ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటుతాం | Sakshi
Sakshi News home page

ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటుతాం

Published Mon, May 6 2024 6:05 AM

ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటుతాం

నిజామాబాద్‌నాగారం: ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించి, బీఆర్‌ఎస్‌ సత్తాచాటుతుందని పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్‌, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నగరంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఆదివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని ప్రజలు భావిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌కు, కేంద్రంలో ఉన్న బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్‌ రోడ్‌షోలకు ఆదరణ వస్తుందన్నారు. ప్రజలు మళ్లీ కేసీఆర్‌ను సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. సోమవారం సాయంత్రం 6.30నిమిషాలకు గాంధీచౌక్‌, నెహ్రుపార్కు ప్రాంతంలో కేసీఆర్‌ రోడ్‌షో సమావేశం ఉందన్నారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. ఎంపీ కేఆర్‌ సురేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బిగాల గణేష్‌ గుప్తా, జెడ్పీచైర్మన్‌ విఠల్‌రావు, మాజీఎమ్మెల్సీ వీజీగౌడ్‌, నుడా మాజీ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, బాజిరెడ్డి జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌,

బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి

Advertisement
Advertisement