పార్వతీపురంటౌన్: 2025వ సంవత్సరం మార్చిలో జరగనున్న మొదటి, రెండవ సంవత్సరాల ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజును నవంబరు 11 లోగా చెల్లించాలని జిల్లా వృత్తి విద్యా శాఖాధికారిణి డి.మంజులవీణ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం థియరీ పరీక్షల ఫీజు రూ.600, జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్స్కు అదనంగా రూ.275, బ్రిడ్జి కోర్స్ రాయాలనుకున్న విద్యార్థులు అదనంగా రూ.165, మొదటి, రెండవ సంవత్సరం (రెండు సంవత్సరాల బ్యాక్లాగ్ పేపర్లు) పరీక్షలు రాస్తున్న విద్యార్థులు రూ.1200, మొదటి, రెండవ సంవత్సరం (రెండు సంవత్సరాలు కలిపి)ఒకేషనల్ ప్రాక్టికల్స్ రాస్తున్న విద్యార్థులు రూ. 550 చెల్లించాలని ఆమె తెలిపారు. హాజరు మినహాయింపు (ప్రైవేట్) విద్యార్థులు రూ.1500 ఫీజు చెల్లించాలని స్పష్టం చేశారు. కళాశాల ప్రి న్సిపాల్ పరీక్ష ఫీజును ఆన్లైన్లో చెల్లించడానికి ఆఖరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే పరీక్ష ఫీజు ఆన్లైన్లో చెల్లించవచ్చని తెలిపారు. రూ.1000 అపరాధ రుసుముతో నవంబర్ 20వ తేదీ వరకు ఫీజులు చెల్లించవచ్చని ఆమె పేర్కొన్నారు.
జిల్లా వృత్తి విద్యా శాఖాధికారిణి
మంజులవీణ
Comments
Please login to add a commentAdd a comment