వైఎస్సార్‌ సీపీలోకి పలువురు చేరిక | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలోకి పలువురు చేరిక

Published Tue, May 7 2024 11:30 AM

వైఎస్సార్‌ సీపీలోకి పలువురు చేరిక

పిడుగురాళ్ల: పట్టణంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో 13వ వార్డుకు చెందిన కరిముల్లా, వైఎస్సార్‌ సీపీ నాయకులు కొఠారు నరసింహారావు ఆధ్వర్యంలో 15 కుటుంబాలు గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగు దేశం పార్టీపై విసుగు చెందిన, ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ ఫలాలు, గురజాల నియోజకవర్గంలో కాసు మహేష్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అభివృద్ధిని చూసి వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.

 
Advertisement
 
Advertisement