‘చంద్రబాబూ.. పిల్లలతో మద్యం అమ్మించడం భావ్యమేనా?’ | YSRCP RK Roja slams Chandrababu over liquor selling | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబూ.. పిల్లలతో మద్యం అమ్మించడం భావ్యమేనా?’

Published Mon, Oct 28 2024 3:09 PM | Last Updated on Mon, Oct 28 2024 4:35 PM

YSRCP RK Roja slams Chandrababu over liquor selling

విజయవాడ, సాక్షి: వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎంగా విద్యాంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తే, ప్రస్తుత సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని మాజీ మంత్రి ఆర్కే రోజా ‘ఎక్స్‌’ వేదికగా మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను పోస్ట్‌  చేశారు. 

‘‘ఈ వీడియో చూడండి. ఏపీలో బెల్టుషాపులను ఎలా నిర్వహిస్తున్నారో. చిన్నపిల్లల్ని.. విద్యార్థులని పెట్టి మద్యం అమ్మిస్తున్నారు. ఇది ఎక్కడో కాదు. చంద్రబాబుకి ఓటేసిన ఆంధ్రప్రదేశ్‌లోనే. తణుకులో ఇలా విచ్చలవిడిగా మద్యం బెల్టు షాపులు వెలిశాయి. టీడీపీ నేతలే మద్యం షాపులు, బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. 

..ఇళ్ల మధ్యలో, మహిళలు నడిచేమార్గాల్లో, చిన్నపిల్లల్ని పెట్టి ఇలా మద్యం అమ్ముతున్నారు. ఇదేనా.. మంచి ప్రభుత్వం?. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. పిల్లలని పెట్టి మద్యం అమ్మించడం భావ్యమేనా?’’ అని ఆమె సూటిగా ప్రశ్నించారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement