సౌత్‌జోన్‌ ఖోఖో పోటీలకు గన్నవరం విద్యార్థులు | Sakshi
Sakshi News home page

సౌత్‌జోన్‌ ఖోఖో పోటీలకు గన్నవరం విద్యార్థులు

Published Tue, May 7 2024 10:35 AM

సౌత్‌జోన్‌ ఖోఖో పోటీలకు గన్నవరం విద్యార్థులు

గన్నవరం: స్థానిక జెడ్పీ బాలురోన్నత పాఠశాలకు చెందిన ఇరువురు విద్యార్థులు జాతీయ స్థాయిలో సౌత్‌ జోన్‌ ఖోఖో పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు ఎన్‌.రవీంద్రభవాని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల తోటపల్లిలో హెచ్‌సీఎల్‌ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర స్థాయి ఖోఖో ప్రతిభ పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన డి.నాగబాలాజీ, కె.వాసులను సెలక్టర్లు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. త్వరలో బెంగళూరులో జరగనున్న సౌత్‌ జోన్‌ పోటీల్లో వీరిరువురు రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు వివరించా రు. వీరిరువురితో పాటు వీరికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు షేక్‌ మీరాసాహెబ్‌ను సీనియర్‌ పీఈటీ దనియాల నాగరాజు, ఉపాధ్యాయ బృందం అభినందించినట్లు తెలిపారు.

 
Advertisement
 
Advertisement