ముగిసిన ఉత్తరాంధ్ర ఓపెన్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఉత్తరాంధ్ర ఓపెన్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు

Published Mon, Oct 28 2024 1:50 AM | Last Updated on Mon, Oct 28 2024 1:50 AM

ముగిసిన ఉత్తరాంధ్ర ఓపెన్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు

ముగిసిన ఉత్తరాంధ్ర ఓపెన్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు

విజయనగరం: విజయనగరం విలేజ్‌ స్పోర్ట్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉత్తరాంధ్ర ఓపెన్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు హోరా.. హోరీగా సాగాయి. నగరంలో ఓ ఇండోర్‌ స్టేడియంలో మెన్‌, 35 ప్లస్‌ వయస్సుల విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 35 ప్లస్‌ విభాగంలో బొబ్బిలికి చెందిన జి.వాసు–పి.రమేష్‌ల జోడి ప్రథమ స్థానం కై వసం చేసుకోగా.. విజయనగరానికి చెందిన పి.నవీన్‌కుమార్‌ – వి.అశోక్‌ల జోడి ద్వితీయ స్థానం, విజయనగరానికి చెందిన ఎం.శ్రీను–టి.గౌరీశంకర్‌ల జోడి తృతీయ స్థానంలో నిలిచాయి. అదే విధంగా మెన్స్‌ విభాగంలో విజయనగరానికి చెందిన పి.నవీన్‌కుమార్‌–శ్రీనుల జోడి ప్రథమ స్థానం, విశాఖపట్నంకు చెందిన జగదీశ్వర్‌–వంశీల జోడి ద్వితీయ స్థానం, తగరపువలసకు చెందిన శ్రీను–సాయిల జోడి తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. విజేతలకు సిటీబ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ విఎస్‌.ప్రసాద్‌, కార్యదర్శి నున్న సురేష్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి సిహెచ్‌.కుటుంబరావుల చేతుల మీదుగా రూ.5000, రూ.3000, రూ.2000 చొప్పున నగదు బహమతులను, ట్రోఫీలను ప్రధానం చేశారు. కార్యక్రమంలో విలేజ్‌ స్పోర్ట్స్‌ ప్రతినిధి సంగమరెడ్డి భాను, గాయత్రి, వెంకటేష్‌, పి.ఆదిలక్ష్మి, ఎస్‌.యశోద తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement