అల్లం విత్తనాల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

అల్లం విత్తనాల పంపిణీ

Published Sat, Aug 24 2024 1:32 PM | Last Updated on Sat, Aug 24 2024 1:32 PM

అల్లం

సీతంపేట: మండలంలోని దీసరిగూడ గ్రామంలో వెలుగు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఐటీడీఏ ఏపీఓ గిరిజనులకు శుక్రవారం అల్లం విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విత్తనాలు కొండపోడు వ్యవసాయంలో వేసి మంచి దిగుబడులు సాధించాలని సూచించారు. పీఎం జన్‌మాన్‌ ద్వారా 11 రకాల పథకాలతో పీవీటీజీల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు అందరూ తీసుకోవాలని కోరారు. పక్కాగృహాలు లేని వారు హౌసింగ్‌శాఖ ద్వారా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వెలుగు సంస్థ డైరెక్టర్‌ బి.సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

పోలమాంబకు

కుంకుమ పూజలు

మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి చదురుగుడిలో ఈవో వి.వి.సూర్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. వేదపండితుడు కప్పగంతుల శ్రావణ్‌కుమార్‌ భక్తులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాలనుంచి పెద్ద ఎత్తున మహిళలు ఆలయానికి చేరుకుని, పోలమాంబ అమ్మవారికి పూజలు చేశారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అల్లం విత్తనాల పంపిణీ1
1/1

అల్లం విత్తనాల పంపిణీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement