చొప్పున, మిగతవాళ్లు వెయ్యి, అంతకంటే ఎక్కువ రూపాయలు విరాళాలు ఇచ్చారని, బ్యాంక్ ట్రాన్స్ఫర్ల ద్వారా మరో 80 కోట్ల రూపాయలు వచ్చాయని, లాక్డౌన్లేని టైంలో స్వయంగా వచ్చి కొందరు విరాళాలు ఇవ్వగా.. అది 60 లక్షల రూపాయల దాకా వచ్చిందని, ఆరోపణలు చేసేవాళ్ల కోసమే ఈ లెక్కలని సంపత్రాయ్ వెల్లడించారు. కాగా, అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామమందిరం 2024 చివరికల్లా పూర్తవుతుందని ట్రస్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ కల్లా ఆలయ పునాది పనులు పూర్తవుతాయని, వెంటనే మొదటి అంతస్థు పనులు మొదలుపెడతామని ట్రస్ట్ వివరించింది. డిసెంబర్ నుంచి రెండో దశ పనులు మొదలుపెట్టి.. ప్రధాన ఆలయ పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. చదవండి: మసీదు నిర్మాణానికి పిలుపు అందితే వెళ్తారా? ఆరోపణలేంటంటే.. రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత పవన్ పాండేలు ఆదివారం వేర్వేరు మీడియా సమావేశాలు నిర్వహించి ట్రస్ట్ మీద ఆరోపణలు చేశారు. అయోధ్యలో 2 కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని.. శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసినట్టు సంజయ్ సింగ్ ఆరోపించారు. రామాలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్న చంపత్ రాయ్ ఆదేశాలతోనే ఈ రెండు చెల్లింపులు జరిగాయని కూడా ఆప్ నేత ఆరోపించారు. మరోవైపు, సమాజ్వాదీ పార్టీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి పవన్ పాండే సైతం ఇదే తరహా ఆరోపణలు చేశారు. కేవలం 10 నిమిషాల తేడాలోనే భూమి విలువను 10 రెట్లు ఎలా పెంచారని ఆయన ప్రశ్నించారు. భూమి విలువ రూ.2 కోట్లుగా 2021 మార్చి 18న రామ టెంపుల్ పేరుతో భూమి కొనుగోలు రిజిస్ట్రీ చూపిస్తోంది. కానీ, పది నిమిషాల తర్వాత రామాలయ ట్రస్టుకు, అమ్మకందారుకు మధ్య రూ.18 కోట్లకు అగ్రిమెంట్ జరిగింది అని పవన్ పాండే చెప్పారు. రామమందిరం పేరుతో రామభక్తులను ట్రస్టు మోసగించిందని, భూముల కొనుగోలు డీల్ గురించి ఒక ట్రస్టీకి, అయోధ్య మేయర్కు తెలుసునని ఆరోపించారు. -
అయోధ్య: 4 లక్షల లడ్డూలు సిద్ధం
లక్నో (ఉత్తర ప్రదేశ్): రామ మందిర నిర్మాణం కోసం జరిగే భూమి పూజ కార్యక్రమానికి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ వేడుకలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ప్రధానితోపాటు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, 50 మంది అతిథులు కూడా హాజరుకానున్నారు. అయోధ్య నిర్మాణాన్ని పర్యవేక్షించే ఆలయ పాలక మండలి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భూమి పూజ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాలకు లడ్డూలను పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు నాలుగు లక్షల ప్యాకెట్ల లడ్డూలను ఆర్డర్ ఇచ్చినట్లు ట్రస్ట్ అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 5న జరిగే కార్యక్రమానికి మొత్తం 1,11,000 వేల లడ్డూలు సిద్ధమవుతునన్నాయని అధికారులు పేర్కొన్నారు. వీటిని రామ్ దాస్ చావ్ని అనే వ్యక్తి వద్ద తయారు చేస్తున్నట్లు తెలిపారు. (అయోధ్యలో హైఅలర్ట్) ఆగస్టు 3వ తేదీన గణేశుడి పూజతో కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు. ఆగస్టు 5వ తేదీన గర్భగుడిలో జరిగే పూజ కోసం 11 మంది పండితులు వేదమంత్రాలు చదవనున్నారు. ప్రధాని మోదీ చేత భూమిపూజ చేపట్టనున్నారు. పూజా కార్యక్రమానికి 600 మంది సాధువులను ఆహ్వానించాలని ట్రస్ట్ నిర్ణయించింది. అలాగే కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేవలం 200 మందిని మాత్రమే వేడుకకు ఆహ్వానించాలని కూడా నిర్ణయించారు. పూజ నిర్వహించనున్న రామ మందిరం పూజారి ప్రదీప్ దాస్ తాజాగా కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. పూజారికి కరోనా సోకడంతో ఏం చేయాలనే దానిపై ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. (అయోధ్య పూజారికి కరోనా) -
'రామాలయానికి బాబర్కు ఏమిటీ సంబంధం?'
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామాలయం ఔరంగజేబు పాలనా హయాంలో ధ్వంసమైందని.. బాబర్ కమాండర్ మిర్ బాకీ చేతిలో కాదని ఐపీఎస్ మాజీ అధికారి కిషోర్ కునాల్ తెలిపారు. ఆయన తాజాగా రాసిన అయోధ్య రీవిజిటెడ్(అయోధ్య పునర్దర్శనం) అనే పుస్తకంలో ఈ విషయం వెల్లడించాడు. 1990లో కేంద్ర హోంశాఖలో ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 1813-14 ప్రాంతంలో ప్రాన్సిస్ బుచానన్ అయోధ్యలో సర్వే చేసి బాబర్ గురించి తప్పుగా పేర్కొన్నారని చెప్పారు. అయోధ్యలోని రామాలయ కూల్చివేతలో అసలు బాబర్కు ఎలాంటి పాత్ర లేదని, అక్కడ మసీదు నిర్మాణంలో కూడా ఆయనకు సంబంధం లేదని అన్నారు. గత రెండు వందల ఏళ్లుగా బాబర్ కు సంబంధం లేని విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని చెప్పారు. బాబర్ చాలా చక్కగా పరిపాలించాడని, స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాడని ఆయనకు రామాలయం నేలమట్టంతో సంబంధం లేదన్నారు. 1660లో ఔరంగజేబు పాలిస్తున్నప్పుడు ఆయన అవాద్ గవర్నర్ ఫెదాయ్ ఖాన్ కూల్చివేశాడని చెప్పారు. ప్రస్తుతం అందరూ భావిస్తున్నట్లు రామాలయం 1528లో ధ్వంసం కాలేదన్నారు.