● డీఈవో రవీందర్రెడ్డి ● గుండంపల్లిలో జిల్లాస్థాయి వాలీబాల్ సెలెక్షన్స్
దిలావర్పూర్: పాఠశాల స్థాయినుంచే విద్యార్థులు క్రీడల్లో మంచి ప్రావీణ్యం సాధిస్తే ఉన్నత విద్య, ఉద్యోగాల్లోనే అవకాశాలు దక్కుతాయని డీఈవో రవీందర్రెడ్డి అన్నారు. మండలంలోని గుండంపల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక పోటీలు శుక్రవారం నిర్వహించారు. పోటీలను డీఈవో ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటూ ఆటల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడాకారులకు ఉన్నత విద్య, ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా ఉంటుందని తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఎంఈవో శంకర్, కాంప్లెక్స్ హెచ్ఎం సదానంద్, ఎస్జీఎఫ్ కార్యదర్శి రవీందర్గౌడ్, పెటా కార్యదర్శి భోజన్న, ఎంపీవో గోవర్థన్, పంచాయతీ కార్యదర్శి సరస్వతి, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment